ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్దం

విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు..ఇది భావ ప్రకటన స్వేచ్ఛ,సమాచార హక్కు చట్ట ఉల్లంఘన..తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి..నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్‌ చేయాలి..మార్చి 6లోగా బాండ్ల వివరాలు సమర్పించాలి.. మార్చి13లోగా పూర్తి వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో పెట్టాలి`ఎస్‌బిఐ… ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనం చరిత్రాత్మక తీర్పు.!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు ముడుతున్న విరాళాలను అత్యంత గోప్యంగా ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నాకచాంగ ధర్మాసనం బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు,బాండ్ల విలువ, వాటి స్వీకర్తల(రాజకీయ పార్టీల) పేర్లను బహిర్గతం చేయాలని ఆదేశించింది.20 18లో తీసుకువచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగపరంగా లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కు చట్టాల ఉల్లంఘనగా ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోనిరాజ్యాంగ ధర్మాసనం అభివర్నించింది. రాజకీయ పార్టీలకు చెందిన విరాళాల సేకరణలో పారదర్శకతను తీసుకురావడానికి, నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రహస్య బ్యాలెట్‌ తరహాలోనే రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లను రహస్యంగా ఉంచుతామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ ఇది లోపభూయిష్టమని పేర్కొంది.ఈ పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. అంతేగాక 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్‌(ఇసిఐ) సమర్పిం చాలని ఎన్నికల బాండ్లను విక్రయిచే అధికారాన్ని పొందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.మార్చి 13వ తేదీ లోగా ఇసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురిం చాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఎన్నికల బాండు విక్రయ తేదీని, కొనుగోలు దారుడి పేరును,ఎన్నికల బాండు విలువను ఇసిఐకి సమర్పించాలని ఎస్‌బిఐని ధర్మాసనం ఆదేశించింది.2019 ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తీర్పు వెలువడిన నేటి వరకు ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల వివరాలను ఎస్‌బిఐ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సిజెఐ డివై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూ ర్తుల ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌,జస్టిస్‌ జెబిపార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఉన్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సంచ లన తీర్పును వెలువరించింది. 2019 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. తాము స్వీకరించిన విరాళాలు, స్వీకరించబోయే విరాళాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు సీల్డ్‌ కవర్‌లో ఇసిఐకి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా,తాజాగా ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు 15రోజుల చెల్లుబాటు గడువు మాత్రమే ఉండే ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఇంకా తమ ఖాతాలలో జమచేయని పక్షంలో సంబంధిత బ్యాంకుకు వాటిని వాపసు చేయాలని, ఆ సొమ్ము మొత్తాన్ని సంబంధిత కొనుగోలు దారుడి ఖాతాలో బ్యాంకులు జమచేయాలని ధర్మాసనం ఆదేశించింది.ఎడిఆర్‌, సిపిఎం, మరి కొందరు వ్యక్తులు ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017-18 నుంచి 2022-23 వరకు రాజకీ య పార్టీల వార్షిక ఆడిట్‌ నివేదికలను సిజెఐ తన 152పేజీల ఏకగ్రీవ తీర్పులో ప్రస్తావి స్తూ పార్టీల వారీగా ఎన్నికల బాండ్ల ద్వారా అందుకున్న విరాళాల వివరాలను పేర్కొ న్నారు.బిజెపి రూ.6,566.11కోట్లు అందు కోగా, కాంగ్రెస్‌ పార్టీ రూ. 1123.3 కోట్లను స్వీకరించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.1092.98 కోట్లు అందుకుంది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాల చెల్లింపునకు అనుమతిస్తూ కంపెనీల చట్ట నిబంధనలను సవరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, అటువంటి అవకాశాన్ని కూడా ఈ పథకం కల్పించలేదని ధర్మాసనం తెలిపింది. నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదని, ఆందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విరాళాలు అందచేయడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలియచేయడం, లేదా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన విరాళాలు అందచేయడం వంటి ప్రధానంగా రెండు కారణాలతోనే విరాళాలు అందచేయడం జరుగుతుందని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. కార్పొరేట్‌ కంపెనీలు అందచేసే భారీ విరాళాల వివరాలను గోప్యంగా ఉంచ డాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. క్విడ్‌ ప్రో కో లావాదేవీల కింద రాజకీయ పారీలకు అందే విరాళాలు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతు గా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. కాగా..జస్టిస్‌ ఖన్నా విడిగా మరో 74పేజీల తీర్పును వెలువరిస్తూ సిజెఐ చంద్రచూడ్‌ రాసిన తీర్పును బలపరుస్తూ వేర్వేరు కారణా లను వివరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేయాలన్న తీర్పుతో ఆయన కూడా ఏకీభవించారు.
ఎన్నికల బాండ్లు అంటే ఏంటి.. పార్టీలకు విరాళాలు ఎలా వస్తాయి..ఎవరు జారీ చేస్తారు?
ఈ ఎలక్టోరల్‌ బాండ్లు అంటే ఏంటి అని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఎలక్షన్‌ బాండ్‌ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్‌ పేపర్‌ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు గానీ..సంస్థలు గానీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరా ళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు.ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017-2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎల క్టోరల్‌ బాండ్స్‌ పథకాన్ని తీసుకుచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి10వ తేదీ వరకు జరిగాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లపై బ్యాం కులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను జనవరి,ఏప్రిల్‌, జూలై,అక్టోబర్‌ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయ గా.. పార్టీలకు విరాళాలు ఇచ్చే వారు కొను గోలు చేసే అవకాశం ఉంటుంది.ఈ ఎల క్టోరల్‌ బాండ్లు రూ.1000,రూ.10 వేలు, రూ.1 లక్ష,రూ.1 కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్‌ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాం డ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజు లలోపు ఖాతాదారులు..వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై.. ఎవరు కొనుగోలు చేశార నేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్‌గా ఉంటాయి.ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.విరాళాలు ఇచ్చే వారి వివరాల్ని బ్యాంకులు,రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి.ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లు అయినా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29ఎ కింద రిజిస్టర్‌ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరిం చేందుకు అర్హత ఉంటుంది.గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ.16437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే రూ.10117కోట్లు రావ డం సంచలనంగా మారింది. అయితే అధికా రంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం,కాంగ్రెస్‌ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని..అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
‘నీకిది నాకిది’తరహాలో..
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని,వాటి జారీని తక్షణం నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మోడీ ప్రభుత్వానికి, బిజెపికి చెంపపెట్టు. కార్పొరేట్లకు దోచిపెట్టి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీగా నిధులు సమకూర్చుకొని రాజకీయాలను శాసించాలనుకున్న బిజెపికి సుప్రీం తీర్పుతో కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,నిష్కళంక,పారదర్శక రాజకీ యాలు కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతిం చాల్సిన తీర్పిది. పాలక పార్టీ, కార్పొరేట్ల నడుమ ‘నీకిది నాకిది’తరహాలో క్విడ్‌ప్రోకోకు ఎలక్టోరల్‌ బాండ్ల స్కీం దారి తీస్తుందన్నవారి ఆందోళనలను, వాదనలను సుప్రీం సమర్ధిం చింది. రాజకీయ పార్టీలకు నిధులు సమ కూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.ఎటువంటి వివరాలూ తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనంది. నల్లధనాన్ని అరికట్టేం దుకు, పారదర్శకత కోసం ఈ స్కీం తెచ్చా మన్న బిజెపి ప్రభుత్వ కుతర్కాన్ని తోసిపారే సింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా అపరి మిత విరాళాలకు అనుమతిస్తూ కంపెనీల చట్టంలో చేసిన సవరణ ఏకపక్షమనీ తప్పు బట్టింది.బాండ్ల ద్వారా సేకరించే విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీం నొక్కి వక్కాణించింది. ఇప్పటి వరకు జారీ చేసిన బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఆ వివరాలను 13లోగా వెబ్‌సైట్‌లో ఇ.సి ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్‌టిఐ,ఐ.టి చట్టాలకు విరుద్ధంగా, కంపె నీల చట్టంలో ఏకపక్ష సవరణలతో ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకొచ్చిందో ఈ కాలంలో బిజెపి జేబులోకి చేరిన అజ్ఞాత కార్పొరేట్ల విరాళాల వరదే చెబుతుంది.2018 జనవరి నుంచి స్కీంను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల బాండ్‌ అంటే ఒక విధంగా ప్రాంసరీ నోటు వంటిది. నిర్దిష్ట సమయాల్లో వాటిని బ్యాంకులు జారీ చేస్తా యి. బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా అందిస్తాయి. వాటిని పార్టీలు నగదుగా మార్చుకొని ఎన్నికలకు, పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపెట్టుకుంటాయి. అయితే ఎవరు విరాళాలిచ్చారో బహిర్గత పర్చనవసరం లేదు.2017-18 నుంచి 2022-23 వరకు దాదాపు 30తడవల్లో 28 వేలబాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది. వాటి విలువ రూ.16,500కోట్లకు పైమాటే. వాటిలో రూ.6,500 కోట్లు బిజెపి గల్లాపెట్టె లో పడ్డాయి.2018-19, 2019-20లలో 70-80శాతం విరాళాలు బిజెపి ఖాతాకు చేరాయంటే, కార్పొరేట్లకు ఆ పార్టీకి మధ్య పెనవేసుకున్న మైత్రి బంధం తీవ్రత అవగతమవుతుంది.ఎలక్టోరల్‌ బాండ్లు రాజకీ య అవినీతిని చట్టబద్ధం చేసేందుకేనని పర్య వసానాలబట్టి తెలుస్తోంది. ఎన్నికల నిధి సేకరణలో పెద్ద ఎత్తున గోప్యతతో కూడిన, పారదర్శకత లేని పద్ధతులకు బిజెపి ప్రభు త్వం తెరతీసిందని స్కీం వచ్చినప్పుడే సిపిఎం, పలు ప్రతిపక్ష పార్టీలు,ఎ.డి.ఆర్‌ వంటి సంస్థలు నిరసించాయి. సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట బాండ్ల జారీ ప్రారంభానికి లోపే విచారణ పూర్తి చేయాలని విన్నవించిన మీదట కోర్టు గతేడాది అక్టోబర్‌లో విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. కార్పొరేట్లు అందిం చిన రాజకీయ నిధులకు బదులుగా రాయి తీలు కట్టబెట్టడం మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న విధానం. ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ లక్షణం. తొమ్మిదిన్నరేళ్లలో కార్పొరేట్లు బ్యాంకుల్లో తీసుకున్న రూ.14 లక్షల కోట్ల రుణాలను మోడీ సర్కారు రద్దు చేసింది. కార్పొరేట్‌ పన్నులో రూ.లక్షల కోట్ల సబ్సిడీలిచ్చింది. సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అప్పగించింది. స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైన ఎన్నికలకు హామీ కల్పించే విధంగా అభ్యర్ధులందరూ సమాన స్థాయిలో పోటీ పడాలనే సూత్రాన్ని ఈ విధంగా లభించిన ధనబలంతో బిజెపి వమ్ము చేస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంస్క రణలు అవశ్యమన్న డిమాండ్‌ బలంగా ముందుకొస్తోంది. ఎన్నికల సంస్కరణలే ప్రజాస్వామ్యానికి రక్ష. -( కృష్ణంరాజు యాదవ్‌)