ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి

‘‘ ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 40దేశాలలో సుమారు 40కోట్ల మంది ఆదివాసీ లు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తిం చాలని 1994 ఆగస్టు 9నఐక్యరాజ్య సమితి డిక్ల రేషన్‌ పేర్కొంది.ఆదివాసీల హక్కులను గుర్తించ డానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరా కరిస్తు న్నాయి. భారత దేశంలో 10కోట్ల మంది ఆది వాసీ ప్రజలు జీవిస్తు న్నారు. 700వందల ఆది వాసీ,75 ఆదిమజాతి తెగల హక్కులను గుర్తిం చేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరి స్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కు లను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పిం చింది. స్వాతంత్య్రం వచ్చి75ఏళ్లు దాటినా ఆది వాసీలు తిండికోసం వలసలు పోవాల్సి వస్తోం ది. వీరు విద్య, వైద్య సదుపాయాలు,ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.’’
భారత రాజ్యాంగం5,6షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు,గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది.అయితే ఆదివాసీప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను బడా కంపె నీలకు ధారాదత్తం చెయ్యడానికి,ఆదివాసీ ప్రాంత అడవు లను అదానీ,అంబానీ పరం చేయడానికి, విలు వైన బొగ్గు,బాక్సైట్‌,కాల్సైట్‌,లేటరైట్‌,మాంగనీస్‌, యురేనియం,గ్రానైట్‌,ఐరన్‌ ఓర్‌,వనమూలికలు, వృక్ష జంతు సంపదను ప్రైవేట్‌ బడా సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.ఆదివాసీల అభిప్రాయాలు, ప్రతి పక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకో కుండా ఏకపక్షంగాఅటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది.ఆదివాసీ ప్రాంతం లో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది.దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవు లు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు,1/70తదితర చట్టా ల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు,భూమి,సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
జీవో నెం 3 అమలు చెయ్యాలి
ఆదివాసీ ప్రాంత గిరిజన హక్కులు, చట్టాల అమలుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు భారత రాజ్యాంగం విస్త్రుతమైన అధికారాలు కల్పించింది.5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీ లకు వందశాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో 3 అమలు చేసి 20రకాల విభాగాలలో ఉపాధి కల్పించింది.అంతటి కీలకమైన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ ప్రాం తంలో రిజర్వేషన్‌ ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులను రద్దు చేసినట్లయింది. గిరిజనేతర జాతులైన బోయ వాల్మీకులకు ఆదివాసీలుగా గుర్తింపు కల్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బిజెపి,రాష్ట్ర వైసిపి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంత అడవులు,సహజ వనరులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా యి. తక్షణమే జీవో నంబర్‌ 3అమలుకు చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
పోలవరం బాధితులకు సహాయక చర్యలు
గత సంవత్సరం జులై 11న వచ్చిన గోదావరి వరద వల్ల అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు చెందిన కూనవరం, వరరామ చంద్రాపురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాల్లోని 200 గ్రామాలు పూర్తిగా నీట మునిగి పోయాయి. వంద రోజులపాటు ఈ గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంవల్ల నీరు వెనక్కి తన్ని ఈ జల ప్రళయం సంభవించింది.ఈ మండలాల్లోని ఊళ్ళకు ఊళ్ళు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలవారు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారు. రెండు నెలల తర్వాత గ్రామాలకు చేరుకున్నారు. అదే పరిస్థితి నేటివరదల సమయంలో మరలా పునరావృతం అయ్యింది. మునక మండలాల గ్రామాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల జల దిగ్బంధనంలో ఉన్నాయి. వరద ముంపు సమస్యపై సత్వరం ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి.
1.గోదావరి వరద ముందస్తు చర్యలు సత్వరం తీసుకోవాలి.2. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి.3.వరద గ్రామా ల నుండి బాధితులను తరలించేందుకు వాహ నాలు ఏర్పాటు చేయాలి. పడవలు, లాంచీలు సిద్ధం చేయాలి.4.వరద బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలిక గుడారాలు నిర్మించుకోవడానికి ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలి.5. ప్రత్యామ్నా య రహదారులను పునరుద్ధరించాలి.రోడ్లను మరమ్మతు చేయాలి.6.పాఠశాలలు మూత పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 7.చింతూరులో ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరును వెంటనే నియమించాలి.
షెడ్యూల్‌ ప్రాంతంలో నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలు కలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా1500ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. షెడ్యూల్‌ ప్రాంతంలో లేనందున అక్కడ నివసి స్తున్న ఆదివాసీల భూములు, అడవులకు రక్షణ లేదు.గిరిజనేతర పెత్తందారులు,మైనింగ్‌ మాఫి యా మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఐటిడిఎ పర్యవేక్షణ, పథకాలు, నిధులు అందక… ఆదివాసీ గ్రామాలకు విద్య, వైద్యం ఉపాధి, మంచి నీరు,రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులోలేక…బిక్కు బిక్కుమంటూ గడుపుతు న్నారు.తక్షణమే నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామా లను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
యుసిసి ని వ్యతిరేకిద్దాం
రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేక శాసనాలు చేసింది. వారి సంస్కృతి, ఆచారాలను గుర్తించింది. అయితే కేంద్ర బిజెపి ఆదివాసీలపై హిందూ భావజాలాన్ని రుద్దేందుకు, ఆదివాసీల ప్రత్యేక శాసనాలు, సంస్కృతి ఆచారాలు తొలగిం చేందుకు ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని చేస్తున్నది. ఆదివాసీ ప్రాంతం లో యుసిసి అమలును వ్యతిరేకించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.
హక్కుల దినోత్సవం ప్రాధాన్యత :
యుఎన్‌ఓ 1982 లో ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించినపుడు, వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తుచేస్తుంది. ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక,ఆర్థిక సాధికారత, సంస్కృతి, సాంప్రదాయాలు,చరిత్ర,వేదాంతశాస్త్రం, వార సత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని గౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ సమా వేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిర చిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ ను అనుస రిస్తూ సెప్టెంబర్‌ 13ను అంతర్జాతీయ ఆది వాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది.
46 రకాల హక్కులను కల్పించి
ఈ డిక్లరేషన్‌ లో మొత్తం 46 ప్రకర ణలు పొందుపరిచారు.ఈ 46ప్రకరణలలో ముఖ్యమైనవి మచ్చుకు కొన్ని…(1):ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం,ఆదివాసీలు స్వేచ్ఛగా మానవహక్కులు, ప్రాథమి క హక్కులను కలిగి వాటిని ఆనందంగా అనుభవించాలి. ఎటు వంటి వివక్షకు గురికావద్దు. అధికరణ(2): ఆదివాసీలు ఎటువంటి వివక్ష లేకుండా ఇతరులతో పాటు సమానంగా హక్కు లను అనుభవించాలి.
అధికరణ (3): ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడు అంశా లను వారి ఇష్టమైన రీతిలో నిర్వహించుకొని అభివృద్ది చెందవచ్చు.
అధికరణ (4): వీరు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలనను వారి అంతరంగిక స్థానిక అంశాలలో నిర్వహించుకోవచ్చు. అదే విధంగా ఆర్థిక వనరు లు,సముపార్జనను వారుఇష్టమైన రీతిలో నిర్వ హించుకోవచ్చును.
అధికరణ(5): ఆదివాసీలకు రాజకీయంగా, ఆర్థికంగా,చట్టాలను బలోపేతం చేసుకునే అధికా రం కలదు.
అధికరణ(6): ప్రతి ఆదివాసీ ఏ దేశంలో నివసి స్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వము పొందే ఉండే హక్కును కలిగి ఉంటాడు.
ఆధికరణ(7):ప్రతి ఆదివాసీ మానసిక సమత గ్రతలో జీవితంలో స్వేచ్ఛ,రక్షణ హక్కును కలిగి ఎటువంటి మారణ హోమానికి గురికాకుండా, వృక్తిగతంగా,సమూహంగా,రక్షణతో కూడిన శాంతి,రక్షణ కలిగి బలవంతపు చర్యలు వీరిమీద, పిల్లల లేకుండా ఉండే హక్కు.
అధికరణ(8): జాతిపరంగా రెచ్చగొట్టే చర్యలు, వివక్ష ఉండకూడదు. వారి సంస్కృతి, సాంప్రదా యాలు రక్షణ కలిగి విలువలు కలిగి ఉండాలి. భూమిపై హక్కులు కాలరాయకుండా, వనరుల దోపిడి జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాం గాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
అధికరణ(9):ఆదివాసీలు సంస్కృతి, సాంప్ర దాయులకు అనుగుణంగా ఏదైనా జాతీయతను కలిగి వుండవచ్చును. వీటిపై ఎట్టివివక్ష చూ పరాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆది వాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభు త్వాల అలసత్వం.ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశ మంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి.
వ్యాసకర్తలు :ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆదివాసీ రచయి తల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి.(కిల్లో సురేంద్ర/గుమ్మడి లక్ష్మీ నారాయణ)