కాఫ్‌28 సదస్సులో నిర్ధిశిష్టమైన నిర్ణయాలు అవశ్యం!

వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్‌ సమావేశాలు నవంబర్‌ 30న జరుగుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు చర్చించుకోవాల్సి ఉంది.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో ఐక్యరాజ్య సమితి వాతావరణమార్పుల 28వసదస్సు మానవాళి భవిష్యత్తును నిర్ధేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది.అతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాఫ్‌28సమావేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.దీనికి కేంద్రబిందువుగా భారత్‌ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌(లైఫ్‌)కార్యక్రమం ఉండాలి.సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్‌ దోహదపడుతుంది.
వాతావరణంలో సంభవించిన మార్పుల్లో ప్రధానమైనవి ఓజోన్‌ పొరు క్షీణత,పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు,మంచుకొండలు కరిగిపోవడం వంటి కారణాలున్నాయి.దీనికి మానవ జీవనశైలిలో సంభవిస్తున్న పెనుమార్పులు ఒకకారణంగా నిపుణులు భావిస్తున్నారు.ఇవన్నీ కూడా అభివృద్ధిపేరుతో వస్తున్న పారిశ్రామిక విప్లవమే మానవాళి వినాసానికి నాంది పలుకుతోంది.దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడాబహుళజాతి కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతున్నాయి.పారిస్‌ ఒప్పందం ప్రాథమికంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వంఉన్న ఉష్ణోగ్రతలు1.5 సెంటిగ్రేడ్‌ పెరుగుతున్నాయి.ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌ సదస్సుల ఉద్దేశం కూడాఅదే.కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించుకోవడానికే ఈసదస్సులు ఏర్పాటు చేస్తారు.భూతాపాన్ని తగ్గించడానికి ఏమాత్రం గడువు లేదు. సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ప్రధానంగా ఇంధన,భూవినియోగం, నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగల మని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం.ఇందుకుగాను వ్యక్తిగతంగా తీసుకురావాల్సిన మార్పు లనూ నివేదికలు సూచిస్తున్నాయి.
పదిహేను రోజులపాటు కొనసాగే కాన్పరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)28సమావేశానికి,వాతావరణ మార్పులపై జరిగే ఇతరసమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది. ధనిక దేశాలు అనేకం కాప్‌ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడుతాయి.అలివికాని హామీలా గుప్పిస్తాయి. సమావేశాల తర్వాత అన్నింటినీ మరిచిపోతుంటాయి. ఇప్పుడు ఆదేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నాయి.అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు.
సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అలవర్చుకునేందుకు లైఫ్‌ కార్యక్రమం దోహదపడుతుంది.దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది.అప్పుడే ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి.ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి,వృధా వ్యవహారాలకు చెక్‌ పడుతుంది. యుఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చిమమాజియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదేకావడం గమనార్హం.పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్దిక వనరులు యూఏఈవద్ద పుష్కలం.ఈనేపథ్యంలో 2015ప్యారిస్‌ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్‌ సమావేశాలు మరింత ఫలప్రదమవుతాయని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,