కోయ భాష అస్తిత్వాన్ని బతికిద్దాం

పిల్లలే కవులుగానూ,కథకులు గానూ రచయితలుగామారి తమకోసం తాము కవి తలు,కథలు,పాటలు రాసుకునే అరుదైన సంఘటనతో మొదటి రోజు బాల సాహిత్య కార్యక్రమం అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం రామన్నపాలెంలో అక్టోబర్‌ 5న కార్యశాల ప్రారంభమైంది. కోయత్తోర్‌ బాట మరియు సమత సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదురోజుల కోయబాష బాల సాహిత్య కార్యశాలఅక్టోబర్‌ 5నుంచి 9వ తేదీవరకు కొనసాగింది.6 నుండి 14 సంవ త్సరాల వయస్సు గల చిన్న పిల్లలు తాము రాసిన కవితలు, పాటలు, కథలు రాసి వినిపించిన తీరు అందరిని ఆకట్టు కుంది.’’ పిల్లల కు సరిjైున అవకాశం, ప్రోత్సాహం ఇస్తే పెద్దల తో సమానం గల కవితలు, కథలు ఎన్నెన్నో రాస్తారని‘‘కార్యశాల సమన్వయకర్తలు జీ.యాదయ్య,కె.పాండు, డి.భీమమ్మ,జె.మల్లయ్య అన్నారు.పిల్లలను ఐదుగురు గ్రూప్‌లుగా విభజించి వాటికి బంతి, మల్‌ పిట్ట,ఎడజు డువ్వు,గులాబీ అని పేర్లు పెట్టి,అందరికీ చిన్న చిన్న కథల,పాటల పుస్తకాలు ఇచ్చి,వీటి మాదిరి మీరు కూడా కవితలు,కథలురాసి,చదివి వినిపించాలని చెప్పి రాయించి‘‘కార్యశాల నిర్వహించిన తీరు వివరించారు.ఇందులో తొలి కోయ బాల సాహిత్య రచయిత్రి భీమమ్మ తాను రాసిన కొన్ని పిల్లల పాటలు చదివి వినిపించి,పిల్లల లను ప్రోత్సాహం నింపింది.కోయ బాష కార్య కార్యకర్తలు తెల్లంకృష్ణ,మోసం సత్యనారా యణలు తమ నాట్య గీతాలలో పిల్లలను పాల్గొనేలా చేసిన తీరు పిల్లలలో కొత్త ఉత్సా హం నింపింది.ఎంతో దూరం నుండి కొయ తురు బాట పూర్వ విద్యార్థులు విచ్చేసి ఈ కార్యశాలలో పాల్గొనడం ప్రశంస నీయమని కార్యశాల నిర్వాహాకులు తెలియ జేశారు.ఈ కార్యశాలలో రామన్నపాలెం పిల్లలూ,కుంజ వారి గూడెం పిల్లలూ ఉత్సాహంగా పాల్గొ న్నారు.కోయత్తోర్‌ బాట పూర్వ ఉపాధ్యా యులూ,బాల సాహిత్య అభిమానులూ, మొదటితరం రచయిత శ్రీపూనెం బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు కనుమరుగవుతూ వస్తున్నాయన్నారు.ఆదివాసీ భాషలు అంతరించే దశకు చేసుకుంటున్నాయి. గత ఇరవైఏళ్లుగా కోయ భాషలో బాల సాహిత్యం అభివృద్ధికి కోయత్తర్‌ బాట విశేష కృషి చేస్తుందన్నారు.ఇందులో భాగంగానే పూర్వ ప్రాధమిక సాహిత్య సృజనపై ఐదురోజుల కార్యక్రమం గిరిజనబిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు.భాష మనుగడను పరిరక్షించడానికి స్వచ్ఛంధ సంస్ధలు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. – (జీ.యాదయ్య)