పంచాయితీలకు పునరుజ్జీవం

పంచాయితీలకు పునరుజ్జీవం కల్పించేం దుకు ఓ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ్పభుత్వం ముందడుగు వేసింది ఆగస్టు 23న ప్రపధమంగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భాగం గా రూ.4,500 కోట్లతో 87రకాల పనులను గ్రామాల్లో చేయించ డానికి ఉపక్రమించారు. పంచా యితీరాజ్‌ సంస్కరణల్లో భాగంగా పంచాయి తీలకు ఇచ్చే సొమ్ము ను రూ.10వేలకు,మేజర్‌ పంచాయితీలకు ఇచ్చే సొమ్మును రూ.25వేలకు పెంచినట్లు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ,గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ఆగస్తు23 నుంచి ప్రత్యేక కార్య కమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ‘గ్రామ సభలు’ ప్రారంభించారు. మైసూరువారిపల్లెలో నిర్వ హించిన గ్రామ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థా యి గ్రామ సభ నిర్వహించారు.
గ్రామాలు పచ్చగా ఉంటేనే: అన్నం పెట్టే రైతు బాగుంటే…అన్నీ బాగుంటాయి..గ్రామాలు పచ్చగా…ఉంటే మన మంతా హాయిగా..ఉంటామని పవన్‌కల్యాణ్‌ అన్నా రు.పార్టీకోసం పనిచేసేందుకు ముందు కొచ్చే వారి ని తాను వదలుకోనని, మనుషులను కలుపు కొనే వ్యక్తినని,విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామా భివృద్ధికి ఏంచేయాలన్నఅంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభు త్వం పంచా యతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్‌వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్య లుచేపడుతున్నామన్నపవన్‌,13వేల 326 పంచా యతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్‌: గత ప్రభు త్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్‌ మండిపడ్డారు.భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరు వారిపల్లె సర్పంచ్‌గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్‌, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు.ఉన్న నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామా లకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ అబి óవృద్ధి,స్వర్ణగ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్య మన్న పవన్‌,ఒకరి అనుభవం,ఇంకొకరి సంక ల్పం,మరొకరి విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో కళాశాలలు,క్రీడా మైదా నాలు కూడా లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వపరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అవుతుందని,దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి వలసలు నివారించి, ఉపాధి అవకాశాలు పెంచు తామన్నారు.వలసలు ఆగడానికి స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ వర్సిటీ తీసుకొస్తామన్న పవన్‌, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరం నాయకులు తయారుకా వడానికి పంచాయతీలే పట్టుగొమ్మలని, పంచాయ తీల నుంచి కొత్త నాయకులు రావాలని పిలుపు నిచ్చారు. యువత, మహిళలు కల్పించుకుంటే తప్ప గ్రామపంచాయతీలు మారవన్నారు.
లక్ష్యం ఇదీ..
ఎన్నికలప్రచార సమయంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకివస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం.దాని ప్రకారమే పంచాయతీలు సుసం పన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్య మంత్రివర్యులుకొణిదల పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామపంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి,గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయ నున్నారని తెలియజేశారు.మహాత్మా గాంధీ జాతీ య ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ. 4,500కోట్లనిధులతో,87రకాల పనులను గ్రామా ల్లో చేయనున్నామన్నారు.దీనిద్వారా మొత్తం 9కోట్ల పనిదినాలు,54లక్షలకుటుంబాలకు ఉపాధి కల్పిం చే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొ న్నారు. దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల సంయుక్త ఆధ్వర్యం లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చి చేందుకు మొత్తం 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఆగస్టు 23న ప్రారంభించారు.‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌.73వరాజ్యాంగ సవరణ ద్వారా పంచాయ తీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశా బ్దాలు దాటింది.రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలు పెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీ లకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్‌ పంచాయతీలకు రూ.100, మేజర్‌ పంచాయతీలకు రూ.250ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్క రణల్లో భాగంగా మైనర్‌ పంచాయతీలకు రూ.10వేలు,మేజర్‌ పంచా యతీలకు రూ.25వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉం టామని భరోసాను ఇచ్చాం.
మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం
పంచాయతీ సంస్కరణలు కొన సాగిం పులో భాగంగా గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణ యాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామా లను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది.భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుం దని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పంతో,ముఖ్యమంత్రి చ్రంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రపంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకు నేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయ తీలకు ఉండే అధికారాలను గ్రామాలఅభివృద్ధికి ఉప యేపడేలా చేసి…పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019-2023 సంవత్సరం వరకు రూ.40,579కోట్లు నిధులు వచ్చాయి.ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. గ్రామీ ణాభివృద్ది కోసం ఈనిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి.కానీ గత ప్రభు త్వంలో ఈ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈనిధులను ఇష్టానికి వాడు కున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో పంచా యతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపో యింది.2014-19వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచా యతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే,2019 `23 సంవత్సరాల్లో ఆ ఆదాయం గణనీయంగా తగ్గి కేవలం రూ.170కోట్లే వచ్చింది.క్షేత్రస్థా యిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభు త్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచా యతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంక ల్పంతో పని చేస్తోంది. పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నాం. పంచా యతీలకు సంబంధించిన విద్యుత్తును అవే ఉత్పత్తి చేసుకునేలా,వాటి ఆదాయం అవే సంపాదించు కునేలా తయారు చేస్తాం.రాష్ట్రాభివృద్ధిలోనే కాకుం డా దేశాభివృద్ధిలోనూరాష్ట్ర పంచాయతీలు కీలకం గా వ్యవహరించేలా తయారు చేస్తాం.
పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తాం.
రాష్ట్రంలోని గొప్పదనం ఏమిటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్ధాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లా లో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకత లను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగు మతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషి స్తాం. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొవాలి. పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొవాలని కోరుకుంటున్నాను.
పంచాయతీల ఆదాయం పెంచేలా సామాజిక అడ వుల పెంపకం
పంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది.దాన్ని క్రమపద్ధతిలో విని యోగించుకోవాలి.స్వచ్ఛభారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓప్రణాళిక ప్రకా రం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్‌,గ్రీన్‌ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టిపెడుతున్నాం.డెన్మార్క్‌ అనే చిన్నదేశం నుంచి కలపను మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది.రూ.6వేల కోట్ల విలువైన కలపను ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసం ఇంత వెచ్చిస్తున్నాం.గ్రామ పంచాయతీలకు సం బంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తు న్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయం గా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం.గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం.
గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ బలహీనం చేశారు
గత ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు,ఉపాధి పనుల్లోచాలా అవకతవకలు జరిగా యి.జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులకు పైపు లైన్లు వేసి వదిలేశారు. వాటికి కనెక్షన్‌ ఇవ్వలేదు. మరోపక్క పైపులైన్ల కోసంతవ్విన పనులు ఉపాధి హామీ పథకంలో చేశారు. అసలు ఏ పనులు దేనికి చేశారో గ్రామ సర్పంచులకు తెలియదు. మస్తర్‌ బుక్‌లో సంతకాలు పెట్టించుకోవడం తప్పితే, సర్పంచులకు ఏపనులు ఎక్కడ చేశారన్న వివరాలు చెప్పలేదు.దీనిలో బోలెడు అవకతవకలు జరిగా యి.నిధుల దుర్వినియోగం దారుణంగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షిం చాల్సిన,నిధుల దుర్వినియోగం అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయ లేదు. సామాజిక తనిఖీ విభాగానికి కూడా పోలీస్‌ అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనిపై అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుం టాం. గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ విభాగం బాధ్యుడిని తప్పించాము. రకరకాల అభియోగాలు వచ్చిన అధికారులను పక్కన పెట్టాం. నిఘా విభాగంపై నిఘా పెట్టాల్సి వచ్చింది. పంచాయతీ ల్లో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఉండాలి. దాన్ని ప్రతి పంచాయతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో పెండిరగ్‌ లో ఉండిపోయిన రూ.2 వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశాం. మెటీరియల్‌ కంపో నెంట్‌ గ్రాంట్‌ ను త్వరలోనే ఇస్తాం.
నీటి పునర్వినియోగంపై దృష్టి
నీటి కోసం గ్రామాల్లో బోర్లు హద్దులు దాటి వేస్తున్నారు.దీనివల్ల ఫ్లోరైడ్‌ ఎక్కువగా పడు తోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతు లకు వెళ్తున్న కొద్దీ ఫ్లోరైడ్‌ వస్తోంది. నీటిని పునర్వి నియోగంపై దృష్టి సారించాలి. అప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. తక్కువ దూరంలోనే నీళ్లులభిస్తాయి.ప్రస్తుతం గ్రామాల్లో పల్స్‌ సర్వే చేస్తు న్నాం.పంచాయతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశా లతో సర్వే నిర్వహిస్తున్నాం.22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్త యితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్‌ సోర్సు మీద ఓస్పష్టత వస్తుంది.అప్పుడు ఓప్రణాళిక ప్రకా రం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకు వెళ్తాం.
విశాఖలో పరిశ్రమల కాలుష్యం మీద నిఘా పెడతాం
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్ర మల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగి స్తున్నాయి.ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆపరిశ్రమలకు చెందిన ఇద్దరు యజ మానుల మధ్యఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయడం మీద దృష్టి పెడతాం.సేఫ్టీ ఆడిట్‌ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్‌ షిపింగ్‌ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత.సేఫ్టీ ఆడిట్‌ ను కఠినంగా అమ లు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు.అయితే పరిశ్ర మలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమ ల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను.ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యే కంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలు ష్యం పెరుగుతోంది.దీన్ని అరికట్టడంపై దృష్టి పెడ తాం.పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా,ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’అన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు – ప్రతీ పేదకు సొంత ఇల్లు : సీఎం చంద్రబాబు
మన గ్రామంలో ఏం చేసుకోవాలి.. ఏ పనులు పూర్తి కావాలి..ఎలా పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవాలి? అనే ఆలోచన ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉండాలి.గ్రామసభల్లో గ్రామానికి అవసరం అయ్యే పనుల మీద గ్రామస్తులంతా సమగ్రంగా చర్చిం చాలి.అంతా ఒక్కటిగా తీర్మానాలు చేసుకొని గ్రామ అభివృద్ధిని, ప్రగతికి ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిని సాధి స్తాయి.స్వర్ణ పంచాయతీలుగా మారి సంపన్న ఆర్థిక,అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకోవలసిన అవసరం ఉంది.గ్రామ పంచాయతీ మొదటి పౌరు డు అయిన సర్పంచులకు విశిష్టమైన శక్తి, అధికా రాలు ఉన్నాయని,దానిని సరైన రీతిలో ఉపయోగిం చుకుంటే ప్రతి గ్రామం రాలేగావ్‌ సిద్ధిగా మారు తుంది.ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడ పిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రప తిగా ఎదిగిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రస్థా నం ఎంతో స్ఫూర్తిదాయకంమని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ.గో.జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు.ఈక్రమంలో సీఎం వానపల్లి లోని పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించు కున్న అనం తరం వానపల్లి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయ తీల్లో ‘గ్రామ సభలు’ పెట్టామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా కింద రూ.4,500కోట్ల పనులకు అను మతి తీసుకున్నామని నరేగా కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84లక్షల కుటుంబా లకు పని దొరుకుతుందని సీఎం తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నాకు.2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని సీఎం చంద్రబాబు తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహి ళలు ఇబ్బంది పడ్డారని వైఎస్సార్‌ సీపీ సభ లకు వెళ్లినవారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టా రని మండిపడ్డారు.గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకమని సీఎం తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. 2014-19మధ్య 27,444కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తామని సీఎంచంద్రబాబు హామీ ఇచ్చారు.గ్రామాల్లోని పేద లకు ఇళ్లుకట్టించే బాధ్యత ప్రభు త్వంతీసు కుంటుం దని తెలిపారు. ఇళ్లకు విద్యుత్‌, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.నిరుద్యోగ యువ తకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తు న్నానని ఇంతా16వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టు లు భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరిం చారు.గత ఐదేళ్లలో ఉద్యోగులు, పింఛనుదారులకు జీతం సరిగా వచ్చేది కాదు. పేదవాడికి రూ.15కే మూడుపూటలా భోజనం పెడుతున్నాం. నైపుణ్యం ఉంటేనే యువత ఆదాయం పెరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.-జిఎన్‌వి సతీష్‌