రాష్ట్ర బడ్జెట్‌202526

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అమరావతి లోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్‌ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ముందుగా పాఠశాల విద్య ఇంకా అభివృద్ధి కోసం రూ.31,806 కోట్లు కేటాయించింది.
2025-2026 సంవత్సరానికి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్‌లలో పారిశ్రామిక కారిడార్‌ల కోసం రూ.837కోట్లు, పరిశ్రమలు, లు సహా ఆహార ప్రాసెసింగ్‌ కోసం రూ.1,400 కోట్లు కేటాయించింది.అలాగే 26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆర్థిక,సాంకేతిక పురోగతి కోసం రూ.55,730 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ హమీలోని తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ 9,407 కోట్లను ప్రతిపా దించారు. అలాగే రూ.15వేలు చొప్పున తల్లుల ఖాతా ల్లో మే నెలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తేలిపింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు13,487కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా, కేంద్రం అమలు చేస్తున్న పీఎంకిసాన్‌ కలిపి ఈ పథకం అమలు కానుంది.
పెన్షన్ల కోసం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌ లో పోర్టులు, ఎయిర్‌పోర్టులకి రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయిస్తూ తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంప్కె వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు అలాగే నవోదయం 2.0స్కీం కిందమద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం కూడా నిధుల కేటాయింపు చేశారు.ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి6,705కోట్లను,సాగునీటి ప్రాజెక్టులకు 11,314కోట్లను కేటాయించారు. ప్రకృతి వ్యవసా యం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.315 కోట్లు, సహకార శాఖకు రూ.239 కోట్లు, వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు,పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు, ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు,దీపం 2.కోసం రూ.2,601 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌కోసంరూ.2,800కోట్లు కేటాయిం చారు.
తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. బడ్జెట్‌ లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్‌ లో నిధులు కేటాయింపు ఎలా ఉంటుదన్న దానిపై ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.
మే నెల నుంచి…
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభు త్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
అర్హతలివే…దీంతో పాఠశాలలు జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.మేనెల నుంచి తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయిం చారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు ఉండాల్సి ఉంటుంది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలరూపాయలు ఇస్తా మని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసర త్తులు ప్రారంభించారు. హాజరుశాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయను న్నారు. తెలుపు రంగు రేషన్‌ కార్డు తప్పనిసరి. కుటుం బంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభు త్వం ప్రకటించనుంది.-(జిఎన్‌వి సతీష్‌)