పార్లమెంట్‌లో పెరగని మహిళా ప్రాతినిధ్యం

మహిళలను జాతి నిర్మాతలుగా మలచడానికి, నారీ శక్తిని గౌర వించడానికి ప్రధాని మోడీ పార్ల మెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లో ఆమోదించారని, గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టం ప్రకారం పార్ల మెంటు, శాసనసభ ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అనేది 2026లో జాతీయ జనాభా గణన పూర్తయి, పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ (డి-లిమిటేషన్‌) పూర్తయిన పిదప అమలులోకి వస్తుంది. అంటే 2029లో మాత్రమే అది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కారణాలవల్ల ఈ డెడ్‌లైన్‌ మిస్‌ అయితే 2034లో జరగబోయే ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్‌ అమలయ్యే పరిస్థితి లేదని మనం అర్ధం చేసుకోవాలి.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది.ఆ పేరుతో ఏడాదిపాటు సంబరాలు కూడా జరుగుతున్నాయి.మరి75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మహిళల పరిస్థితి దేశంలోఎలా ఉంది?మహిళలకు దక్కాల్సిన సమా న అవకాశాల పరిస్థితి ఏంటీ? ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదం ఇంకా అలాగే ఎందుకు మిగిలింది?అన్ని అన్నీ రంగాల్లో సమాన హక్కులు సరే,చట్టాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభల్లో మహిళలకు ఏమేరకు భాగ స్వామ్యం దక్కింది?మనపార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళల ప్రాతినిధ్యం తొలిసారిగా వంద దా టింది.ప్రస్తుతం లోక్‌సభలో 81మంది,రాజ్య సభ లో29మంది మహిళా ఎంపీలుఉన్నారు. మొత్తంగా చూస్తే 14.9శాతమే.సమాన అవకాశాల నినాదం ప్రకారం చూసినా,33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరంగా చూసినా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం చాలా తక్కువే.ఇక ఆయా రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల పూర్తియిన తర్వాత కూడా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా సగటున 9శాతం మంది మహిళలు మాత్రమే ఎంపీలయ్యారు.ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే పురుషులకు కొంచెం అటుఇటుగా మహిళా ఓటర్లు ఉంటారు.కానీ ఎన్నికల్లో పోటీ,గెలుపు విషయానికి వచ్చేసరికి మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
దేశంలోని మిగితా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా..తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 317మంది మహిళలు పోటీ చేయగా,.27మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.అంటే గెలిచిన 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 140మంది మహిళలు పోటీ చేస్తే ఆరుగురు మాత్రమే గెలిచారు.122మంది డిపాజిట్లు కోల్పోయారు.2019ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 211మంది పోటీ చేస్తే 14 మంది మహిళలు గెలవగా,174మందికి డిపాజిట్‌ దక్కలేదు.ఇక 2014లో చంద్రబాబు సీఎంగా ఏర్పడిన ఏపీ కేబినెట్‌లో పరిటాల సునీత, అఖలి ప్రియ,మృణాళిని,పీతల సుజాత మంత్రులుగా పని చేశారు. తెలంగాణా ఏర్పడ్డాక కొలువుదీరిన మొదటి కేబినెట్‌లో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు.2018లో తెలంగాణాలో ముందుస్తు ఎన్నికలు రావడం,ఆతర్వాత మరోసారి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కేబినెట్‌లో చోటు దొరికింది.వారే సత్యవతి రాతోడ్‌,సబితా ఇంద్రారెడ్డి.సబితా వేరే పార్టీ నుంచి రాగా,సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.అంటే టీఆర్‌ఎస్‌ బీ`ఫారం మీద గెలిచిన ఏ ఒక్క మహి ళా ఎమ్మెల్యే ఇప్పటి వరకు మంత్రా కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఏర్పడిన వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో పుష్పశ్రీవాణి,వనిత, సుచరిత, విడుదల రజనీ మంత్రులయ్యారు.
ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే మహిళా సభ్యుల ప్రాతినిధ్యం తీసికట్టుగానే ఉంది. ఇంకా చెప్పా లంటే తగ్గింది.74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇది మొత్తం పార్లమెంట్‌ సభ్యుల్లో 13.6శాతం మాత్రమే.2019లో78మంది మహి ళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.ఇది14.4 శాతంగా ఉంది.గత ఎన్నికల్లో 726మంది మహిళ లు పోటీ చేయగా,2024ఎన్నికల్లో పోటీ చేసిన వారి సంఖ్య 797కి పెరిగింది.అయినా ఎన్ని కయి న మహిళా పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య తగ్గడం గమనార్హం.
ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షిం చేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విషయం మనకు తెలిసిందే.రాష్ట్రాలలో శాసనసభలకు జరిగే ఎన్ని కల సందర్భంగా,మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను కూడా రాజకీయ పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల లాగే,పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో ప్రత్యేక పథకాలను పొందు పరిచాయి.ఆంధ్రప్రదేశ్‌,ఒడిషా ఎన్నికలలో పాలక, ప్రతిపక్ష పార్టీలు మహిళలే కేంద్ర బిందువుగా అనేక పథకాలు తీసుకువచ్చాయి. వీటన్నింటి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని,ఓట్లు వేయడానికి మహిళా ఓటర్లు పోటెత్తుతారని అందరూ భావించారు. కానీ విపరీతమైన ఎండ తీవ్రత,ఓటింగ్‌ పట్ల నిరాసక్తత వంటి కారణాలతో ఓటింగ్‌ శాతం తగ్గింది.
2019లో దేశవ్యాప్తంగా 67.01శాతం పురు షులు ఓట్లేయగా,67.18శాతం మహిళలు ఓట్లేశారు.ఈ ఎన్నికలలో 65.08శాతం పురు షులు ఓట్లేస్తే, 65.78శాతం మాత్రమే మహిళా ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో 31కోట్ల మంది మహిళా ఓటర్లు ఓట్లేసినప్పటికీ, గతంతో పోలిస్తే దాదాపు 2 శాతం మహిళా ఓటింగ్‌ తక్కువ నమోదవడం గమనార్హం. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో మాత్రం 80 శాతం పైబడి మహిళా ఓటింగ్‌ నమోదైంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 52దేశాల్లో పార్లమెంట్‌ ఎన్ని కలు జరిగాయి.ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపియు) సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 27.6శాతం మహిళలు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ఈవిషయంలో 185ప్రపంచ దేశా ల్లో భారత్‌ స్థానం 143గా ఉంది.ఈ ఏడాది ఎన్ని కలు జరగడానికి ముందు మన దేశ పరిస్థితి ఇది. ఈ ఎన్నికల తర్వాత,మన దేశస్థానం ఇంకా దిగ జారే ప్రమాదం ఉంది.ఫిన్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌,స్వీడన్‌ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి.అక్కడి ప్రజాప్రతి నిధుల్లో అత్యధికులు మహిళలే.
మన పార్లమెంట్‌లో మహిళల భాగస్వా మ్యం అంతంత మాత్రంగా ఉంటే, అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి.ఈ మధ్యే మెక్సికోలో మొట్టమొదటి సారిగా ఓ మహిళ అధ్యక్ష పీఠానికి ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన ఇద్దరు అభ్యర్థు లూ మహిళలే కావడం విశేషం.ఇదేదో ఒక రోజు లో జరిగింది కాదు. మెక్సికో కూడా లిబరల్‌ దేశ మేమీ కాదు. అక్కడ కూడా ఛాందసవాద శక్తులు, గుత్త పెట్టుబడిదారీ శక్తులు వివిధ రంగాల్లో మహి ళల భాగస్వామ్యాన్ని అడ్డుకుంటూనే ఉన్నాయి. అయితే, వీటిపై పురోగామి శక్తులు,ఫెమినిస్టులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. దాని ఫలితమే ప్రస్తుతం మెక్సికోలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మన దేశంలో పార్లమెంటరీ రంగం లోనే కాదు నిర్ణయాత్మక రంగాలలోనూ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువుగా ఉంది. దేశం అను కున్న రీతిలో అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన అవరోధంగా ఉంది.1947లో దేశ మొత్తం అక్షరా స్యత కేవలం 12 శాతం ఉండగా నాడు మహిళల్లో అక్షరాస్యులు 6 శాతం మాత్రమే. ప్రస్తుతం మొత్తం అక్షరాస్యత 77.7శాతం ఉండగా మహిళలది 70.3 శాతంగా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే గణనీ యంగా పెరిగింది. 1957లో కేరళలో నంబూద్రి పాద్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసింది.1977లో పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం కూడా భారీగా భూ సంస్కరణలు అమలు చేసింది. మిగులు భూమి ని పేద ప్రజలకు ఇవ్వబడిరది.తినడానికి ఆహారం, చదువుకోవడానికి విద్య ప్రజలకు లభించింది. అందుకే మానవాభివృద్ధిలో మొదటి స్థానం కేరళ రాష్ట్రానిది.100శాతం అక్షరాస్యత సాధించబ డిరది. ఈ నిర్ణయాల వల్ల కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మహిళల స్థితిగతులు గణనీయంగా పెరిగాయి.
1992లో 73,74రాజ్యాంగ సవరణ ల ద్వారా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2002లో పట్టణ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,మహారాష్ట్ర, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో పంచాయతీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.ఫలితంగా వారి ప్రాతి నిధ్యం గణనీయంగా పెరిగింది. మరోవైపు చూస్తే చదువు,అవకాశాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు,అత్యాచారాలు దేశంలో ఏదో మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి.స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసు కొచ్చినా పోరాటం తప్పడం లేదు. అసంఘటిత రంగాలలో మహిళలు వారి కనీస సదుపాయాల కోసం నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. మణి పూర్‌లో కుకీ ప్రజలపై జరిగిన దాడులు, మహిళ లపై జరిగిన అత్యాచారాల ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని,సుప్రీంకోర్టు హెచ్చరిక చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో పురుషాధిక్య ధోరణి, లైంగిక అణచి వేత పోవాలంటే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.దీనితో పాటుగా రాజకీయాల తీరు తెన్ను లు మారాలి. పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులని, అనేకమంది ఎంపీలకు నేర చరిత్ర ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛందసంస్థ తెలియచేస్తోంది. ధన మయ,నేరమయ రాజకీయాలు రూపుమా పకుండా పురోగామి,మహిళాభ్యుదయ రాజకీయాలు సాధ్యమా అనేదే ప్రశ్న? దురదృష్టవశాత్తు మహిళా భ్యుదయంలో ముందంజలో ఉన్న కేరళ రాష్ట్రం నుంచి ఒక్క మహిళా పార్లమెంట్‌ సభ్యులు కూడా ఎన్నిక కాలేదు.
అన్ని పార్టీలూ మహిళలను నిలబెడితేనే మహిళా ప్రాతినిధ్యం సాధ్యం. కనుక పార్లమెంట్‌ లో,చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే మహిళా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యామ్నా య ఆర్థిక విధానాలతో ముందుకు వచ్చే వామపక్ష, అభ్యుదయ శక్తులను ప్రజలు ఆదరించాలి. మత వాద,చాందసవాద రాజకీయ శక్తులను ఓడిర చాలి.అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడే, ప్రత్యామ్నాయ శక్తుల రాజకీయ ప్రాబల్యం పెరిగి తేనే నిజమైన మహిళాభ్యున్నతి,మహిళా సాధి కారత సాధ్యం అవుతుంది.
పార్టీల్లోనూ అంతంతే..
రాజకీయపార్టీల విషయానికివస్తే నలు గురు మహిళలు పార్టీలకు అధ్యక్షులుగా ఉండి విజయంవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మాయావతి,సోనియాగాంధీ,మమతా బెనర్జీ, మెహ బూబా ముప్తీ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా,పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. జయలలిత వంటివారు కూడా పార్టీని ఎంత సమర్ధ వంతంగా నడిపారో,ఎలా అధికారంలోకి తెచ్చారో మనకు అనుభవంలోఉన్నదే.అయితే మిగతా రాజకీయ పార్టీల్లో మహిళు ఎక్కడ ఉంటు న్నారు? వారి పాత్ర ఏమిటీ ని ఆలోచించినప్పుడు నిరాశా పూరిత వాతావారణమే కనిపిస్తుంది. ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ,కోశాధికారి వంటి పదవులకు మహిళలు కనీసం నామినేషన్‌ వేసే పరిస్థితి కూడా పలు పార్టీల్లో లేదు.దశాబ్దాలుగా పురుషల డామి నేషన్‌ ఆయా పార్టీల్లో పరంపరంగా కొనసాగుతూ వస్తోంది.ఎంపీటికెట్లు,ఎమ్మెల్యే టికెట్లు దాటి పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి మెజార్టీ పార్టీల్లో మహిళలకు లేదు.
33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరిస్థితి..
మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌ ఆమోదం పొందలేదు.2008లో తొలి సారిగా పార్లమెంట్‌ ముందుకు వచ్చిన ఈబిల్లుకు కొన్ని పార్టీలు ససేమిరా అన్నాయి.మహిళలకు ఒకసారి రిజర్వుచేస్తే శాశ్వతంగా తమకు అధికా రం దక్కదన్న భావన ఆబిల్లుకు ఆమోదం కాకుండా అడ్డుపడుతోంది.యూపీఏ హాయంలో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు జరిగాయి.ఆ తర్వాత వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం ఈబిల్లు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ దక్కుతున్నా ఎన్ని కైన తర్వాత 90శాతం మగవారే పెత్తనం చెలాయి స్తున్నారు.పేరుకే మహిళలు సీట్లోకూర్చుంటున్నా భర్తో,అన్నో,తండ్రోవ్యవహరాలను చక్కబెడు తున్నా రు. ఇది రాజ్యాంగ విరుద్దం అని తెలిసినా చూసీ చూడనట్లు నడిచిపోతోంది.అసలు ఈ పరిస్థితి ఎందుకు తెలెత్తుతోంది?సంప్రదాయకంగా మహిళ లను ఇంటికి,ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన మెజారిటీ కుటుం బాల్లో ఉండటమే ప్రధాన కారణం.ఇల్లు,పిల్లలు తప్ప మరోగోల పట్టని మహిళే మెజారిటీ,వారిని ఛట్రంలోనే ఉంచుతున్నది మెజారిటీ పురుషస్వా మ్యమే అయినా అక్కడక్కడ మహిళలు కూడా ఇందుకు దోహదపడుతున్నారు.ప్రాధమికంగా చదువుకునే విషయం నుంచి ఈ వివక్ష మొదలవు తుంది.ఆడపిల్లలకు చదువుఎందుకనే చర్చ మొదలు కొని ఎక్కువ చదువుకుంటే సరైన భర్తను తేలేమన్న హిపోక్రటిక్‌ భావాలతో సమాజం నిండిపోయింది. ఇలాంటివెన్నో వారు రాజకీయంగా ఎదగకపోవ డానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.- (పి.సతీష్‌)