కూటమి వంద రోజుల పాలన
ఏపీకి భరోసా లేకుండా లేని నాడు,ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్న నేపథ్యంలో అసలు ఆశలు అన్నవి ఆవిరి అయిన వేళ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది.మూడు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో ఇదే తొలిసారి.ఎంతో అనుభవం కలిగిన చంద్ర బాబు అలాగే ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్,కేంద్రంలో రెండు టెర్ములు సక్సెస్ ఫుల్ గా అధికారాన్ని అందుకుని ప్రజలకు మేలైన పాలన సాగించిన బీజేపీ కలసి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాయి.జూన్ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు.అలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సరిగ్గా సెప్టెంబర్ 20తో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులలో ప్రభుత్వం ఏమిచేసింది అన్నది అంతటా చర్చించాల్సిన విషయమే. నిజానికి ఒకప్రభుత్వానికి వంద రోజులు అన్నది చాలా చిన్నది.అయినా సరే ఈ వంద రోజులలో చంద్ర బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజ లలో కొత్త భరోసా కల్పించింది.ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ఏపీకి రాజధాని ఆవశ్యకతను గుర్తించి అమరావతిని మళ్లీ పూర్వపు దారిలో నడి చేలా చర్యలకు ఉపక్రమించింది. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు మొదలెట్టిన గత ప్రభుత్వం దిగి పోగానే వైసీపీ వచ్చి వాటిని అలా వదిలేసింది. అయితే తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే పాత నిర్మాణాలను పరిశీలించి వాటిని ఎక్కడ నుంచి నిర్మాణం పనులు ప్రారంభించవచ్చు అన్నది నిపుణులతో చర్చించి ఒక గాడిన పెట్టే కార్యక్రమం ఆరంభించింది. అంతే కాదు అమరావతి రాజధాని అంటే దాని చుట్టూ తుప్పలతో అడవిని తలపించే లా ఉన్న వాటిని అన్నీ తొలగించేలా పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. దాని కోసం 37 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంద్వారా అమరావతికి కొత్త రూపు ఇవ్వ డానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంవద్ద ఉన్న పలుకుబడితో అమ రావతి రాజధానినిర్మాణానికి అవసరం అయిన నిధులను పోగుచేసే పనిలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది. కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంక్ ఏకంగా పది హేను వేలకోట్ల రూపాయలు తీసుకుని రావడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి. దాంతో పాటు అమరావతిలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగిస్తు న్నారు. గతంలో అమరావతిలో భూములు కేటా యించిన వారిని పిలిచి వారితో సంప్రదింపులు చేయడం ద్వారా వారి పనులు ప్రారంభించ డానికి కూడా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నారు.అలాగేఎన్నారైలను కూడా పిలిచి మరీ వారిద్వారా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలని మాస్టర్ ప్లాన్ వేస్తు న్నారు. అమరావతిలో విద్యా సంస్థలు ఇతర కార్య కలాపాలు మొదలైతే కచ్చితంగా అక్కడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని దాని ఫలితంగా అమరావతి రూపూ షేపూ మారిపోతాయని బాబు భావిస్తు న్నారు. మరో వైపు అమరావతి రాజధాని విషయం లో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు కూడా చేస్తోం ది.గతంలోలా కాకుండా గుంటూరు, విజయ వాడలను కలుపుకుని జంట నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇక అమరావతి నుంచి భారీ రైల్వే లైన్లు వేసేలా కేంద్రం నుంచి సహకరం కూడా అందు కుంది.అదే విధంగా ఆరులైన్ల రోడ్లను కూడా నిర్మించడం ద్వారా అమరావతిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు దగ్గరచేసేలా కనెక్టివిటీ ఉండేలా కూడా ప్రయత్నం చేస్తోంది.దీంతో గతపదేళ్ళుగా రాజధాని లేదు అని మానసికంగా ఎంతో అవేదన చెందుతూ ఇతర రాష్ట్రాల వారితో ర్యాగింగ్కి గురి అయిన ఏపీ ప్రజానీకానికి కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాజధాని పేరిట ఒక రాజసం కల్పించింది అని చెప్పాలి. అలాగే పోలవరం ప్రాజెక్ట్. ఇది ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్. దీని విషయంలో 2014 నుంచి 2019దాకా టీడీపీ ప్రభుత్వం చాలానే వర్క్ చేసి పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా స్లో డౌన్ అయింది. దాంతో ఎపుడో పూర్తికావాల్సిన పోలవరం కూడా పడకే సింది.టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్య తలుగా పోలవరంని కూడా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్ళి పెండిరగులో ఉన్న 12 వేల కోట్ల రూపాయ లను విడుదల చేయించుకుంది.దాంతో పోలవరం పనులకు ఇపుడు ఆటంకాలు లేకుండా పోయాయి. నవంబర్ నుంచి పోలవరం పనులు శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాలైన ప్రయత్నాలను కేవలం వందరోజుల వ్యవధిలోనే కూటమి ప్రభు త్వం చేయడం మరో ప్లస్పాయింట్. ఇక నిరు ద్యోగా యువత కోసం మెగా డీఎస్సీని 16 వేలకు పైగా టీచర్ పోస్టులతో భర్తీ చేయడానికి చంద్ర బాబు సీఎంగా చేసిన మొదటి అయిదు సంతకా లలో ఒకటిగా పెట్టడం నిజంగా మరో విజయం గా చూస్తున్నారు.అంతేకాదు చంద్రబాబు సామా జిక పెన్షన్లు కూడా భారీగా పెంచారు. మూడు వేల రూపాయలను ఒక్క సారిగా నాలుగు వేలకు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల పెన్షన్ కూడా రెట్టింపుచేసారు. ఈ విధంగా అరవై ఆరు లక్షలకుపైగా పెన్షన్ లబ్దిదారుల కళ్ళలో వెలుగు నింపారు.మరోవైపు చూస్తే ల్యాండ్ టైటిలిం గ్ యాక్ట్ ద్వారా రైతులు తమ భూములు ఎక్కడ పోతాయో అని నానా బాధలు పడుతూ అవేదన చెందారు.కూటమి ప్రభుత్వం అధికారంలోని వస్తూనే ఆయాక్ట్ని తొలగించింది. దాంతో రైతులు అంతా పూర్తి భరోసాను పొందారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను టీడీపీకూటమి ప్రారంభిం చడం మరో శుభ పరిణామం.దీనివల్ల పేదల ఆకలి పూర్తిగా తీరుతోంది.ఇది దేశంలోనే అద్భుత పథకంగా మారింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ ఏపీకి తేవాల్సిన నిధులను తెచ్చుకుంటూ మరో వైపు ఏపీని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ తొలి అడుగులే బలంగావేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ముఖ్యంగా గతంలో ప్రజలలో ఉన్న అభద్రతా భావం ఇపుడు లేదు.అంతే కాదు భవిష్యత్తు మీద ఒకగట్టి నమ్మకం ఏర్పడిరది. ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని ప్రతీ ఒక్కరూ భావిస్తు న్నారు. ఏపీ సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుని అభివృద్ధిలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు ఇవ్వగలి గారు. మొత్తానికి వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా చంద్రబాబు ఆత్మ విశ్వా సంతో ముందుకు సాగారు.దానికితాజా ఉదా హరణ బెజవాడను ముంచెత్తిన భారీ వరదలు. అటువంటి సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి పదిరోజుల పాటు శ్రమించి ప్రజలకు తగిన సహాయం అందించగలిగారు. దాంతో వందరోజుల పాలన ఏపీకి మేలు మలు పుగా ఉందని అంతా భావిస్తుననారు.
వంద రోజుల అసహనం, అపనమ్మకం
నరేంద్ర మోడీ సర్కారు మూడో దఫా పాలనకు వంద రోజులు నిండిన పేరుతో హడా వుడి చేయా లని బిజెపి, సంఘపరివార్లు ఎంత హంగామా చేసినా వాస్తవాలు మాత్రం వెక్కిరిం చేలా గోచరిస్తున్నాయి.నిజానికి మూడోసారి వచ్చిన ప్రభుత్వానికి ఇవేవీ పెద్ద సందర్భాలు అవసరం లేదు. అయితే ఈసారి కేంద్రంలో ఎన్డిఎ సర్కారు ఏర్పడిన తీరులోనే ఆబండారం దాగుంది. నాలుగు వందల జపంతో మొదలై చివరకు అందులో సగం దగ్గర ఆగి అన్య పక్షాల మద్దతుపై ఆధారపడి రాజ్యం చేయవలసిన రాజకీయ దురవస్థ అడుగ డుగునా అడ్డుచక్రం వేస్తున్నది.లాంఛనంగా జర పాల్సిన ఈవంద రోజుల వేడుకను పెద్దఉత్స వంలా ప్రచారం చేసుకోవడంలోనే బలహీనత స్పష్టమవుతుంది.ఒకసారి నెట్ పరికిస్తే అన్ని ఇంగ్లీ షు పత్రికలలోనూ చాలా జరిగిపోయిందని రైట ప్పులు రాయించుకోవడం, అందరూ అచ్చు గుద్ది నట్టు ఒకే జాబితా రాయడం బట్టి వాటికి ఎలాంటి ఆదేశాలు వచ్చిందీ తెలిసిపోతుంది. మంగళవారం నాడు మోడీ ‘సుభద్ర’పేరుతో ఒకపథకం ప్రారం భిస్తూ తాము ఎన్ని చేశామో ఏకరువు పెట్టారు. నిజానికి ఈఅపనమ్మకం ఎన్నికల ఫలితాలు రాక ముందే మొదలైంది.రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గతప్రభుత్వమే చర్చకు పెట్టడం వంటి ప్రహసనం గతంలో ఎన్నడూ జరిగి వుండదేమో!కానీ మోడీమోతకు అవన్నీ అవసరమై నాయి.ముందే నిర్ణయించాము గనక ఆవంద రోజుల పనులు చేశామని ఆయన ఇప్పుడు చెప్పు కుంటున్నారు.మరోవైపున హోంమంత్రి అమిత్షా కూడా అదే పనిలో వున్నారు. మూడుకోట్ల కొత్త ఇళ్లనిర్మాణం,యువతకు సహాయ పడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి,కొత్త పెన్షన్ పథకం,11లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయంఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ,ఇప్పుడు కూడా స్పష్టత లేనివే. వచ్చిన మేరకు కూడా ఉద్యమాల ఒత్తిడికి జంకి మొక్కు బడిగా ప్రకటించినవి వున్నాయి. పదేళ్ల తర్వాత కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేక పోయామని ప్రధాని పరోక్షంగా ఒప్పుకుంటు న్నారన్నమాట.ఇక నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డుస్థాయిలో వుంటే వారి పేరి ట కార్పొరేట్లకు నెలజీతం జమ చేయడం ఓ విపరీ త విధానం. వీటినే మహత్తర విజయాలుగా మోడీ సర్కారు గానీ ఆయన పార్టీగానీ ప్రచారం చేసుకో వడం,ఎన్డిఎ భాగస్వాములుగా వున్న పార్టీలు వంత పాడటం హాస్యాస్పదం. ఇదేగాక విదేశాంగ విధానంలోనూ గొప్పఫలితాలు సాధించినట్టు మరో ప్రచారం. – జి.ఎన్.వి.సతీష్