విశాఖ వైపు మెట్రో పరుగులు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో సుందరీకరణ,అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పెండిరగ్‌లో ఉన్న మెట్రో రైల్‌ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబో తోంది. ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్‌ను త్వరలోనే విడుదల చేసేందు కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ ప్రకటించారు.అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి విశాఖ రాజధాని అభి వృద్ధిపై అధికార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్టుపై చర్చిలు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి,సంప్రదాయం ప్రతిబింబిం చేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో76.90కి.మీ.మేర లైట్‌ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి మెట్రో రైల్‌ కార్పొరేషన్కు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖ మెట్రో పరిధి ఖరారు పారిశ్రా మికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఏపీలోని ప్రస్తుతం మరే ఇతర నగరాల కంటే కూడా మెరుగైన స్ధితిలో ఉంది. ఇక్కడ కొత్తగా వస్తున్న ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన ఉద్యోగులతో నగరం కిటకిటలాడు తోంది.ఈ రద్దీని తట్టుకునేందుకు ఎప్పటి నుంచో మెట్రోరైల్‌ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి అరకొరగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు వాటిని దుమ్ముదులిపి ఎలాగైనా మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది.కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.
ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి

2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25లక్షలకుపైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41లక్షలు. లాభనష్టాలతో సంబంధం లే కుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యా లను మె రుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది.సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరు ణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్‌ సమస్య తీరడం తోపాటు సమయం కూడా ఆదా అవుతుంది..
నాలుగు కారిడార్లుగా విభజన…
విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్‌ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజిం చారు. స్టీల్‌ ప్లాంట్‌ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్‌ వరకూ,గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ,తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్‌ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ సాధ్యమై నంత త్వరగా సిద్ధం చేయాలని విజయ వాడలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆధేశించారు. వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
2025 నాటికి రోజుకు ఆరులక్షల మంది ప్రయాణం…
కోవిడ్‌ కారణంగా డీపీఆర్‌ తయారీ ఆలస్యమై నప్పటికీ సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభు త్వానికి అందించేందుకు అధికారులు సన్నద్దమవు తున్నారు.ఆ తర్వాత దాన్ని వెంటనే ఆమోదించి ప్రాజెక్టును పట్టాలెక్కిం చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు మొదలుపెడితే మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ లెక్కన చూస్తే 2025 నుంచి రోజుకు సగటున ఆరు లక్షల మంది విశాఖ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక మెట్రోగా ఉన్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కంటే మెరుగైన టెక్నాలజీతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 15న పునాది రాయి
వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహన్రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్‌-1లో స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40కి.మీ..కారిడార్‌-2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కి.మీ.,కారిడార్‌-3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్‌ మెట్రో కారిడార్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్‌-4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌ ఒక మణిహా రంగా రాబోతోంది. ప్రధాన జం క్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్‌ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్‌ ట్రామ్ని నడ పిేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా స్టీల్‌ ప్లాంట్‌ నుంచి అనకాపల్లి, ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్‌ కారిడార్‌ రాబోతోంది.
శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష
ఏపీ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్షియల్‌ క్యాపిటల్గా, ఐటీ హబ్‌ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతా లు కూడా కోర్‌ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో స్వా కర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌ లో మార్పులు, చేర్పులు జరిగాయి.
విశాఖ మెట్రో స్వరూపమిదీ..
మొత్తం అంచనా వ్యయం:14.09 కోట్ల
ఫేజ్‌-1లో కారిడార్‌-1, 2,3 నిర్మాణ అంచనా వ్యయం: రూ.9,699 కోట్లు
ఫేజ్‌-2లో కారిడార్‌-4 నిర్మాణ అంచనా వ్యయం: రూ.4,610 కోట్లు ప్రాజెక్టు
విస్తీర్ణం: 76.90 కి.మీ. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో నిర్మించే మొత్తం స్టేషన్లు: 54
మోడ్రన్‌ ట్రామ్‌ ప్రాజెక్టు
అంచనా వ్యయం: రూ.5,323 కోట్లు కారిడార్‌ -1 అంచనా వ్యయం: రూ.1,102 కోట్లు,కారిడార్‌-2 అంచనా వ్యయం: రూ.1.879 కోట్లు, కారిడార్‌- 3 అంచనా వ్యయం: రూ.1,321 కోట్లు, కారిడార్‌ – 4 అంచనా వ్యయం: 1.21 కోట్ల, ప్రాజెక్టు విస్తీర్ణం: 60.05 కి.మీ.– (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ప్రపంచ భాషల్లో అందమైనది..తెలుగు భాష ఒక్కటి

  • ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర
    ’’అడుగుజాడ గురజాడది అది భావికిబాట’’ అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు. సమాజం లోని కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహం కారాన్ని, గ్రాంధిక భాషా ఛాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన యుగకర్త గురజాడ. ఈయన దృష్టిలో సాహిత్యం ఒక భోగ(వినోద) వస్తువు కాక సమాజంలోని మార్పుకు ప్రజల పక్షాన కృషి చేసే ఆయుధంగా (దిక్సూచి)గా భావించారు.అందుకే గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు,నవయుగ వైతాళికు డయ్యాడు
    జననం -కుటుంబ నేపథ్యం
    గురజాడగారు 1862 సెప్టెంబర్‌ 21వతేదీన విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకా లోని రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు.తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు.గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా గురజాడ గ్రామంనుండి విశాఖ మండ లానికి తరలివచ్చారు. గురజాడ తండ్రి ’’చీపురు పల్లి’’లో ఉద్యోగం చేసేవారు. అందువల్ల గుర జాడ ఆఊరులో ఉన్న గ్రాంటు స్కూలులో మొదటి మూడు తరగతులు చదివారు. వెలువలి రామ మూర్తి పంతులుగారివద్ద సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. విజయనగరం మహారాజా వారి హైస్కూలులో లోయర్‌ ఫోర్త్‌, అప్పర్‌ఫోర్త్‌, ఫిప్తు,మెట్రిక్యులేషన్‌ చదివారు.1882లో మెట్రిక్యు లేషన్‌ ఉత్తీర్ణులయ్యారు.1882-1884మధ్య ’’ఎఫ్పే’’చదివారు. 1884-1886లో ఫిలాసఫీలో బి.ఎ.చదివారు.బి.ఎ.చదువుతుండగా 1885లో అప్పారావు వివాహం జరిగింది.భార్యపేరు ’’అప్పల నర్సమ్మ’’.ఈ దపంతులకు 1887లో లక్ష్మీనరసమ్మ (కుమార్తె),1890లో వెంకట రామదాసు (కుమారుడు) 1902లో కొండయమ్మ (కుమార్తె) జన్మించారు. గురజాడ బి.ఎ.ఉత్తీర్ణత పొందడంతో ప్రిన్స్‌పాల్‌ చంద్రశేఖరశాస్త్రి రాజా వారి కళాశాలలో ఎనిమిదో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వేయించారు. నెలకు 25 రూపాయలు జీతం కావడంతో,ఆర్థిక ఇబ్బందుల వల్ల 1886 లో కళాశాల నుండి సెలవు తీసుకుని ’’డిప్యూటీ కలక్టరాఫీసులో’’ హెడ్‌ క్లర్కుగాచేరారు. కాని ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.తిరిగి 1887లో ఆనందగజపతి మహారాజా వారి కళాశాలలో నాలుగవ లెక్చరర్‌గా చేరారు. దానితో పాటు మహారాజావారికి వార్తాపత్రిలు చదివి విన్పించి నందుకు మరో 50రూపాయలు అదనంగా ఇచ్చే వారు. మొత్తంగా నెలసరి జీతం 150 రూపా యలు వచ్చేవి.1889లో మహారాజావారి ఆస్థా నంలో ఏర్పాటు చేయబడిన డిబేటింగ్‌ క్లబ్‌ చర్చా వేదికకు ఉపాధ్యక్షుడైనారు.1896లో విజయ నగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా నియ మితులైనారు.1897లోఆనందగజపతి మరణా నంతరం సంస్థానం వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నిర్వర్తించారు. 1898 నుండి 1912 వరకు రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా చేసి 1913 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.
    గురజాడ రచనా వ్యాసంగం
    గురజాడలో మెట్రిక్యులేషన్‌ చదువు తున్నప్పుడే కవిత్వ శక్తి వికసించింది. ఆంగ్లంలో ’’కకూ’’ (కోకిల)అనే కవితను వ్రాశారు. సంస్కృ తంలో శ్లోకాలు వ్రాస్తుండేవారు.1883లో ఇంగ్లీషులో ’’సారంగధర’’ అనే కథా కావ్యాన్ని రాశారు.అది ’’ది ఇండియన్‌ లీజ్జర్‌ అవర్‌’’ అనే ఆంధ్రాంగ్ల పత్రికలో ప్రచురించబడిరది. కలకత్తా నుండి వచ్చే ’’రీస్‌ అండ్‌ రయ్యత్‌’’ అనే పత్రికలో ’’సారంగధర’’ ను పునర్ముద్రించారు. ఈ పత్రికా సంపాదకుడైన శంభుచంద్ర ముఖర్జీతో గురజా డకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి.గురజాడ రాసిన రచనల్లో కన్యాశుల్కం ఒక గొప్ప రచన. ఇది ప్రపంచ సాహిత్యంలో గొప్ప ఆదునిక నాట కాల సరసన నిలిచిన నాటకం. దీని తొలికూర్పు 1897లో,రెండవ ముద్రణ1909లో జరి గింది. 1909లో నీలగిరి పాటలు రచించారు. 1910 లో గురజాడను తెలుగు కవిత్వ చరిత్రలో చిర స్థాయిగా నిలిపిన’’ముత్యాల సరములు’’ రచన చేశారు. ఇది కవితా సంపుటి. ఇందులో ముత్యా ల సరాలు,కాసులు,లవణరాజుకల,కన్యక, పూర్ణ మ్మ,లంగరెత్తుము,డామన్‌ పితియస్‌,దేశభక్తి గేయం మొదలైన కవితా ఖండికలున్నాయి. కొండు భట్టీయం, బిల్హణీయం అనే అనువాద నాటకాలు రచించారు. దిద్దుబాటు, దేవుళ్లారా మీ పేరేమిటి? మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం వంటి సంస్కృత రచనలతో ఆపటు సౌదామిని వంటి నవలలను కూడా రచించారు. కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తు గడా, నడిపించే తీరూ, నాటకీయత, ఒక పతాక స్థితి,ఒక ముగింపూ తప్పకుండా ఉంటాయి. వీటన్నింటి మేళవింపు గురజాడ రచనల్లో మనకు దర్శనమిస్తాయి.
    ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర-ఒక పరిశీలన
    ’’జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది’’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాట గురజాడ సాహి త్యానికి పూర్తిగా వర్తిస్తుంది. గురజాడ సాహిత్య పతాక సంఘ సంస్కరణకు మించిన సాంఘిక విప్లవం.అందుకే ఆయన ఆనాటి మొత్తం భారత దేశంలోనే విశిష్టమైన సాహితీవేత్త. సమకాలీన కొత్త వస్తువుతో, కొత్త దృక్పథంతో, కొత్త రూపంతో గురజాడ తన నాటక కళను కవిత్వాన్ని, కథాని కను తీర్చిదిద్దినారు. దానికి నిదర్శనమే ఆనాటి కాలంలోని కన్యాశుల్క వివాహాలను నిరసిస్తూ, అనాదిగా కొనసాగుతున్న సంస్కృత నాటక కళను నిరాకరించి వాడుక భాషలో కన్యాశుల్కం రచిం చడం.వ్యవహారికభాషలో రచన చేయడమే కాకుం డా 1906లో సహాధ్యాయి అయిన గిడుగు రామ మూర్తి పంతులుతో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించారు. ఇలా వాడుక భాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యంలో వాడుక భాషకు పునాదివేసి ’’ఆధునిక యుగకర్త’’ అయినారు. వేదాంతం పేరుతో మన దేశంలో ఎంత వంచన ఎంత మూర్ఖత్వం సాగు తుందో అని వాపోయాడు గురజాడ. మతాచారాల పేరు మీద సాగే స్వార్థపరత్వాన్ని ఎండగడుతూ రాసిన కథ -’’మీ పేరేమిటి?’’ మానవ సంబంధాల ఉద్వేగాలు మతాలకు అతీతమైనవి అని పెద్ద మసీదు కథ విశదపరు స్తుంది.మూఢ విశ్వాసా లను తృణీకరించే విధంగా ’’ముత్యాల సరములు’ రచన చేశారు.
    ’’దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమం టే మనుషు లోయ్‌’’ – అంటూ దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో జాతీయ భావ స్ఫూర్తిని నింపారు. ’’ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరా స్తుందని’’ ఆశాభావం వ్యక్తం చేశారు. గురజాడ రాసిన తెలుగులో మొదటి కథానిక అయిన ’’దిద్దుబాటు’’ద్వారా’’పురుషుడి అడుగు జాడల్లో స్త్రీ నడవటం కాదు,పురుషుడికి నడక నేర్పేది, పురు షుడి జీవితాన్ని తీర్చిదిద్దేది స్త్రీ’’అని చాటి చెప్పారు. వర్ణవ్యవస్థను పూర్తిగా నిరాకరించి మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలున్నాయి అని చెప్పారు.ఆధునిక సాహిత్యం లో ఎన్నో ఉద్యమాలకు ప్రేరకులైనారు. ప్రాచీన కాలం నుండి సాహిత్యాన్ని కేవలం ఒక భోగ (వినోదవస్తువు) వస్తువుగానే భావించి రచన లు చేశారు. నాటి వ్యవస్థను నిరసిస్తూ సమాజ మార్పే సాహిత్య లక్ష్యం అంటూ రచనలు చేశారు గురజాడ. ప్రజాస్వామ్య యుగపు లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం సాధనకు కలంబట్టి నాటకం,కవిత్వం,కథలు,సాహిత్య,విద్యా రంగంపై విమర్శనా రూపాలతో చివరిక్షణాల దాకా సమా జ ప్రగతికై రచనలు చేశారు. స్త్రీ జాతికి సమాన గౌరవం దక్కాలని పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించిన గురజాడ 1915 నవంబరు 30నాడు కన్నుమూశారు. స్త్రీలపై అణచివేత, పీడన కొనసాగినంత కాలం వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తూనే వుంటాయి. కొందరు జీవిస్తూ మరణిస్తారు. మరికొందరు మరణించి జీవిస్తారు. ప్రజాకవి గురజాడ మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. – (స్త్రీవాద పత్రిక భూమిక సౌజన్యంతో) – (జాలిగం స్వప్న)

అపరా అనుభవసారం ఆదివాసీ ఆత్మగానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘‘ డాక్టర్‌ వి.ఎన్‌ .వి. కె, శాస్త్రి గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘ఆదివాసి ఆత్మగానం’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
గిరిజన జన జీవితాలను అత్యంత దగ్గరగా గమనించడమే కాక సుమారు 50సంవత్స రాల పాటు వారితో సహజీవత్వం చేసిన పరిశోధకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రచయిత, ముఖ్యంగా కేవలం గిరిజనుల గురించి అనేక పుస్తకాలు పరిశోధనాత్మకంగా వ్రాసిన వ్యక్తి, తెలుగు గిరిజన రచయిత లలో ప్రథమ స్థానంలో నిలిచేవారు, వారే అందరికీ డాక్టర్‌విఎన్‌.వి.కె,శాస్త్రిగా సుపరిచి తులైన ‘‘వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి’’ ఆయన ఇటీవల వెలువరించిన వ్యాససంపుట్టి ‘‘ఆదివాసి ఆత్మగానం’’ ఆదివాసి జీవన సంస్కృతులకు దర్పణం పడుతున్న ఈ వ్యాసవళిలో మొత్తం 34వ్యాసాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో మన గిరిజన బిడ్డలు పడుతున్న ఇక్కట్ల గురించి సహేతుకంగా వివరించే నేపథ్యంలో ఒకవైపు సంస్కృతి పరంగా, మరోపక్క పాలకులు చేస్తున్న దురాగతాలు, అలాగే వలస గిరిజనుల వల్ల కలుగుతున్న నష్టాలు అదేవిధంగా గిరిజనే తరులు, ప్రపంచీకరణ సాయంతో సాగు తున్న ఆధునిక అభివృద్ధివల్ల వాటిల్లుతున్న నష్టం గురిం చి రచయిత పారదర్శకంగా ఆలోచింప జేసే విధంగా ఈవ్యాస ప్రస్థా నం కొనసాగించారు. ఆనాటి మొగ లాల సాయంతో మన తెలుగు ప్రాంతానికి వచ్చిన బంజారాలు తమదైన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అష్ట కష్టాలు పడి దుర్భర జీవితాలు అనుభ వించిన వారు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలుగా తెలంగాణలో లంబాడాలుగా పేర్లు కలిగి గిరిజ న సామాజిక వర్గ సౌక ర్యాలు పొందుతున్న తీరును వివరిం చిన శాస్త్రిగారి వ్యాసంలో కేవలం వారి చరిత్ర జీవితం మాత్రమే ప్రస్తావించారు, వారివల్ల నిజమైన కొండల్లోని గిరిజన సామాజిక వర్గం వారికి జరుగుతున్న ఉపాధి ఉద్యోగ ఆర్థిక నష్టాల ప్రస్తావన లేదు.కానీ ఇదే వ్యాస సంపు టిలో ‘‘నకిలీ గిరిజన సర్టిఫికెట్‌ గాళ్లు’’ అనే మరో వ్యాసంలో ఆయన స్వీయ అనుభవంలోని విష యాలు ప్రస్తావించారు. సుమారు 50 సంవత్స రాల క్రితమే నకిలీ సర్టిఫికెట్లు పొంది వివిధ ఉద్యోగ హోదాల్లో ఉన్నవారు ప్రస్తుతం వారి పిల్లలకు సైతం అదే సర్టిఫికెట్లతో రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవిస్తున్న వైనం ఇందులో పేర్కొంటూ నకిలీ గిరిజనులు ఏర్పడుతున్న తీరును, తెలిపి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మాత్రం అస్పష్టంగా ముగించారు. కోసం మెరుపుగా ఏజెన్సీ బయట నివసిస్తున్న గిరిజనులు ఏజెన్సీ గిరిజనులుగా నకిలీ సర్టిఫికెట్లు పొంది స్థానిక గిరిజన కోటాలో ఉద్యోగాలు పొందుతున్న వైనం, ప్రస్తావించిన శాస్త్రిగారు తనదైన పారదర్శకత చూపించే ప్రయత్నం చేశారు. ఆధునికత పేరుతో ఆవిర్భవించిన పర్యాటక రంగం వల్ల అడవి బిడ్డల సంస్కృతి ఎలా నాశనం అవుతుందో వివరించే వ్యాసంతో పాటు మాయమవుతున్న సాంప్రదాయ నాయకత్వం, గిరిజనేతరులైన వడ్డీ వ్యాపారులు, గిరిజనులను ఆర్థికంగా దోచుకుంటున్న వైనంతో పాటు ప్రస్తుతం ఆధునిక గిరిజన జనాభా పోడు వ్యవసాయం నుంచి కాఫీ తోటలు సాగు చేసే స్థాయి వరకు సాధించిన అభివృద్ధిని కూడా వ్యాస ర చయిత ఇందులో పేర్కొనడం అభినందనీయం.
ఇక గిరిజనులు అంటేనే సాంస్కృతి సాంప్రదాయాల వారసులుగా చెప్పుకుంటాం. అంతేకాక వారిలో అబ్బురపరిచే జీవన సంస్కృతి ఆగుపిస్తుంది ఈ వ్యాస సంపుటలో ఈ కోవకు చెందిన వ్యాసాలు కూడా మనం చదివే వీలు కల్పించారు. గోండు గిరిజనుల సలహాదారులైన ‘‘ప్రధానులు’’ అనే గిరిజన ఉపతెగ ప్రస్థానంతో పాటు,యానాదులు కొండరెడ్లు చెంచులు రాచకోయలు గుండులు తదితర గిరిజన జాతుల వారి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విశేషమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి, మనం అంతా గోండులు అని వ్యవహరిస్తున్న వారు గోండ్లు కాదు కోయత్తుర్లు అనే సహేతుక విశ్లేషణ కూడా వ్యాస రచయిత ఇందులో చేశారు.ప్రస్తుత గిరిజన సాహిత్యంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం’’ గిరిజన చట్టాలు’’ వీటికి సంబంధించిన విలువైన సమాచారయుతమైన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు, ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం గురించిన ఎంతో ఉపయుక్త సమాచారం ఇందులో వివరించబడిరది. అలాగే గిరిజన యువతలో విద్యావంతులతో పాటు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి కూడా వివరిస్తూనే గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన లేని తీరు, భాష అంతరిస్తే జరిగే పరిణామాలు గిరిజన పాఠశాలల సంఖ్య తో పాటు పెరగాల్సిన సౌకర్యాలు గురించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాల కారణంగా గిరిజన అక్షరాస్యత దేశవ్యాప్తంగా 58.96% మాత్రమే కాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే గణాంకాలు ఉన్నట్లు చెబుతూ.. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన అక్షరాస్యత ఆశించినంత ఎక్కువగా లేదనే అభిప్రాయం వెల్లడి చేశారు. అంతేకాక గిరిజన స్త్రీ అక్షరాస్యత 40% మాత్రమే ఉండటం మరింత అన్యాయంగా వ్యాసకర్త అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జన జాతుల్లో ఒకటైన ‘‘సవర’’ తెగ గురించిన సంపూర్ణ వివరణలో భాగంగా చిత్రకళలో వారి నైపుణ్యాన్ని వారు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ఎంతో ఆసక్తిగా విశేషంగా వివరించారు ‘‘ఇడి సింగ్‌ లేని ఇల్లుండదు’’ వ్యాసంలో. ఇలా ఈ 34 వ్యాసాలు వేటికవి ప్రత్యేకతలు కలిగి ఆసక్తి విశేషాలతో కూడిన విలువైన సమాచారం నిండి ఉన్నాయి. వ్యాసాలు అనగానే పాఠకుల దృష్టి అదో గణాంకాల సమూహం, అనే సాధారణ అభిప్రాయం ఉంటుంది కానీ ఈ వ్యాసాల రచయిత ఒక పరిశోధకుడు మాత్రమే కాక అర్థశతాబ్దం పాటు అచ్చంగా గిరిజనులతోనూ వారు నివసించే ప్రాంతాల లోను అత్యంత దగ్గర సంబంధాలతో నివసించిన వ్యక్తి అలాగే 1980 దశకంలో గోండు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే లండన్‌ విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ఆచార్యుడు, గిరిజన పరిశోధకుడు, నైజాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, అయిన ‘‘హేమన్‌ డార్ప్‌’’ తో డాక్టర్‌ శాస్త్రి ప్రత్యక్ష పరిచయం, వారి పర్యటనల్లో భాగస్వామి కూడా అయిన అనుభవాల సారం తదితర ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యాసర చయిత కలం నుంచి జాలువారిన ఈ అన్ని వ్యాసాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వ్యాసాలు అన్నీ సాధారణ నిడివి అత్యంత సరళమైన భాష ఆసక్తిని పెంచే అనుభవ సంఘటనలు, తదితరాల మేళవింపుతో ఈ వ్యాస సంపుటి విలువ మరింతగా పెరిగింది, కేవలం గిరిజన జీవన విధానం, చరిత్ర, సంస్కృతి,తో పాటుగా పరిశోధనలకు అవసరమైన ప్రామాణిక విషయా లు గణాంకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు పరిశోధకులు విధిగా చదవాల్సిన వ్యాసావళి ఇది.
ఆదివాసి ఆత్మగౌరవం… వ్యాసకర్త: డాక్టర్‌ వి ఎన్‌ వి కె శాస్త్రి, పేజీలు: 152, వెల: రూ 90/-ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు. ఫోను: 040 – 27665420. సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ సోమనాథన్‌

భారతదేశ హరితవిప్లవ పితామహు డు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్‌ స్వామినాథన్‌ కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన,సెప్టెంబర్‌ 27న చెన్నెలోని తననివాసంలో తుదిశ్వాస విడిచి నట్లు కుటుంబ వర్గాలు వెల్లడిరచాయి. ఆయన వయసు 99ఏళ్లు.అధిక దిగుబడినిచ్చే వరి, గోధు మ రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రెండవ పంచవర్ష ప్రణాళిక (1956- 1961)సమయంలో హరిత విప్లవానికి నాందిపలికారు.స్వామినాధన్‌ ప్రయత్నాలు భారతదేశం తన ఆకలి సంక్షోభా పరిష్కరిం చడంలో సహాయపడిరది. ముఖ్యంగా 1943 లో బెంగాల్‌ కరవు పరిస్థితి తర్వాత స్వామినాథన్‌ ప్రయోగాలకు ప్రాధాన్యతేర్పడిరది. స్వామినాథ నకు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్‌, మధురా స్వామి నాథన్‌, నిత్యా స్వామినాధన్‌ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్‌ సైంటిస్టుగా ఉన్న సౌమ్యా స్వామి నాథన్‌ ఈయన కుమార్తె కావడం విశేషం.
వైద్యరంగం నుంచి వ్యవసాయంవైపు..
ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశ హరిత విప్లవ పితామ హుడు. ప్రపంచ ప్రఖ్యా త వ్యవసాయ శాస్త్రవేత్త కూడా.భారతదేశం ఆహార సంక్షోభా న్ని ఎదుర్కొం టున్న వేళ,అధిక న్న వేళ,అధిక దిగుబడినిచ్చే వరి,గోధుమ రకాలను అభివృద్ధిచేసి ఆహార ధాన్యాల సమృద్ధికి బీజం వేశాదు. ఆహారభద్ర తకు మార్గదర్శిగా నిలిచాడు.ఎంఎస్‌ స్వామి నాథన్‌ 1925ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసి డెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎండే సాంబశివ న్‌ సర్జన్‌, మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయా రు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు నుంచి తన అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాల జై నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత. మద్రాసు అగ్రిక ల్చరల్‌ కాలేజీ లో చేరారు. అగ్రికల్చరల్‌ సైన్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు.ఆ తర్వాత ఢల్లీిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు. యూపీఎస్సీపరీక్ష రాసి ఐపీఎస్‌ కు అర్హత సాధించారు. కానీ,ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చ రల్‌ యూనివర్సిటీలో చేరారు.
రీసెర్చి స్కాలర్‌..
1952లో ఇంగ్లండ్లోని క్యాంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి జెనటిక్స్లో పీహెచ్‌ పూర్తి చేశారు. అమెరికా లోని విసిస్సన్‌ లో ఆయన పోస్టు డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు.జెనటిక్స్‌,నేచర్‌,జర్నల్‌ ఆఫ్‌ హెరిడిటీ, జెనిటీకా,యుఫిటికా,బిబిలియో గ్రాఫికా జెనటికా, అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ బాటనీ, అమెరికన్‌ పొటా టో జర్నల్‌ లాంటి పత్రికల్లో ఆయన రచనలు అయ్యాయి. రీసెర్చి స్కాలర్‌ స్వామినాథన్‌.. ప్రోస్ట్‌ రెసిస్టాంట్‌ అలుగడ్డను డెవలప్‌ చేశారు. అతి శీతల వాతావరణాన్ని తట్టుకునే ఆలు వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు.తన రీసెర్చ్‌ కెరీర్ను క్రిప్టోజెనటిక్‌ స్టడీస్తో ప్రారంభించారు. నెదర్లాండ్స్లో ఉన్న నాగనీస్‌ఆన్‌ వ్య న వ్యవసాయ యూనివర్సిటీ లో 1949లో ఆయన ఆలుగడ్డపై తన అధ్య యనం చేపట్టారు.
పురస్కారాలు…
స్వామినాథన్‌ అనేక జాతీయ, అంతర్జాతీయ అవా ర్డుల ను గెలుచుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు దక్కింది. 1971లో రామన్‌ మెగస్సే న్‌ అవార్డు వరించిం – 1986లో ఆల్బర్ట్‌ ఐన్స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ అవార్డు పొందా రు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి,1967లో పద్మశ్రీ, 1972లో పద్యభూషణ్‌,1989లో పద్మ విభూషణ్‌ పురస్కా రాలు అందుకున్నారు. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్కు నామినేట్‌ ఎంపీగా సేవలం దించారు. 1988లో స్వామినాథన్‌ లాభాపేక్ష లేని రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ను చెన్నైలో స్థాపించారు. అలస్కా ప్రోస్టిస్‌ అన్న వెరైటీతో ఆయన ఫేమస్‌ అయ్యారు.ఆ తర్వాత ఆయన అనేక పంటలకు చెందినఎన్నోహైబ్రిడ్‌ వెరైటీలను డెవలప్‌ చేశారు.
అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు..
20వశతాబ్దంలో ఆసియాలో ప్రభావం చూపిన 20 మందివ్యక్తుల్లో ఎంఎస్‌ స్వామినాథన్‌ ఒకరని టైమ్‌ మేగజైన్‌ కీర్తించింది. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ తర్వాత ప్రభావంతమైన భారతీయ వ్యక్తుల్లో ఆయన్ను ఒకడిగా పేర్కొన్నది. స్వామినాథన్‌ ను ఫాదర్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎకాలజీ అని ఐక్య రాజ్యసమితి కీర్తించింది.వ్యవసాయం లో హరిత విప్లవానికి స్వామినాథన్‌ నాయ కత్వం వహించినట్లు యూఎన్‌ఓ దశలో పేర్కొన్నది. ఆ ఆహార భద్రతకోసం ఐక్యరాజ్యసమితిలో ఆయన ఎన్నోకీలప పదవుల్ని చేపట్టారు. 1980 లో ఏర్పాటు చేసిన యూఎస్‌ సైన్స్‌ అడ్వైజరీ కమిటీలో ఆయన చైర్మెన్‌గా చేశారు. వియన్నా యాక్షన్‌ ప్లాన్లో పాల్గొన్నారు.ఆ ఎఫ్‌ఎవో కౌన్సిల్‌ ఇండిపెండెంట్‌ చైర్మెన్‌గా ఉన్నారు. ప్రకృతి, ప్రకృతివనరుల సంరక్షణ అంతర్జాతీయ సంఘా నికి అధ్యక్షుడిగా చేశారు.వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచరు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1961 నుంచి 1972 వరకు ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ కు డైరెక్టర్‌గా ఉన్నారు. 1979 -1980లో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 1980 నుండి 1982 వరకు ప్రణాళికా సంఘం లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కృషిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్గా ఫిలిప్పీన్స్లో పనిచేశారు. అన్నదాతలకు ఆప్త మిత్రుడు.
విదేశాల నుంచి గోధుమలను దిగు మతి చేసుకునే దుస్థితి నుంచి మన దేశం వ్యవ సాయ రంగంలో స్వయం పోషకత్వం సాధించ డానికి ప్రధాన కారకుడు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌. అందుకే, ఆయ నను హరిత విప్లవ పితామహుడని శ్లాఘి ఉం టారు. ఆయనకు రుణపడి ఉంటామని అన్నదా తలు అంటూంటారు.వ్యవసాయ రంగంలో సమ స్యల పరిష్కారానికి డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సు లను అమలు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు తరచూ డిమాండ్‌ చేస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి,తండ్రి బాటలో డాక్టర్‌ అవుదామన్న మెట్రిక్యులేషన్‌ పూర్తి కాగానే మెడిక ల్‌ స్కూల్లో చేరారు. ఆ రోజుల్లో బెంగాల్లో కరవు విలయతాడవం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. అవిభక్త బెంగాల్లో ఆకలిచావుల గురించిన వార్తలు దేశ ప్రజలను కలచివేశాయి. స్వామి నాథన్‌ డాక్టర్‌ అవ్వాలన్న తన ఆలోచన మార్చు కున్నా అధ్యయనం చేసి డాక్టరేట్‌ సంపాదించారు. ఆ రోజుల్లో మేధావులు ఏ వృత్తిలో ఉన్నా దేశం గురించే ఆలోచించేస్వామినాథన్‌. సంకరజాతి వరి, గోధుమ వంగడాలను సృష్టించడం ద్వారా అధిక దిగుబడి నిచ్చే వంగడాలను సృష్టించినం దువల్లనే ఆయనను ఈరంగానికి పితా మహుడని కీర్తిస్తున్నారు. వ్యవసాయ రంగం గ్రామాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. వ్యవసాయ రంగం వృద్ధి చెందాలంటే స్వామినాథన్‌ సిఫార్సులు అమలు జరగాల్సిందేనన్నది అధికుల విశ్వాసం. ఆకలిలో మగ్గుతున్న వారు 60శాతం ఉన్నారని డాక్టర్‌ స్వామినాథన్‌,ఆయన గురువు నార్మన్‌ బోర్లోగ్‌ విశ్వసించి, ఆహార లో సాధించిన భద్రత కోసం ఏదైనా చేయాలని పట్టుబట్టి సంకరజాతి గోధుమలను కనుగొన్నారు.అదే సస్యవిప్లవానికి దారి తీసింది. స్వామినాథన్‌ కృషికిఆనాటి ప్రధాని ఇందిరా గ్రహించి గాంధీ సంపూర్ణ సహకారం అందించారు. తమ స్వార్థం కోసం కాకుండా సమాజ హితం గురించి ఆలోచించేవారు.డాక్టర్‌ స్వామినాథన్‌ రోజున తన నిర్ణయాన్ని మార్చుకో కుండా ఉండి ఉంటే దేశానికి ఒక గొప్ప వ్యవసా య శాస్త్రవేత్త లభించి ఉండే వారు కారు. ఆహార సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆహార రంగంలో స్వయం సమృద్ధిగల దేశంగా మార్చిన ఘనత ఆయనదే. అప్పట్లో అమెరికా నుంచి పిఎల్‌ 480 రకం గోధుమలను మన దేశం దిగుమతి చేసు కునేది. ఆ దశలో ఉన్న వ్యవసాయరంగం దిశ,దశ మార్చినవాడు. అందుకే మన దేశాన్ని పాడి పంటల భాగ్యభూమిఅని అభివర్ణించారు. తరత రాలుగా భారత్లో ప్రజలు ఈ రెండిరటిపై ఆధార పడి జీవనోపాధి సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ 60శాతం మందిపైగా ఈ రెండు రంగాలపైనే ఆధారపడు తున్నారు.ఏదేశమైనా అభివృద్ధి సాధించేందుకు ఈ రెండు రంగాల్లో సాధించిన వృద్ధి అసలైన అభివృద్ధికి కొలమానం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పంపిణీ కావడం వృద్ధినే అభివద్ధిగా పరిగణిస్తున్నారు. సాఫ్‌ వేర్‌ ఎగుమతులు కాదు,ఆహారధాన్యాల ఎగుమతులు పేరిగితేనే దేశం అభివృద్ధి చెందినట్టు, ఈ వాస్త వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస వ్యవస్థా పకుడు కె.చంద్రశేఖరరావు అమలులో పెడుతు న్నారు. రంగం రూపురేఖలు మారిపోయాయి. ఆహార ధాన్యాల.అదే ఆయనకు నిజమైన నివాళి.ఉత్పత్తులు 34లక్షల టన్నులకు పెరిగాయి. కేసీఆర్‌ పదేపదే ప్రకటిస్తున్నట్టు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. స్వాతంత్య్రా నంతరం పాలకులు వ్యవసాయ, పారిశ్రామికరం గాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చేవారు. తర్వాత వ్యవసాయ రంగంపై దృష్టి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలు లేక అక్కడి జనం గ్రామాలు, నగరాలకు వలసలు రావడం ప్రారంభించారు.దీనిని నిరోధించేందుకు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఇప్పుడు అంతంత మాత్రంగా కొనసాగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా అవి సక్రమంగా లేదు. అందుకే యూపీఏ హయాంలో ఆహార భద్రతా పథకాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆపథకం నీరుగారడం వల్లనే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. స్వామి నాథన్‌ సిఫార్సులను అమలు చేయడం ద్వారా వ్యవసా య రంగాన్ని,ఇటు రైతులను పరిపుష్టం చేయ వచ్చు.అందుకే కేంద్రప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయాలి.అదే ఆయనకు నిజమైన నివాళి.- (కె.సతీష్‌ కుమార్‌)

పెసా చట్టం అమలు చేయాలి

గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన అవశ్యకత ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే గిరిజను గ్రామసభల ద్వారా స్వయంపాలన చేసుకోగలరు. గ్రామసభలు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,ప్రజా ఆస్తులు, గ్రామ రక్షణ,మౌలిక సదు పాయాలు మొదలైన వాటికోసం సొంతంగా కమిటీలు వేసుకొనే హక్కునిస్తోంది.అటవీ భూమి,చిన్న నీటి వనరులు,మైనర్‌ ఖనిజాలు,సహజ వనరుల వినియోగానికి సంబంధించిన హక్కులు కూడా పెసాచట్టం కింద నిర్వచించబడ్డాయి.దీనర్థంగ్రామసభలు నేల,వనరులు వంటి మొదలైన చిన్నఖనిజాల కోసం ప్రణాళికలు రూపొందించి,వాటిని ఉపయోగించు కోవచ్చు.ఏదైనా ఖనిజ తవ్వకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి,అంటే మైనింగ్‌లీజు లేదా మైనర్‌ ఖనిజాలకోసం ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ అనుమతి దానితో ముందస్తు సంప్రదింపులు లేకుండాజారీ చేయబడదు.చెరువుల వంటి సహజ నీటి వనరులలో చేపలు పట్టడానికి మరియు నక్కల వంటి వనరులను సేకరించేందుకు నివాసితులందరికీ సమాన హక్కులు ఉంటాయి.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోని ప్రాంతాల సంప్రదాయ ఆచారాలు,పద్ధతులకు హానికలిగించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కూడా సభలు తిరస్కరించవచ్చు. ఏ గిరిజన భూమి అయినా గ్రామసభ అనుమతి ఇచ్చిన తర్వాతే సేకరించవచ్చు. పెసా చట్టం లక్ష్యాలను ప్రతి గిరిజనుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది.గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన అందించడం.భాగస్వామ్య ప్రజాస్వామ్యంతో గ్రామ పాలనను కలిగి ఉండటం మరియు గ్రామసభను అన్ని కార్యకలాపాలకు కేంద్రకం చేయడం.సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా తగిన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం.గిరిజన వర్గాల సంప్రదాయాలు మరియు ఆచారా లను పరిరక్షించడం మరియు సంరక్షించడం.ఈ చట్టం కింద గ్రామసభలకు విస్తృత అధికారాలు అప్పగించబడ్డాయి.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూమి అన్యాక్రాంతాన్ని నిరోధించడం,షెడ్యూల్డ్‌ తెగకు చెందిన ఏదైనా చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూమిని పునరుద్ధరిం చడానికి తగిన చర్యలు తీసుకోవడం,గ్రామ మార్కెట్‌లను ఏ పేరుతో పిలిచినా నిర్వహించండి,షెడ్యూల్డ్‌ తెగలకు రుణాలిచ్చే డబ్బుపై నియంత్రణను పాటించండి,అన్ని సామాజిక రంగాలలోని సంస్థలు,కార్యకర్తలపై నియం త్రణను అమలు చేయాలి.గిరిజన ఉపప్రణాళికలతో సహా అటువంటి ప్రణాళికల కోసం స్థానిక ప్రణాళికలు,వనరులపై నియంత్రణ ఉంటోంది.అదేవిధంగా పౌర సమాజంలో గిరిజనులు ఎదుర్కొం టున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి పెసాను మరింత మెరుగ్గా అమలు చేయాలని పెసా చట్టం చెబుతోంది. గిరిజనుల ప్రాంతంలో మంచి పని చేస్తున్న,స్వచ్ఛంద సంస్థలు పాల్గొనవలసిన అవసరం ఉంది.
అయితే పెసా చట్టం అమలుపై పలువురు మేథావులు,ఐఏఎస్‌ విశ్రాంతి అధికారులు ప్రభుత్వాలకు ఎన్నొ లేఖలు రాస్తునే ఉన్నారు. ఇటీవల విశాఖకు చెందిన ఫోరం ఫర్‌ బెటర్‌ విశాఖ వ్యవస్థాపకులు కేంద్రప్రభుత్వ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో,పీసా చట్టం అమలు కావడం లేదు.అటవీ ప్రాం తాల్లో భూములను తరతరాలుగా సాగుచేస్తున్న ఆదివాసీలకు,అటవీహక్కుల చట్టం క్రింద వ్యక్తిగత,ఉమ్మడి పట్టాలు లభించడం లేదు. ఇందుకు కారణం,ప్రభుత్వ సంస్థలలో ఆదివాసీలపట్ల ఉన్న నిర్లక్ష్యం,ఉదాసీనత.ఈ విషయంలో పభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనాపెసా చట్టాన్ని సమర్ధవంతంగా గిరిజనప్రాంతాల్లో అమలు పర్చాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగంకల్పించిన వారి హక్కులు నిర్వీర్యం చేయకుండా గిరిజన చట్టాలను అమలు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

త్వరలో విశాఖ నుంచి పాలన

రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా రాజధానికి సీఎంవో తరలనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు తరలింపు తప్పదంటూ నాయకుల ప్రకటనలు మినహా ఆ దిశగా జరిగిందేమీ లేదు. అయితే గతంలోనే సీఎం ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు విశాఖలో సీఎంవో,హెచ్‌వోడీల కార్యాలయాల కోసం పర్యటనలు చేశారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో భవనాలనూ ఖరారు చేసుకున్నారు.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తరలి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీలో పాసైన చట్టంపై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడంతో తరలింపుపై వేచి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌ఆర్సీ వంటి వాటిని న్యాయ రాజధాని అయిన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. హైకోర్టు తరలింపుపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి పరిపాలనను సాగించబోతున్నట్లు ఉత్తరాంధ్ర కీలక నేతలు కూడా చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు, ప్రచారం జరిగినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ముఖ్య మంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తే అదే రాజధాని అని చట్టం చెబుతోందని న్యాయస్థానంలోనూ ప్రభుతవ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులతో బిల్లును ఉపసంహరించుకున్నా తరలింపునకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స పలు వేదికలపై చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విశాఖే పాలనా రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మరో బిల్లుతో వస్తామని పేర్కన్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బిల్లు తుది దశలో ఉండటంతోనే సెప్టెంబర్‌ ఒకటిన జరగాల్సిన కేబినెట్‌ను ఏడో తేదీకి వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోనున్నట్లు చర్చ జరుగు తోంది. సీఎం జగన్‌ ఇటీవల పర్యట నలను వేగవంతం చేశారు. రెండుమూడు సార్లు ఉత్త రాంధ్రలోనూ పర్యటించారు. ఈ క్రమంలో విశాఖతో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి కూడా పరిపాలనను నిర్వహించ నున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆవిధంగా చేస్తే న్యాయపరమైన ఆటంకాలు కూడా ఉం డవని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో పరి పాలనకు అవసరమైన అన్ని భవనాలను ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన ప్రారంభిస్తే ప్రస్తుతానికి హెచ్‌వోడీలు తరలి వెళ్తే సరి పోతుందని చెబుతున్నారు.
అక్టోబర్‌ 23వ తేదీన మూహోర్తం..
విజయదశమికి ఇంకా నెలరోజులు గడవు ఉంది.ఈలోగా అమరావతి ప్రాంతంనుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరు వాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం.విజయదశమి రోజు(అక్టోబర్‌ 23న) రాజధాని నిర్మాణాలకు సీఎం చేతులు మీదుగా శంకుస్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. చట్ట బద్ధం గానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్‌ గత ఏడాది సెప్టెంబరులో జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి,పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా డిసెంబరు నెలాఖరున నివేదిక సమర్పించింది.దీనిపై ప్రతిపక్షాలు, అమరావతికి 33వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చిన రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.ఆపై బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక అంటూ మరోకటి తెరపైకి తీసుకువచ్చింది.దీంతో విశాఖకు పరిపాలన రాజధానిని తరలిం చాలని ప్రభుత్వం నిర్ణయింది. విశాఖలో ఇందుకు అవసరమైన కార్యాలయాలను ఎంపిక చేసుకోవాలని అన్ని శాఖల అధిపతులకు సూచించింది. రెవెన్యూ,ఐటీ, జలవనరులు,ఆర్‌అండ్‌బీ, పురపాలన, పట్టణాభివృద్ధి,రిజిస్ట్రేషన్లు…ఇలా అన్ని శాఖల అధిపతులు ఏదో ఒక సమయంలో విశాఖ పట్నం వచ్చి, తమ శాఖకు అనుకూలమైన భవనాలను పరిశీలించుకున్నారు. కుటుం బాలతో సహావస్తే… ఉండేందుకు రుషి కొండలో ఏపీ టూరిజం నిర్మిస్తున్న ఐదు భవన నిర్మాణాల్లో రెండు భవనాలు సిద్దమవుతున్నాయి.భహుశా ఆభవనాల్లోనే ముఖ్యమంత్రి పరిపాలన కార్యనిర్వహణా కొనసాగించవచ్చని పరిశీలికలు భావిస్తున్నారు.
సీఎం కార్యాలయాలన్నీ భీమిలి నియోజకవర్గ పరిధిలోనే?
విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనగానే..భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని కార్యాలయాలు రానున్నాయి.ఈ మేరకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఈప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ‘ఇదంతా రాజధానిప్రాంతమని అనేవారు.గత సీఎం సలహాదారు అజయ్‌ కల్లం, అప్పటి సీఎం పేషీముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి… తదితరులు విశాఖలో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు,భవనాల కోసం అన్వేషిం చారు.మొదట రుషికొండఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికే అందులో కాండ్యుయెంట్‌ కంపెనీ ఉండడం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోతా యని ఐటీవర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఐటీ సెక్రటరీ కోనశశిధర్‌, స్వర్గీయ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి విశాఖపట్నం వచ్చి…అటువంటిదేమీ లేదని, అందులో సీఎం కార్యాలయం రాదని ప్రకటించారు. అయితే ఆ పక్కనే మిలీనియం టవర్‌-2నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దానిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించు కోనున్నారు.
పరిపాలన కార్యాలయాలు గతంలో కొన్ని గుర్తింపు..
సీఎం నివాసం,కార్యాలయం,సచివాలయం ఇలా అన్నీ శాఖల కార్యాలయాలు ఏర్పాటుపై గతంలో అప్పటి సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు ఒక కమిటీ ఏర్పడి విశాఖలో పర్యటించి కొన్ని భవనాలను గుర్తించారు.ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి?అనే అంశాలపై క్షుణ్ణంగా పలు ప్రదేశాలను సందర్శించారు.అప్పట్లో రుషికొండ ఐటీపార్కులో స్టార్టప్‌ విలేజ్‌ భవనాన్ని సీఎం కార్యాలయం కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో స్టార్టప్‌ కంపెనీలన్నింటినీ ఏడాది క్రితమే ఖాళీ చేయించారు. ఐటీ పార్కులో ఓరాజకీయ నాయకుడికి చెందిన భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం మాట్లాడారు. మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న ఆభవనంలో మరో అంతస్థు నిర్మించే అవకాశం కోసం పరిశీలిం చారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ కార్యాల యం ఉంది.అక్కడ భద్రత ఎక్కువ. అందు లోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.బోయపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడికి చెందిన పైడా విద్యా సంస్థల భవనాలను కూడా అజయ్‌ కల్లం,తదితరులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడతాయని అప్పట్లో పరిశీలిం చారు.అదే విధంగా నగరంలోని ఏలేరు గెస్ట్‌హౌస్‌ను జల వనరులశాఖ రాష్ట్ర కార్యాలయంగా,మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ స్‌ను ఆ శాఖ ప్రధాన కార్యాలయం కోసం వినియోగించుకుంటారని కూడా అప్పట్లో సీఎంఓ ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగింది.రుషికొండ ఐటీ పార్కులో పరిశ్రమలు,ఐటీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయం కోసం మద్దిలపాలెం ఆటోమోటివ్‌ సమీపాన వీఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అప్పట్లో రిజర్వ్‌ చేసి సీఎంకి నివేదించారు.
అధికారులకు అద్దె ఇల్లులు సిద్దం..
రుషికొండ కేంద్రంగా పరిపాలన సాగితే అందుకు తగ్గట్టుగా అధికారులు నివాసం ఉండటానికి ఇప్పటికే గృహలను గుర్తించారు. ఇరవై రోజులుగా బీచ్‌ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 128ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి ముందుగా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రవైద్యకళాశాల వైద్యుల క్వార్టర్స్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది డూప్లెక్స్‌ ఇళ్లను సైతం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరు మంత్రులు విశాఖలో ఇళ్లు కొనుగోలు చేయగా,మరికొందరు అద్దెకు తీసుకోవడానికి సిద్దమయ్యారు.
మంత్రిత్వశాఖలకు అతిథి గృహాలు..ఖాళీ భవనాలు
మంత్రుల కార్యాలయాలకు ఆయా శాఖల్లోని ఖాళీ భవనాలు,అతిథగృహాలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్సులో ఖాళీగా ఉన్న ప్లోరుతోపాటు,అతిథిగృహాన్ని రహణాశాక మంత్రి కార్యాలయానికి, ఆధునీకరిస్తున్నట్టు జిల్లాపరిషత్‌ అతిథిగృహాన్ని పంచాయితీశాఖ మంత్రిత్వశాఖకు,బీచ్‌ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పురపాలకశాఖ కార్యాలయానికి, ఈఎన్‌సీ కార్యాలయంలో జలవనరులశాఖ మంత్రికి,దేవాదాయశాఖ మంత్రికి సింహాచలంలో కార్యాలయాలు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బృహత్తర ప్రణాళికతో విశాఖ అభివృద్ధి
విశాఖనగర అభివృద్ధికి భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కే.ఎస్‌.జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశనిర్ధేశం చేశారు. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎం ఆర్‌డీఏ)పరిధిలో మూడు జిల్లాలో రూ.కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు,ఇతర అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. విశాకలో చేపట్టే ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారతాయని,అభివృద్ధి పనుల్లో పచ్చదనం,పారిశుద్ద్యాఆనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బీచ్‌ కారిడార్‌లో భాగంగా కాపులుప్పాడలో సిగ్నేచర్‌ టవర్‌,ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని జవహర్‌రెడ్డి సూచించారు. మంగమూరిపేట వద్ద జల క్రీడలు,కైలాసగిరిపైన సైన్స్‌ సిటీపాటు నగరంలోని అన్ని ఉద్యానవనాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
పరిపాలన రాజధాని విశాఖ కొత్త హంగులు
ఇప్పటికే అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందాల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు మరిన్ని కొత్త హంగులు దిద్దేందుకు జిల్లా కలెక్టర్‌,జీవీఎంసీ కమిషనర్‌,కలసి కసరత్తు చేస్తున్నారు.సీఎం నివాసముండే రుషికొండ భవనాల చుట్టూ వంద అడుగుల రహదారులు నిర్మాణమవు తున్నాయి.ఇక్కడ నుంచి నగరంలోకి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందకు గీతం వర్శిటీ నుంచి జోడుగుళ్లపాలెం వరకు బీచ్‌ రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు .విశాఖవ్యాలీ మలుపు నుంచి సీతకొండ వ్యూ ఫాయింట్‌ వరకు విస్తరణకు నోచుకోని బీచ్‌ రోడ్డును అటవీశాఖ అనుమతులు తీసుకొని ఐదువందల మీటర్లు పొడవును విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి.రుషికొండ నుంచి ఆర్కేబీచ్‌ వరకు బీచ్‌ రోడ్డు ఇరువైపుల పుట్‌పాత్‌లు,విద్యుత్‌లైట్లతో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు.నగర పరిధిలో ఉన్న ఇరుకైన రహదారులను విస్తరిస్తున్నారు. ఇప్పటికే పూర్ణామార్కెట్‌, ఓల్డ్‌టౌన్‌,కనకమహాలక్ష్మీ టెంపుల్‌,కొత్త రోడ్డు వంటి ఇరుకైన మెయిన్‌ రోడ్డులను విస్తరి స్తున్నారు. అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ తదితర ప్రాంతాల్లో కూడా మెయిన్‌రోడ్డులను విస్తరించి అకర్షణీయంగా నిర్మించేందకు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికేంద్రికరించారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో రహదారులు విస్తరణ,అభివృద్ధి..
ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) పరిధిలో కూడా పరిపాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భొగాపురం వరకు మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు.భీమిలీ బీచ్‌ నుంచి భోగాపురం వరకు రోడ్డును సుందరంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు సిద్దం చేశారు. అదే రకంగా13 మండలాల వీలీనంతో ీ(వీఎం ఆర్‌డీఏ) పరిధి పెరిగింది.ఇప్పటికే అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ,అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
అడ్డంకులు అధికమించి..
జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్నీ ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించి కేబి నెట్‌కు నివేదికను సమర్పించింది. చట్టసభ ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా… ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేసింది. తరువాత జనవరి 20న అసెంబ్లీ ఆమోదించింది.22న శాసన మండలి ముందుకు బిల్లును తీసుకువచ్చారు. అక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మండలిలో తెలుగుదేశానికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలుగు సంవత్సరాది ఉగాదినాటికి విశాఖ తరలి రావాలని ప్రభుత్వం మరోయత్నం చేసింది. అది కూడా బెడిసి కొట్టింది. ఆతరు వాత స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్‌ మార్పు,కరోనా వైరస్‌ వ్యాప్తి ఇలా…ఒక దాని తరువాత మరొకటి రావడంతో వేసవి సెలవుల తరువాత కార్యాలయాలు తరలించాలని యోచించారు. ఇదే సమయంలో రాజ్యాంగపరంగా అవసర మైన అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. రెండోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తరువాత ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపిం చారు. దీంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారినట్టయ్యింది.- గునపర్తి సైమన్‌

1 2