ఉరుముతున్న నిరుద్యోగం

పతకమూరు దామోదర్ ప్రసాద్
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేక పోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్త వుతాయి. స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినా భారత్లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వస్తువులను చైనా తదితర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవు తున్నాయి.
స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయ మైన అభివృద్ధి సాధించినా భారత్లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదను గుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వ స్తువులను చైనా తదితర దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను వచ్చే 24ఏళ్లలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం లో 3వస్థానానికి చేర్చడమే లక్ష్యంగా సంకల్పం చెప్పుకుని ఆదిశగా కొన్ని చర్యలు చేపట్టారు.అయితే ఇవి లక్ష్యసాధనకు ఏమేరకు ఉపకరిస్తాయనేదే ప్రశ్న.నిరుద్యోగ సమస్య తీవ్రత దృష్ట్యా పాలస్తీనా వివాదంలో ఇస్లామిక్ దేశాలతో పోరాడుతున్న ఇజ్రేల్ దేశములో వివిధ రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి భారత యువత ఎగబడటం చూస్తే నిరుద్యోగ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.ఇజ్రియల్ నిర్మాణ రంగంలో పనిచేయడానికి 10వేలమందికి పైగా ప్లంబర్లు,ఎలక్ట్రీషియన్ లు,కార్పెంటర్ లు,పెయింటర్ల వంటి వివిధ వృత్తుల వారు అవసరం కాగా ఆపనుల్లో చేరడానికి తొలుత 25కోట్ల జనాభాగల అతిపెద్ద రాష్ట్రం యుపి, హర్యానా యువకులు ఎగబడ్డారు.కాగా ఇజ్రేల్ తో స్నేహసు హృద్భావ సంబంధాలు నెరపు తున్న శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ తీసుకుని బిజెపి ఏలుబడిలోని యుపి, హర్యానాలో కార్మికుల రిక్రూట్మెంట్లో ఇజ్రెల్ కు తమ సహకారాన్ని అందించింది. పాలస్తీనా సంఘర్షణలో ఇస్లామిక్ దేశాలు,ఇ జ్రేల్ పరస్పరం బాంబు,క్షిపణి దాడులకు దిగడంతో అక్కడ ప్రాణాంతకమైన భీతా వహ పరిస్థితుల్లో సైతం పనిచేయడానికి మన నిరుద్యోగ యువత పోటీపడుతున్నది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.1.40లక్షల జీతం,రూ 4వేల వరకు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో ఎంపిక జరుగుతున్న చోట్ల తొక్కిసలాట జరుగుతున్నది.ఆకలితో మరణించడం కంటే పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి యువత సిద్ధపడటం నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం. వివిధ దేశాలలో నైపుణ్యం,పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండ టంతో బతుకు కోసం ఆదేశాలకు తరలి వెళ్ళడానికి యువత పోటీ పడుతున్నారు.ప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో పని చేస్తూ తమ కుటుంబాలకు వేలకోట్ల రూపాయలు పంపి ఆదు కుంటున్నారు. దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకే యువత విదేశాలబాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పి స్తామని 2014లో అధికారం లోకి రావడానికి ముందు బిజెపి తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే వాస్తవంగా జరిగింది వేరు.దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కన్సల్టెన్సీలకు వేలకొద్దీ డబ్బు చెల్లించి మన యువత విదేశాలకు తరలి వెళుతున్నారు. ధనదాహంతో కొన్ని కన్సల్టెన్సీలు అవకాశాలు లేని దేశాలకు కూడా యువతను పంపడం, అక్కడికి చేరాక వారు అష్టకష్టాలు పడటం తెలిసిందే.కెనడా, అమెరికా వంటి దేశాలకు వెళ్లిన వారికి సైతం తగిన ఉద్యోగాలు లభించక అర్ధాకలితో అలమటిస్తూ,అప్పుల పాలై మళ్లీ స్వస్థలాలకు తిరిగి వస్తున్నవారు గణనీయంగా ఉన్నారు.2022అక్టోబర్ -2023 సెప్టెంబర్ మధ్యమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 96,917మందిని గుర్తించి పట్టుకున్నట్లు అమెరికన్ కస్టమ్స్,సరిహద్దు భద్రతా దళం గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందు తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా ఇది ఉద్యోగ, ఉపాధి కల్పించలేని అభివృద్ధిగా మిగిలి పోతున్నది.2024-25లో మనదేశం 7.3 శాతం అభివృద్ధి సాధించగలదని ఇటీవల తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వెల్లడిరచారు.కోట్లాది యువతకు,శ్రామికులకు ఉద్యోగ జీవనో అవకాశాలు కల్పించలేనిదిగా నిలవనుంది. నిరుపేదలు ఏపని దొరికితే అపనికి వెలుతూ జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత మాత్రం తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకే ప్రాధా న్యత ఇస్తున్నారు. పనిచేసే వయసుగల యువ తకు తగిన ఉపాధి అవకాశాలు లభిం చక పోతే అది వారిలో నైరాశ్యానికి, అశాంతికి దారితీసే ప్రమాదముంది. భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం సై న్యంలో చేరదలచిన యువ తకు అగ్నిపత్ పథకాన్ని ప్రకటించగా వేలాదిమంది యువత ముందుకొచ్చారు. మామూలు సైన్యంలో ఇచ్చే జీత భత్యాలు, పింఛను వీరికి రావు.బిజేపి ప్రభుత్వం ఎక్కువగా వాణిజ్య,పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నందున, అగ్నిపథ్లో శిక్షణ పొందిన వారు ఐదేళ్ళ తర్వాత పరిశ్రమల వారికి రక్షకులుగా పని చేయాల్సి ఉంటుంది.13కోట్ల జనాభాగల పెద్ద రాష్ట్రం బీహార్లో పరిమితమైన రైల్వే ఉద్యోగాలకోసం యువత ఎగబడడంతో అది హింసాకాండకు దారితీసింది.ఆరేళ్ల క్రితం 35వేల ఉద్యోగాల కోసం ప్రకటన రాగా కోటి మంది దరఖాస్తు చేశారు.నియామకాల్లో అవినీతి జరిగి ఆందోళనలకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 368బంట్రోతు ఉద్యోగాలకు ప్రకటన చేయగా పీహెచ్ డీలు, పోస్టు గ్రాడ్యుయేట్లు సహా 23లక్షలమంది దర ఖాస్తు చేసుకున్నారు.ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు6.6శాతం.నగరాలు,పట్టణాలలో 15-19ఏళ్ల ఉద్యోగార్థులు రేటు అంతకు 3రెట్లు ఎక్కువగా ఉన్నట్లు 2023జులై సెప్టెంబర్ గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిరుద్యోగ సైన్యం నానాటికీ పెరిగిపోతుండటం అనేక సమస్య లకు దారి తీస్తున్నది.2014లో యువత కోటి ఆశలతో కమలం పార్టీకి ఓటేయడంతోనరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మోడీ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం కావాలి.అయితే అరకొర చర్యలు తప్పితే మోడీ ప్రభుత్వం ఈరంగంలో పెద్దగా పురో గతి సాధించలేదు.ఉద్యోగాలు కల్పించినా కొన్ని పట్టణాలు,నగరాలలో అసంఘటిత రంగంలో రోజువారీ కూలీపనులే,మహిళలే అధికం.2019-20లో 22శాతంగా ఉన్న ఈ పనులు 2022-23లో 24శాతానికి పెరిగి నట్లు పరిశీలనలో తేలింది.ఇవి,హెల్పర్లు ,గృహ పరిశ్రమలకు చెందినవే.పట్టణ యువత నైరాశ్యంతో ఉద్యోగాల కోసం వెదకడం మానేసినట్లు తేలింది.2023 జూలై -సె సెప్టెంబర్ లో ఉద్యోగుల చేరిక తగ్గింది. మూడు నెలల్లో లోకసభ,అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల డిఎస్ సి ద్వారా టీచర్ల నియామకాలను ప్రకటించింది.2023 జూలై నాటికి నిరు ద్యోగి త రేటు 7.95శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇండస్ట్రీ వెల్లడిర చింది.తెలంగాణా ప్రభుత్వం 2015నుండి ఇప్పటి వరకు36,643 ఖాళీల భర్తీకి నోటిఫ కేషన్లు జారీ చేసినట్లు ఆర్టిఐ ద్వారా సమా చారం లభించింది.మధ్యలో ప్రశ్నా పత్రాలు లీకై కొన్ని పరీక్షల రద్దుకు,ఉద్యోగాలు రావనే నిరాశతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం.అయినా పదవులు వెలగ బెట్టిన వారిలో కొంతయినా ఆత్మ పరిశీలన లేక పోవడం విచారకరం.కాగా రేవంత్ రెడ్డి సిఎం గా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 2లక్షల పోస్టులకు దశల వారీగా నియామక ప్రక్రియ చేపట్టడం యువతకు ఆశా కిరణంగా కనిపిస్తోంది. తెలంగాణా ప్రభుత్వ 31వి భాగాలలో మం జూరైన పోస్టులు4,91,304.ప్రస్తుతం 3లక్ష ల ఉద్యోగులు మాత్రమే పనిచేస్తు న్నారు. స్కూ లు విద్య,ఆరోగ్యకుటుంబ సంక్షేమ, పోలీసు, పంచాయతీరాజ్,రెవెన్యూ శాఖలలో దాదాపు 77శాతం మంది పనిచేస్తున్నారు.స్కూలు విద్యాశాఖలో మంజూరైన పోస్టులు 1,37, 651కాగా ప్రస్తుతం 1,13,853మంది మాత్రమే పని చేస్తున్నారు.పోలీసు శాఖలో మంజూ రైన పోస్టులు98,384కాగా ప్రస్తుతం 61,212మంది మాత్రమే పని చేస్తున్నారు. ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖలో మంజూ రైన పోస్టులు52,906కాగా ప్రస్తుతం22,336 మంది పని చేస్తున్నారు.కాగా నరేంద్ర మోడీ పదేళ్లపాలనలో 9లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు,అదే మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితెంద్రసింగ్ అభివ ర్ణించారు.కానీ యూపీయే పదేళ్ల పాలనలో ఇచ్చినది 6లక్షల ఉద్యోగాలేనని కేంద్రమంత్రి అంటున్నారు.యుపి ఎస్ సి ద్వారా మోడీ ప్రభుత్వం 50,906 ఉద్యోగ నియామకాలు చేయగా యుపిఏ హయాంలో ఇచ్చింది45, 431ఉద్యోగాలేనని,ప్రస్తుత సిబ్బందికి భారీగా ప్రమోషన్లు కల్పించామని మంత్రి చెప్పారు. భారత ప్రభుత్వంలో మంజూరైన పోస్టులు 40లక్షలు కాగా,ప్రస్తుతం 30లక్షల ఉద్యోగులే పని చేస్తున్నారు.సివిల్ సర్వీసులలో1,365, ఐఏఎస్,703,ఐ పీఎస్,1042,ఇండియన్ ఫారెస్ట్ పోస్టులు1042ఖాళీలు,ఐ ఆర్ ఎస్ పోస్టులు 301ఖాళీగా ఉన్నాయి. హోమ్ శాఖలో 1,14,245,సీఆర్పీఎఫ్,బి ఎస్ ఎఫ్, ఢల్లీి పోలీసు శాఖలలో గ్రూప్ ఏ స్టులు3, 075,గ్రూప్ బి పోస్టులు15861 పోస్టులు, గ్రూప్ సి లో95,309పోస్టులు,ఖాళీగా ఉన్నా యి. రైల్వేలలో 2.63లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవల పలుదఫాలుగా1.39లక్షల పోస్టులు భర్తీ చేశారు.ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 8లక్షల ఉద్యోగులు ఉన్నారు.వారిలో 5.6లక్ష ల రెగ్యులర్,1.3లక్షలమంది గ్రామ,వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నారు. 2లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్నారు.యుపిలో 27లక్షల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, మహారాష్ట్రలో 17లక్షలు,తమిళనాడులో 16లక్షల ఉద్యోగులు,పెన్షనర్లు ఉన్నారు. బీహార్,రాజస్తాన్,జార్ఖండ్,ఢల్లీి రాష్ట్రాలలో నిరుద్యోగులు అధికం. కేంద్రప్రభుత్వం, తెలం గాణా,ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకు కొంతయినా ఊరట కలుగుతుంది. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తే మరి కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈదిశగా సత్వర చర్యలు చేపట్టాలి.