ఓటరా..మేలుకో..!

‘‘ లోక్‌ సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పజల ఆకాంక్షలకు పాలకులు చరమ గీతం పాడిన రోజున ప్రజల తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించు కుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్ధం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య,వైద్య,సామాజిక న్యాయం ప్రజలం దరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుం దని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొం టారని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ దిశానిర్దేశం చేవారు. రాజ నీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోసించ వలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.’’
‘ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే విద్య ను మాత్రం ఉచితంగా అందివ్వరు’అని చురకలు అంటించారు.డాక్టర్‌బి.ఆర్‌అంబేద్కర్‌.విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందితే ప్రజలు చైతన్యవంతు లై శాసించేస్థాయికి వస్తారనేది ఇందులోని అంరా ర్దం.ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే అత్యంత చురుకైన సాధనం‘విద్య’ అని ప్రపంచవ్యా ప్తంగా ఏకాభిప్రాయం ఉంది. ఇందుకు ఎలాంటి మినహా యింపులు లేవు.కానీ,ఈప్రశ్నించేతత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరుగుతున్న మాట వాస్తవం కాదా?మతం,మూఢ విశ్వాసాలు, అతివినయం,మనకు సంబందం లేదని గిరి తీసుకు నేతత్వం,సామాజిక స్పృహ లేకపోవడం,పరిధి దాటి రాకపోవడం,ప్రబుత్వాల కుట్రవంటి అనేక అంశా లు కూడా ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ఎదగ కుండా చేస్తున్నవని చెప్పుకోవచ్చు. ఇన్ని అవరోధా లను అధిగమించి,అసాంఫీుక శక్తుల కబంధహాస్తాల నుంచి విముక్తి చెంది,సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించడానికి,లక్ష్యాలనుచేరుకోవడానికి,ఆత్మ విశ్వాసం నింపడానికి,సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడే ప్రయాణంలో ‘ప్రశ్నించడం’అనివార్యమైంది.
ఏయే అంశాలలో..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు జన జీవితాలను విచ్ఛన్నం చేస్తున్నప్పడు,అసాంఫీుక శక్తులు ప్రశాంత తను కొల్లగొడుతున్నప్పుడు, అసామానతలు, అంతరాలు,వివక్షత సమాజంలో ఎల్లెడలా వ్యా పించినప్పుడు,జాతిసంపదను సంపన్నులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి సామాన్య జనాలను నిర్లక్ష్యం చేసినప్పడు ప్రశ్నిం చడమే పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా జీవితంలో చొరబడి,స్వేఛ్చా స్వాతం త్య్రాలను హరించివేసి,బానిసలుగా తయారు చేసుకొని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ‘ప్రశ్నించి యజమానులుగా మారుతారా? లేక లొంగిపోయి బానిలుగా జీవిస్తారా? ’తేల్చు కొమ్మన్నారు డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌.ఈ హెచ్చరిక వెనుకఉన్న నేపథ్యం విద్యను ఆయు ధంగా చేసుకుని సమాజాన్ని శాసించాలని ఆశించడమే.అందుకే అంబేద్కర్‌ ‘ప్రభుత్వాలు అంత సులభంగా విద్యను ప్రజలకు ఉచితంగా అందించడానికి సిద్దపడవు’ అని జ్ఞానోదయం కలిగించిన సందర్భాన్ని మనం సమయస్పూర్తి తో సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది.అంబేద్కర్‌ సూచనలు మేరకు ప్రశ్నింప నేర్పే నాన్యమైన విద్యను ఉచితంగా అందుకోవ డానికి మరో పోరాటం చేయక తప్పడం లేదని తేలిపోతున్నది కదా!?.కేరళ,ఢల్లీి, రాష్ట్రప్రభు త్వాలు విద్యారంగంలో నువ్వా?నేనా?అనే స్థాయిలో పోటీపడుతున్నాయి.విద్యకు 24,25 శాతం నిదులను కేటాయించి అంతర్జాతీయస్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్న సందర్భాలను మిగ తా రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలింపు చేసుకుంటే మంచిది.ఢల్లీి ప్రభుత్వం వేలాది తరగతి గదులను సర్వాంగ సుందరంగా,విశాలంగా తీర్చిదిద్ది విద్య ను ఉచితంగా అందిస్తూ,కార్పొరేటు పాఠశా లలను పరోక్షంగా మూసివేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి.ఢల్లీి లాంటి రాష్ట్రాలలో నిబంధనలను తుంగలోతొక్కిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వాలే మూసివేసి జరి మానా విధించిన సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో విద్య అంగడి సరు కుగా మారిందని భావించక తప్పదు.
ఉచితం ఉండాలి..
రాజ్యాంగ రచన సందర్భంలోనూ,స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనూ జరిగిన అనేక సభలు, సమావేశాల సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబే ద్కర్‌ చేసిన అనేక సూచనలు లేదా హెచ్చరికలు నేటి పాలకులకు కనువిప్పు కావాలి.ప్రజల ఆకాం క్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అను వైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చ రించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్య కతను అర్దం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య, వైద్య,సామాజికన్యాయం ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తిఎగుదుల ఉన్నతంగా ఉం టుందని,మెరుగైన సమాజం నిర్మాణంలో వారుచు రుగ్గా పాల్గొంటారని అంబేద్కర్‌ దిశానిర్ధేశం చేశా రు.రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించవలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయ త్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచ వలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
పాలకులు ఎప్పుడు కూడా సంపన్న వర్గాల పక్షాన నిలిచి పనిచేస్తారనే ముందుచూపు, ప్రజల ఐక్య ఉద్యమాలు,పోరాటాలద్వారా ఏర్పడే నిజమైన చట్టాల ముందు పాలకులు తలవంచక తప్పదనే హెచ్చరిక వారి మాటలలో కనబడు తుంది.కేంద్ర ప్రభుత్వం విద్య,వైద్యానికి నామ మాత్రపు నిదులను కేటాయిస్తూ ప్రైవేటుపరం చేయడానికి ఉత్సాహపడుతుంది.రాష్ట్రాల ప్రభు త్వాలు కూడా ఆయా రంగాలను గాలికి వదిలి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో పోటీ పడుతున్న తరుణంలో ఐక్య ఉద్యమా లే పరిష్కారమని సూచన కూడా మన ముం దు చర్జనీయాంశంగా నిలిచింది.దేవ గౌరవాన్ని, జాతి ప్రతిష్టను,ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి పిడికిలి బిగించి నినదించడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ఎన్నికల వేళ అలాంటి పార్టీలకే తమ ఓటు అనే డిమాండ్‌ తెర మీదకు రావాలి.
ఓటు ఓ వజ్రాయుధం
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగను న్నాయి. రాజ కీయ పార్టీల ఎన్నికల్లో గెలవడానికి ప్రచారములో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అమలుకు నోచు కోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటి స్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తు న్నాయి.ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞతప్రదర్శించాలి. ఎన్నికలపై నిర్లక్ష్యం తగదు..ఎన్నికలు అంటే అవి నాయకులకే పరిమితమైనవని సాధారణ పౌర సమాజం ఎన్నికలపట్ల ఆసక్తి చూపక పోవ డంవల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయా లు మార్గమైనాయి. ప్రాజెక్టుల పేరు మీద ప్రజల సొమ్మును దోపిడిచేస్తూ దోసుకో’దాసుకో అనే నినా దాన్ని తమ పాలన విధానంగా మార్చివేసి పేద’ మధ్యతరగతి బిసి బడుగు బలహీనర్గాలను చట్ట సభల్లోకి ప్రవేశించకుండా అడ్డు కునే వికృత రాజ కీయ క్రీడ కొనసాగడంశోచ నీయం. బ్రిటిష్‌ పాలన నుండి దేశ ప్రజల విముక్తి కొరకు జరిగిన పోరా టాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర అనంతరం చట్టసభలకు జరిగే సార్వత్రికఎన్నికల్లో ఉదా సీన వైఖరి అవలంభించ డంవల్ల చట్టసభలు నేరచరితులరౌడీల’మాఫి యా ల’ ధన స్వాముల పరమైనాయి. ఎన్నికలు గెలుపు గుర్రాలు ఎన్నికలు అంటే గెలుపు గుర్రాలకు మాత్ర మే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తు పార్టీ కొరకు ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు అంకిత బావం సిద్ధాంత నిబద్ధత కలిగిన సీనియర్‌ కార్యర్త లకు టికెట్లు ఇవ్వక పోవడంవల్ల చట్టసభలకు జరిగే ఎన్నికలు ధనికులకు‘మాఫియా‘డాన్‌ కార్పొరేట్‌ శక్తులకు రిజర్వ్‌ చేయబడ్డాయన్న మానసిక భావన సమాజంలో స్థిరపడి పోయింది.మన తలరాతను మార్చేది ఎన్నికలే..మనం ఎన్నికల ఓటింగ్‌ గురించి పట్టించు కోక పోయిన మనసమాజంలో ఆర్థిక ‘సామాజిక సాంస్కృతిక ‘సాంఘికఉద్యోగ’ ఉపాధి ‘పెట్టుబడి ఉత్పత్తి’ఉత్పాదకత ‘స్వదేశీవిదేశీ వర్తకం’ వ్యారం ‘విధ్య వైద్యం ‘ఆరోగ్యం ‘విదేశీ విధానాల రూపకల్పనలో మౌలికమార్పులు తెచ్చి మన జీవి తాలను భవిష్యత్తును మనపిల్లల భవిష్యత్తును మార్చ గలిగేది చట్ట సభలకు జరిగే ఎన్నికలు మాత్రమే నన్నది చారిత్రిక వాస్తవం .ఎన్నికలు అంటే సమాజ ములో అందరివి కొందరివి కాదు లేదా కొన్ని సామాజిక వర్గాల ఏకస్వామ్యంకాదు. కుటుం భాలగుత్తాధి పత్యంకాదు.ఓటర్లు పోలింగులో సంపూర్ణ భాగస్వాముల్కె‘‘తమ స్థితగతులను ‘‘మా ర్చు కునే పరిస్థితిగా గుర్తించాలి. ఓటు మన జన్మ హక్కు..నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతి లోనే వుంటుంది.ఐదేళ్లకు ఒక సారి మన సేవకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకుంటాం. పరి పాలన దక్షున్ని రాజ్యాంగ చట్టాలపట్ల ప్రజా సంక్షే మ పథకాలు చట్టాల పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడంలో ఓటే కీలకం.నోటుకు ఓటును అమ్ముకోవద్దు.ఓటుద్వారా తమ తల రాతను మార్చే శక్తి వుంది.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే ఉత్తమ అభ్యర్థులకు ఓటువెయ్యాలి.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు వులు ప్రజలు తమకున్న ఓటుహక్కుతో ఐదు సంవ త్సరాల పదవీ కాలానికి ప్రజా ప్రతినిధులను ఎన్ను కొని ప్రభుత్వాల ఏర్పాటులో క్రియా శీలకంగ పాల్గొనాలి. ఓటుమార్పుకు ఆయుధం.. ఓటు అనే ఆయుధంతో ఓటరు తమ ఆకాంక్షలు అవసరాలు తీర్చే ప్రభుత్వాలకు అధికారం ఇస్తాడు. అభివృధ్ది సాధకులకు ఎన్నుకోవాలి..జాతి తల రాతలు మార్చే సమాజ సేవకులను సామర్థ్యం’ సత్తాగల అభివృద్ధి సాథకులనుచట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్ను కోవాలి. ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలునుఎన్నికల మేనిఫెస్టో పట్ల ఆలోచించాలి.
తలరాతను మార్చేది ఓటు..
బాధ్యత గల పౌరుడిగా మన జీవితాన్ని తద్వారా జాతి తల రాతను మార్చేది మన ఓటుతోనే వీలవు తుందనే వాస్తవాన్ని మరువరాదు. ఎవరికి ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వేయాలి? జాతిభవి ష్యత్తు ‘దేశఐక్యతా సమగ్రత’ దేశ సార్వభౌమా ధికార రక్షణ భద్రత దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయం ‘పారిశ్రామిక అభివృధి ‘సేవా రంగాల విస్తరణ స్వయంసమృది సుస్తిరాభివృద్ది‘ఉపాధిఉత్పా దక’సామర్థ్యం ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు పరిచే పార్టీ అభ్యర్థులను చట్ట సభ సభ్యు లుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు రాజకీయ పార్టీల విదానాలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నిబద్ధత నిజాయితీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అవ లంబించే సామర్థ్యం ఉన్న వారిని ఎన్నుకోవాలి. ఓటర్లుఎన్నికల మేనిఫెస్టో పరిశీలించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ప్రాజెక్టుల నిర్మాణం నాణ్యత లభిదారుల సమస్యలు పరిష్కారాలు పరిశీ లించాలి.ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అభివృధ్దికి పాటు పడేవారికి ఓటు వెయ్యాలి.ఏపార్టీ,మన దేశాన్ని,మన ధర్మాన్ని రక్షిం చడానికి కట్టుబడి ఉంది?ఏపార్టీ లంచగొండితనం తో కూరుకుపోయి ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తుంది. అభివృధ్ది సంక్షేమం పేరున అమలౌతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్దిచేకూరుస్తున్నాయనే అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి వుండాలి. సహజ వనరు లు మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసి పేదరికం నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సరైన పార్టీకి ఓటు వేసి ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటు తోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తలరాతను మార్చి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఓటరు ఓటు వేసే ముందుపార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీకాలంలో అమలుఅవుతాయా? లేదా? తెలుసుకోవాలి.రాజకీయాల పట్లఎన్నికల పట్ల ఎన్ను కునే ప్రతి పౌరుడు ఆసక్తి అవగాహన కలిగి వుం డాలి.మనం రాజకీయం చేయక పోయినా రాజకీ యాలు తెలుసు కోవటం నేటి తక్షణ అవసరం. ఓటు నిశ్శబ్ద విప్లవం.. దేశ రాజకీయాలకు వెగటు పుట్టిస్తున్నధన’ రౌడీ రాజకీయాలతో పరువు మాస్తున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగం ద్వారా అవినీతి అక్రమాల చెర లోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజాఉద్యమానికి విజ్ఞతగల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది.ఓటు ఒక నిషబ్ధ విప్లవం ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి.మన ధర్మాన్ని మనం నిల బెట్టు కోవాలి!మన బతుకులు మనం చక్కపరచు కోవాలి! ఎన్నికల్లో ప్రతిఓటరు క్రియా శీలక బాగ స్వామి కావాలి.ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి ఇతర ఓటర్లను యువతను తమఓటు హక్కు వినియోగించుకొని తమ తల రాతను మార్చే పార్టీ లకు అభ్యర్థులకు ఓటు.వెయ్యాలి. పోటీ చేసే అభ్య ర్థుల గునగణాలు వారి సామాజిక సేవా అంశాల మీధ విరివిగా చర్చించాలి. నోటుకు ఓటు అమ్ము కో వద్దు..ఓటువేసే ముందు విజ్ఞత ఓటరు రాజకీ య పార్టీల హామీల ఓట్ల వేలం పాటల హోరులో హైరానా పడి నోటుకు ఓటు అమ్ముకోవద్దు. మన ఓటు తెలంగాణ అభివృద్ధికి మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించ కుండ కులమతాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించే వారిని ఎన్నుకోవాలి. ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థి ఏపార్టీ వాడని చూడకు ఏ పాటి అభివృద్ధికి పాటుపడే వాడో ఆలోచించు. మనంవేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉద్దరించ గలగాలి.ఓటుకు ఒక ప్రత్యేక త వుంది.దాని ప్రాధాన్యం ఎంత చెప్పిన తక్కువే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందే జాగ్రత్త పడాలి.నీతినిజా యితీగా పనిచేసే వాడికి,రాష్ట్ర భవిష్యత్తు అభివృధ్దికి సంక్షే మానికి ప్రజారక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికు డిగా అండగా నిలబడే పార్టీకి/ అభ్యర్థికి ఓటు వెయ్యాలి రాష్ట్ర ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు పాటు పడే పార్టీ/ అభ్యర్థులకు ఓటు..పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరిచి సామాన్య పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిం చే వ్యక్తికి /అభ్యర్థికి ఓటు వేస్తే తెలంగాణా ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు సుఖమయ జీవితానికి దోహ దపడే నూతన అభివృధ్ది వ్యూహా లతో ముందుకు వచ్చే పార్టీకి/ అభ్యర్థులకు ఓటు వేయండి.ప్రజా సంక్షేమానికి పాటు పడని నేతలను ఓటు ద్వారా నిగ్గ తీయండి.ప్రజాఆకాంక్షలు తీర్చని వారిని శం కర గిరి మాన్యాలు పట్టించే శక్తిని సమకూర్చేది ఓటు హక్కేనని విజ్ఞతగల ఓటర్లు.గుర్తించాలి. ఓటర్లు జాతి తలరాతను మార్చి రాసేవిధాలుగా అవతరించాలి.ఓటర్లు నిర్లక్ష్యాన్ని నిర్లిప్తత ను సోమ రితనం విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొ నాలి.తమ ఓటుద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగు తుందనినే వాస్తవాన్ని మరువద్దు.ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యంగా మార్చే ప్రక్రియ లో ఓటర్లదే తుది తీర్పు .ఓటు పదున్కెన ఆయుధం. దీన్ని ఏవిధంగా సందిస్తే మన జీవితాలు మారుతా యనేది ఆలోచించాలి.ఎది ఏమైనా మనం వేసే ‘‘ఓటుకోహినూర్‌’’వజ్రంకంటే అత్యంత విలువై నది.ఓటు ఓగొప్ప మార్పుకు సంకేతం. ఓటు ప్రగ తికి మేలుకొలుపులాఉండాలి.మనం తోడుకున్న గోతిలో మనం పడకూడదు.ఓటరా మేలుకో ప్రజా స్వామ్యాన్ని రక్షించుకో (గునపర్తి సైమన్‌)