పేదల చెంతకు శ్రీమంతుల చదువు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠ శాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నే షనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు.ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయి లో పోటీపడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024-25 విద్యా సంవత్స రంలో ఐబీ బోధ నపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపు ణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్ల తోపాటు మండల,జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది,ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్బోర్డు సిబ్బం దికి‘ఐబీ’పై అవగా హన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు.దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీగ్లోబల్ టీచర్ నెట్ వర్క్లో భాగమ వుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమ వుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిల బస్ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి,2037కి 12వ తరగతిలో అమ లు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫి కెట్కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.
2019 నుంచే గ్లోబల్ సిటిజన్స్ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దు తోంది.జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్ర మాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాట లు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించింది.
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్టస్ బుక్స్ నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్తో ఉచిత ట్యాబ్స్ పంపిణీ చేసింది.
హై స్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఐఎఫ్పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను
అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.
ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు
ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయ కత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతో పాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్) కు ప్రాధాన్యతనిస్తారు.
సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లో నూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్ డిసిప్టీనరీ కాన్సెప్ట్ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది.ఈ సిలబస్ను అభ్యసించిన విద్యా ర్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతు న్నారు. ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు.
కొత్తగా మారేదేంటి ? ప్రయోజనమెంత?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్య, అనలిటిక్స్ కోసం బైజూస్ కంటెంట్ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాపరిశోధనా మండలి ఎస్.సి. ఈ.ఆర్.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతు న్నాయి.రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేం దుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడు కోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ ను ప్రవేశపెడ తారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరి స్తారు. ఇలా ఐబీ సిలబస్ లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.ఐబీ సిలబస్ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతే కాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్స హిస్తారు. సిలబస్ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఐబీ సిలబస్లో భాగంగా క్లాస్ రూమ్ బోధనతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్), ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ కు సమ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టి కోణంలో అధ్యయనం కోసం ఇంటర్ డిసిప్లేనరీ కాన్సెప్ట్ అమలు చేస్తారు.ఐబీ సిలబస్లో విద్యా భ్యాసం చేసిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపం చంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అలాగే అంతర్జాతీయ స్ధాయిలో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ’’మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యా ర్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వంలో ‘జగనన్న విదేశీ విద్య’పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు.పేద విద్యార్థుల చదువులకు ప్రభు త్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో చదువుతుండటం చాలా ఆనం దంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు రూ.8 లక్షల వార్షికా దాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నా’’మని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాల యం వేదికగా సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41. 60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సా హకం, మెయిన్స్ పాస్ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడిర చారు. సివిల్స్లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.
అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా..
తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. శాచురేషన్ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్, టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో కానీ, క్యూఎస్ ర్యాంకింగ్స్లోటాప్ 50 కాలేజీ ల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చితోడుగా నిలబడే కార్యక్రమం ఇదని తెలిపారు.
మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక
ఈ ఏడాది దాదాపుగా 51మందికి కొత్తగా అడ్మి షన్లు వచ్చాయని,రూ.9.50కోట్లు వారికి ఇస్తున్నామని, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు నేడు ఇస్తున్నామని తెలిపారు. ‘‘దాదా పుగా రూ. 107కోట్లు 408 మంది విద్యార్థు లకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నాం.ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్స్ఫైర్ అయి టాప్ యూనివ ర్సిటీల్లో సీట్లు తెచ్చుకునేలా, మీరు గొప్పగా ఎదిగే దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రీబ్యూషన్ ఇచ్చి రాష్ట్రాన్ని గుర్తు పెట్టు కోవాలి. మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక’’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు.
మీ అందరికీ ఆల్ దీ బెస్ట్
‘‘వార్షిక ఆదాయం రూ.8లక్షలు ఉన్న కుటుం బాలకు ఈ పథకం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా ఆల్ దీ బెస్ట్ విసెస్ తెలియ జేస్తూ మీరందరూ అత్యధికం గా బాగుపడాలని కోరుకుం టున్నాను. రాబో యే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వారి కుటుంబాలను ఈ స్థాయి నుంచి మరో స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితి రావాలని, దేవుడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను’’ అని సీం అన్నారు -జిఎన్వి సతీష్