కనుమరుగువుతున్న సోషలిజం..!

ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నరమేథాన్ని తలపిస్తున్నాయి.విశాలమైన ప్రజాస్వామ్యదేశంలో సామాన్యల బ్రతులకు స్వేచ్ఛ కరువైంది.75 ఏళ్ల స్వాతంత్య్ర భారతవనిలో రాజులు,జమిందారులు పాలనపోయి..బహుళజాతి బడా కంపెనీలు రాజ్యమేలుతున్నాయి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషలిజం కన్పించడం లేదు.సమాజంలోని భూమి,కర్మాగారాలు ,వ్యాపారాలు వంటి వనరులు సమాజానికి చెందినవి, ప్రైవేట్‌ వ్యక్తులకు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం అదానీ,అంబానీ,టాటా,బిర్లా..ఇలా దేశంలో ఒక రెండు,మూడు శాతం మంది వ్యక్తుల వద్దే దేశ సంపదలో సింహభాగం పోగుబడిరది.వీళ్లే నూతన భారతావనికి మహారాజులు.
మనప్రధానమంత్రి మోదీ రామరాజ్యం జపంలో దేశఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా మారింది.పెద్దనోట్లు రద్దుచేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. అగ్నివీర్‌ యోజన పేరిట సైన్యంలో శాశ్వత నియామకాలకు చిల్లుచీటి పొడుచారు.దేశంలో 50శాతం జనాభాలో వెనుకబడిన వర్గాలు. 15శాతం దళితులు,8శాతం గిరిజనులు,15శాతం మైనారిటీలు కలిపి దాదాపు 90శాతం ఉన్నారు. వారికి అన్నీ రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోంది.వారెవరికీ వివక్షే తప్పడం లేదు. ఇటీవల జరిగిన రాముని ప్రాణ ప్రతిష్టకార్యక్రమంలో ఎంతమంది దళితులు,గిరిజనులు,వెనుకబడిన వర్గాల వారు వున్నారు? గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు.దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ను లోపలకు అనుమతించలేదు.ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లుతో గెలిచిన ప్రజాప్రతి నిధులు పరిపాలన ఎలా ఉండాలనేది,ప్రజాసంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ద పెట్టాలనే విషయాలపై రాజ్యాంగం చెబుతుంటే..మోదీ రామరాజ్యమే రాజ్యాంగంగా పరితపిస్తున్నారు.
చట్టాలనుపక్కన పెట్టి సనాతన ధర్మం కావాలంటున్నారు.ఇది ఇప్పుడు హిందువుల మతంగా సంస్థాగతీకరించబడిరది.మత ప్రమేయం లేకుండా ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని రాజ్యాంగం చెబుతుంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ జరిగిన అభివృద్ధి,అవినీతి రహిత పాలన,ప్రపంచంలో మన దేశకీర్తి ప్రతిష్టలు పెరిగాయి.అభివృద్ధి చెందిన దేశాలెన్నో భారత దేశం ఇంకా ఐదోస్థానంలోనే ఉండటం గమనార్హం.పూర్వం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలువారు చేసిన అభివృద్ధి, ప్రణాళికలు అసెంబ్లీ, పార్లమెంటు సభలో తీసుకున్న వివిధరకాల సంస్కరణలు,కీలక విధి,విధానాలు ప్రజలకు తెలిపేలా ప్రెస్‌మీట్లుపెట్టి తెలియజేసేవారు.కానీ నేడుఆపరిస్థితులు ఎక్కడా కన్పించలేదు. నాలుగు గోడల మధ్యనే అన్నీ జరిగిపోతున్నాయి.చీకట్లోనే జీవోలు వచ్చేస్తూన్నాయి.వాటిని వ్యతిరేకించే ప్రజలపై నరమేథం సృష్టించి ప్రజా ఉద్యమాలను అణగ దొక్కేస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలోమార్పు వస్తుంది.సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి.సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్ధానపరిచే ప్రజాస్వామ్యం రావాలి.వంచన,మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి,మిగిలినవారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దు.
రాబోతున్న సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ తమ ఎత్తుగడలు వేస్తూ అధికారాన్ని మళ్లీ చేజిక్కుంచుకోవడానికిప్రజల్ని వివిధరకాల ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లుకోసం ప్రజల్ని ఆశావాహులుగా,సోమరులగా మార్చే ఎత్తుగడలు చేస్తున్నారు. ప్రజారాజ్యాన్ని బలహీనపరుస్తున్నారు.ప్రజలకు కావాల్సింది..రామరాజ్యం కాదు. ప్రజాసంక్షేమం కావాలి. సమాజంలో ప్రతిపౌరునికి సమానన్యాయం జరగాలి.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రజాస్వామ్య వాదులను,సామాజిక సమానత్వం,న్యాయంకల్పించే వారికి,ఓటు వేసి నెగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది! -రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్