వలస కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు.సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడాకూలీపనులు వుండటం లేదు.కారణం ముఖ్యం గా వ్యవసాయంలో యంత్రాలు రావడం.పంటల సాగులో మార్పులు రావడం (ఉదా:డ్రమ్‌ సీడిరగ్‌ చల్లటం లాంటి పనులు).ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం.బయట రాష్ట్రాల నుండి (బెం గాల్‌,బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసా యేతర పనులకు వెళుతున్నారు.ప్రధానంగా ఇటుక బట్టీ పను లు,భవననిర్మాణపనులు,హోటళ్ళలో క్లీనింగ్‌ పనుల కు,అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహి ళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు.నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి.ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి. వలస కూలీల పరిస్ధితి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌,బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్టచేత పట్టుకొని మహిళలను,పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తు లు,డీలర్లు చూపిన పశువుల కొట్టాలు,పాడుబడిన ఇళ్లు,బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు.వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు.ఒకఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ. 4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలంరూ.3200,రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద(గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి,కూరగాయలు,ఆటో ట్రాన్స్‌ పోర్టు) మధ్యవర్తులు,డీలర్లు కాజేస్తున్నారు.ఒక్క నెల్లూరు జిల్లా లోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది.స్ధానిక కూలీలు 2లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతాకూడా రైతాం గం బెంగాల్‌ కూలీలచేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి – (పుల్లయ్య మంగళ/ఆకారపు మల్లేశం)