గిరిజన సంస్కృతి వాచకం…
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజనులు సంస్కృతి పగ్రతికి సవాళు ’’ అనే పుస్తకంపై సమీక్ష –డా. అమ్మిన శ్రీనివాసరాజు
మన దేశ సంస్కృతి సారథి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వెలువరించబడ్డ ‘‘ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్లు….’’ అనే పుస్తకాన్ని ప్రముఖ గిరిజన పరిశోధకు రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ రాశారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు విలువడ్డాయి కానీ వాటి అన్నిటికన్నా భిన్నమైనది సంక్షిప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించింది ఈ పుస్తకం,70 పేజీలుగల ఈ రచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గిరిజన ప్రాంతాలను స్పృశిస్తూ చారిత్రక, భౌగోళిక, సంస్కృతి, సాంప్రదాయాలను కూలంకషంగా అందిం చింది.
రచయిత శివరామకృష్ణ తెలుగు ప్రాంతా లలోని గిరిజన ఆవాసాలు విస్తృతంగా పర్యటించి ప్రత్యక్షంగా అక్కడి వారి స్థితిగతులు అర్థం చేసుకున్న అనుభవంతోనే ఈ పరిశోధనాత్మక రచన చేశారు, ప్రసిద్ధ ఒరియా రచయిత ‘‘గోపీనాథ మహంతి’’ వ్రాసిన అమృత సంతానం నవల చదివి గిరిజనులకు వారిదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుందని దానిని తెలుసుకోకుండా మనం వారిని అర్థం చేసుకోలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్వానుభవంకూడా రచయిత ఈ రచనకు తోడు తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి, హైమన్ డార్ప్లతో పాటు యానాదుల పరిశోధకుడు వెన్నెల కంటి రాఘవయ్య, వంటి వారు సైతం ఆయా గిరిజనుల గురించిన పరిశోధన కృషి చేసేటప్పుడు వారి సమాచారాన్ని సేకరించటం కన్నా వారి ప్రపంచంలో సంచరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే అంశం ఈ రచయిత స్పష్టం చేశారు, ఇది భావి పరిశోధకులు అందరికీ శిరోధార్యం అయిన విషయం.
‘‘గణరాజ్యాలు’’ మొదలు ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కులు అభివృద్ధిలో వాటాలను కోల్పోతున్నారా?’’ అనే శీర్షిక వరకు ముచ్చటగా మూడు ప్రధాన శీర్షికలు గల ఈ పుస్తకంలో గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక, వర్తమాన, సాంఘిక, సమాచారం గణాంకాలతో సైతం సమగ్రంగా అందించబడిరది. గణరాజ్యాల యందు నాటి చక్రవర్తులకు గిరిజనుల కు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, నల్లమల అడవుల్లో గిరిదుర్గాలు చెంచుల నాయకత్వంలో ఉన్న విషయం, కొండ రెడ్ల జాతి ఆవిర్భావం,గోండు జాతి గిరిజనులలోగల ఉపతెగల వివరాలు, మన్యం కొట్టాలు,బోయకొట్టాలు,పితూరీలు, ఏర్పాటుతో పాటు అవి చేసిన కృషి ఫలితాల గురించిన విశ్లేషణ ఇందులో చదవవచ్చు. అలాగే మార్గ, దేశి, గిరిజన సంప్రదాయాలు, సంచార గిరిజన తెగల గురించి చెబుతూ భారతదేశంలో ప్రధాన భాషలు పదుల సంఖ్యలో ఉంటే గిరిజనుల భాషలు వందల సంఖ్యలో ఉన్నాయన్న ఆసక్తికర విషయం రచయిత ఇందులో లేవనెత్తారు. మనకు సాధారణంగా తెలిసిన గిరిజనుల పండు గలతో పాటు, వివిధ ప్రాంతాల్లో స్థానికంగా చేసుకునే విలక్షణ పండుగల సమాచారం కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అరకులోయలోని ఆదివాసులు పాటించే కాలచక్రం చాలా విలువైన భౌగోళిక సమాచారం అందిస్తుంది, ఆ విషయాల గురించి రచయిత ఇందులో కూలం కషంగా వివరించారు. గిరిజనులు చేసుకునే ‘‘నంది పండుగ’’ మొదలు తెలుగు నెలల వారీగా చేసుకునే గిరిజనుల పండుగలు విశేషాలు తెలిస్తే అడవి బిడ్డలకు తెలుగు భాష పట్ల గల అభిమానం అర్థం అవుతుంది. కళింగ రాజ్యంలోని శ్రీముఖలింగం క్షేత్రంలో గల మధుకేశ్వర స్వామి అవతరణలో ఆరాజ్య సవర గిరిజన రాజు కుమార్తె, సవరరాజుల ప్రస్థావనతో ఆ ప్రాంతంలో గిరిజన రాజులస్థానం. అలాగే పూరీ జగన్నాథుడు సవర గిరిజనుల దేవుడుగా ఉన్న విషయం, కాకతీయుల సేనా ధిపతుల్లో 12 వేల విలుకాండ్ల దళానికి నాయకుడైన కోయరాజు ‘‘సీతాపతి రాజు’’ విషయంతో పాటు అతడు ‘‘శితాబ్ ఖాన్’’ గా మార్చబడ్డ వైనం ఇందులో చర్చించబడిరది.
ఇలా ఎన్నో ఆసక్తికర గిరిజన చారిత్రక సంఘటనలు ఈ పుస్తకంలో మనం చదవవచ్చు.
రెండవ విభాగం నిండా నిజాం, బ్రిటిష్ ,పాలకులతో గిరిజనులు చేసిన ప్రత్యక్ష పోరాటాలు వివరాలు వ్రాయబడ్డాయి.
నైజాంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్ గురించి ఇందులో ప్రధానంగా చెప్పబడిరది, ఏడు నెలల పాటు జోడెడ్ ఘాట్ ప్రాంతంలో జరిగిన అభీకర పోరాటం వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక తూర్పు కనుమల్లో గిరిజనులు చేసిన స్థానిక తిరుగుబాట్లు, పితురీలతో పాటు 1920- 24 సంవత్సరాల మధ్య అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు తిరుగుబాటుల గురించి కూలంకషంగా వివరించ బడ్డాయి.ఈ పోరా టాల సమగ్ర అధ్య యనం ద్వారా తెలిసే విషయాలు, వివిధ ప్రాంతాలలోని గిరిజనులు అంతా సమీప రాజులు, జమీందారులతో సత్సం బంధాలతో స్నేహం చేస్తూ… వారి పాలనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సైనికుల వలే ముందుండి నడిచే వారిని. కొన్ని రాజ్యాలకు సామంత రాజులుగా కూడా వ్యవహరించే వారనే విషయాలు ఈ సందర్భంగా తేటతెలమవుతాయి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా తెలుగు ప్రాంతాలలోని గిరిజనుల పాత్ర అజ్ఞాతంగా ఉండేదనే విషయం అర్థమవుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా గిరిజన సమాజంలో అలజడులు పోరాటాలు కొనసాగడానికి కారణాలను కూడా సామాజికవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయం రచయిత సూచించారు. స్వతంత్ర భారతదేశంలో పాలనాపరమైన రాజ్యాంగం అమలై… గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, నిధులు, కేటాయించిన, వాటి అమలులో చూపిస్తున్న అశ్రద్ధ కారణంగా కొన్ని గిరిజన తెగలు నేటికీ వెనుకబడి అన్ని విధాలా నష్టపో తున్నారు అసంతృప్తితో రగిలి పోతున్నారు అనే విషయం కూడా రచయిత రేఖామాత్రంగా పేర్కొన్నారు.మూడవ విభాగంలో ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కు లను అభివృద్ధిలో వాటాలను కోల్పో తున్నారా?’’ అంటూ తెలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన షెడ్యూలు ప్రాంతాల వివరాలు, ప్రాంతాల వారీగా జనాభా గణన,జిల్లాల వారీగా గిరిజన తెగల వ్యాప్తి, వారిలో గల విభిన్న సంస్కృ తులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేసిన పంచశీల విధానాలతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ప్రకారం గిరిజన అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు, అటవీ హక్కుల చట్టం 2006, పిసా చట్టం, వంటి ప్రధాన చట్టాల గురించిన సమాచారంతోపాటు గిరిజనులు హిందూజాతి వారే అనడానికి సహేతుక కారణాలు వివరిస్తూ గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ ఆశ్రమం కృషి తదితర విలువైన సమాచారం ఇందులో అందించారు. గిరిజనుల సమగ్ర సమాచారం ‘‘కొండ అద్దమందు’’ అన్న చందంగా ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం సమస్త పరిశోధకులకు గిరిజన ఆధ్యయనకర్తలకు చక్కని దారి దీపంలా పనిచేస్తుంది, అనడంలో నిండైన నిజం ఉంది.
పుస్తకం పేరు:- ‘‘ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల సంస్కృతి ప్రగతికి సవాళ్లు..’’
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ,. పేజీలు: 72, వెల: 20/- రూపాయలు.
ప్రతులకు: సాహిత్య నికేతన్, బర్కత్ పురం, హైదరాబాద్ – 27, ఫోన్: 040- 27563236.
సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్: 7729883223.