ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రజా సమక్షంలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.17మంది కొత్త వారితో సహా 24మందితో తన మంత్రి మం డలి జట్టును కూడా ప్రకటించారు. ఈ ప్రమా ణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా విచ్చేసి,కొత్త ప్రభు త్వానికి శుభాకాంక్షలు చెప్పారు.చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ సమయంలో కార్య కర్తల హర్షాతిరేకాలతో సభాప్రాంగణం మార్మోగి పోయింది! జూన్‌ 4న టిడిపి కూటమి విజయ కేతనం ఎగుర వేయడంతో మొదలైన కూటమి శ్రేణుల సందడి నిన్నటి ప్రమాణ స్వీకారంతో పతాకస్థాయికి చేరింది.జూన్‌ 13న చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి,కొన్ని ఎన్ని కల వాగ్దానాలపై తొలి సంతకాలు చేయడంతో పాలనాపర్వం మొదలైంది.
వివిధ తరగతుల ప్రజలు పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలనూ నెరవేర్చే విధంగా కొత్త ప్రభుత్వం ఇక ముందుకు సాగవల్సి ఉంటుంది. నిరంకుశ విధానాలు, ప్రజలపై భారాలూ అమలు చేస్తే జనం ఎలా స్పందిస్తారో గత ప్రభుత్వ అను భవాన్ని సదా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. విభజిత రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబుకి, ఆయన మంత్రివర్గానికి ఇది చాలా బాధ్యతాయుత కాలం. రాష్ట్రం విడివడి పదేళ్లు గడచిపోయాక కూడా విభజన హామీలు నెరవేరలేదు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సిన కేంద్రంలో ఈ పదేళ్లూ బిజెపియే అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల వ్యవధిలోనే ప్రత్యేక హోదా హామీకి మోడీ షా ప్రభుత్వం మంగళం పాడేసింది. మనం హక్కుగా పొందాల్సిన విభజన హామీలు చూస్తుండగానే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైల్వే జోను మంజూరు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, వివిధ సంస్థల ఏర్పాటు వంటి కీలక బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా తప్పుకొంది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడు రాజధానుల జపం చేసినప్పుడు మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లిలా అవకాశవా దాన్ని ప్రదర్శించింది.తన వైఖరిని స్పష్టం చేయకుండా నాన్చి,రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని త్రేన్చి, రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది.
అలాంటి బిజెపి ఇప్పుడు చంద్రబాబు మద్దతు తప్పనిసరైన పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకరికొకరు చాలా కీలక మూ,అవసరమూ అన్నంత ప్రదర్శన మోడీ -చంద్రబాబుల్లో బయటికి బ్రహ్మాండంగా కనిపిస్తోంది.2014లో వలె రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని పంచుకుంటుంటే, కేంద్రంలో టిడిపి మంత్రిపదవులను అంది పుచ్చుకొంది. అయితే, బిజెపి సహజంగానే తన మిత్రులకు సమాన ప్రాతినిథ్యం ఇవ్వదని, సంపూర్ణ విశ్వాసం చూపదని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అనుభవం. గతంలో చంద్రబాబు కూడా దీనిని చవి చూశారు కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ల నుంచీ రాష్ట్ర ప్రయోజనాలే ప్రప్రథమ ప్రాధాన్య బాధ్యతగా తలకెత్తుకొని పనిచేయాలి. కేంద్ర బిజెపి మన రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా,తెలుగు జాతి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేటు పరం చేయటానికి పూనుకొంది. ఏళ్ల తరబడి మొక్కవోని దీక్షతో ఉక్కు కార్మికులు సాగిస్తున్న నిరవధిక పోరాటమే దానిని ఇన్నాళ్లూ భద్రంగా ఉంచగలిగింది. చంద్ర బాబు ప్రభుత్వం పూనుకొని,విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలోనే నిలబెట్టి, సొంత గనులూ సాధించాలి.రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని విభజన హామీలూ ఆచరణలోకి వచ్చేలా నిక్కచ్చిగా, నిరంతరాయంగా పనిచేయాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, నిర్వాసి తులకు సంపూర్ణంగా పరిహారం, పునరావాసం కల్పన వంటి కీలక బాధ్యతలను నెరవేరుస్తూనే -ఎన్నికల ప్రాంగణంలో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలనూ అమలు చేయాలి. మోడీ షాల మాటల మాయోపాయంలో కాలహరణం జరిగిపోకుండా తొలిరోజు నుంచీ న్యాయ బద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం, ప్రకటిత హామీల అమలు కోసం గొంతెత్తాలి.తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టి రామారావు స్థాపించిన పార్టీ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు గట్టిగా పనిచేయాలి.
ఆ ఐదు ఫైళ్లపై సంతకాలు
వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే.. ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ముందుగా మెగా డీఎస్సీ,పెన్షన్ల పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్‌ సెన్సస్‌ ఫైళ్లపై సైన్‌ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్‌పైనే ముఖ్య మంత్రిగా తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవ రించి..కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలు న్నట్టు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రజల్ని అయోమ యానికి గురిచేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023అక్టోబర్‌ 31న తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో పదే పదే కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కా రం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించార ని మండిపడ్డారు.సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీనిచ్చారు చంద్రబాబు. దీంతో రెండో సంతకం..ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు ఫైల్‌పైనే చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపా యలున్న వృద్ధుల పెన్షన్‌ ఏకంగా ఐదు రేట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత దాన్ని 2వేలకు పెంచారు.ఈ సారి ఎన్నికల ప్రచా రంలో వృద్దుల పెన్షన్‌ నాలుగు వేలకు పెంచు తామని చంద్రబాబు హామీనిచ్చారు. అంతే కాదూ ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ వర్తింపజే స్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తం గా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక పూటకి ఐదు రూపాయల చొప్పున మూడు పూటలకి 15రూపాయలకే భోజనం అందిం చారు.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను నిలిపివేశారు.ఎన్నికల ప్రచారంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబా బు ప్రకటించారు.ఇందులో భాగంగా నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. యువత ఉన్నత విద్యనభ్యసించినా అందుకు తగ్గట్టు ఉద్యోగాలు రావడం లేదు. కారణం నైపుణ్యం లేకపోవడమే.ఇది గుర్తించిన కూటమి నేతలు..ఎన్నికల ప్రచారంలో స్కిల్‌ సెన్సస్‌ హామీనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి,ఏరంగానికి ప్రాధాన్య ముంది..ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు స్కిల్‌ సెన్సస్‌ చాలా ఉపయోగపడనుంది.ఐదో సంతకం స్కిల్‌ సెన్సస్‌పైన చేశారు.
మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం
సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల జీవితాల్లో భరోసా నింపారు. మెగా డీఎస్సీ ద్వారా పాఠశాలల్లో 16,347 పోస్టులకు పచ్చజెండా ఊపారు.చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో నిరుద్యోగులకు పండగొచ్చింది. మెగా డీఎస్సీ అంటే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉండొచ్చు అనుకుంటే అంతకు మించి ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.మెగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్లస్‌? అనిపించేలా 16,347పోస్టుల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ పైల్‌పైనే తొలి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం,సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం,మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబుకు గుంటూరులో అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ పాలనలో ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్‌ విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు. చాలా మంది అభ్యర్థులు వయో భారంతో అవకాశాలు కోల్పోయారని తెలి పారు. కూటమి ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకెంతో మేలు జరుగుతుందని డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన 24గంటల్లోపే మెగా డీఎస్సీ పై సంతకం చేస్తామన్న నారా లోకేశ్‌ మాట నిలబెట్టుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.ఐదేళ్లుగా మెగా డీఎస్సీపేరుతో జగన్‌ నిరుద్యోగులను దగా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే తెదేపాతోనే సాధ్యమన్నారు. డీఎస్సీ పై మ్నెదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు నిరుద్యోగ యువత ధన్యవాదాలు తెలిపారు.
మెగా డీఎస్సీ 2024 ఖాళీల వివరాలివే..
ఎస్‌జీటీ 6,371
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 132
స్కూల్‌ అసిస్టెంట్‌ 7,725
టీజీటీ పోస్టులు 1,781
పీజీటీ పోస్టులు 286
ప్రిన్సిపాళ్లు 52
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు.
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు..
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు దస్త్రంపై పెట్టారు.తర్వాత న్యాయశాఖ వద్దకు పంప బోతున్నారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమో దం తెలుపుతుంది.ఆ తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశ పెడతారు.
నీతి ఆయోగ్‌ నమూనా చట్టానికి తూట్లు పొడిచి..
గత ప్రభుత్వం రూపొందించిన టైటిలింగ్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ప్రజల స్థిరా స్తుల భద్రతను ప్రశ్నార్ధకం చేశాయి.సొంత స్థిరాస్తులపై చట్టబద్ద హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజ మాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్‌ కోర్టులను వైసీపీ ప్రభుత్వం తప్పించడం దుమా రాన్ని రేపింది.వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 31నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీవో జారీ చేయడం భూ యాజమా నులకు ఆందోళన కలిగించింది. అలాగే.. చట్టంలోని సెక్షన్‌28కి అనుగుణంగా ఏపీ ల్యాండ్‌ ఆధారిటీని ఏర్పాటు చేస్తూ దానికి చైర్‌పర్సన్‌,కమిషన్‌,సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబర్‌ 29నప్రభుత్వం జీవో జారీ చేసింది.నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన టైటిలింగ్‌ చట్టానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచి..తన ఇష్టమొచ్చినట్లు నియమ నిబంధనలు రూపొం దించి,అందరిని కలవరానికి గురిచేసింది.నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నమూనా టైటిలింగ్‌ చట్టం సెక్షన్‌5లో టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌ఓ) నియామకం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కోంది.నోటిఫికేషన్‌ జారీ చేయ డంద్వారా ఏ అధికారినైనా(ఎనీ ఆఫీసర్‌) టీఆర్‌ఓగా నియమించవచ్చని తెలిపింది. అయితే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం సెక్షన్‌ 5లో ఏవ్యక్తినైనా(ఎనీ పర్సన్‌)టీఆర్‌ఓగా నియమించవచ్చని పేర్కొంది.రికార్డుల్లో యజమానుల పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేసిన తర్వాత మూడేళ్లలోపు ఎవరూ అభ్యం తరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విష యంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని నమూనా చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది.రాష్ట్ర చట్టంలో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు.రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును రెండేళ్లకే పరిమితం చేశారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ అఫీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే నీతీ ఆయోగ్‌ నమూనా చట్టం సెక్షన్‌16ప్రకారం హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం ఇవ్వలేదు.హైకోర్టులో రివిజన్‌కు మాత్రమే దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు.భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికార పరిధి నుంచి రాష్ట్రంలోని సివిల్‌ కోర్టులను పూర్తిగా పక్కనపెట్టి(సెక్షన్‌ 38)జగన్‌ సర్కారు..హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం లేకుండా కేవలం రివిజన్‌కు అవకాశాన్ని కల్పించడం తీవ్ర ఆందోళన కలిగించింది.
న్యాయస్థానాల తీర్పులనూ పక్కన పెట్టి
భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరిం చేందుకు నీతీ ఆయోగ్‌..నమూనా టైటిలింగ్‌ చట్టం ద్వారా మూడు అంజెల వ్యవస్థను సిఫార్సు చేసింది.ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఈ వ్యవహారాన్ని రెండు అంచెలకే పరిమితం చేశారు.న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికా రాన్ని వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టడం చర్చనీ యాంశమైంది.భూ హక్కులను అధికారులు నిర్ణయించలేరని,న్యాయస్థానాలు మాత్రమే ఈ విషయాన్ని పరిష్కరించగలవని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం పెడచెవిని పెట్టింది.ఈ చట్టాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి కోర్టు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించలేదు.
పెన్షన్ల పెంపుపై 3వ సంతకం
‘‘మొదటి సారి రూ.35లతో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్‌. సమైక్యరాష్ట్రంలో నేను దాన్ని రూ.75లకు పెంచాను. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1000లకు, తర్వాత రూ.2వేలకు పెంచాను. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌ పెన్షన్‌ తో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు నెలకు రూ.1000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పాను. పెంచిన వాటితో కలిపి జులైలో రూ.7వేలు పెన్షన్‌ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రూ.6 వేలకు పెంచాం…పెంచిన పెన్షన్‌ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ పెంచాము. ఇబ్బందులు పడేవారిని గుర్తించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం.’’అని సీఎం చంద్రబాబు అన్నారు.
నైపుణ్య గణన పై 4వ సంతకం
‘‘యువత నైపుణ్యం లెక్కించేందుకు, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకుక నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి..కానీ వాటిని సాధించుకోవాలంటే కావాల్సిన నాలెడ్జ్‌, నైపుణ్యం కావాలి. ఉన్నత చదువులు చదివినా…సరైన స్కిల్స్‌ లేకపోవడంతో ఉద్యోగా లు రావడం లేదు.నాలెడ్జ్‌ ఎకానమీలో ముం దుకు వెళ్తున్న సమయంలో తగిన స్కిల్స్‌ ఉంటే ప్రపంచంలో రాణించవచ్చు.ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కులు తీశారు..కానీ మొదటి సారిగా స్కిల్‌ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది…దేశంలో ఏఉద్యో గాలు ఉన్నాయి…దానికి తగ్గ స్కిల్స్‌ ఉన్నాయా లేదా అన్నది లెక్కిస్తున్నాం.పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుండి ఉద్యోగులు రాకుండా మనరాష్ట్రం నుండే కావాల్సిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. కావాల్సి న నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టాం. ఇది యువత భవిష్య త్తుకు సంబంధించిన అంశం.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. – జి.ఎన్‌.వి.సతీష్‌