మత్తు ఉచ్చులో బాలలు
‘‘డ్రగ్స్ చట్టంలో మనిషి నుంచి మనిషికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవ్వడాన్ని కూడా ట్రాఫికింగ్ అనే అంటారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్. ఒక విధంగా డ్రగ్స్ వాడుతున్న వాళ్ళను క్షమించి వారికి కొత్త జీవితాన్ని అందించడానికి ప్రయ త్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ సరఫరా చేస్తున్న డ్రగ్ మాఫియాను మాత్రం కూకటి వేళ్ళతో పెకలించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూన్ 26, 1987న చేసిన తీర్మానం మేరకు ‘డ్రగ్స్’ విని యోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను నడుం బిగించింది. ఈ సంవత్సరం (2023) హానికరమైన మాదక ద్రవ్యాలను వినియోగించే వారు, వారి కుటుంబాలలో అత్యధికులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పరిస్ధితులకు దారితీస్తుంది. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించే పరిస్ధితులు బలపడేలా చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు ముందుగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై వివక్షతను తొలగించి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ధీమ్ ప్రకటించింది.’’ –గునపర్తి సైమన్
సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియో గించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తు మందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరు కుంటున్నారు. వాటిని సమకూర్చు కోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదా గా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈమధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పిం ది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో మాదకద్ర వ్యాల విని యోగం అత్యంత ప్రమా దకర స్థాయిలో పెరుగుతోంది. పదేళ్ల ప్రాయం నుంచే కొందరు బాలలు వీటికి అలవాటు పడుతున్నారు. ఏకంగా 3.17లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా.. వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండ టం ఆందోళన కలిగి స్తోంది.బాలల్లో గంజాయి వినియోగం అధికం గాఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానంలో ఉండటం మరింత కలవరపెడుతోంది. మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని రాష్ట్రంలోని కొందరు బాలలు అల్లాడు తున్నారు.ఓపియం, హెరాయిన్, గంజాయి వంటి నాటికీ వారు బాని సలవుతుండటం కలవరం రేపు తోంది. వీటిలో గంజాయి వినియో గం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలోని ఏపీ12వ స్థానంలోఉండగా.. బాలల్లో ఓపయడ్స్కు సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో పదివస్థానంలోఉంది. సెడెటివ్స్ వినియోగంలో ఎనిమిదివ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ సాధి కారిత మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
దేశంలో మత్తు పదార్ధాల బారిన పడి త్రీవంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఈ నివేదిక వెల్లడిరచింది. ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కోంది.మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.దీనివల్ల నేరాలూ పెరుగుతున్నాయి.ముప్పు ఇంతస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వం నియంత్రణకు అవసరమైన కార్యాచరణ కొరవడిరది.
మత్తు ఉచ్చులో విద్యార్థులు..కిక్కు కోసం బానిసలు
రాష్ట్రంలో గంజాయికి బానిసులుగా మారిన వారు 4.64లక్షలమంది ఉన్నారు. వారి లో 21వేలమంది బాలలే.వీరిలో 10నుంచి 17ఏళ్లలోపు వారు గంజాయి రుచిచూస్తున్నారు. మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19లక్షల మందిలో 22.98శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు. 10నుంచి 17ఏళ్ల మధ్య వయస్సున్న 3.17లక్షల మంది మాదకద్ర వ్యాలకు అలవాటుపడగా..,వారిలో 21వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.18నుంచి 75ఏళ్లలోపువారిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది.గతంలో మన రాష్ట్రంలో సాగు మాత్రమే ఉండేది.గత నాలుగేళ్లలో దాని లభ్యత, వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడే లభిస్తోంది. విక్రయదారులు, సరఫ రాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసకోవల్లేదు.ఈ ఉదాసీనత ఫలి తంగా దానికి అడ్డుకట్ట పడట్లేదు.ఓపి యోడ్స్, ఇన్హెలెంట్స్,సెడిటిప్స్కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా9.88లక్షల మంది ఓపి యెడ్స్కు బానిసలుగా మారారు.
రాష్ట్రంలో గాజాయి ఫుల్..చర్యలు నిల్
మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 201819లో 1,752మంది లబ్దిపొందగా,2020
21నాటికి వారిసంఖ్య ఏకంగా 8,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 291.57శాతం మంది లబ్దిదారులు పెరిగారు.201920తో పోలిస్తే 202
21లో ఏకంగా 233.39శాతంమంది లబ్దిదారులు పెరిగారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈగణాంకాలే చెబుతు న్నాయి.
గంజాయి ఊబిలో యువత..జీవితాలు నాశనం
దేశవ్యాప్తంగా 272జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం,ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది.ఆజాబితాలో ఉమ్మడివిశాఖ, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాలు ఉన్నా యి.వీటిలో విశాఖమన్యం గాజాయి సాగు సర ఫరాకు కేంద్రంగా ఉంది. మిగితా జిల్లాలు మీదు గా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది.మద్యానికి అలవాటు పడి బానిసలైన వారు ఎక్కువమంది ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది.3.86కోట్ల మందితో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉం డగా..65.09లక్షల మందితో ఏపీఏడోస్థా నంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటుపడ్డవారు ఏపీకంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40లక్షలమంది ఉన్నారు.
డ్రగ్ అడిక్ట్స్ను గుర్తించడమెలా?
డ్రగ్స్కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరికే ఉద్రేకపడిపోతుం టారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు. మంచి దుస్తులు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. వారి ధరించిన దుస్తులు నుండి చిత్రమైన వాసన రావచ్చు. కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయా రవుతాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మంద గించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా నిద్రలే కుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణా లు, ఫోన్ లో రహస్యంగా మాట్లాడటం ఎవ్వరి తోను కలవక పోవడం, ఎక్కువుగా బబుల్ గమ్, చూయింగ్ గమ్లు నమలడం, డోర్ లాక్ చేసు కుని గదిలోనే ఉండిపోవడం. ఇటువంటి లక్షణా లున్న వారు డ్రగ్స్ మాయలో చిక్కుకున్నట్లే.
సమిష్టి పోరుతో సత్ఫలితాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు కార్యక్రమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. ఉగ్ర వాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపం చంలో మత్తుమందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది. అంటే పూర్తిగా అదిప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకో వచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నా యి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు.ఈ సమస్యకు శాశ్వత పరి ష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్ర మాలు ప్రభుత్వాలు చేపట్టాలి.ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో చిత్తశుద్ధి ఉం డాలి.అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్రతాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కృతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేం. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లి దండ్రులు,విద్యాసంస్థలు,ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ మాదకద్ర వ్యాల భూతం ఎల్లెడలా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యం పైనే కాదు సమాజంపైనా తీవ్ర దుష్పరిమాణాలు చూపుతుంది. అందుచేతనే ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నుండి 60సంవత్సరాల వయసు గల పెద్దల వరకూ భాగ్యవంత దేశాల నుండి అభి వృద్ధి చెందుతున్న దేశాల వరకూ అన్ని వర్గాల వారిని ఈమాదక మహమ్మారి మత్తుగా మింగేస్తూ ఉంది. జీవితాలను చిత్తు చేసే ఈ డ్రగ్ రక్కసి కోరల్లో మత్తు కోసం చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తు లోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
నేటి సమకాలీన సమాజంలో పరిశీలి స్తే పుస్తకాల తోటలో విహరిస్తూ పుస్తకాలు చదు వుతూ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఎందరో విద్యా ర్థులు పుస్తకాల అధ్యయనానికి బదులు పొగ పీలుస్తున్నారు. గురువులు చెప్పేది మెదడులో ఎక్కించుకోవడానికి బదులు మెదడుకు రసాయ నాల మత్తును ఎక్కిస్తూ మత్తులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకు పోతున్నారు. పట్టుమని పదహారేళ్లయినా నిండని ఈ టీనేజ్ పిల్లలు కిక్ కోసమో, థ్రిల్ కోసమో పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి ముందుగా ప్రారంభిస్తారు. అయితే క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారిపోతాయి.కానీ కాలక్రమంలో ఈ వ్యసనాన్ని సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు. మరింత థ్రిల్ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొం దరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్ వైపు అడుగులేస్తారు. సరదా కోసం ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదుకానీ డ్రగ్స్ మాత్రం బాగా అందుబాటు లోకి వచ్చాయి అనేది మాత్రం వాస్తవం. దేశం లో యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ, అత్యంత విలు వైన మానవ వనరులను చీడ పురుగుల్లా తొలి చేస్తూ దేశ భవిష్యత్ను పెనుగండంగా మార్చి, మొత్తం సమాజాన్ని విచక్షణా రహితంగా వ్యస నాల ఊబిలోకి డ్రగ్ రక్కసి నిర్దాక్షిణ్యంగా నెట్టి వేస్తున్నది. ఈ సమస్యకు కారణం మాదక ద్రవ్యాల వినియోగం కన్నా ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాగా చెప్పవచ్చు.
చరిత్ర..
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధా లను వాడటం ఈ మధ్య కాలంలో మొదల య్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈతరహా వ్యసనాలు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు.మత్తు కోసం ఆనాడు ప్రకృతి సిద్ధం గా లభ్యమయ్యే మద్యం,గంజాయి,పొగాకు, నల్లమందు,మత్తునిచ్చే పుట్టగొడుగుల వంటి పదార్థాలను విరివిగా వాడుతుండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదా య మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్ మత్తు పదార్థాలు ఎపిడ్రిన్,కొకైన్,ఓపియమ్ (నల్ల మందు),హెరాయిన్, బ్రౌన్షుగర్,కెటామైన్ పేరే దైతేనేం..ఈమత్తు పదార్థాలు ఎక్కువగా వాడుక లోనికి వచ్చేసాయి. గడచిన ఆరేడు దశా బ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విష యంలో మాఫియా ముఠాలు పనిచేయడం,ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. ఈమత్తు పదార్థాల విని యోగానికి క్రమేపీ యువత బానిసలు కావడం నేడు ఆందోళనకరంగామారి వారి పాలిట కాల కూట విషాలుగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా యువత ఈ మాదక ద్రవ్యాల విషవలయంలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా వీటి వినియోగం ద్వారా తాము బానిసలుగా తయారై జీవితాన్ని నాశనంచేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అయితే చాలా మంది ఇది ఎలా ఉంటుంది? ఒక సారి రుచి చూద్దాం అనే కోరికతో మొదలై, దానికి బానిసలుగా మారే స్ధితికి వచ్చిన వారే అధికం. వీరితో పాటు డిప్రెషన్ కు గురయిన వారు, ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, సామాజికప రంగా వెనుకబడి ఉన్నవారు, ఆర్ధికంగా సమస్య లను ఎదుర్కొనే వారు, చదువులో వెనుకబడిన వాళ్ళు, కుటుంబం నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేని వాళ్ళు, తరచూ గొడవలు పడే భార్యా భర్తలు, జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తు న్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్య వేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్, మోజు,స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు మందులు వినియోగానికి కొందరు అలవాటుపడు తున్నారు. చివరకు ఇది దీర్ఘ కాలిక సమస్యగా పరిణమించిన తరువాత ఆఉచ్చు నుండి బయట పడటం సాధ్యంకాక నిలువునా జీవితాలను బుగ్గి పాలు చేసుకుంటున్నారు.
భారత్లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల విష సంస్కృతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాప క్రింద నీరులా సాగుతూనే ఉంది. డ్రగ్స్ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో యువత కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. ఇండియా క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరందరికి ఇవి మొదట పబ్లు, క్లబ్లు,సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్ అనే డ్రగ్ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమా చారం చూస్తే దాదాపు 130మంది పబ్లిక్ స్కూల్ చిన్నారులకు డ్రగ్స్ అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి స్కూల్ పిల్లలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడిరది.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్ర వ్యాలు ఉపయోగించేవారు 0.71శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియా లో 2.65శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ వాడు తున్నారని తెలిసింది. భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్-డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ చట్టాన్ని అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా1988,2001, 2004లో ఈచట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ముంబై తర్వాత పంజాబ్ డ్రగ్స్ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ దాదాపు 30లక్షల మంది డ్రగ్ యూజర్లు ఉన్న ట్టు అంచనా.గంజాయిసాగు విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.మన దేశంలో ఒకప్పుడు మెట్రో నగరా లకు మాత్రమే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు క్రమేపీ ద్వితీయ శ్రేణినగరాలకు చివరకు గ్రామా లకు సైతం విస్తరించి ఎల్లెడలా మత్తు వాసనలు గుప్పు మంటున్నాయి. విదేశాల నుంచి తరలి వస్తున్న డ్రగ్స్తో పాటు స్దానికంగా నెలకొన్న ఔషధ పరిశ్రమలలో తయారయ్యే మత్తు పదార్థా లు వీటికి తోడవుతున్నాయి.
గతంలో యువకులు ఏర్పాటు చేసుకునే పార్టీలలో మద్యం ఏర్పాటు చేసుకునే వారు. అయితే ఇప్పటి పార్టీలలో మద్యంకు బదులు మాదక ద్రవ్యాలు చేరాయి. ఉన్నత విద్యా సంస్ధలలో విశ్వ విద్యాల యాల్లో చివరకు పబ్లిక్ స్కూల్స్లో సైతం మాదక ద్రవ్యం ఉదంతాలు మనం నిత్యంచూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం‘ఎన్డీపీఎస్’ తీసుకువచ్చింది. తర్వాత ఎప్పటికప్పుడుపలు సవరణలు చేస్తూ ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రపంచం మొత్తంమీద మత్తులో జోగుతున్న దేశా ల్లో భారత దేశం ముందు వరుసలో నిలవడం భావి భారతానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
డ్రగ్స్కు ఆకర్షితులు కావడానికి కారణాలు..
ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసంలేని వాళ్లు జీవి తంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమ నం పొందాలనుకునే వాళ్ళు, ఒంటరితనం, ఓట మిని తట్టుకోలేని వాళ్ళు, చదువులు బుర్రకు ఎక్కక పోవడం, చెడు స్నేహాలు..ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు.పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంత రాలు.కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. పరీక్షలో, ప్రేమలో, ఫెయిల్ అయినవారు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం ఎదురు చూసే వాళ్ళు పాశ్చాత్య పోకడలు, టీవీ, సినిమా, మీడియా ప్రభావం ఇత్యాదికారణాలవల్ల యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. కిక్ కోసమో, థ్రిల్ కోసమో ప్రారంభించిన ఈ అలవాట్లు కాల గమనంలో ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారి క్రమేపీ యువత వీటికి బాని సలై బలైపోతున్నారు. ఒక్కసారి ఈడ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటే చాలు, మరలా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఈలోపు కెరీర్ అంతా సర్వనాశనం అవుతుంది. యువత దీనికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.డ్రగ్ వ్యసనం నుండి వెనక్కి తిరిగి రాలేని వాళ్ళు మరణం పాలవు తున్నారు. కొందరైతే డ్రగ్స్ లభించక బలవన్మ రణం పాలవుతున్నారు. మాదక ద్రవ్యాల వినియో గంలో బానిసలుగా చిక్కుకున్న యువతను దాని నుంచి బయటపడేసే విషయంలో ప్రభుత్వాలు సామాజిక సంఘాలు తమ వంతు కృషి జరుపు తున్నప్పటికీ డ్రగ్స్ మాఫీయా మాత్రం వెనుకడుగు వేయడం లేదు.ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు, నిఘా సంస్ధల కళ్ళు కప్పి రహస్య ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ దందా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో స్ధానిక ముఠాలు,అంతర్జాతీయ గ్యాంగులు మార్కెట్లో మాదక ద్రవ్యాలను కుమ్మ రిస్తూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సర ఫరా,సేవనం విషయంలో కఠిన చర్యలు తీసు కుంలున్నప్పటికీ డ్రగ్స్మాఫియా తమ కార్య కలా పాలను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
శారీరక ఆరోగ్యం,మానసిక ఆరో గ్యం,సామాజిక ఆరోగ్యం ఈమూడు కూడా సం పూర్ణ ఆరోగ్యానికి ప్రధాన హేతువులు. అయితే మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఈ మూడు నశించి పోతున్నాయి. వీటి వినియోగం ద్వారా ప్రాధమికంగా విచక్షణ కోల్పోతారు. మాదకద్ర వ్యాలు,ఉత్ప్రేరకాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకృత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికైనా యువత వెనుకాడరు. డ్రగ్స్ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థల పైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతా యి. చివరకు అకాల మరణాలకు కారణమవు తాయి. డ్రగ్స్ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే.. గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్, మానసిక అనారోగ్యం, హెచ్ఐవీ, హెపటైటిస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ప్రదానంగా రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతిం టుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు మందగింపు
రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి క్షీణించ డంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన డం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఎదురు గా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందర గోళ పరిస్ధితి ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహిం చి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి పూర్తిగా నశిస్తుంది. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. వైద్య నిపుణుల పరిశోధ నలు ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో 25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు.42శాతం ఒత్తిడికి,మానసిక సమస్య లతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు.40శాతం నేర పూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత విషయంలో చూస్తే 45శాతానికి పైగా సెక్స్ లో విఫలమవుతున్నారు.24 శాతం మంది స్థూల కాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత వారి అలవాట్లను అవసరాలను తీర్చుకునే నేపథ్యంలో సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. వీటి ఫలి తంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకం గా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు.ఈ విధంగా డ్రగ్స్ మత్తులో పడి యువత నిర్వీర్యమై పోయిన దేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్య లు, గృహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్ వినియోగమే మూల కారణమవు తోంది. ఏది ఏమైనా ఈ మాదక మహమ్మారి వినియోగం, దానికి బానిస కావడమనేది తల్లిదం డ్రుల కలలనే కాదు, మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
నివారణ సాధ్యమే
ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్షును హరించే ఈ మత్తు మహమ్మారి విష వలయంలో చిక్కుకున్న తరువాత దాని నుంచి బయటపడటం కష్టమే కానీ అసాధ్యం కాదనే చెప్పాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలలో మందులు, కౌన్సిలింగ్, బిహేవిరియల్ థేరపీ వంటి వాటి ద్వారా బయట పడవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, సహనం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు వైద్య నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి. ప్రధానంగా మాదకద్రవ్యాల బారి నుంచి బయట పడాలనే గట్టిసంకల్పం డ్రగ్స్ వాడే వారిలో ఉండాలి. అయితే ఇలా సంకల్పించిన ప్రతీ సారి ఏదో ఒక విఘ్నం తారసపడుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో నిగ్రహంగా నిలబడి వైద్యుల సలహాలు కుటుంబ సభ్యుల సహకారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది.ఎందుకంటే వీరు డ్రగ్స్ వాడకానికి దోహద పడిన కారణాలు విశ్లేషణ చేసి దాని నుండి బయట పడటానికి అవసరమైన కౌన్సిలింగ్ మానసిక వైద్యులు అందిస్తారు.మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయట పడాలంటే ముందుగా దానికి దోహద పడిన కారణాలు నిర్ములించాలి. ఇది కేవలం మానసిక వైద్యుల కౌన్సిలింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ తీసుకుంటూ సడలని మనో సంకల్పంతో నిలబడగలిగితే ఈవిషవలయం నుండి బయట పడటం అసాధ్యం ఏమీ కాదు. ఇవన్నీ పాటిస్తూ డ్రగ్స్కు బానిస అయిన వాళ్ళుకూడా గట్టి సం కల్పంతో ఈ విషవలయం నుండి బయట పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో మార్కులు ర్యాంకులు మాత్రమే పరమావిధిగా చూస్తున్నారు తప్ప తమ పిల్లల మానసిక పరివర్తన వ్యవహారశైలి గురించి పట్టించుకోవడంలో శ్రద్ద చూపడం లేదు.వారికి కావలసిన పాకెట్ మనీ అందచేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అసలు పరిశీలించడం లేదు. తల్లితండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై అపార నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు. చూపించాలి కూడా. అయితే అదే సమయంలో ఆనమ్మకం అతి కాకూడదు. నిజంగా ఆడ్రగ్ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత తిష్ట వేసినప్ప టికీ దానిని గమనించే అవకాశాన్ని మనకు ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటి పోయిన తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లితండ్రులు తమ బిడ్డపై నమ్మ కంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అను మానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది.ఈ విషయంలో తల్లి తండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందే హం లేదు.డ్రగ్స్ బారిన పడిన వారిని దండిర చడం, బెదిరించడం, వారితో వాదించడం వారిని చిన్నబుచ్చకునేలా చేయడం ఆత్మన్యూనత కలిగేలా వ్యవహరించడం వంటి చర్యలు ద్వారా వారిని డ్రగ్స్ వ్యసనం నుంచి ఎట్టి పరిస్ధితులలో కూడా బయట పడేయలేమని ముందుగా తల్లి తండ్రులు గుర్తించాలి. డ్రగ్స్ వాడకం వలన తలెత్తే దుష్పరి ణామాల గురించి పిల్లలకు చాలా ఓపికగా వివరించాలి. ఈ వ్యసనం నుండి బయటపడితే సమాజంలో మనం తిరిగి గౌరవ ప్రద జీవితాన్ని పొందగలం అనే ఆశాజనకమైన ప్రేరణ కలిగిం చే మాటలు చెప్పాలి. దానివలన ఖచ్చితంగా అనుకూల ప్రభావాన్ని సాదించవచ్చు.
ఔషధం కన్నా కౌన్సిలింగే కీలకం
నేడు వైద్య విధానంలో డ్రగ్స్ నుండి విముక్తి చేయడానికి అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులోనికి వచ్చినా డ్రగ్స్ బారిన పడిన వారిని బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్ చాలా బలమైన ప్రభావం చూపిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు.వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహ మ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లి తండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రా యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు.డ్రగ్స్ ఊబి నుంచి బయట పడాలంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సి లింగ్ ఇస్తారు. ఇది వీరు పాటించగలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లవాడిని నువ్వు చేస్తున్నది తప్పుఅని చెప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగాచూడాలి. ఇదికనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజ యం సాధించి నట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టం అయ్యింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు
విశాఖపట్నంజిల్లాలో మాదకద్రవ్యా ల రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖ తీసు కున్న చర్యల ఫలితంగా దాదాపు రెండేళ్లుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని జిల్లాకలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. పోలీస్ శాఖ, నగర పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వార్షిక నేర సమీక్ష సమావేశం డిసెంబర్ 27న ఏయూ కన్వెన్షన్ సెంటరులో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునతోపాటు నగర పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్, జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్,జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ, డీసీపీలు పి వెంకటరత్నం, కె.ఆనంద్ రెడ్డి, కె. శ్రీనివాసరావులు, రెవిన్యూ, జ్యుడీషియల్, ఇతర శాఖల అధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లా స్థాయి కమిటీ సభ్యుల సూచనల మేరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యల వలన మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో, నివారించడంలో ప్రజలు, కళాశాల విద్యార్థుల్లో కూడా అవగాహన పెరిగినట్లు చెప్పారు. వి.ఎం. ఆర్.డి.ఏ, జి.వి.ఎం.సి.పోలీసు శాఖల సహకా రంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రమా దాల సంఖ్య కూడా తగ్గినట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి పోలీసు, ఇతర శాఖల సహకారం కూడా ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ డా.ఎ. రవిశంకర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రావ్యల అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘాతో పాటు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగర పోలీసు అధికారులు మరింత సమర్ధవంతంగా పోలీసింగ్ చేయడానికి అవసరమైన విధానాల గురించి పేర్కొన్నారు. తమ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్లపై ఆయా అధికారులతో విశ్లేషించిన ఆయన ఉత్తమ పోలీసింగ్ కోసం రాబోవు సంవ త్సరంలో తీసుకోవలసిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎస్.ఇ.బి అడిషనల్ ఎస్.పి బి.శ్రీనివాసరావు,ఉపరవాణా కమీషనర్ జి.సి. రాజరత్నం,ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్,భాస్కర రెడ్డి, ఎన్.హెచ్.ఎ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్,డీఈవో కె.చంద్రకళ, సమగ్రశిక్ష ఏ.పి.సి శ్రీనివాసరావు, నగర ఏ.డి.సి.పిలు, ఏ.సి.పిలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.