దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన

దేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయ డంలో మౌలిక సదుపాయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రాథమిక పెట్టుబడులలో కూడా ఇవే కీలకం. శ్రామిక, మూలధన రూపంలో ఉన్న విస్తారమైన వనరుల కార ణంగా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.భారతదేశ ఆర్థిక వ్యవ స్థలో ఎంఈఐఎల్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. పారిశ్రా మిక, వ్యాపార మౌలిక సదుపాయాలలో స్థిరమైన వృద్ధిని అందిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది ఎంఈఐఎల్‌. మౌలిక సదుపాయాల్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధిని అందిస్తూ..ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక నీటి పథకాల ద్వారా సాగు, తాగు నీటిని అందిస్తోంది.భారీ విద్యుత్‌, రోడ్‌ టన్నెల్‌ ప్రాజెక్టులు చేపట్టి..వాటిని నాణ్యతా ప్రమాణా లతో పూర్తి చేస్తూ..దేశ వృద్ధిని పెంపొందిస్తోంది. దేశం లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ ఎంఈఐఎల్‌ తన సత్తా చాటుకుంటోంది.మౌలిక సదు పాయాలు, పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రసంగించారు..సారాంశం ఇదీ..!!
‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల అభి వృద్ధి ఒక చోదకశక్తి’ : ‘ప్రతిఒక్కరూ నూతన బాధ్య తలు,నూతన అవకాశాల విషయంలో గొప్ప నిర్ణ యాలు తీసుకోవడానికి ఇది తగిన సమయం’’ ‘భారతదేశంలో శతాబ్దాలుగా జాతీయ రహదారు లకు గల ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది’ ‘పేదరికం ఒక శాపం అనే ఆలోచనను తుడిచిపెట్ట డంలో మనం విజయం సాధించాం.‘ఇప్పుడు మనం మన వేగం పెంచాలి. మరింత దూసు కళ్ళాలి.పి.ఎం.గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలికసదుపాయాలు, దాని బహుళన మూనా లాజిస్టిక్స్‌ రూపురేఖల్ని మార్చనుంది. ‘పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌ దేశ ఆర్థిక, మౌలికసదు పాయాల ప్లానింగ్‌ను అభివృద్ధితో అనుసంధానం చేస్తుంది.నాణ్యత,మల్టీమోడల్‌ మౌలికసదుపాయా లతో,మనలాజిస్టిక్‌ల ఖర్చురాగల రోజులలో మరిం త తగ్గనుంది. మౌలికసదుపాయాల బలంతో,దేశ సామాజిక మౌలిక సదుపాయాలుబలంగా ఉండ నున్నాయి.మీరు కేవలం దేశ అభివృద్ధికే కాదు, భారతదేశ పురోగతివేగం పెంచేందుకు దోహద పడుతుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మౌలికసదుపాయాలు,పెట్టుబడులు: పిఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తో లాజిస్టిక్‌ సామర్ధ్యాలను మెరుగుపరచడం’ అనే అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను నిర్వహించారు.బడ్జెట్‌ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్‌. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్ర మాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా వెబి నార్‌లో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇవాల్టి వెబినార్‌లో వందలాది మంది పాల్గొంటుండడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.సుమారు 700 మంది సిఇఒలు, మేనేజింగ్‌ డ్కెరక్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు.దీనిని బట్టి ఈ వెబినార్‌ ప్రాధాన్యత తెలుస్తోంది.వివిధ రంగా లకు చెందిన నిపుణులు, స్టేక్‌హోల్డర్లు ఈ వెబి నార్‌ను విజయవంతం చేశారని అన్నారు.మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌ నూతన శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.బడ్జెట్‌కు సర్వత్రా ప్రశంసలు లభించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బడ్జెట్‌ లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు నిపుణుల నుంచి ప్రధాన మీడియా సంస్థలనుంచి ప్రశంసలు లభించాయన్నారు. భారతదేశపు కాపెక్స్‌ 2013`14 సంవత్సరంతో పోలిస్తే 5 రెట్లు పెరగిందన్నారు. ప్రభుత్వం జాతీయ మౌలికసదుపాయాల పైప్‌ల్కెన్‌ కింద 110 లక్షల కోట్లరూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు పోతున్నదని చెప్పారు.నూతన అవకాశాలకు, నూతన బాధ్యతలకు, గొప్ప నిర్ణయాలు తీసుకోవ డానికి ఇదిఎంతో అనువైన కాలమని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచు కున్నప్పుడు,ఏ దేశ సుస్థిరాభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల చరిత్రకు సంబంధించిచన పరిజ్ఞానం కలవారికి ఈవిష యం బాగాతెలుసునని ఆయన అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరాపథ్‌ నిర్మించగా, అశోకుడు దానిని మరంత ముందుకు తీసుకువెళ్లారని, షేర్‌ షా సూరి దానిని అప్గ్రేడ్‌ చేశారని అన్నారు. దానిని బ్రిటిషర్లు జి.టి.రోడ్‌గామార్చారని చెప్పారు.జాతీయ రహదా రుల ప్రాధాన్యతను శతాబ్దాల క్రితమే భారత దేశంలో గుర్తించారని ప్రధానమంత్రి చెప్పారు. జలమార్గాలు,రివర్‌ ఫ్రంట్‌ల గురించి ప్రస్తా విస్తూ ప్రధానమంత్రి,బెనారస్‌ ఘాట్‌ ల గురించి ప్రస్తావిం చారు.ఈఘాట్లు జలమార్గాలద్వారా నేరుగా కల కత్తాతో అనుసంధానమై ఉండేవని చెప్పారు. తమిళనాడులోని 2000 సంవత్సరాల క్రితం నాటి కలనై డ్యామ్‌ ఇప్పటికీ నీటిని అందిస్తోందని ప్రధాన మంత్రి తెలియజేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.పేదరికం ఒకశాపమన్న భావనను తొల గించి,ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతు న్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.మౌలిక సదు పాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడినట్టు ప్రధానమంత్రి వివరిం చారు.2014 నాటికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చినపుడు,జాతీయ రహదారుల నిర్మాణం సగ టున రెట్టింపు అయిందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే 2014కు ముందు సంవత్సరానికి 600 రూట్‌ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగిం దని, అది ప్రస్తుతం సంవత్సరానికి 4000 కిలో మీటర్లకు చేరుకున్నదన తెలిపారు. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య, సముద్ర పోర్టుల సామ ర్ధ్యం రెట్టింపు అయినట్టు ప్రధానమంత్రి తెలి పారు.‘‘మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా’’అని అంటూ ప్రధాన మంత్రి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం రూపుదిద్దుకునే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.ఇందుకు అనుగుణమైన మార్గాన్ని భారత దేశం అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఇప్పుడు మనం వేగాన్ని మెరుగుపరచుకుని టాప్‌ గేర్లో ముందుకు పోవాలని అన్నారు. పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ అనేది,ఎంతో కీలకమైనది అని అంటూ ప్రధానమంత్రి, సమీకృత ఆర్ధిక,మౌలికక సదుపాయాల ప్రణాళికకు ఇది ముఖ్యమైనదని అన్నారు. గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, మల్టీ మోడల్‌ లాజిస్టి క్‌ ల ముఖచిత్రాన్ని మార్చివేయనున్నదని చెప్పారు. పి.ఎం.గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.లాజిస్టక్‌ ల సమర్ధతపై ప్రభావం చూపుతున్న అంశాలను ,లోపాలను గమనించడం జరిగిందని ప్రధాన మం త్రి తెలిపారు.అందువల్ల ఈఏడాది బడ్జెట్‌లో 100 కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి నట్టు తెలిపారు. ఇందుకు 75,000 కోట్ల రూపా యలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన,మల్టీ మోడల్‌ మౌలిక సదు పాయాలతో,మన లాజిస్టిక్‌ ఖర్చులు రాగల రోజు లలో మరింత తగ్గనున్నాయి. ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అనిఆయన అన్నారు.లాజిస్టిక్‌ రంగం తోపాటు సులభతర జీవనం,సులభతర వ్యాపారం విషయలోనూ పరిస్థితి మరింత మెరుగుపడనున్న దని చెప్పారు.మౌలికసదుపాయాల రంగంలో పెట్టు బడులు పెట్టాల్సిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు.రాష్ట్రాల పాత్ర గురించి వివరిస్తూ ప్రధానమంత్రి,50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌ వ్యయం 30శాతానికి పెంచినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి వివిధ మెటీరియల్స్‌ అవసరం ఉన్నం దున,ఆయా రంగాల అవసరాలకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలని ప్రధాన మంత్రి సూచించారు.భవిష్యత్‌ సుస్పష్టంగా ఉన్నందున మనం సమీకృత విధానాన్ని అనుసరిం చాలని ప్రధానమంత్రి సూచించారు. ఇందులో పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కీలక పాత్ర పోషి స్తుందని ఆయన అన్నారు.ఈరంగంతో సర్కులర్‌ ఎకానమీని సమీకృతం చేయాల్సిన అవసరం ఉం దని ఆయన అన్నారు.కచ్‌ ప్రాంతంలో భూకం పం వచ్చినప్పడు తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.సహాయ కార్యక్రమాల అనం తరం కచ్‌ ప్రాంతంలో పూర్తిగా నూతన అభివృద్ధి విధానాన్ని అనుసరించినట్టు ఆయన తెలిపారు. మౌలక సదుపాయాల అభివృద్ధి తో కూడిన అభివృ ద్ధిని ఈ ప్రాంతంలో చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రాజకీయంగా అవసరార్థం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కచ్‌ ప్రాంతాన్ని ఒక గొప్ప ఆర్ధిక కార్యకలాపాలక్షేత్రంగా మార్చినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.దేశ సామాజిక మౌలిక సదుపా యాలను బలోపేతం చేయాలంటే,భారతదేశపు భౌతిక మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు.బలమైన సామా జిక మౌలిక సదుపాయాలు,మరింత ప్రతిభ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయ డానికి ముందుకు రావడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు యాజమా న్యం,ఆర్ధిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యుయర్‌ షిప్‌, ఈ లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపకరిస్తుందని చెప్పారు.నైపుణ్యాల కు సంబంధించిన సమాచారం అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని సూచించారు.ఇది వివిధ రంగాలలోని చిన్న,పెద్ద సంస్థలకు ఉపయోగపడుతుందని చెప్పా రు.ఇది దేశమానవ వనరుల శక్తి సద్విని యోగానికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈదిశగా ప్రభు త్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు సత్వరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.ఈ వెబి నార్‌ లోని ప్రతి స్టేక్‌ హోల్డర్‌ ఇచ్చే సూచనలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అంటూ ప్రధాన మంత్రి,వీరు దేశ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, భారత దేశ ప్రగతి వేగం పరుగులు పెట్టడానికి దోహదపడుతున్నారని అన్నారు.మౌలిక సదుపా యాల అభివృద్ధి రైలు, రోడ్డు, పోర్టులు, విమానాశ్ర యాలకు మాత్రమే పరిమితం కాదని,ఈ ఏడాది బడ్జెట్‌ లో భాగంగా భారీ ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.గ్రామాలలో రైతుల పంట ను నిల్వచేసే సదుపాయాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. నగరాలు, గ్రామాలలో వెల్‌ నెస్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.ఈ వెబినార్లో వివిధ స్టేక్‌ హోల్డర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు.వారి అనుభవాలు అన్నీ ఈ ఏడాది బడ్జెట్‌ వేగంగా,చురుకుగా అమలు చేయడానికి పనికి వస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక పదాన్ని మీరు గనక తొలగించినట్లయితే అది అర్థ రహితం అవుతుంది.ఆ పదమే ‘డిజిటల్‌’బీ న్యూ ఇండియా ఆవిష్కారంలో దానికి ప్రతీకగా మారిన పదం ఇదే.ఈడిజిటల్‌ ఇండియా ఉద్యమం ఫలితం గా టెలికాం డేటా అన్నది భారతదేశం లోని మారు మూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటు లోకి వచ్చింది. గత నాలుగున్నర సంవత్సరాల లో టెలికమ్‌ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో మునుపటి తో పోల్చితే మా ప్రభుత్వం ఆరు రెట్లు అధికం గా పెట్టుబడులను ప్రవహింపజేసి, దానిని మరింత బలోపేతం చేసింది.-జి.ఎన్‌.వి.సతీష్‌