గిరిజన ముంగిట విద్యావనం

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు.దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది.సాలూరులో మెం టాడ,దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో,561.88ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌, సీఎం జగన్‌ ఆగష్టు 25వ తేదీన శంకు స్థాపన చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ ట్క్రెబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంజగన్‌ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయిం చడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూము లిచ్చిన రైతులకు రూ.25. 90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.28.49 కోట్లు చెల్లించి నట్లు తెలిపారు. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో,భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి,విజయ నగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందు బాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసి నట్లు వివరించారు.ఉత్తరాంధ్రకు కిరీటంగా సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ ఉత్తరాంధ్రకు కిరీటంగా నిలుస్తుం దని,మన ప్రాంతం ఉన్నత చదువు లకు నెలవుగా మారుతోందని సీఎం జగన్‌ పేర్కోన్నారు.గత టీడీపీ ప్రభుత్వం విభజన హామీలో భాగమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటును గాలికొదిలేస్తే, మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత అనుకూల పరిస్థితులు ఉండేలా విశాఖ పట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందు బాటులోఉండేలా, భోగాపురం అంతర్జాతీయఎయిర్‌ పోర్టుకు సమీప ప్రాంతలో యూనివర్సిటీకి భూకేటా యింపులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే వర్సిటీకి అవసరమైన భూమి,విద్యుత్‌,నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చినట్లు వివరించారు. దీంతో పాటు వర్సిటీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోను న్నట్లు తెలిపారు.సెంట్రల్‌ ట్రైబల్‌ యూని వర్సిటీలో ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లీష్‌, సోషియాలజీ,ట్రైబల్‌ స్టడీస్‌, బయో టెక్నా లజీ, కెమెస్ట్రీ,జర్నలిజం,ఎంబీఏ,ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌,బోటనీ కెమిస్ట్రీ, జియాలజీ,టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌ మెంట్‌,బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14అకాడ మిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌,ఒకేషనల్‌,జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోందన్నారు. 2019 నుంచి విజయనగరం జిల్లా కొండ కారకం లోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ పాత క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీలో 385 మంది విద్యార్థులు ఉన్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో విద్యా కాంతులు
మన గిరిపుత్రులు రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ ప్రాం తాంలో ఎటు చూసిన కొత్త కాలేజీలు, యూనివ ర్సీటీలు కనిపిస్తున్నాయని గిరిపుత్రుల జీవీతాల్లో విద్యా కాంతులు వెలుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల మన పాలనలో వైద్యా, విద్యకి ప్రాధాన్యత ఇచ్చామని వాటికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు చేపట్టా మని సీఎం జగన్‌ వివరించారు.
1.54లక్షల మంది గిరిజనులకు3.23లక్షల ఎకరాల భూములు
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం సమున్నత చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమం కోసం మన ప్రభుత్వం రూ. 16,805.77కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి పోర్టల్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేసి1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాలను అన్ని హక్కులతో కూడిన RశీఖీRపత్రాలు పంపిణీ చేసినట్లు వివరించారు. 4.58లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019నుంచి రూ.410.11 కోట్ల ఖర్చుతో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు వివరించారు.పార్వతీపురం,పాడేరులో రూ.1000 కోట్లతో మెడికల్‌ కాలేజీలు, 300 మెడికల్‌ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్ద పీట వస్తున్నట్లు సీఎంజగన్‌ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్ల నిర్మా ణం చేపట్టినట్లు వివరించారు.105.32 ఎకరాల్లో రూ.153.85కోట్లతో కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల, 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాల యాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.రాజన్న,తదితరలు పాల్గొన్నారు.
ఆహ్లాదకరం..ఏపీ కేంద్రియ గిరిజన విద్యాలయం
ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువి శాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యా లయం సాకారం కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీ యూఏపీ)ను కేటాయించింది.2019 వరకూ అధికా రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం..దీనిని పట్టించు కోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి.
పూర్తిగా కొండప్రాంతం.
పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు.తమ పదవీకాలం ముగిసే వరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగ­రం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్‌ పాత భవనంలోనే 2019ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి.
గిరిజనులకు చేరువగా..
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక ల్పించింది. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహ దారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల కు అందుబాటులో ఉండేలా భూమి కేటాయిం చింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీ­పంలోనే ఉంటుంది. మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01ఎకరాలు,దత్తిరాజేరు మండలం మర్రి వలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87ఎక రాలు..మొత్తం561.88ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తిం చారు. ఇప్పటికే దాదాపు రూ.30.58కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60కోట్లను గతే­డాది విడు దల చేసింది. విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహ దారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగు­ల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్నాయి.తాగునీటి వసతి కల్పనకు రూ.7కోట్లు, విద్యుత్‌ సౌకర్యా­నికి దాదాపు రూ.60లక్షలను ప్రభుత్వం కేటాయించింది.కాగా,విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్‌(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెటింగ్‌ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నారు.ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమా లనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచర ణ సిద్ధం చేసింది.ఏటా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు.- జిఎన్‌వి సతీష్‌