అంబరాన్నింటిన ఆదివాసీ సంబరాలు
‘‘ గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు.పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది…వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు నేను తప్పకుండా శ్రద్ధ తీసుకుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళికతో పేదరికాన్ని తగ్గిస్తాం. పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో డోలీ మోతలు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధింపులకు పాల్పడను. కానీ రాష్ట్ర ప్రజల ఖజానాను, ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈ రోజు నుండి చైతన్యం 2.0ప్రారంభమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవాడుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నా..’’ `- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగష్టు 9న జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సంబరాలు అంబరాన్నింటాయి.అంత ర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ రాష్ట్రం లోని గిరిజనులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ సిద్ధాం తాలల్లో ఒకటని గుర్తు చేశారు. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి హాజరైన సీఎం గిరిజ నులతో మమేకమయ్యారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి,ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం చేశారు.అనంతరం గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించి, వారితో మమేకమయ్యారు.ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటిం చారు.అనంతరం అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు, గిరిజనుల తయారు చేసిన ఉత్ప త్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల వద్దకు వెళ్లారు.గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జా తీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించా మని చెప్పారు.గిరిజన జాతులను కాపాడు కోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్న తంగా నిలబెట్టడమే అని పేర్కొన్నారు. రాబో యే రోజుల్లోనూ గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని గిరిజను లకు,వారి బిడ్డలకు మంచి భవిష్యత్ను అంది స్తామని హామీ ఇచ్చారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆదివాసీ ప్రజలను ఉద్దే శించి ప్రసంగించారు.‘గిరిజనులు పేదరి కంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించు కోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి.ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది..వారిని అన్ని విధాలా పైకి తీసుకొ చ్చేందుకు నేను తప్ప కుండా శ్రద్ధ తీసు కుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళి కతో పేదరికాన్ని తగ్గిస్తాం.పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటి లిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈరోజుల్లో డోలీ మోత లు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధిం పులకు పాల్పడను.కానీ రాష్ట్ర ప్రజల ఖజా నాను,ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈరోజు నుండి చైతన్యం 2.0ప్రారం భమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవా డుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుం టున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థుల కోసం శిక్షణా కేంద్రాలు
‘ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం.డీఎస్సీకి పోటీపడే గిరిజన అభ్య ర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం.గిరిజన విద్యార్థుల కోసం విశాఖ,విజయవాడ, తిరుపతి లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తాం.ఆదివాసీల్లో అనేక కళలున్నాయి.అరకు గిరిజన నృత్యం దేశంలోనే ప్రత్యేకమైంది. అనేక కళలున్న ఆదివాసీలు చాలా రంగాల్లో వెనకబడి ఉన్నా రు. ప్రతి యేడాది ఆగస్టు 9న ప్రపంచ ఆది వాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని జీఓ నెంబర్ 123ను నాడు తెలుగుదేశం ప్రభుత్వం లోనే విడుదల చేసి నిర్వహించాం.కానీ గత ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిం చడం మానేసింది.మన దేవానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. పాఠశాలలో ఉపాధ్యా యిరాలిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారంటే అదీ ఆదివాసీల్లో ఉండే ప్రతిభ. ఆదివాసీలు అనగానే శౌర్యం, ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రకృతిని ఆరాధి స్తారు.ఎగ్జిబిషన్ లో ఏకలవ్యుడి ఫోటోలు చూశాను. గిరిజన కుటుంబంలో పుట్టాడు. విలువిద్యను అందించేందుకు గురువులు నిరాకరిస్తే పట్టుదలతో విద్యనభ్యసించి అంద రికీ ఆదర్శంగా నిలిచారు.బిర్సాముండా, తాత్వాబిల్, మన తెలుగువారైన కొమరం భీం లాంటి వాళ్లు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అల్లూరి సీతారామరాజు మీ అండతోనే బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంతం చేయడానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. అందుకే దేశానికే ముద్దబిడ్డగా మిలిగిలారు.మీ త్యాగాలు, మీమద్దతు జాతి మరవదు. దేశంలో 10.42కోట్ల మంది గిరిజనులున్నారు. రాష్ట్రం లో 5.56శాత మంది ఉన్నారు.’అని సీఎం వివరించారు.
ఆదివాసీలు వెనకబాటుతనంపై సమగ్ర అధ్యయనం
‘మీలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. మైదా నంలో ఉండే వారి జీవన ప్రమాణాలు తక్కువ గా ఉన్నాయి…ఏజన్సీలో ఉండే వారికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. సమైఖ్య రాష్ట్రంలో చైతన్యం అనే కార్యక్రమం పెట్టి పెనుమార్పు లకు శ్రీకారం చుట్టాం. మైదాన ప్రాంతాల్లో ఉండేవారి కంటే ఏజన్సీలో ఉండేవారికి వనరులు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అరకు కాఫీని ప్రమోట్ చేశాం.అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను అందిం పుచ్చుకున్నాం.చాలామంది అర్గానిక్ ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు.ఎక్కడా దొరకని తేనె మన ప్రాంతాల్లో దొరుకుతోంది.కాఫీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు సాగును ప్రోత్సహించాం.ప్యారిస్లో కూడా ప్రస్తుతం అరకు కాఫీ అమ్ముతున్నారు.కొన్ని పెద్ద పత్రి కలు కూడా అరకు కాఫీ గురించి రాస్తు న్నాయి. వ్యవసాయంలో అరకు కాఫీ కూడా భాగమని కథనాలు రాస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆదివాసీల మహిళలు డ్వాక్రా సంఘాల్లో కూడా ఉన్నారు. పేద మహిళలను సంఘటిత శక్తిగా మార్చాలని నాడు ఆలోచించాను.మారుమూల ప్రాంతా ల్లోని ఆడబిడ్డలు చేసే కుల,చేతివృత్తులను ప్రోత్సహించాం.మల్టీ గ్రెయిన్ బిస్కెట్ల తయా రీని ప్రోత్సహించాం.ఏపని చేసినా అనునిత్యం సాధన చేస్తూ నైపుణ్యం పెంచుకుంటే ఆదా యం వస్తుంది. కానీ ప్రభుత్వం నుండి ఆధా రం లేకపోవడంతో దెబ్బతిన్నారు.ఆదివాసీలు ఎందుకు వెనకబడి ఉన్నారో అధ్యయనం చేస్తున్నా’నని అన్నారు.
గత ప్రభుత్వం దుర్మార్గంగా16 సంక్షేమ పథకాలు రద్దు చేసింది
‘స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లైంది.చాలా వర్గాలు అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాయి. కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆదివాసీల్లో పుట్టిన పిల్లలతో పాటు తల్లులు కూడా చనిపోతున్నారు.ఈ సంఖ్యను తగ్గిం చాలి. పిల్లల సంఖ్య తగ్గితే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మన పిల్లలే మనకు ఆస్తి. వారిని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్న ప్పుడు చూసుకుంటారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.72లక్షలు ఉంటే ఏపీలో రూ. 2.20లక్షలు ఉంది. కానీ ఆదివాసీల్లో రూ.1.20లక్షలే ఉంది.పేదల జీవన ప్రమా ణాలపై శ్రద్ధ పెడతాం. అన్ని విధాలా పైకి తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 16పథకాలు తీసుకొచ్చాం.199 గురు కులాలు తీసుకొచ్చాం.2,705 విద్యాసంస్థల్లో ప్రస్తుతం 2,45,380 మంది విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు.ఆదివాసీల్లో విద్యాభ్యాసం తక్కువగా ఉందని ఆలోచించిన ఎన్టీఆర్ ఏ ఊరిలో స్కూలు కావాలంటే ఆఊరిలోనే స్కూలు నిర్మిం చారు. గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉపాధ్యా యులుగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్.మీ పిల్లల విద్య కోసం 2014-19లో రూ.450 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం సగం కూడా ఖర్చు చేయలేదు. గిరిజన పిల్లలు అటవీ ప్రాంతాలకు పరిమితం కాకూడదని ఐఏఎస్, ఐఐఎంలలో చదవాలని శ్రద్ధ పెట్టాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కు వెళ్లేందుకు 1000మందికి రూ.13కోట్లు ఖర్చు చేశాం.కానీ గత ప్రభుత్వం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి ముగ్గురికే ట్రైనింగ్ ఇచ్చింది. గిరిజనుల్లో ప్రతిభ ఉంది… దాన్ని సానబెట్టి బయటకు తీయాలి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విదే శాల్లో చదువుకునేందుకు రూ.15లక్షల చొప్పున సాయం అందించి 55మందిని విదేశాలకు పంపాం.దీనికోసం రూ.7.5కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకుని ఒక్కరికి మాత్రమే విదేశీ విద్యను అందించింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లలో చదు వించుకునేవారి కోసం ప్రభుత్వం నుండి ఫీజు లు చెల్లించాం.గిరిపుత్రిక కింద 9,222 మంది గిరిజన యువతులకు రూ.56కోట్లు పెళ్లి కానుక అందించాం.దాన్ని కూడా గత ప్రభు త్వం నీరుగార్చింది.గిరిజనులు చనిపోతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం బీమా ద్వారా అందిం చాం. రహదారి సదుపాయం లేని ప్రాంతాల నుండి ఆసుపత్రులకు డోలీల్లో వెళ్తున్నారని గుర్తించి ఫీడర్ అంబులెన్సులు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం వాటిని కూడా నిర్వీర్యం చేయడంతో మళ్లీ డోలీల్లో మొసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. డోలీల్లో తీసుకొచ్చే సమయంలో ప్రసవం అవుతున్నారంటే ఏంటి ఈ దౌర్భా గ్యం.ఆధునిక యుగంలో ఉన్నాం…అయినా డోలీల్లో తీసుకొస్తున్నారంటే అందరూ బాధ పడాలి.ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే మాతా,శిశు మరణాలు తగ్గుతాయి. సరైన పౌష్టికాహారం అందించేందుకు బాలింతలు, పిల్లలకు ఫుడ్ బాస్కెట్ ప్రవేశపెట్టాం. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి దోమ తెరలు అందించాం. ట్రైకార్ ద్వారా ఉపాధి, భూమి కొనుగోలుకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేశాం.మేము ఉచితంగా కరెంట్ ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలు నిలిపేస్తే లేట్ రైట్ పేరుతో తవ్వ కాలు చేశారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు
‘ఆరోగ్య,ఆర్థికంతో పాటు కుటుంబానికి కావా ల్సిన వసతులపై సమగ్ర విధానం తీసు కొస్తాం. ఇంకా విద్యుత్తు, మరుగుదొడ్లతో పాటు తాగునీరు లేని గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీస అవసరాలు కల్పిస్తాం. గిరిజన వాడల్లో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. పాఠశాలకు పిల్లలందరూ వెళ్తున్నారో లేదో కూడా సమీక్ష చేస్తాం. గ్రామంలోని వనరులు ఉపయోగించి ఆదాయం పెంచే మార్గం చూపిస్తాం.ట్రైకార్ ద్వారా రుణా లు ఇస్తాం.2014-19 మధ్య ఇచ్చినట్లుగానే ఇన్నోవా కార్లు అందిస్తాం.గతంలో 80 స్కూళ్ల ను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్చాం…వాటి కోసం కొత్త భవనాలు నిర్మిస్తాం.గిరిజనుల్లోని సమరయోధుల త్యాగాలను తెలియజేసేందుకు లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. దేశంతో పాటు, ప్రపంచం లోని ముఖ్య నగరాల్లో అరకు కాఫీని ప్రమోట్ చేసి మరింత గుర్తింపు తీసుకొస్తాం.అరకు కాఫీ నాణ్యతను పెంపొందిస్తాం. వాణిజ్య పంటల కంటే కాఫీ పంటకు ఆదాయం అధికంగా వచ్చేలా చేస్తాం.మీరు పండిరచే ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తాం.తయారు చేసే వస్తువులను ఓఎన్డీసీ ఫ్లాట్ ఫాం ద్వారా వినియోగదారులకు నేరుగా వినియోగించేలా చేస్తాం.జీవో నంబర్ 3 నాకు బాగా గుర్తు ఉంది.నేనే తీసుకొచ్చా.విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నికలు ఉండ టంవల్ల మాట్లాడలేకపోతున్నా…మీ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలో అదంతా చేస్తా. సీతంపేట ఐటీడీఏలో రూ.7కోట్లతో సమగ్ర పసుపు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్ ను రూ.2.54 కోట్ల తో అభివృద్ధి చేస్తాం. పార్వతీపురం ఐటీడీఏ కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం.చింతూరు ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తి పోతల పథకాలను రూ.2.5 కోట్లతో నిర్మిస్తాం. పాడేరులో మెడికల్ కళాశాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తాం.418 ఏకో పాధ్యాయ పాఠశాలలకు రూ.50 కోట్లతో భవనాలు పూర్తి చేస్తాం. అల్లూరి సీతారా మరాజు మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రంలో మూడు ప్రధాన రహదారుల కారిడార్ను రూ.50కోట్లతో పూర్తి చేస్తాం.పాడేరు ఏజన్సీలో రూ.10కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. 2,191 గిరిజన గ్రామాలకు త్వరలో రోడ్డు మార్గాలు నిర్మిస్తాం. 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు తాగునీరు లేదు,ఆ ప్రాంతాలకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తాం.’అని సీఎం హామీల వర్షం కురిపించారు.
మీ భూములు దోచుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేశాం
‘ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలపడమే కాదు…నిర్ధిష్ట ప్రణాలి కతో అభివృద్ధి చేస్తాం.అరకు పార్లమెంట్ పరిధిలో 5స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. మంచి పనులు జరగాలంటే ఆలోచనా విధానం కూడా మారాలి.మొన్నటి ఎన్నికల్లో సుడిగాలి వచ్చింది…ఆ సుడిగాలిలో తిరిగి రానంతగా జగన్ కొట్టుకుపోయారు. దీనికి కారణం అవినీతి, దోపిడీ, పేదల పొట్టకొట్టే పాలకులు ఉండటమే. ఇక్కడుండే వారిని అడుగుతున్నా….గత ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? మీకు ఒక్క రుణమైనా ఇచ్చిందా.? మీ పిల్లల భవిష్యత్తు ను నిర్వీర్యం చేశారు.గిరిజనులపై దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టారు.అందుకే నిశ్వబ్ధ విప్లవం వచ్చి ఎవరూ ఊహించని విధంగా 93శాతం స్థానా లు కూటమికి వచ్చాయి. మీరు అనేక కష్టాలు అనుభవించారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్ష ల కోట్లు అప్పులు చేసింది..వాటికి ప్రతి నెలా వడ్దీలు కట్టాలి. ఇప్పటికే కొన్ని పథకాలు అమ లు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన విధం గానే పింఛను రూ.3వేల నుండి రూ.4వేలకు పెంచి పెద్దకొడుకుగా ఉన్నా. వాలంటీర్ల లేకుం టే పింఛన్లు ఇవ్వలేరని చెప్పి 35 మంది వృద్ధు ల ప్రాణాలు తీశారు. కానీ మనం ఒక్కరోజు లోనే 97శాతం మందికి పింఛన్లు అందిం చాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం.రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా మీభూములను దోచుకోవాలని చూశారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశాం.’ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
– గునపర్తి సైమన్