ఆదివాసులకు దక్కని రాజ్యాంగ ఫలాలు

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘‘నేషనల్‌ లా డే’’ లేదా ‘‘సంవిధాన్‌ దివస్‌’’ అని కూడా పిలుస్తారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 26 న జరుపుకుంటారు. 26 నవంబర్‌ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను, డాక్టం బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.– బి.రామారావు దొర

ఈ దేశ ఆదివాసులకు భారత రాజ్యాంగం షెడ్యూల్‌ 5,6 ద్వారా ప్రత్యేకమైన రక్షణ వలవలయాలు (బపర్‌ జోన్స్‌) రూపొందించింది. భూమి హక్కులు,వనరులు పరిరక్షించడంతో పాటు భాష,సాంస్కృతి, సాంప్రదాయక విలువలను కూడా ఈరక్షణ వలయంలోకి తీసుకువచ్చింది.ఈషెడ్యూల్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిరక్షణకు 1/70భూ వదలాయింపు నియంత్రణ చట్టం చేసింది.1917 ుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ aఅస ూaఅస ుతీaఅంటవతీం Aష్‌, 1917 (Aష్‌ చీశీ.1శీట 1917)’’ఈ చట్టానికి మూలం కాగా,ఈ చట్టం రూపకల్పనకు కారం తమ్మన్న దొర చేసిన పోరాటం స్పూర్తిగా నిలిచింది. ఆ తరువాత 1935, 1959 సవరణల తరువాత 1970లో ఏజేన్సీ ప్రాంతంలో ఆదివాసులు-ఆదివాసేతరు లకు మద్య అన్నిరకాల భూబదలాయింపులు పూర్తిగా నిషేదించబడిరది. షెడ్యుల్డ్‌ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిని బలపరుస్తూ,స్థానిక సంస్థల పరిపాలనను చూసుకోవడానికి పెసా చట్టం, 1996 ను తీసుకు వచ్చారు. వందల ఏళ్లుగా అదారపడ్డ అటవీ భూములకు యాజమాన్యపు హక్కులు సుస్థిరం చేయడానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రూపకల్పన చేసారు.షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగల పట్ల అత్యాచారాలు,ద్వేషపూరిత నేరాలను నిరోధించడానికి భారతపార్లమెంటుఎస్సీ,ఎస్టీ అట్రాసిటి (అత్యాచారాల నిరోధక) చట్టం,1989 తీసుకు వచ్చింది. ఆదివాసులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటానికి షెడ్యూల్డ్‌ ప్రాంత ఋణ (వడ్డీ) వ్యాపార నిబంధనలు 1960,రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు మరియు వెనకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రాల జారిచట్టం`1993వంటి రక్షణ వ్యవస్థలు రూపొందించబడి ఉన్నాయి. అంతేకాకుండా,జాతీయ విధానాలు (చీa్‌ఱశీఅaశ్రీ ూశీశ్రీఱంఱం), మార్గదర్శకాలు (Gబఱసశ్రీఱఅం) చాలానే ఉన్నాయి.
క్షేత్రస్థాయి ఆచరణలో ఆదివాసుల హక్కులపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన వారి హక్కులకు భంగంకలుగుతూనే ఉన్నాయి.రోజురోజుకు వారిహక్కులు ఉల్లంఘించబడుతూ ఉంది. బలమైన రాజ్యాంగవ్యవస్థలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఆదివాసుల స్థితి ఏమిటి అంటే?ఉన్న చట్టాలు అమలు కోసం లేదా పరిరక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, జరుగుచున్న ఉల్లంఘనలను అడ్డుకో వడానికి కొత్త చట్టాలు రూపకల్పనకు మరో పోరాటం చేస్తు ఉండాలి.దొంగ ఎస్టి సర్టిఫికెట్లుతో ఎస్టీల లోకి చొరబడిన వారు దొంగ ఎస్టీ విద్యార్థులు,దొంగ ఎస్టీ ఉద్యోగులు,దొంగ ఎస్టీ రాజకీయ నాయకులు, దొంగ ఎస్టీ ఓటర్లు, దొంగ ఎస్టీ లబ్దిదార్లు ఆదివాసులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యంగా ప్రయోజనాలు, భూములు దొంగిలిస్తున్నారు.వీరికి పాలకపక్షాలన్ని మద్దతుగా నిలుస్తున్నారు.భారతదేశం అత్యంత వైవిధ్యమైన ఆదిమా సముహాల జనాభాకు సాక్షిగా నిలుస్తుంది.ప్రతి తెగకు దాని సొంత పాత్ర,గుర్తిం పు,స్వభావం కలిగి ఉంటుంది.ఉదాహరణకు,మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలోని ఆదివాసుల జీవితం, పరిస్థితులకు – ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లోని తెగల స్థితులు భిన్నంగా ఉంటాయి. దేశంలోని ఆదిమ సమూహాలు 18 రాష్ట్రాలలో విస్తరించి దేశ జనాభాలో 8.6% (104.2 మిలియన్లు) ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ఈ సమూహాలు మెజారిటీగా ఉండగా (ఉదా:ఈశాన్య రాష్ట్రాలు), ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ ప్రంతాలలో చిన్నచిన్న భూ భాగా లుగా ఉన్నాయి.వీరిచట్టాలు కేంద్ర,రాష్ట్రా ప్రభు త్వాలచే అమలు చేయబడతాయి.భారత రాజ్యాంగం ఆదివాసుల ప్రయోజనాలను,ప్రత్యేకించి వారి భూమిపై వారి స్వయం ప్రతిపత్తి హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5,6 ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది.ఇది ఆదివాసీ సమూహాలను దోపిడీ నుండి రక్షించడానికి,వారి భూమిపై వారి హక్కులను కాపాడు కోవడానికి దోహద పడుతుంది.
ఐదో షెడ్యూల్డ్‌ నియమాల ప్రకారం సాధారణ పరిపాలనకు ఉద్దేశించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన చట్టాలను షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తిస్తా యని జారిచేసిన నోటిఫికేషన్‌ లేదా ఆ చట్టాలను కొన్ని మినహాయింపులు, కొన్ని చేర్పుల (జుఞషవజ్‌ూఱశీఅం aఅస వీశీసఱటఱషa్‌ఱశీఅం)తో ఈ ప్రాంతానికి వర్తింపచేసేటట్లు రాష్ట్ర గవర్నర్‌,టిఎసితో కలిసి తగిన నిర్ణయం తీసుకుని వర్తింపచేయవలసి ఉంటుంది. ఇది ఐదో షెడ్యూల్డ్‌ లోని పేరా 5(1డ2) వెసులుబాటు కల్పిస్తుంది.దీనికి ఉదా హరణ:1994లో 73వరాజ్యాంగ సవరణ ద్వారా రూ పొందించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టం నియ మాల ప్రకారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, 1996లో పంచాయతీరాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత విస్తరణ చట్టం (పెసా) కేంద్ర చట్టం చేసే వరకు ఇదేళ్ళపాటు (1995-99) షెడ్యూల్‌ ప్రాంతంలో హై కోర్టు తీర్పుతో రద్దుచేసారు. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను మినహాయింపులు లేదా చేర్పుల లేదా కొత్త చట్టాలు రూపొందించడానికి టిఎసిదే కీలకపాత్ర.కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న ఇంకా కౌన్సిల్‌ ఏర్పాటు జరగలేదు. నియమా నుసారం జరజవలసి రాజ్యాంగ ప్రక్రియాను నిర్లక్ష్యం చేయడం లేదా దానిని రాజకీయ సంస్థగా చూడటం వలన ఆదివాసులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఇది అణ గారిన అదివాసి ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1950 జనవరి 26 నాటికి షెడ్యూల్‌ తెగలుగా గుర్తించబడి షెడ్యూల్డ్‌ ప్రాం తంలో నివాసం ఉంటున్న స్థానిక తెగలతో టిచర్‌ పోస్టుల భర్తికి ఉద్దేశించిన జీవో నెంబర్‌ 3రద్దు తర్వాత అదివా సులలో ‘షెడ్యూల్‌ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం’ చేయాలని డిమాండ్‌ ముందుకు వచ్చింది.నిజానికి ఈ డిమాండ్‌ కొత్తగా లేవనెత్తిన గొంతెమ్మ కోరిక కానేకాదు. రాజ్యాంగ కర్తలు ఐదో షెడ్యూల్‌ పేరా5లో పొందు పరచిన అంశమే.ఈ ప్రక్రియా రాజ్యాంగ వ్యవస్థ అయిన టిఎసిని ఏర్పాటుచేసి, ఆదివాసీ శాసనసభ్యులంత సంత కాలుచేసి,తిర్మాణాన్ని ఆమోదించి గవర్నర్‌ గారికి పం పాలి.రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపాలి.ఆతీర్మానం ఆమోదం పొందితే ఆదివాసుల ఉద్యోగ భద్రతకు చట్టబద్దత వస్తుంది.ఇది రాజ్యాంగ ప్రక్రి యనే అయినప్పటికీ,ఉభయ తెలుగు రాష్ట్రాలు కనీస ప్రయత్నం చేయకుండా గుమ్మనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో గతప్రభుత్వం చేసిన టిఎసి తీర్మానం గవర్నర్కు ఆమోదం కోసం పంపిన సరిపోతుంది.లేదా టిఎసి ఏర్పా టు చేసి, తీర్మానాన్ని ఆమోదించి పంపాలి. లేదంటే, నాణ్యత లేని అరకొర చదువులతో ఏజేన్సీ ప్రాంత తెగలు, ఇప్పుడున్న పోటిని ఎదుర్కొని ఉద్యోగాలు పొందడం అంత సులువు కాదు. జీవో నెంబర్‌ 3రద్దు తరువాత,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడకి లేఖ రాస్తూ, ‘ఆదివా సుల హక్కులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సాను భూతి లేకపోవడం వలన అణగారిన ప్రజలు వారి పురోగతికి,సాధికా రతకు ఆటంకం కలిగిస్తున్నార’ని తన లేఖలో పేర్కొ న్నారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అరుకు సభలోను,అమరావతిలో జరిగిన ‘ప్రపంచ ఆది వాసి దినోత్సవ’ సభ లోను జివో నెం.3ని మళ్లీ తీసుకు వస్తానని బాబుప్రకటించారు.ఈప్రకటన వయసు మిరు తున్న ఆదివాసీ నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.అయినా,మెగా డిఎస్సి -2024 నోటిఫికేషన్‌ జారీకి ముందు ఏజేన్సీప్రాంతానికి కేటాయించిన పోస్టు లు గురించి సరిjైున నిర్ణయం తీసుకోకుండా జెనరల్‌ రోస్టర్‌ ప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ఆదివాసులకు గత పాలకులపై కలిగిన అపనమ్మకం, చంద్రబాబుపై పెట్టుకున్న ఆశ నెరవేరాలని ఆశిద్దాం…(నంబర్‌ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్బంగా… వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌, అల్లూరి జిల్లా)

వణికితున్న మన్యం..విసురుతున్న చలి పంజా…!

చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8 గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్‌, జాగింగ్‌ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గునపర్తి సైమన్‌


ఉత్తరాంధ్రలో చలిపంజా విసురుతోంది. అర్ధ రాత్రి నుంచి తెల్లవారే వరకు కురుస్తున్న మంచుకు చలిగాలులు తోడయ్యాయి.దీంతో జనం ఉదయం7 గంటల వరకు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులుచెబుతున్నారు. సాధారణంగాఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి వేగంగా పడిపోతు న్నాయి.మన్యంలోపాటు మహావిశాఖలోను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.కురి స్తున్న దట్టమైన పొగమంచుతో చలి తీవ్రత పెరగడంవల్ల మన్యం వణికిపోతుంది. ప్రధా నంగా వృద్దులు,పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గతంలో లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.నగరంలో గతనాలుగైదు రోజుల నుంచి కనిష్టస్థాయిలో సుమారు14 డిగ్రీలుగా నమోదువుతు న్నాయి.చలిగాలి తీవ్రత పెరిగి వణికిస్తోంది.ప్రధానంగా రాత్రిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతుండడం గమనార్హం.రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు.ఇక మన్యప్రాంతంలో డుంబ్రిగుడలో8.2, జీ.మాడుగులలో 8.4,అరకులోయలో 8.5,పాడేరులో 10.9,ముంచంగిపుట్టులో 10.9,గూడెం కొత్తవీధిలో 11.4,చింతపల్లిలో11.3,మినుములూరులో9, పాడేరు లో 11డిగ్రీలు నమోదైంది.
మన్యంలో దట్టమైన పొగమంచులు..
చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది.జనం ఇళ్లలో నుంచి బయటకు రావడా నికి భయపడిపోతున్నారు.చలిమంటలు వేసుకుని కాలక్షే పం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదా రుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి పోతు న్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
ఎంత పొద్దెక్కినా సూరీడు కనిపించట్లేదు..
ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపిం చకపోగా, పాడేరు,చింతపల్లి,అరకు లోయ, డుంబ్రిగుడ, ముంచుంగిపుట్టు, హుక్కుంపేట, తదితర మన్యప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతు న్నారు.రోజురోజుకూ ఉష్ణోగ్ర తలు పడిపోవ డంతో పగలైనా సరే,వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్‌ చెయ్యా ల్సిందే.ఇక ముంచంగిపుట్టులో చలితీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది.క్రమంగా ఉష్ణోగ్ర తలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చలితీ వ్రత కొనసాగుతోంది.ఇకసాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవు తోంది.కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఇక ముంచంగి పుట్టు మండల పరిధిలో గత మూడు రోజులు గా చలి తీవ్రత పెరిగింది.ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మం చు తెరలు వీడడం లేదు.చలికి జనం గజగజ వణికిపోతున్నారు.సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయ పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమి స్తున్నాయి.ఇలా ఉండగా ఈవాతావరణ పరిస్థితులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతినిస్తోంది.చలిలో మంచు అందాలను తిలకిం చేందుకు మాత్రమే వారు సందర్శి స్తున్నారు.మంచు విపరీతంగా పడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు.ఫ్రధానంగా విష(వైరల్‌) జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఆస్తమా(ఉబ్బసం)బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం విశాఖ కేజీహె చ్‌కు జ్వరాలు,ఆస్తమాతో బాధప డుతున్న రోగులు తాకిడి పెరిగింది.ఎక్కువశాతం మందికి ఓపి విభాగంలో చికిత్స చేసి పంపుతున్నామని,శ్వాస తీసుకోవడంతో ఏమైనా ఇబ్బందులుంటే ఆసుప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నా మని ఆసుపత్రి మెడిసిన్‌ విభాగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ వల్లూరి సత్యప్రసాద్‌ తెలిపారు.చలి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పెరుగుతున్న బాధితులు..
బాధితుల్లో ఒళ్లునొప్పులు,జ్వరం,జలుబు, గొంతు నొప్పి,నోరు రుచి లేకపోవడం వంటిలక్షణాలు కనిపిస్తు న్నాయి. జ్వరం మాత్రం48గంటలోపే నియంత్ర ణలోకి వస్తోంది.ఐదురోజుల వరకు జ్వరం తగ్గకపోయినా,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కోవిడ్‌ టీకాలు వేయించుకోకుంటే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.ప్రస్తుతం వస్తున్నవి విష జ్వరాలే.ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాస్త ఆప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..` డాక్టర్‌.యశోధ

కాఫ్‌`29 భేటీ లాభమేంటీ!?

ప్రపంచ వాతావరణ సదస్సు కాఫ్‌`29 అజర్‌ బైజాన్‌లోని బాకులో ముగిసింది.నవంబర్‌ 22తో పూర్తికావాల్సిన సదస్సును అంతర్గత,వాగ్వివాదాల వల్ల రెండు రోజులపాటు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిఎదుర్కోవాలన్నలక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసించాయి.ఐక్యరాజ్యసమితివాతావరణ మార్పుల నియంత్రణ ఒప్పందం (యూఎన్‌ఎఫ్‌సీసీ)లో భాగస్వాములైన దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)గా వ్యవహరిస్తారు.శిలాజ ఇంధనాల వినియోగం వంటి మానవ కార్యకలాపాలతో భూగోళం వేడెక్కిపోతోంది.భూఉష్ణోగ్రత పెరగుదలను 1.5సెల్సియస్‌ డిగ్రీల దగ్గర నిలువరించాలని పారిస్‌ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానించాయి.ఈలక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్ధికంగా చేయూతనివ్వాలని నిశ్చయించాయి.దీన్ని వాతావరణ ఫైనాన్స్‌ అంటున్నారు.బాకు కాఫ్‌`29 సదస్సులో పేద దేశాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని అజెండా పేర్కోంది.
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక,అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏమాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్తఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన,నిరుపేద దేశాలు భావిస్తున్నాయి.
క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 100బిలియన్ల డాలర్లు (10 వేల కోట్ల డాలర్లు) ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పుకున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! సంపన్న దేశాలు 2020నుంచి వాతావరణ ఫైనాన్స్‌ కిద ఏటా 100బిలియన్ల డాలర్లు (10వేలకోట్లు డాలర్లు) ఇస్తామని వాగ్దానంచేశాయి.2022లో సదరులక్ష్యాన్నిఅందుకున్న ఆ దేశాలు 2025వరకు దీన్నికొనసాగిస్తామన్నాయి.ఇప్పుడు తమ సాయాన్ని 30వేల కోట్ల డాలర్లకు పెంచుతున్నామనీ,అదీ ఉదారంగా ఇస్తున్నదేనని వాదిస్తున్నాయి.వాస్తవానికి 2035కల్లా 50వేల కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అవి మొదట్లో ప్రతిపాదించాయి.అది చివరికి 30వేల కోట్ల డాలర్లకు తగ్గింది.వచ్చే ఏడాది జరిగే కాఫ్‌30సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్‌ను 1.3లక్షల కోట్ల డాలర్లకు పెంచే విషయం పరిశీలిస్తామని మాటతో సరిపెట్టేశారు. ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదని పేద దేశాలు వాపోతున్నాయి.ప్రపంచంలో పునుత్తాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2030కల్లా మూడు రెట్లు పెంచాలని కాఫ్‌29లక్షిస్తోంది.కానీ,శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మాణం చేయకపోవడం గమనార్హం.దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు,చమురును యధేచ్ఛగా వినియోగిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది.వాతావరణంలో మార్పుల నిరోధానికి సంపన్న,వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి.ఈవిషయంలో ఏకాభిప్రాయం లోపించడం కాప్‌29లో స్పష్టంగా కనిపించింది.పాశ్చాత్య దేశాలు కూడా మాటలకే పరిమితమయ్యాయి.ఆఖరికి కాఫ్‌29 సదస్సును నిర్వీర్యం చేస్తూ అర్ధవంతంగా ముగించేశారు.!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

1 2