నీళ్లకోసం..నేలకోసం..మత్స్యకారుల దైన్యం
మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై.. ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు. చేపలనే కాదు.. సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంద్రం నిండా కదలాడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమైపోతుంటే.. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో దిక్కు తెలియక ప్రపంచవ్యాప్తంగా సతమతమవుతున్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! కడలి అలలపైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు.. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత చేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం,బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతుపట్టని రోజుల తరబడి ప్రయాణం..అయినా సంద్రంపై నమ్మకంతో బతుకుపోరు సాగిస్తూనే ఉంటారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు..అన్న నానుడిని మననం చేసుకుంటూ,వలలు భుజాన వేసుకుని, తిరిగి వస్తామో రామోనన్న నమ్మకం లేని పయనం చేస్తారు మత్స్యకారులు.. సంద్రంలో ఇప్పుడు కార్పొరేట్, కాలుష్య తిమింగలాలు సంద్రాన్ని..తీరాన్ని.. వీరిని, వీరి బతుకుల్ని కబళించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..-`గునపర్తి సైమన్
వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులతో1997లో తొలిసారిగా వరల్డ్ ఫిషరీస్ కన్సార్టియమ్ ఫోరమ్ పేరిట న్యూఢల్లీిలో ఒక సమా వేశం జరిగింది. దాదాపు 18 దేశాల నుండి ప్రతి నిధులు హాజరైన ఈసమావేశంలో వరల్డ్ ఫిషరీస్ ఫోరమ్ (డబ్ల్యుఎఫ్ఎఫ్) ఆవిర్భవించింది. మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా,కార్పొరేట్ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్ 21ని మత్స్య దినోత్సవంగా జరపాలని ఆసమావేశం పిలుపునిచ్చింది.తొలి సమావేశం జరిగి 26 సంవత్సరాలు గడిచిపోయా యి.అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్య కారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు.
ఉనికికే ప్రమాదం..
ఇప్పుడు జలచరాలకే కాదు..మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలు ష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈదుష్పరిణా మానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూము లపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆప్రాం తంలోని అన్నిజలవనరులను విషతుల్యంగా మారు స్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తు న్నారు.జలచరాల గుడ్లను కూడా మిగల్చ కుండా ఊడ్చేస్తున్నారు. అందుకే..మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపు నింపే నీళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఈ పరిణామాలు మన రాష్ట్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి.ఫలితంగా తూర్పు తీరం లోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్ప చెబుతున్నాయి.సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇలా..
రాష్ట్రానికి సుదీర్ఘమైన 974కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది.సముద్రం మీద ఆధా రపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం)సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం12,747మోటారైజ్డ్,1771మెకనైజ్డ్, 14, 677సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడి చిన పన్నెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకా రుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.సాంప్రదాయ,మోటరైజ్డ్బోట్లసంఖ్య భారీ గా తగ్గింది.వాటిస్థానంలో మెకనైజ్డ్ బోట్లు పెరిగా యి.వెజెల్స్ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి.పెద్ద వ్యాపారవేత్తల నుండి వందలకోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కార ణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యం గా మారింది.ఎక్కడైతే స్వేచ్ఛగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీ డ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను,చేప పిల్లలను వదిలి వేస్తూ సాగే ‘బతుకు.. బతికించు’ జీవన విధానం నుండి ‘సర్వస్వాన్ని దోచేసే’ కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళ కింద నేలను..బోటుకింద నీళ్లను..’లాగేసే ప్రభుత్వ విధానాలు..తీర ప్రాంతంలో తిష్టవేసి,మత్స్యకా రుల బతుకుల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు దయనీయస్థితిలోకి నెట్టబడ్డారు.
ఏం జరుగుతోంది?
నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగు తోంది.సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది.నదుల్లో చేరుతు న్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రం లో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచా రం లేదు.రిలయన్స్ వంటి సంస్థలు కోస్టల్ రెగ్యు లేటరీ జోన్ నిబంధనలను కాదని, బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమోగానీ స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈవాస్తవం పూర్తిగా అర్థ మైంది.‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్ర త్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు.తీసుకెళ్లి చూపించేస్తారు కూడా..కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు..పైగా రోజురోజుకీ పెరుగుతూ ఉం టోంది’అని కాకినాడ డీప్ వాటర్పోర్టులో జెట్టి ఆపరేటర్గా పనిచేస్తున్న ఒకమత్స్య కార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగు తూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్ బోటులో మరో ముగ్గురు, నలు గురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన‘కొన్ని సంవత్స రాల క్రితం ఒడ్డునేచేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. రోజుల తరబడి సము ద్రం మీదనే ఉండాల్సి వస్తోంది.ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు.ఒక్కోసారి బోటు మీద తీసుకెళ్ళేవారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు.ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీరప్రాంతంలో కనిపించడం లేదు. వీటి లో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్ప మని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి!
కలవరపెడుతున్న కోత!
కాలుష్యం కారణంగా చోటుచేసుకుం టున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి.పిల్లి పిల్లలను మార్చి నట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాం తాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సి వస్తోంది.అయినా,తరతరాలుగా అలవాటైన సము ద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. అందు బాటులో ఉన్నలెక్కల ప్రకారం గడచిన 80 సంవ త్సరాల కాలంలో ఇక్కడ రెండు కిలోమీటర్ల భూమి కోతకు గురైంది.ఈప్రభావం 1989నుండి మరిం త స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ఒక అంచనా! ‘ఒకే దగ్గర నివాసంఉండటమన్నది మరచి పోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం.మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా..ఇక్కడే ఉంటున్నాం’అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ఇళ్లనుకోల్పోయిన వారే అంద రూ.కోల్పోకుండా ఉన్నవారు ఒక్కరంటే ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు.ఇలానష్ట పోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్ట లతో మిగలడం వారికి మామూలే. ఉప్పాడలోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రనాథ్ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89కిలోమీటర్ల భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం.దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ఏ జిల్లాలో ఎంత కోత?
జిల్లా కోత (కి.మీ.లలో)
శ్రీకాకుళం 25.12
విశాఖపట్నం 25.81
తూర్పుగోదావరి’ 89.25
కృష్ణా 57.55
నెల్లూరు 53.52
తీరం కార్పొరేట్ల పరం..
కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిణామం మరింత వేగవంతమైంది.అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు,మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోంది.ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ కాస్తా అదానిప్రదేశ్గా మారుతోంది. పోరు ్టలను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సము ద్రంలోకి నౌకలకు ఆటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37కిలోమీ టర్లకు పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కిలోమీటర్ల మేర కాంపౌండ్వాల్ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మి కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరం పోర్టు వద్ద కూడా ఇదే స్థితి.గోడ నిర్మాణంతో కిలోమీటరు దూరం వెళ్లి, వేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా‘కోస్టల్ ఎకనామిక్ జోన్లు, సెజ్లు,సాగరమాల’ ప్రాజెక్టుల పేరుతో తీరప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్ ప్రాసె సింగ్, టెక్స్టైల్స్, పెట్రో కెమికల్స్ ఫార్మా పరిశ్ర మలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివీస్ లాబరేటరీస్ లిమిటెడ్,రాంకీ ఫార్మ సిటి, హెటిరో ఇన్ఫ్రాస్ట్రక్చర్,బ్రాండిక్స్ ఇండియా అపె రల్ సిటీ,డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ లిమిటెడ్లు వీటిలో కొన్ని.వీటి నుండి విడుదలయ్యే కాలు ష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తు న్నాయి.దీనిని నియంత్రిస్తున్నట్లు,కాలుష్య నివార ణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరి మితం.దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది.
సమస్యలు పరిష్కరిస్తేనే బతుకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు నష్టదాయకమైన జీవోలను విడుదల చేస్తున్నాయని ఎపి మత్స్యకారులు,మత్స్యకార్మిక సంఘం పేర్కొం ది.దీంతో మత్స్యకార వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది.చేపలకు గిట్టుబాటు ధర కల్పించాలి. గంపల మహిళలకు మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి.సబ్సిడీ డీజిల్,ఐస్ ప్లాంట్ వంటి సదుపా యాలు కల్పిస్తామని,జెట్టీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.తుపాను సమయాల్లో మత్స్య కారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి. వేట నిషేధ కాలంలో సమస్యలను పరిష్కరించాలి. యాభై సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పిం ఛన్ సౌకర్యం కల్పించాలి.స్థానిక పరిశ్రమల్లో మత్స్యకార కుటుంబాల యువతకు ఉపాధి కల్పించాలి.
ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి..
ఆక్వా (రొయ్యలు, చేపలు,పీతలు) రైతులు ఇటీవల కాలంలో పీకల లోతు కష్టాల్లో కూరుకు పోతున్నారు. సన్న, చిన్నకారు రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెరి గాయి.ఫీడ్, సీడ్ (విత్తనం) నాణ్యతా ప్రమాణాల్లో లోపాలుంటున్నాయి.వైరస్లు, వాతావరణ మార్పు లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దిగుబడులు తగిన విధంగా లేవు.ధర రాక ఆక్వా రైతులు కుదేలౌతు న్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల పన్ను లు,విదేశీ మారకద్రవ్యం రూపంలో ఆదాయం పొందుతున్నాయి.కానీ ఆక్వారైతుల్ని మాత్రం గాలి కి వదిలేసి,నట్టేట ముంచుతున్నాయి. ఆక్వా రైతుల చేపలు,రొయ్యలకు ధర కల్పించి..ఆదుకోవాలి. నాణ్యమైన సీడ్,ఫీడ్ సరఫరా చేయాలి.విద్యుత్ రాయితీ పునరుద్ధ్దరించాలి.
సముద్రమూ వారికే..
మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు,వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ-సిఎఎ(అమెండ్ మెంట్)బిల్లు -2023..సాధారణ మత్స్యకారు లకు ప్రాణాంతకంగా మారనుంది.ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం.గత ఏడా దికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచ నా.వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్,మెకనైజ్డ్ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్ బోట్లకు లక్షల రూపా యల్లో పెట్టుబడులు అవసరమైంది. బ్లూ ఎకానమి,సముద్ర ఆధారిత టూరిజం,డీప్ సీ మైనింగ్ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమ తించింది.దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్య కారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని,సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపా డుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది! 2004 భారత మహాసాగరమైన సునామీ నుండి వచ్చే పాఠాలు తదుపరి తరంకోసం మహా సముద్రం వంటి అధికమొత్తంలో నీరు శీఘ్ర స్థాన భ్రంశం జరగడంవల్ల ఒక సునామి సముద్రపు కెరటం (అలలు) పరంపర ఆరంభమవుతుంది నీటి పై గాని క్రిందగాని భూకంపాలు, సమూహపు కద లిక,కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనములు,కొన్ని జలాంతర్భాగ విస్ఫోటనం.