విశాఖ ఓ అద్భుత నగరం

విశాఖ అద్భుతమైన నగరం..సిటీ ఆఫ్‌ డెస్టినీ..(గమ్య నగరం)గా విశాఖనగరం దూసుకుపోతుంది..భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఎంతోమంది వైద్య ప్రముఖలను దేశానికి అంది స్తోంది..పూర్వవిద్యార్థులురూ.50కోట్లతో క్యాబ్‌(సెంచినరీ అలుమ్ని బిల్డింగ్‌)నిర్మించడం అభినందనీయం.ఇదే స్పూర్తి మున్ముందు కొనసాగాలి. వేలాది మంది వైద్యులను అందించిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలి.వైద్య సేవల కోసం ప్రజలు ఆసుపత్రికి రాకుండా..సంపూర్ణ వైద్యాన్నందించే కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని భారత దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఆకాంక్షిస్తూ వైద్య విద్యార్థులకు పిలుపు నిచ్చారు.ఏఎంసీ శతాబ్ది వేడుకల్లో పాల్గోనేందుకు విశాఖ తొలిసారిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సహజ అందాల విశాఖను కొనియాడారు. అక్టోబర్‌ 28న విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో మాట్లా డారు. విశాఖతోపాటు ఆంధ్రవైద్య కళాశాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఇదే సమయంలో పాల్గొన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ ఏఎంసీకి అనుబంధంగా ఉన్న అసుపత్రుల ద్వారా రోజుకు రెండువేలమందికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. విశాఖనగరాన్ని దేశంలోనే కీలక గమ్యస్థానంగా మారుస్తున్న కొన్ని ప్రధాన సంస్థలు ఆత్మనిర్భర్‌ భారత దార్మనికతకు దోహదం చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర వైద్య కళాశాల మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షించారు. తర్వాత ఎఎంసీ కళాశాలకు చేరుకున్న ఉపరాష్ట్ర పతి,గవర్నర్‌ ఆవరణంలో మొక్కలునాటి నీళ్లుపోశారు.అనంతరం శతాబ్ది వేడుకలు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్‌నుఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.తర్వాత రూ.20కోట్లతో నిర్మించనున్న క్లినికల్‌ అండ్‌ బయోమెడికల్‌ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి బృంద చిత్రం దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి విశాఖ చరిత్రను ఆసక్తిగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కళా శాల ప్రస్థానం,పూర్వవిద్యార్థుల చేయూత, క్యాబ్‌ ప్రాజెక్టు వివరాలను క్యాబ్‌ చైర్మన్‌ డాక్టర్‌. టి.రవి రాజు ఉపరాష్ట్రపతి,గవర్నర్‌ దృష్టికితీసు కెళ్లా రు.ఈపర్యటన కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర ఐటి,పరిశ్రమలశాఖమంత్రి గుడి వాడ అమర్‌నాథ్‌,జిల్లా ఇన్ఛార్జి,రాష్ట్ర వైద్యఆరోగ్య, శాఖమంత్రి విడదల రజని,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్‌ జె.నివాస్‌, జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లి ఖార్జున,జివిఎంసి కమిషనర్‌ సాయి కాంత్‌వర్మ, సెంటినరీ సెలబ్రేషన్స్‌ కమిటీఅధ్యక్షులు డా.టి.రవి రాజు,ఎ.ఎం.సికళాశాల ప్రిన్సిపాల్‌ డా.బుచ్చి రాజు, కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.పి.అశోక్‌ కుమార్‌, పలువురు జిల్లా వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌