ఆర్దిక అంతరాలకు అంతమెన్నడు.

కొంతమంది ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నేడు ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ పాలనలో కన్నా ఘోరంగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా వారు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంపద సృష్టి బాగానే జరుగుతున్నా, అది కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమౌతుంది. దేశ సంపద లో 44శాతం ఒక్కశాతం ధనికుల చేతిలోఉంది. ఆఒక్క శాతం మంది జాతీయ ఆదాయంలో 22 శాతం మేరకు పొందు తున్నారు.ఏభై శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15శాతానికి మించి పొందలేక పోతున్నారు. అంటే జాతీయ ఆదాయం ఎంత పెరిగినా జనాభాలో సగం మందికి దక్కేది అందులో 15పైసల వాటానే. ఇలా అసమానతలు పెరగడానికి ఇప్పటి ప్రభుత్వ విధానాలే కారణం. ధనికులపై విధించే పన్నులు తక్కువ. వారు పొందే రాయితీలు ఎక్కువ. పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులు ఎక్కువ. వారికి దొరికే ఊరట. ధరల నియంత్రణ ద్వారానో, మరోలానో తక్కువ. అయితే అసమానతలు తగ్గే విధానాల్ని అమలు చేస్తామని ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. వృద్ధి వైపు దేశాన్ని పరుగులు పెట్టిస్తామని అందరూ అంటున్నారు తప్పించి, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందేలా విధానాలు రూపు దిద్దగలమని జాతీయ పక్షాలు మాట్లా డడం లేదు.బహుశా దాని వల్ల ధనికులు దూరమై, వారి విరాళాలు అందవని భయ మేమో? చూశాం కదా, ఎన్నికల బాండ్ల రూపంలో దివాళా కంపెనీలు కూడా పార్టీలకు ఎలా నిధులు ఇచ్చాయన్నది. ఇకపోతే ఆర్థిక అంతరాలు మరీ వారు చెప్పినంత ఘోరంగా లేవని వాదించవచ్చు. కానీ అసమానతలు దండిగా ఉన్న వాతావరణంలోనే ఉన్నామన్నది ఎవరూ కాదనలేరు. వేరే వేరే నివేదికల ప్రకారం 2000 సంవత్సరంలో 35 శాతం ఉన్న నిరుద్యోగిత నేడు 65 శాతం అయ్యింది. పేదరికం, పోషకాహార లేమి గణనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ వైద్యం, విద్యపై పౌరులు భరించాల్సిన ఖర్చు ఎక్కువే. వాటివల్ల అప్పులు పాలయ్యే వాతావరణం. ఈ సమస్యల్ని గమనం లోకి తీసుకోకుండా వృద్ధిలో ముందంజ వేయడం సాధ్యమా? పేదలకి, అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి భారమైన విద్య, వైద్యం చవకగా అందుబాటులోకి రావాలి. అప్పుడే నాణ్యమైన భవితకు, ఆర్థిక వృద్ధికి పూచీ. యువత గణనీయంగా ఉన్న భారత్‌ శక్తిమంతం కావడమే కాదు అసమానతలు లేని సమాజంగా మారాలి. ఇప్పుడున్న విధానాలతో అది సాధ్యం కాదు. మెరుగైన విధానాల కోసం, అవి ఎన్నికల్లో ప్రాధాన్యత గల అంశాలుగా మారడం కోసం నడుం కట్టాల్సింది పౌర సమాజమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశా బ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమాన తలు తీవ్రస్థా యిలో ఉన్నాయి. నిత్యం పెరుగు తున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు,గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరా టం చేస్తుండగా..మరోవైపు ఇదే సమ యంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీలైఫ్‌ అనుభవిం చడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్‌ స్టోర్‌కు పలు వురు పోటెత్తడమే ఉదాహరణ.ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్నదేశాల జాబితాలో భారత్‌ ఉన్నదని వరల్డ్‌ ఇన్‌ఈవ్వాలిటీ ఇండెక్స్‌-2022 పేర్కొన్నది. భారత్‌లో దేశ ఆదాయంలో టాప్‌ 10శాతం లేదా 1శాతం సంపన్నుల వద్ద వరుసగా 57శాతం, 22శాతం సంపద ఉన్నద నే ఆందోళనకర విష యాన్ని వెల్లడిరచింది. ఇటీ వల యాపిల్‌ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభిం చింది. అక్కడ ఒక్కొ క్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్‌ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి.ఇదే సమ యంలో మధ్య తరగతి ప్రజలు వినియో గించే బైక్‌లు,దేశీయ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్‌ను తమ వేగవం తమైన మార్కెట్‌గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సి డెస్‌ బెంజ్‌ అమ్మకాలు గణనీయంగాఉంటా యని అంచ నా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63శాతం పేద,మధ్య తరగతి వినియోగ దారులు అనవసరమైన వస్తు వులు,సేవలపై ఖర్చులను పరిమితం చేసు కొంటున్నారని 2023 పీడ బ్ల్యూసీ గ్లోబల్‌ కన్జ్యూ మర్‌ ఇన్‌సైట్స్‌ పల్స్‌ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందు తున్నామని సర్వేలో పాల్గొన్న74శాతం మంది పేర్కొ న్నారు. కలరా,తట్టు,పోలియో,మెదడు వాపు, మశూచి, సార్స్‌,ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహ మ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- ‘ఆర్థిక అసమానత’!
అసమానతలకు అంతంలేదా?
కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మా రులు పీడిస్తూనే ఉన్నాయి.అసమానత అనే రుగ్మ తకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామా జిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడిరది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూ త్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమ లు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృత మవుతుంది. ‘ఫోర్బ్స్‌’ లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచం లో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తేఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మ భూషణ్‌ కౌశిక్‌ బసు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదికను ఉటంకిస్తూ-73శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దురదృష్ట వశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్ప కుండా… తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడు కోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తు న్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.
ఆర్థికంగా చితికిపోయింది..
బ్రిటిష్‌ పరిపాలనకు ముందు మనది స్వయం సమృద్ధ దేశం.వారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది.తదనంతర కాలంలో దేశాన్ని నిల బెట్టడం కోసం ప్రభుత్వాలు అనేక విధానా లను రూపొందించి అమలు చేశాయి. జనాభా పెరిగి అవసరాలూ మారిన తరవాత 1965లో హరిత విప్లవం దిశగా సాగి దిగుబడులు సాధించింది. 1990లో ప్రపంచీకరణకు తలు పులు తెరిచింది. అయినప్పటికీ స్వావలం బన అనేది ఇప్పటికీ ఇంకా సుదూరంలోనే ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో 23.64శాతం దిగుమతులు ఉంటే,19.74 శాతం ఎగుమతులు ఉన్నాయి. మందులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రక్షణ సామగ్రి, చమురు, సెమీకండక్టర్ల వంటివాటికి ఇప్పటికీ ఇతర దేశాలమీదే ఆధారపడుతున్నాం. అందుకే స్వావ లంబన మంత్రాన్ని జపిస్తున్నాం. కరోనా, లాక్‌ డౌన్‌, సడలింపులు వంటి వాటితో మన వైద్య, ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం బయటపడిరది. వలస కూలీల వెతలే ఇందుకు నిదర్శనం. బ్రూకింగ్స్‌ నివేదిక ప్రకారం7.30కోట్ల ప్రజలు కటిక పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. ఆపైన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు అరకొర ఆదాయాలు, చుక్క లంటుతున్న ధరలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 1917-18లో 4.6శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో6.3 శాతానికి 2019-20లో 7.6శాతానికి ఎగబా కింది. అసంఘటితరంగం ఆసాంతం, సంఘటిత రంగంలోని చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్రం గా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోసుకుపోయి, ఆదాయాలు అడుగంటినవేళ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఉపాధి, ఆదాయం,కొనుగోలు శక్తి,ఈ మూడిరటి మధ్య సంబం ధాన్ని గుర్తించ నంత కాలం, ఉపాధిలో స్వావలం బన సాధించ నంత కాలం అంతరాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఆర్థిక అంతరాలు తగ్గే విధంగా, సంపద సృష్టి సమాజంలో అందరికీ విస్తరిం చేలా ఉపాధి కల్పన పథకాలు, కార్యక్రమా లను అమలుచేసే విధంగా ప్రభుత్వాలు తమ విధానా లను మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత కరోనా క్లిష్టకాలంలో ఎంతైనా ఉంది! `(వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు, అమరావతి – (పొడిశెట్టి సత్యనారాయణ)