ఆగని ఆకలి కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు

పేదరికం ఒక విషవలయం.కనీస అవస రాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొంద లేని స్థితిని‘పేదరికం’అని ఐక్యరాజ్య సమితి నిర్వ చించింది.పేదరికం బాధను అంధుడుసైతం చూడ గలడంటూ నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వాపోయారు.ఆకలి,అనారోగ్యం ఈ రెండూ పేదరి కం కవలలు. పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత,నిరుద్యోగం వంటి మౌలిక సమ స్యలతో భారత్‌ నేడు సతమతమవుతోంది. స్వాతం త్య్రానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొంద రికే పరిమితం కావడంతో బీద ధనిక అంతరాలు కొనసాగుతున్నాయి.పోషకాహార లోపాలను అధిగ మించడంలో కొంత ముందడుగు పడినా, చేయా ల్సింది మరెంతో ఉందని క్షేత్రస్థాయి వాస్తవాలు చాటుతున్నాయి.2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్ల వ్యవధిలో 27.1కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు గణాంకాలు చెబుతున్నా, 130కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరి కంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ నివేదిక స్పష్టీకరించింది.
పథకాలు ఎంత వరకు గట్టెక్కిస్తాయి?
ప్రధానిగా ఇందిర అయిదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం తరవాత చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇప్పటి గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాల వరకు పేదల సంక్షే మం కోసం ప్రభుత్వాలు అనేకానేక పథకాలు చేపడుతూ వచ్చాయి. హరిత విప్లవం పుణ్యమాని 60వ దశకం చివరలో వ్యవసాయ ఉత్పత్తుల పెరు గుదల ఆహార భద్రతకు బాటలుపరచింది. అన్నా ర్తుల ఆకలి కేకలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. పేద రైతులకు పెట్టుబడి సాయాలు, పేదలకు పింఛను పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా కిందకు దిగిరానం టున్న పేదరికం గణాంకాలు వెక్కిరిస్తూనే ఉన్నా యి.ఈ తరహా పథకాలద్వారా ఆకలి మంటల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని ఇన్నేళ్ల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి. పేదలకు ఆదాయ భద్రతతో పాటు విద్య,వైద్యం,రక్షిత తాగునీరు వంటివి అం దాలి.దారిద్య్ర రేఖను స్వయంకృషితో అధిగ మించేలా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా వీటికోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆశించిన స్థాయి లో లేవు. సేవల నాణ్యతా పలు విమర్శలకు తావి స్తోంది.పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహాలు అవసరమని దీన్నిబట్టి బోధపడుతోంది.తాజా ప్రపంచ ఆకలిసూచీ-2019 నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న చిన్నారులు 2008-12మధ్యకాలంలో 6.50 శాతం నమో దైతే, 2014-18 మధ్యకాలంలో వారి సంఖ్య 20.83 శాతానికి పెరిగింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది. వాస్త వానికి పేదరికాన్ని ఎలా గణించాలన్న దానిపై ప్రభుత్వపరంగానే స్పష్టత కొరవడుతోంది. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం నియమించిన అలఫ్‌ు కమిటీ (1979), లకడాయీలా (1993), తెందూల్కర్‌(2009),రంగరాజన్‌కమిటీ(2014) లు పేదరికం గురించి భిన్నమైన నిర్వచనాలు ఇవ్వ డమే దీనికి దాఖలా.ఆ మేరకు తెంద్కూలర్‌ కమిటీ దేశంలో పేదలు 22శాతమని అంచనా వేయగా, రంగరాజన్‌ కమిటీ 29.5శాతమని చెప్పింది.

ఆ వర్గాల వారే ఎక్కువగా!
జీవితమంతా పేదరికంతో మగ్గినవారిని శాశ్వత పేదలంటారు. వీరు తరవాతి తరానికీ పేదరికాన్ని బదలాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఎస్సీ, ఎస్టీల్లో ఉంటున్నారు. ‘క్రానిక్‌ పావర్టీ రీసెర్చ్‌ సెంటర్‌’ పత్రాల ప్రకారం దేశం లోని పేదల్లో 50శాతం ‘శాశ్వత పేదరిక’ పరిధి లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్టీల్లో పేదరికం తగ్గుదల మిగిలినవారికన్నా తక్కువ. 1993-94,2004-05 సంవత్సరాలనాటి అంచ నాల ప్రకారం దేశవ్యాప్తంగా పేదరికం 37శాతం నుంచి 27శాతానికి దిగివస్తే, ఎస్టీల్లో మాత్రం 51.9 శాతం నుంచి 47.3 శాతానికే తగ్గింది. దీన్నిబట్టి పేదరిక నిర్మూలన పథకాలు వీరికి చేర వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అవ గతమవుతోంది.పేదల స్థితిగతులు ఇలాఉంటే, దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతు న్నారు. 2018లో కేవలం ఒక శాతం ధనవంతుల సంపద 39శాతం అధికమైతే, అట్టడుగున ఉన్న సగం జనాభా సంపద మూడు శాతమే పెరిగింది. దేశంలో సగానికిపైగా సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉంది. పదేళ్లపాటు జీడీపీలో తొమ్మిది శాతం వృద్ధి సాధ్యపడితే ప్రగతిఫలాలు అట్టడుగు స్థాయికి చేరి పేదరికం నిర్మూలన సాధ్య పడుతుందన్న అంచనాలు గురితప్పాయి. గ్రామీణ పేదరికానికి పగ్గాలు వేయగల వ్యవసాయానికి సరైన గిట్టుబాటు దక్కకపోవడం శాపమవుతోంది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే, పట్టణా ల్లో అవి పెరుగుతున్నాయి.
లోపాలను అరికట్టితే చాలు
భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశ స్వాతంత్య్ర పరమార్థమని మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన లక్షిం చారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం రాజకీ య స్వాతంత్య్రాన్ని మాత్రమే సాధించుకున్నామని అప్పట్లో అన్నారు. సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్ర సాధన తదుపరి లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థికన్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగ నిర్మాతల ఆశయం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ లక్ష్య సాధనకు దూరంగా ఉండటం మన వ్యవస్థల వైఫ ల్యాలనే చాటుతోంది. పన్నెండు పంచవర్ష ప్రణా ళికలు, మూడు వార్షిక ప్రణాళికలు కాలగర్భంలో కలిసిపోయినా,భారత్‌ ఇంకా దిగువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనుగడ సాగి స్తోంది. దేశంలో క్రమేపి పేదరికం తగ్గు ముఖం పడుతోందని చెబుతున్నా, ప్రభుత్వ సంక్షేమ పథ కాల అర్హుల సంఖ్య ఏటాపెరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు పేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలు పలికి తీసుకురావాలి. పథకాల అమలులో లోపా లను అరికట్టి అర్హులకే లబ్ధి నేరుగా చేరేలా జాగ్రత్త లు తీసుకోవాలి. సంక్షేమ ఫలాలను పేదలు సద్వి నియోగం చేసుకునేలా చైతన్యపరచాలి. తద్వారా పేదరికం కోరల నుంచి వారు బయటపడేలా చేయాలి.- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు