మహిళలు..బాలల హక్కులకేదీ భరోసా

రాజ్యాంగం మహిళలు,బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
చట్టం ముందు అందరూ సమానులేనని,అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది.కుల,మత,జాతి,మత,లింగ, ప్రాంతీయ పరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది.మహిళలు,బాలలహక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనాప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే,ఆపని నిక్షేపంగా చేయవచ్చునని15(3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది.మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం,మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది.వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది.ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా,1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడిరది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది.1961లో మాతృత్వ సంక్షేమ చట్టం,వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది.ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్‌ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది.అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం,కోడళ్ల హత్యలు,ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేరగణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడిరచడం ఓభీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్ప నిసరి.అందుకే గృహహింస నిరోధానికి ఒకచట్టం చేశాం.పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని,అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని,లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం.ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి.రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు,పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం,ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశి స్తున్నాయి.పంచాయతీలు,పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్‌ కులాలు,తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయి స్తున్నారనే వార్తలు వస్తున్నాయి.కొందరు అగ్రశ్రేణి రాజకీ య నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటిం ట్లోనని,వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం.కాబట్టి కేవలం చట్టా లతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్త త్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి.ప్రత్యేక సంరక్ష ణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వ త్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది.1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి.తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది.14 ఏళ్ల లోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్క డైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి.స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందా గా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించా లన్నాయి.బాలలు,యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా,భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలి వేయడం వంటివి జరగరాదంటున్నాయి.ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి.ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం.పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగు తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
లక్ష్యసాధనలో వైఫల్యాలెన్నో
ప్రగతిశీల సమాజంగా, సజీవ ప్రజాతంత్ర, గణ రాజ్యంగా వెలిగిపోతుందనుకొంటున్న భారతదేశం నిజంగా ఏమి సాధించిందనే ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది. లక్ష్యసాధనలో కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.మరి వాటిని అధిగమించడానికి మనమేం చేశాం, ఏం చేస్తున్నాం? మొదట దేశ ప్రజల ఆలోచనా విధానం మారాలి. కాలం మారుతోందని గుర్తించి తదను గుణంగా నడచుకోవాలి.చిరకాలం ఇంటి నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన భారతీయ మహిళ నేడు బయటి ప్రపంచంలోకి వస్తోంది.‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే మను సూక్తికి కాలం చెల్లిపోయింది. తమకూ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం వాటికి భరోసా ఇచ్చిందని మహిళలు గ్రహించారు.సమానత్వం, గౌరవ మర్యాదల పరిరక్షణకు కట్టుబడిన రాజ్యాంగం వనితలను తమ హక్కులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది.దీన్ని ఎవరూ కాదనలేరు.నాయకులు కాని, మరెవరైనా కాని మహిళల హక్కులను కాలరాయలేరు. మహిళలు కూడా సంస్థాగతంగా సంఘటితమై తమ హక్కులను కాపాడు కోవడానికి ఉద్యమిస్తున్నారు.మన దేశజనాభాలో 37 శాతం బాలలే అయినా గడచిన 70ఏళ్లుగా బాలల హక్కు లను అలక్ష్యం చేస్తూ వచ్చాం.ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్నది భారత్‌లోనేనని గర్విస్తూనే బాలల గురించి పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు. బాల్యం నుంచి చక్కని చదువులు చెప్పి,యౌవనంలో నైపుణ్యాలు గరపడం ద్వారా యువ జనాభాను దేశ ప్రగతికి చోదక శక్తిగా మలచుకోవలసిన బాధ్యత జాతి మీద ఉంది. మహిళలు,బాలలకోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ-అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరుపై సామాజిక తనిఖీ చేయాలి.వసతి గృహంలో లైంగిక అత్యాచారాలపై నిష్పాక్షికంగా,హేతుబద్ధంగా జరిపిన విచారణ ద్వారానే నేరస్తులకు శిక్షలు విధించగలిగాం. సామాజిక తనిఖీ కూడా అదే పంథాలో సాగాలి.
ఆచరణలో వెనకబాటు
పిల్లలు,ముఖ్యంగా ఆడ పిల్లల శ్రేయం కోసం జాతీయ విధానాలుచాలానే రూపొందించుకున్నాం. పిల్లల సంక్షేమానికి తరుణ వయస్కుల న్యాయ చట్టం రూపొందింది.14ఏళ్ల వయసువరకు బాలలకు ఉచిత విద్య ఒకహక్కుగా గుర్తించాం.ఇన్నిచట్టాలు చేసినా వాస్త వంలో పరిస్థితి వేరుగా ఉండటం శోచనీయం. కైలాస్‌ సత్యార్థి వంటివారు నిస్వార్థంగా కృషి చేసినప్పటికీ బాల కార్మికులతో పని చేయించే పద్ధతి ఇప్పటికీ కొనసాగు తోంది. సరైన వైద్య సౌకర్యాలు లేక వందల సంఖ్యలో శిశువులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు.దేశంలో రోజుకు 250మంది బాలలు అదృశ్యమవుతున్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి. వసతి గృహా ల్లో,శరణాలయాల్లో బాలికలపై లైంగిక అత్యాచారాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక శరణాల యంలో 30మంది బాలికలపై పదేపదే అత్యాచారం జరిపిన వ్యక్తులకు ఇటీవల శిక్షపడటం చూస్తే, రాజ్యాం గం నిర్దేశించిన రీతిలో బాలలకు ముందుగానే రక్షణ కల్పించలేకపోతున్నామని తేలుతోంది.బాలలు నేరాలకు ఒడిగట్టే ధోరణి తగ్గుతుంటే,వారి పట్ల నేరాలు పెరిగి పోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడిరచింది.2016-2018 మధ్యకాలంలో బాలలపై నేరాలు గణనీ యంగా పెరిగా యని తెలిపింది. బాలలకు విద్యాహక్కును తొమ్మి దేళ్ల క్రితమే దత్తం చేసినా,ఆశించిన స్థాయిలో ఆహక్కు అమ లైందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అర్హులైన ఉపాధ్యాయులు,సరైన పాఠశాలభవ నాలు, ప్రయోగశాలలు,ఇతర మౌలిక వసతులు కొరవడటంవల్ల బాల లకు విద్యా హక్కు అరకొరగానే అమలవుతోంది. భారత గణతంత్ర రాజ్యానికి70ఏళ్లు నిం డిన సం దర్భంలో స్త్రీలు,బాలల అభ్యున్నతికి భావి కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణ యించుకోవడం ఎంతైనా అవసరం. ఆలక్ష్య సాధనకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఐక్య రాజ్య సమితి లో సభ్యులైన 193దేశాలు సంతకం చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పత్రం సరిగ్గా అటువంటి ప్రణాళికే. భారత దేశం కూడా దాని మీద సంతకం చేసింది.సుస్థిరా భివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీల)ను సక్రమంగా అమలు చేస్తే,అన్ని వర్గాలతో పాటు స్త్రీలు, బాలలూ లబ్ధిపొందుతారు. ఎస్‌డీజీలలో అయిదోది స్త్రీలు,బాలికల గురించి పట్టిం చుకొంటోంది.లింగ సమానత్వం సాధించి, మహిళలు, బాలికలకు సాధికారత అందిం చాలని అందులోని అయిదోలక్ష్యం ఉద్ఘా టిస్తోంది.ఎస్‌డీ జీలలో ఇతర లక్ష్యాలైన పేదరికం,అసమా నతలనిర్మూలన,ఆరోగ్య సంరక్షణ,ఉపాధి,ఆర్థిక ప్రగతులను సాధిం చడానికి మహిళా సాధికారతే పునాది.కొత్త దశాబ్దంలో ఈలక్ష్యాల సాధనకు జాతి యావత్తు కలిసి కట్టుగా ప్రజాస్వామికంగా కృషి చేయాలి.- వ్యాసకర్త : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి