నిరంతర స్పూర్తిప్రదాత

నూట ముప్పైయేళ్లు క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు.అంబేద్కర్‌.133 ఏళ్ల తర్వాత.. ఈకోట్లాది మహాభారతావనికి బాబా సాహెబ్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.ఈ దేశ గతిరీతులకు విధాత.నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ధేత.కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహో పాధ్యా యుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక.ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింపచేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ,ఆర్ధిక విధానాలకు నిత్య నిర్ధేశకుడు అంబేద్కరే.ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.-జీఎన్‌వీ సతీష్‌
ఆయన రాసిన ప్రతి అక్షరం,పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం.ఆ నిత్య స్పూర్తిమంతుని 133వజయంతిని జరుపు కోవడం,సేవలను మన నం చేసుకోవడం ఒకగొప్ప అనుభవం.చారిత్రక అవసరం. అస్పృశ్యతా శాపానికి గురైన మహర్‌ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్‌,ఆవర్గంలో మెట్రిక్యు లేషన్‌ చేసిన మొదటి విద్యార్ధి.బరోడా మహారాజు ఆర్ధిక సాయంతో ముంబైలో డిగ్రీపూర్తిచేసి,ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా)వెళ్లారు.అక్కడ ఉన్న భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించే వారు.సంఘానికి సంబంధించి నంతవరకు అస్పృశ్యులు వేరు కాదు.వారు భారతీయ సంస్కృతిలో అవిభక్త భాగమే అని ఇండియన్‌ రేస్‌ అనే తనవ్యాసంలో స్పష్టం చేశారు.తర్వాత ఆయన చేసిన పరిశోధనలకు ఈ సిద్దాంతమే ఆధారం.
అంబేడ్కర్‌ తొలి పత్రిక ‘’మూక్‌ నాయక్‌’’కు 104 ఏళ్లు
‘‘ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓసినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈదేశం అన్యాయా లకు పెట్టని కోటలా కనిపిస్తుంది.కచ్చితంగా అలానే అనిపి స్తుంది’’.సరిగ్గా 104 సంవత్స రాల క్రితం,31జనవరి 1920నాడు‘ ‘మూక్‌నాయక్‌’’జర్నల్‌ తొలి సంచిక కోసం అంబేడ్కర్‌ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చిచూస్తే..నేడు చాలా మార్పులు వచ్చాయి.అయితే, మారాల్సినంత మార లేదు.మీడియాతో అంబేడ్కర్‌కు విడదీయరాని బంధాలు పెనవేసుకుని ఉండేవి.ఆయన సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించారు. సంపాద కుడిగా పనిచేశారు.ప్రత్యేక వ్యాసాలూ రాశారు.ఆతర్వాత ఆయనే పత్రికల వార్తల్లో నిలిచారు.అప్పట్లో ఎక్కువమందికి చేరువైన,సామాజిక ఉద్య మాలను ఒంటి చేత్తో నడిపించిన అగ్రనా యకుల్లో అంబేడ్కర్‌ ఒకరు. కాంగ్రెస్‌ తరహాలో ఆయనకు ఆర్థిక,సామాజిక సాయం అందలేదు.అయితే,పేదల ఉద్య మంగా ఆయన దీన్ని నడిపించారు.భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుక బడిన బలహీన వర్గాలే ఆయన అనుచ రులు. దీంతో ఆయ నకు ఆర్థికంగాఎలాంటి సాయమూ అందేదికాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుం డానే తన భుజాలపై అంబేడ్కర్‌ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిం చాల్సి వచ్చేది. మీడియా కవరేజీలోనూ ఇది స్పష్టంగా కనపడేది.
అంతర్జాతీయ మీడియాలోనూ..
అంబేడ్కర్‌ కృషి దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేది. దేశీయ మీడియాలో ఆయన రాసిన కథనాలు, వ్యాసాల గురించి మనకు కొంతవరకు తెలుసు. అయితే, అంతర్జాతీయ మీడియాలో ఆయనకు సంబంధించిన కవరేజీ చాలా వరకు మరుగున పడిపోయింది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లైన లండన్‌లోని ద టైమ్స్‌,బాల్టీమోర్‌ ఆఫ్రో అమెరికన్‌, ద నార్‌ఫోక్‌ జర్నల్‌లను అపట్లో నల్లజాతీయులు నడిపించేవారు.అంబేడ్కర్‌ అంటరానితనంపై నడిపించిన ఉద్యమాన్ని ఈ పత్రికలు విస్తృతంగా కవర్‌ చేశాయి.గాంధీతో ఆయన విభేదాలపైనా వార్తలు ప్రచురించాయి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్ర, పార్లమెంటులో ఆయన చర్చలు,నెహ్రూ ప్రభు త్వం నుంచి ఆయన రాజీనామా తదితర పరిణామాలను ప్రపంచం క్షుణ్నంగా గమనిం చింది.అంతర్జాతీయ పత్రికల్లో అంబేడ్కర్‌పై వచ్చిన కథనాలు, ఆయన రాసిన కథనాలపై ‘’అంబేడ్కర్‌ ఇన్‌ బ్లాక్‌ అమెరికా’’ పేరుతో నేను ఓ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురించబోతు న్నాను.దేశీయంగానూ తన సామాజిక ఉద్యమా న్ని ముందుకు నడిపించేందుకు అంబేడ్కర్‌ మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు.దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్‌ ‘’మూక్‌ నాయక్‌’’ను ప్రారంభించారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం..
అణగారిన వర్గాల హక్కుల కోసం తన పత్రికలు, జర్నల్స్‌ సాయంతో అంబేడ్కర్‌ పోరాడేవారు. మూక్‌ నాయక్‌ తొలి 12 ఎడిష న్లకు ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డీడీ ఘోలప్‌ ఆ బాధ్యతలను తలకెత్తుకున్నారు. అయితే 1923లో మూక్‌ నాయక్‌ మూతపడిరది.ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్‌ విదేశాలకు వెళ్లడం,ప్రకటనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్‌ ఈమ్యాగజైన్‌కు సాయం అందిం చారు.అంటరాని వారి స్వాతంత్య్ర ఉద్యమానికి మూక్‌ నాయక్‌ బాటలు వేసిందని అంబేడ్కర్‌ జర్నలిజంపై పరిశోధన చేస్తున్న గంగాధర్‌ పంత్‌వానే వ్యాఖ్యానించారు.అణగారిన వర్గాల్లో ఈ జర్నల్‌ కొత్త ఊపిరులు నింపిందని ఆయన అన్నారు.
బహిష్కృత్‌ భారత్‌ పేరుతో మరొకటి..
‘’మూక్‌ నాయక్‌’’ అనంతరం ‘’బహిష్కృత్‌ భారత్‌’’ పేరుతో3 ఏప్రిల్‌ 1927లో మరో జర్నల్‌తో అంబేడ్కర్‌ ముందుకు వచ్చారు. మహద్‌ ఉద్యమంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మొదలుపెట్టారు.ఇది 15, నంబరు 1929 వరకు నడిచింది. అయితే ఈ జర్నల్‌ కూడా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గాల్సి వచ్చింది. మూక్‌ నాయక్‌, బహిష్కృత్‌ భారత్‌ల ఒక్కో ఎడిషన్‌ ధర ఒకటిన్నర అణాలు మాత్రమే.వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ అయితే పోస్టల్‌ చార్జీలతో కలిపి మూడు రూపాయలకే ఇచ్చే వారు. ఇదే సమయంలో ‘’సమత(1928)’’ జర్నల్‌ మొదలైంది.ఆతర్వాత బహిష్కృత్‌ భారత్‌ పేరును ‘జనతా’గా మార్చి24నవంబరు 1930 న దీన్ని మళ్లీ పునఃప్రారంభించారు.దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా జనతా రికార్డులకు ఎక్కింది.దాదాపు 25ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది.ఆ తర్వాత కాలంలో అంబే డ్కర్‌ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ‘’ప్రబుద్ధ భారత్‌’’గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్‌ భారత్‌ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని,భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన పత్రిక ఇదేనని చెబుతారు.
అందరినీ కలుపుకుంటూ..
ఈ కాలంలోనే ఉన్నత కులాల పాత్రికేయుల్ని తన మిషన్‌లో అంబేడ్కర్‌ కలుపుకుంటూ వెళ్లారు. అప్పట్లో చాలా పత్రికలను బ్రాహ్మ ణులు నడిపించేవారు.డీవీ నాయక్‌ (సమత, బ్రాహ్మణ్‌ బ్రాహ్మణేతర్‌),బీఆర్‌ కాద్రేకర్‌ (జనతా),జీఎన్‌ సహశ్రబుద్ధి (బహిష్కృత్‌ భారత్‌, జనతా) తదితరులు ఆయనతో పనిచేసిన వారిలో ఉన్నారు.బీసీ కాంబ్లే, యశ్వంత్‌ అంబేడ్కర్‌ తదితర దళిత ఎడిటర్లు జనతాలో కీలకపాత్ర పోషించారు.అయితే,బహిష్కృత్‌ భారత్‌లో ఎడిటర్ల కొరత ఉండేది.ఒక్కోసారి ఒక ఎడిటరే 24-24కాలమ్స్‌ రాయాల్సి వచ్చేది.యశ్వంత్‌ అంబేడ్కర్‌, ముకుందరావ్‌ అంబేడ్కర్‌,డీటీ రూపవస్తే,శంకర్రావు కారాట్‌, బీఆర్‌ కాద్రేకర్‌ల సాయంతో ప్రబుద్ధ భారత్‌ ముందుకు నడిచింది.
దళిత జర్నలిజం
అంబేడ్కర్‌కు ముందు దళితుల కోసం పనిచేసిన జర్నల్స్‌ చాలాతక్కువగా ఉండేవి.ఫూలే ప్రారం భించిన ‘సత్యశోధక్‌ ఉద్యమం’ దళితుల కోసం పనిచేసింది.సత్యశోధక్‌ సమాజం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 1, 1877లో కృష్ణరావ్‌ భాలేకర్‌‘దీన్‌ బంధు’ జర్న ల్‌ ప్రారంభించారు.దళితుల ఆలోచనలు,అభి ప్రాయాలకు దీన్‌బంధు స్థానం కల్పించేది. మధ్య మధ్యలో అంతరాయాలతో దాదాపు 100ఏళ్లు ఈ జర్నల్‌ నడిచింది.తొలి దళిత జర్నలిస్టులుగా పేరొందిన వారిలో మహర్‌ వర్గానికి చెందిన గోపాల్‌ బాబా వాలాంగ్కర్‌ ఒకరు. ఆయన వ్యాసాలు,కథనాలు..‘దీన్‌ మిత్ర’,‘దీన్‌బంధు’,‘సూధ్రక్‌’తదితర జర్నల్స్‌ కోసం ఆయన పనిచేశారు.హిందూ ధర్మాలపై ఆయన విమర్శలను ‘’విటాల్‌ విధ్వంసక్‌’’ పేరుతో ఓపుస్తకం కూడా ప్రచురించారు. దీనిలో శంకరాచార్య సహా ప్రముఖ హిందూ నాయకులకు 26 ప్రశ్నలు సంధించారు.
మరికొందరు కూడా..
మహర్‌ నాయకుడైన శివరామ్‌ జన్బా కాంబ్లే కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరా డారు.తొలి దళిత దినపత్రిక ‘’సోమ్‌వాన్షీయ మిత్ర’’ను ఆయన జులై 1,1908లో ప్రారం భించారు.దళితుల ఉద్యమ నాయకుల్లో కిసాన్‌ బాన్సోడే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు కార్మిక నాయకుడు ఎంప్రెస్‌ మిల్‌.. నాగ్‌పుర్‌లో స్వతంత్ర మీడియా సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే ‘మజూర్‌ పత్రిక’ (1918-22),‘చోఖామేలా(1936)’లను ఆయన నడిపించారు.1941లో రచయిత చోఖామేలా ఆత్మకథనూ ఆయన ప్రచురించారు. ‘సోమ్‌ వాన్షీయ మిత్ర’కు ముందు కిసాన్‌ బాన్సోడే.. ‘మరాఠా దీన్‌బంధు’ (1901)‘అత్యంజ్‌ విలాప్‌’ (1906),‘మహారాంచ సూధ్రక్‌’(1907)ల పేరుతో మూడు దిన పత్రికలను ఆయన నడిపించారు.అయితే,ఈ పత్రికల కాపీలు ఏ ప్రాచీన పుస్తక భాండాగారాల్లోనూ లభించడంలేదు. అయితే అప్పటి పరిణా మాలపై పరిశోధనలు చేసిన కొందరు..ఈ పత్రికలను బాన్సోడే నడిపించారని తేల్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలను ఏకం చేయ డమే ఈ పత్రికల లక్ష్యం.అంబేడ్కర్‌ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లిన పత్రికల్లో దాదాసా హెబ్‌ శిర్కే మొదలుపెట్టిన ‘గరుడ్‌’(1926), పీఎన్‌ రాజభోజ్‌ ప్రారంభించిన ‘దళిత్‌ బంధు’ పతిత్‌పావండాస్‌ నడిపించిన పతిత్‌పావన్‌ (1932),ఎల్‌ఎన్‌ హరదాస్‌ ప్రారంభించిన మహారత్తా(1933),దళిత్‌ నినాద్‌(1947)ఉన్నా యి. కులాలపై గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీఎన్‌ బార్వే..‘దళిత్‌ సేవక్‌’ను మొదలుపెట్టారు.తొలినాళ్లలో అంబేడ్కర్‌ జర్నలిజంపై..‘దళితాంచి వృతపత్రే’ పేరుతో 1962లో అప్పాసాహెబ్‌ రాన్‌పిసే ఓపుస్తకాన్ని ప్రచురించారు.మరోవైపు దళిత జర్నలిజంపై గంగాధర్‌ పంతవానే 1987లో ఓపరిశోధక పత్రాన్ని ప్రచురించారు. ఆతర్వాత అంబేడ్కర్‌ దళిత జర్నలిజంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కళాత్మకంగా…
అంబేడ్కర్‌ రచనలు చాలా కళాత్మకంగా ఉంటా యి. వీటిలో ఆయన గట్టి విమర్శలు చేసేవారు. మరోవైపు అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమీక్షించడంతోపాటు బడుగు వర్గాలపై జరిగే అకృత్యాలను ఎత్తిచూపేవారు. ప్రభుత్వ విధానాలు,రాజకీయ పార్టీల వాద నలు,సామాజిక,రాజకీయ సంస్కరణలపై అంబేడ్కర్‌ సంపాదకీయాలూ రాసేవారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆయన కథనాలు,వ్యాసాలు మనకు చక్కటి అవకాశం కల్పిస్తాయి.ఆయన మంచి వ్యాసకర్త,ఆలోచనా పరుడు. ఆయన ప్రచురించిన జర్నల్స్‌లో దళిత ఉద్యమకారుల చిత్రాలు,దళిత కళాకారుల సృజనాత్మకత కనిపించేవి.జూన్‌ 15,1927లో‘బహిష్కృత్‌ భారత్‌’లో రాసిన ఓకథనంలో బ్రాహ్మణులపై అంబేడ్కర్‌ ధ్వజమెత్తారు.ముంబయి ప్రాంతంలో చేపట్టిన ఓసర్వేను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.ప్రతి రెండులక్షల మంది విద్యావంతుల్లో బ్రాహ్మణులు వెయ్యి మంది వరకు ఉంటే…అంటరాని వారి ప్రాతినిధ్యం సున్నా అని గణాంకాలను ఉటంకించారు.దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది.దళితుల సామాజిక,రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే,అంబేడ్కర్‌ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. (హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌లోని షోరెన్‌స్టీన్‌ సెంటర్‌ ఆన్‌ మీడియా,పాలిటిక్స్‌,పబ్లిక్‌ పాలసీలో సూరజ్‌ యెంగ్డే పరిశోధకుడు)