అరుదైన తాబేళ్లకు ఆపద

మానవ తప్పిదాలు..సముద్ర జలాల కాలుష్యం..అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల పాలిట శాపంగా మారుతున్నాయి.ఇక్కడి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న క్రమంలో చేపల వలలకు చిక్కి,బోటు పంఖాలు తగిలి కొన్ని మృత్యువాత పడుతున్నాయి.కాలుష్యం కార ణంగా మరికొన్ని చనిపోతున్నాయి.పరిస్థితి తీవ్రత గమనింఎచిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వీటి మృతికి కారణాలు తెలసుకుని పూర్తిస్థాయిలో దరాస్యప్తు చేయాలని ఆదేశిం చారు. అధికారులు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమకులు చెబుతున్నారు.విశాఖ తీరంలోనూ తాబేళ్ల మరణాలు కలవరపెడు తున్నాయి. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం వీటి కళేబరాలను చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాబేళ్లు ఎక్కడ పుడితే అక్కడకే చేరి గుడ్లు పెట్టే సుగణం వీటికి ఉంది.ఈనేపథ్యంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లుపై ప్రత్యేక కథనం..
ఆలివ్‌ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా
అరుదైన ఆలివ్‌ రిడ్లీ(సముద్ర తాబేళ్ల)లకు అమ్మ ఒడిలా ఒడిశా రాష్ట్రం ఆత్మీయత పంచుతోంది.ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి.తీరంలో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవు తున్నాయి.ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు.అవి పిల్లలుగా మారిన తర్వాత సముద్రంలోకి వదులుతున్నారు.ఆలివ్‌ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి.ఆ రాష్ట్రంలోని గహీర్‌మఠ(కేంద్రపడ జిల్లా),రుషికుల్యా ముఖద్వారం(గంజాం జల్లా),దేవీ ముఖద్వారం(పూరీజిల్లా)తాబేళ్ల పునరుత్పిత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్‌..
వేల కి.మీ.దూరం ప్రయాణించి పునుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశాఖ తీరాలకు వస్తుంటాయి.తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరా లు,తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలివ్‌ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు.ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు.ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధికుక్కలు,నక్కలు తినేయ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత ఆలివ్‌ రిడ్లేలు సముద్రంలో ఎంత దూరం వెళ్లుతున్నాయి?మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియోట్యాగ్‌లు అమర్చు తున్నారు. పరిశోధనలకు ఆచర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్‌ రిడ్లీలు..?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్‌రిడ్లీ.ఇవి చూడటానికి ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి.అందుకే వీటికి ఈపేరు వచ్చింది.పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్‌ వర్ణంలోకి మారి పోతాయి.వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది.పశ్చిమ అట్లాంటిక్‌ తీరంలో నివసించే ఆలివ్‌ రిడ్లీలు తూర్పుపసిఫిక్‌ ఆలివ్‌రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి.యుక్తవయస్సు వచ్చినా వీటి పరిమాణం 2నుంచి 2.5అడుగులు మాత్ర మే పెరుగుతుంది.ఒక్కోక్కటి 36నుంచి 49కిలోల బరువుంటాయి.వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్‌ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి..
ఆలివ్‌ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్ట పడతాయి.పసిఫిక్‌,అంట్లాంటిక్‌,హిందూ మహాసముద్ర తీరాల్లో అవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం తీరాల్లో ఆలివ్‌ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది.శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాటిక్‌ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆలివ్‌ రిడ్లీలు సర్వభక్ష కాలు..అంటే ఇవి మొక్కలను తింటాయి.అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే,ఎండ్ర కాయలు,పీతలు,రొయ్యలు,చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి.కొన్నిసార్లు ఆలివ్‌రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో500అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు.ఇక ఈఆలివ్‌ రిడ్లీలు తమజీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయ నాలు జరుగుతున్నాయి.అయితే,చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూ హంగా ఏర్పడతాయి.ఎండలో అలాగుంపులుగా నిల్చోని పరస్పర తోసు కుంటూ కన్పిస్తాయి.ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ తాయి.ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల,వేల మైళ్లు సునాయసంగా ప్రయాని స్తాయి.అలా వచ్చినవన్నీ ఒకచోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్‌’ అని అంటారు.ఇక్కడే ఆడతాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు..వందల సంఖ్యలో గుడ్లుపెడతాయి.-గునపర్తి సైమన్‌