2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..!
‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలిం చేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరికొత్త విధానాలు తెచ్చాం. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం’’. – జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్
ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగు లేని మెజారిటీ ఇచ్చారని,ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు.ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైం దని,గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్ట పోయిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నా మన్న గవర్నర్, అధి కారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం పెరిగింది: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడి లో పెడుతున్నా మన్న గవర్నర్,తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకా శాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడిరచారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని,పేద విద్యార్థులకు ఉప కారవేతనాలు అందిస్తు న్నామని అన్నారు.విద్య, వైద్యం,మౌలికవసతు లపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్, బీసీవర్గాలు సమాజానికి వెన్నెముక అని వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీల కు 34శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: ‘మన బడి – మన భవిష్యత్తు’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గవర్నర్ తెలిపారు. మెరిట్ ఆధారంగా 9వర్సిటీలకు వీసీలను నియమించామని, స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని,ఐటీఐలు, పాలిటెక్నిక్ల్లో 200 స్కిల్ హబ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలనేది సీఎంఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టు బడులు పెరిగాయని గవర్నర్ నజీర్ అన్నారు. ఎంఎస్ ఎంఈలకు అండగా ఉన్నామని,అన్నివిధాలా ప్రోత్స హిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమలో కరవు అనేదే ఉండదు: తాగు,సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమా లు చేపట్టామని, 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని, రాయలసీమలో కరవు అనేదే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందన్న గవర్నర్, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని 7శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలి పామని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ జరిగిందని మండి పడ్డారు.గతఐదేళ్ల పాలనలో ఎక్సైజ్,ఇసుకలో లోప భూయిష్ట విధానాలు జరిగాయన్న గవర్నర్, ప్రభుత్వ పన్నులను సైతం దారి మళ్లించారని చెప్పారు. రూ.6.5లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టారు: రూ.2, 488 కోట్ల ఆర్థికసంఘం గ్రాంట్తో స్థానిక పాలన బలోపేతం చేశామని గవర్నర్ నజీర్ తెలిపారు. పోలవరం,అమరావతి ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిం చామని, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. సుస్థిర వృద్ధికి దోహదపడే 22కొత్త విధానాలద్వారా బలమైన పునాది వేశామన్న గవర్నర్,గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్ కంపెనీలను ఆకర్షించినట్లు తెలిపారు. గ్రీన్కో గ్రూప్, బీపీసీఎల్, టీసీఎస్ కంపెనీలను ఆకర్షించా మని, ఇన్వెస్టర్లు ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడిరచారు. ఆయా పెట్టు బడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్లకు విస్తరించిందని అన్నారు.
కందుకూరి వ్యాఖ్యలు ప్రస్తావించిన గవర్నర్: తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు,సేవల రంగాలు వృద్ధి చెందాయని అన్నారు.ఈ సందర్భంగా సంఘ సంస్కర్త కందుకూరి వ్యాఖ్యలను గవర్నర్ ప్రస్తావించారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుందని, అవకాశమిస్తే బయటకు వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దిశగా వెళ్తోందని, సమాజ అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలని సూచిం చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐటీ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అమెరికాలోని ప్రవాస తెలుగువాళ్ల తలసరి ఆదాయం ఎక్కువని తెలిపారు. ప్రస్తుతం ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, పరిపాలన,పరిశ్రమలు,ఆర్థిక వృద్ధిలో ఏఐను విని యోగిస్తున్నామని చెప్పారు.
‘‘స్వర్ణాంధ్ర-2047కు పది సూత్రాలతో విజన్ రూపొందించాం.పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యువతకు నైపు ణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన,నీటి భద్రత, రైతు-అగ్రి టెక్,గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్,వ్యయ నియంత్రణ, విద్యుత్-ఇంధనం ప్రత్యేక దృష్టి పెట్టాం. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్మ్యాప్ రూపొందించాం.పేదలకు ఆహార భద్రత కోసం పీడీఎస్ను బలోపేతం చేశాం.ఎస్సీ,ఎస్టీ కుటుంబా లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంది స్తున్నాం’’. -జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్
24 అంశాలపై చర్చ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు నడపాలన్నది నిర్ణయించను న్నారు. ఎన్నికల హమీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్?ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశా లపై గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్?ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పాత ప్రభుత్వం సభకు సమ ర్పించింది.
రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా బడ్జెట్: ఆతర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇతరత్రా అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్?ను సమర్పించింది. రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, అభివృద్ధిని గాడిన పెట్ట డంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఎంతో కీలకం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, మేనిఫెస్టోలో అంశాలకు ఈబడ్జెట్లో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్టుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణ ఇక్కడ కీలకం కానుంది. బడ్జెట్ సమావేశాల సంద ర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర పథకాలను వీలైనంతగా వినియోగించుకుని: ముఖ్యమంత్రి ఆర్ధికశాఖ అధికారులతోను, ఆర్ధిక మంత్రితోను బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వశాఖలకు సంబం ధించిన మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కూలం కషంగా చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యా లపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు ప్రకారం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాఖల వారీగా వారి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్ రూప కల్పన,అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండ నున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వీలైనంతగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధు లు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.-గునపర్తి సైమన్