ఆదివాసులకు దక్కని రాజ్యాంగ ఫలాలు

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘‘నేషనల్‌ లా డే’’ లేదా ‘‘సంవిధాన్‌ దివస్‌’’ అని కూడా పిలుస్తారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 26 న జరుపుకుంటారు. 26 నవంబర్‌ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను, డాక్టం బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.– బి.రామారావు దొర

ఈ దేశ ఆదివాసులకు భారత రాజ్యాంగం షెడ్యూల్‌ 5,6 ద్వారా ప్రత్యేకమైన రక్షణ వలవలయాలు (బపర్‌ జోన్స్‌) రూపొందించింది. భూమి హక్కులు,వనరులు పరిరక్షించడంతో పాటు భాష,సాంస్కృతి, సాంప్రదాయక విలువలను కూడా ఈరక్షణ వలయంలోకి తీసుకువచ్చింది.ఈషెడ్యూల్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిరక్షణకు 1/70భూ వదలాయింపు నియంత్రణ చట్టం చేసింది.1917 ుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ aఅస ూaఅస ుతీaఅంటవతీం Aష్‌, 1917 (Aష్‌ చీశీ.1శీట 1917)’’ఈ చట్టానికి మూలం కాగా,ఈ చట్టం రూపకల్పనకు కారం తమ్మన్న దొర చేసిన పోరాటం స్పూర్తిగా నిలిచింది. ఆ తరువాత 1935, 1959 సవరణల తరువాత 1970లో ఏజేన్సీ ప్రాంతంలో ఆదివాసులు-ఆదివాసేతరు లకు మద్య అన్నిరకాల భూబదలాయింపులు పూర్తిగా నిషేదించబడిరది. షెడ్యుల్డ్‌ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిని బలపరుస్తూ,స్థానిక సంస్థల పరిపాలనను చూసుకోవడానికి పెసా చట్టం, 1996 ను తీసుకు వచ్చారు. వందల ఏళ్లుగా అదారపడ్డ అటవీ భూములకు యాజమాన్యపు హక్కులు సుస్థిరం చేయడానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రూపకల్పన చేసారు.షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగల పట్ల అత్యాచారాలు,ద్వేషపూరిత నేరాలను నిరోధించడానికి భారతపార్లమెంటుఎస్సీ,ఎస్టీ అట్రాసిటి (అత్యాచారాల నిరోధక) చట్టం,1989 తీసుకు వచ్చింది. ఆదివాసులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటానికి షెడ్యూల్డ్‌ ప్రాంత ఋణ (వడ్డీ) వ్యాపార నిబంధనలు 1960,రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు మరియు వెనకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రాల జారిచట్టం`1993వంటి రక్షణ వ్యవస్థలు రూపొందించబడి ఉన్నాయి. అంతేకాకుండా,జాతీయ విధానాలు (చీa్‌ఱశీఅaశ్రీ ూశీశ్రీఱంఱం), మార్గదర్శకాలు (Gబఱసశ్రీఱఅం) చాలానే ఉన్నాయి.
క్షేత్రస్థాయి ఆచరణలో ఆదివాసుల హక్కులపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన వారి హక్కులకు భంగంకలుగుతూనే ఉన్నాయి.రోజురోజుకు వారిహక్కులు ఉల్లంఘించబడుతూ ఉంది. బలమైన రాజ్యాంగవ్యవస్థలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఆదివాసుల స్థితి ఏమిటి అంటే?ఉన్న చట్టాలు అమలు కోసం లేదా పరిరక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, జరుగుచున్న ఉల్లంఘనలను అడ్డుకో వడానికి కొత్త చట్టాలు రూపకల్పనకు మరో పోరాటం చేస్తు ఉండాలి.దొంగ ఎస్టి సర్టిఫికెట్లుతో ఎస్టీల లోకి చొరబడిన వారు దొంగ ఎస్టీ విద్యార్థులు,దొంగ ఎస్టీ ఉద్యోగులు,దొంగ ఎస్టీ రాజకీయ నాయకులు, దొంగ ఎస్టీ ఓటర్లు, దొంగ ఎస్టీ లబ్దిదార్లు ఆదివాసులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యంగా ప్రయోజనాలు, భూములు దొంగిలిస్తున్నారు.వీరికి పాలకపక్షాలన్ని మద్దతుగా నిలుస్తున్నారు.భారతదేశం అత్యంత వైవిధ్యమైన ఆదిమా సముహాల జనాభాకు సాక్షిగా నిలుస్తుంది.ప్రతి తెగకు దాని సొంత పాత్ర,గుర్తిం పు,స్వభావం కలిగి ఉంటుంది.ఉదాహరణకు,మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలోని ఆదివాసుల జీవితం, పరిస్థితులకు – ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లోని తెగల స్థితులు భిన్నంగా ఉంటాయి. దేశంలోని ఆదిమ సమూహాలు 18 రాష్ట్రాలలో విస్తరించి దేశ జనాభాలో 8.6% (104.2 మిలియన్లు) ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ఈ సమూహాలు మెజారిటీగా ఉండగా (ఉదా:ఈశాన్య రాష్ట్రాలు), ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ ప్రంతాలలో చిన్నచిన్న భూ భాగా లుగా ఉన్నాయి.వీరిచట్టాలు కేంద్ర,రాష్ట్రా ప్రభు త్వాలచే అమలు చేయబడతాయి.భారత రాజ్యాంగం ఆదివాసుల ప్రయోజనాలను,ప్రత్యేకించి వారి భూమిపై వారి స్వయం ప్రతిపత్తి హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5,6 ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది.ఇది ఆదివాసీ సమూహాలను దోపిడీ నుండి రక్షించడానికి,వారి భూమిపై వారి హక్కులను కాపాడు కోవడానికి దోహద పడుతుంది.
ఐదో షెడ్యూల్డ్‌ నియమాల ప్రకారం సాధారణ పరిపాలనకు ఉద్దేశించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన చట్టాలను షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తిస్తా యని జారిచేసిన నోటిఫికేషన్‌ లేదా ఆ చట్టాలను కొన్ని మినహాయింపులు, కొన్ని చేర్పుల (జుఞషవజ్‌ూఱశీఅం aఅస వీశీసఱటఱషa్‌ఱశీఅం)తో ఈ ప్రాంతానికి వర్తింపచేసేటట్లు రాష్ట్ర గవర్నర్‌,టిఎసితో కలిసి తగిన నిర్ణయం తీసుకుని వర్తింపచేయవలసి ఉంటుంది. ఇది ఐదో షెడ్యూల్డ్‌ లోని పేరా 5(1డ2) వెసులుబాటు కల్పిస్తుంది.దీనికి ఉదా హరణ:1994లో 73వరాజ్యాంగ సవరణ ద్వారా రూ పొందించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టం నియ మాల ప్రకారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, 1996లో పంచాయతీరాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత విస్తరణ చట్టం (పెసా) కేంద్ర చట్టం చేసే వరకు ఇదేళ్ళపాటు (1995-99) షెడ్యూల్‌ ప్రాంతంలో హై కోర్టు తీర్పుతో రద్దుచేసారు. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను మినహాయింపులు లేదా చేర్పుల లేదా కొత్త చట్టాలు రూపొందించడానికి టిఎసిదే కీలకపాత్ర.కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న ఇంకా కౌన్సిల్‌ ఏర్పాటు జరగలేదు. నియమా నుసారం జరజవలసి రాజ్యాంగ ప్రక్రియాను నిర్లక్ష్యం చేయడం లేదా దానిని రాజకీయ సంస్థగా చూడటం వలన ఆదివాసులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఇది అణ గారిన అదివాసి ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1950 జనవరి 26 నాటికి షెడ్యూల్‌ తెగలుగా గుర్తించబడి షెడ్యూల్డ్‌ ప్రాం తంలో నివాసం ఉంటున్న స్థానిక తెగలతో టిచర్‌ పోస్టుల భర్తికి ఉద్దేశించిన జీవో నెంబర్‌ 3రద్దు తర్వాత అదివా సులలో ‘షెడ్యూల్‌ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం’ చేయాలని డిమాండ్‌ ముందుకు వచ్చింది.నిజానికి ఈ డిమాండ్‌ కొత్తగా లేవనెత్తిన గొంతెమ్మ కోరిక కానేకాదు. రాజ్యాంగ కర్తలు ఐదో షెడ్యూల్‌ పేరా5లో పొందు పరచిన అంశమే.ఈ ప్రక్రియా రాజ్యాంగ వ్యవస్థ అయిన టిఎసిని ఏర్పాటుచేసి, ఆదివాసీ శాసనసభ్యులంత సంత కాలుచేసి,తిర్మాణాన్ని ఆమోదించి గవర్నర్‌ గారికి పం పాలి.రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపాలి.ఆతీర్మానం ఆమోదం పొందితే ఆదివాసుల ఉద్యోగ భద్రతకు చట్టబద్దత వస్తుంది.ఇది రాజ్యాంగ ప్రక్రి యనే అయినప్పటికీ,ఉభయ తెలుగు రాష్ట్రాలు కనీస ప్రయత్నం చేయకుండా గుమ్మనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో గతప్రభుత్వం చేసిన టిఎసి తీర్మానం గవర్నర్కు ఆమోదం కోసం పంపిన సరిపోతుంది.లేదా టిఎసి ఏర్పా టు చేసి, తీర్మానాన్ని ఆమోదించి పంపాలి. లేదంటే, నాణ్యత లేని అరకొర చదువులతో ఏజేన్సీ ప్రాంత తెగలు, ఇప్పుడున్న పోటిని ఎదుర్కొని ఉద్యోగాలు పొందడం అంత సులువు కాదు. జీవో నెంబర్‌ 3రద్దు తరువాత,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడకి లేఖ రాస్తూ, ‘ఆదివా సుల హక్కులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సాను భూతి లేకపోవడం వలన అణగారిన ప్రజలు వారి పురోగతికి,సాధికా రతకు ఆటంకం కలిగిస్తున్నార’ని తన లేఖలో పేర్కొ న్నారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అరుకు సభలోను,అమరావతిలో జరిగిన ‘ప్రపంచ ఆది వాసి దినోత్సవ’ సభ లోను జివో నెం.3ని మళ్లీ తీసుకు వస్తానని బాబుప్రకటించారు.ఈప్రకటన వయసు మిరు తున్న ఆదివాసీ నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.అయినా,మెగా డిఎస్సి -2024 నోటిఫికేషన్‌ జారీకి ముందు ఏజేన్సీప్రాంతానికి కేటాయించిన పోస్టు లు గురించి సరిjైున నిర్ణయం తీసుకోకుండా జెనరల్‌ రోస్టర్‌ ప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ఆదివాసులకు గత పాలకులపై కలిగిన అపనమ్మకం, చంద్రబాబుపై పెట్టుకున్న ఆశ నెరవేరాలని ఆశిద్దాం…(నంబర్‌ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్బంగా… వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌, అల్లూరి జిల్లా)