కాఫ్‌28 సదస్సులో నిర్ధిశిష్టమైన నిర్ణయాలు అవశ్యం!

వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్‌ సమావేశాలు నవంబర్‌ 30న జరుగుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు చర్చించుకోవాల్సి ఉంది.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో ఐక్యరాజ్య సమితి వాతావరణమార్పుల 28వసదస్సు మానవాళి భవిష్యత్తును నిర్ధేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది.అతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాఫ్‌28సమావేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.దీనికి కేంద్రబిందువుగా భారత్‌ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌(లైఫ్‌)కార్యక్రమం ఉండాలి.సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్‌ దోహదపడుతుంది.
వాతావరణంలో సంభవించిన మార్పుల్లో ప్రధానమైనవి ఓజోన్‌ పొరు క్షీణత,పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు,మంచుకొండలు కరిగిపోవడం వంటి కారణాలున్నాయి.దీనికి మానవ జీవనశైలిలో సంభవిస్తున్న పెనుమార్పులు ఒకకారణంగా నిపుణులు భావిస్తున్నారు.ఇవన్నీ కూడా అభివృద్ధిపేరుతో వస్తున్న పారిశ్రామిక విప్లవమే మానవాళి వినాసానికి నాంది పలుకుతోంది.దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడాబహుళజాతి కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతున్నాయి.పారిస్‌ ఒప్పందం ప్రాథమికంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వంఉన్న ఉష్ణోగ్రతలు1.5 సెంటిగ్రేడ్‌ పెరుగుతున్నాయి.ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌ సదస్సుల ఉద్దేశం కూడాఅదే.కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించుకోవడానికే ఈసదస్సులు ఏర్పాటు చేస్తారు.భూతాపాన్ని తగ్గించడానికి ఏమాత్రం గడువు లేదు. సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ప్రధానంగా ఇంధన,భూవినియోగం, నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగల మని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం.ఇందుకుగాను వ్యక్తిగతంగా తీసుకురావాల్సిన మార్పు లనూ నివేదికలు సూచిస్తున్నాయి.
పదిహేను రోజులపాటు కొనసాగే కాన్పరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)28సమావేశానికి,వాతావరణ మార్పులపై జరిగే ఇతరసమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది. ధనిక దేశాలు అనేకం కాప్‌ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడుతాయి.అలివికాని హామీలా గుప్పిస్తాయి. సమావేశాల తర్వాత అన్నింటినీ మరిచిపోతుంటాయి. ఇప్పుడు ఆదేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నాయి.అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు.
సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అలవర్చుకునేందుకు లైఫ్‌ కార్యక్రమం దోహదపడుతుంది.దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది.అప్పుడే ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి.ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి,వృధా వ్యవహారాలకు చెక్‌ పడుతుంది. యుఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చిమమాజియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదేకావడం గమనార్హం.పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్దిక వనరులు యూఏఈవద్ద పుష్కలం.ఈనేపథ్యంలో 2015ప్యారిస్‌ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్‌ సమావేశాలు మరింత ఫలప్రదమవుతాయని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,

ఇటుకల బట్టీల్లో వలసల బతుకులు

రాష్ట్రంలో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.అక్కడ నుంచి వలస వచ్చిన కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా,కనీససౌకర్యాలుకూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనంసాగిస్తున్నారు. పగలనకా,రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న కష్టపడి పనిచేస్తున్న వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఇటుకల బట్టీ యజమానులు కోట్లరూపాయలు గడిస్తున్నారు.బట్టీల నిర్వహణకు మైనింగ్‌,కార్మికశాఖల నుంచి అను మతులు తీసుకోవలసి ఉన్నా ఆనిబంధనలేవీ అమలు కావడం లేదు.
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూశాఖ,కాలుష్య నియంత్రణమండలి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి, కానీకొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడంలేదు.అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు.విశాఖపట్నం,విజయనగరం,అనకాపల్లి,భీమిలితదితర మండలాల్లో రోడ్డుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంవల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం,బట్టీలనుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఇక అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు మట్టి పెళ్లలను పెకిలిస్తున్నాయి.పలకలు పట్టాల్సిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. నిరుపేదలుగా పుట్టటమే వారికి శాపమయ్యింది.ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లాల్సిన వయస్సులో బాలకార్మికులుగా వెట్టిచాకరి చేయిస్తున్నారు. ఈడు పిల్లలు బడిలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా,స్థానిక గ్రామ సచివాలయ వ్యవస్థ, విద్యాశాఖ, రెవెన్యూ కార్మికశాఖ ఈచిన్నారుల అవస్థలు నిత్యం చూస్తున్నా..ఒక్క అధికారి కూడా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.బాల కార్మికులతో ఇటుకలు పేర్చటం,మట్లిపోయడం,ఇటుకలు ఆరబెట్టడం,వంటి పనులు చేయిస్తున్నారు.పని చేస్తున్నకార్మికులకు కనీసవేతనం చట్టం నిబంధనలప్రకారం శ్రమతగ్గా వేతనాలు చెల్లించడంలేదు.ఆ నిబంధనలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలు లేవు. దీంతో కార్మికులే కాకుండా వారి పిల్లల బ్రతుకులు ఇటుక బట్టీలోనే నలిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలతో ఎక్కువ పనిచేయించుకొని తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ ను దోచేస్తున్నారు.
ఇటుక బట్టీల అక్రమార్కులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై బట్టీలను నిర్వహించడంతో అధికారులు వారివైపు చూడటానికి భయపడుతున్నారు.బట్టీ యజమానులు అక్రమంగా మట్టిన త్రవ్వి వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇటుక బట్టీ యజమానులు ఇన్నిరకాల నేరాలకు పాల్పుడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నిర్మాణరంగం పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అక్రమార్జనకే అధికప్రాధాన్యత ఇస్తుందే తప్పా వలస కార్మికులు,బాలకార్మికుల బతుకులను పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారికి కనీసం నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడిఈడు పిల్లల్ని బడికి పంపించేలా విద్యాశాఖ అధికార్లు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,

పెసా చట్టం అమలు చేయాలి

గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన అవశ్యకత ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే గిరిజను గ్రామసభల ద్వారా స్వయంపాలన చేసుకోగలరు. గ్రామసభలు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,ప్రజా ఆస్తులు, గ్రామ రక్షణ,మౌలిక సదు పాయాలు మొదలైన వాటికోసం సొంతంగా కమిటీలు వేసుకొనే హక్కునిస్తోంది.అటవీ భూమి,చిన్న నీటి వనరులు,మైనర్‌ ఖనిజాలు,సహజ వనరుల వినియోగానికి సంబంధించిన హక్కులు కూడా పెసాచట్టం కింద నిర్వచించబడ్డాయి.దీనర్థంగ్రామసభలు నేల,వనరులు వంటి మొదలైన చిన్నఖనిజాల కోసం ప్రణాళికలు రూపొందించి,వాటిని ఉపయోగించు కోవచ్చు.ఏదైనా ఖనిజ తవ్వకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి,అంటే మైనింగ్‌లీజు లేదా మైనర్‌ ఖనిజాలకోసం ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ అనుమతి దానితో ముందస్తు సంప్రదింపులు లేకుండాజారీ చేయబడదు.చెరువుల వంటి సహజ నీటి వనరులలో చేపలు పట్టడానికి మరియు నక్కల వంటి వనరులను సేకరించేందుకు నివాసితులందరికీ సమాన హక్కులు ఉంటాయి.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోని ప్రాంతాల సంప్రదాయ ఆచారాలు,పద్ధతులకు హానికలిగించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కూడా సభలు తిరస్కరించవచ్చు. ఏ గిరిజన భూమి అయినా గ్రామసభ అనుమతి ఇచ్చిన తర్వాతే సేకరించవచ్చు. పెసా చట్టం లక్ష్యాలను ప్రతి గిరిజనుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది.గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన అందించడం.భాగస్వామ్య ప్రజాస్వామ్యంతో గ్రామ పాలనను కలిగి ఉండటం మరియు గ్రామసభను అన్ని కార్యకలాపాలకు కేంద్రకం చేయడం.సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా తగిన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం.గిరిజన వర్గాల సంప్రదాయాలు మరియు ఆచారా లను పరిరక్షించడం మరియు సంరక్షించడం.ఈ చట్టం కింద గ్రామసభలకు విస్తృత అధికారాలు అప్పగించబడ్డాయి.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూమి అన్యాక్రాంతాన్ని నిరోధించడం,షెడ్యూల్డ్‌ తెగకు చెందిన ఏదైనా చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూమిని పునరుద్ధరిం చడానికి తగిన చర్యలు తీసుకోవడం,గ్రామ మార్కెట్‌లను ఏ పేరుతో పిలిచినా నిర్వహించండి,షెడ్యూల్డ్‌ తెగలకు రుణాలిచ్చే డబ్బుపై నియంత్రణను పాటించండి,అన్ని సామాజిక రంగాలలోని సంస్థలు,కార్యకర్తలపై నియం త్రణను అమలు చేయాలి.గిరిజన ఉపప్రణాళికలతో సహా అటువంటి ప్రణాళికల కోసం స్థానిక ప్రణాళికలు,వనరులపై నియంత్రణ ఉంటోంది.అదేవిధంగా పౌర సమాజంలో గిరిజనులు ఎదుర్కొం టున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి పెసాను మరింత మెరుగ్గా అమలు చేయాలని పెసా చట్టం చెబుతోంది. గిరిజనుల ప్రాంతంలో మంచి పని చేస్తున్న,స్వచ్ఛంద సంస్థలు పాల్గొనవలసిన అవసరం ఉంది.
అయితే పెసా చట్టం అమలుపై పలువురు మేథావులు,ఐఏఎస్‌ విశ్రాంతి అధికారులు ప్రభుత్వాలకు ఎన్నొ లేఖలు రాస్తునే ఉన్నారు. ఇటీవల విశాఖకు చెందిన ఫోరం ఫర్‌ బెటర్‌ విశాఖ వ్యవస్థాపకులు కేంద్రప్రభుత్వ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో,పీసా చట్టం అమలు కావడం లేదు.అటవీ ప్రాం తాల్లో భూములను తరతరాలుగా సాగుచేస్తున్న ఆదివాసీలకు,అటవీహక్కుల చట్టం క్రింద వ్యక్తిగత,ఉమ్మడి పట్టాలు లభించడం లేదు. ఇందుకు కారణం,ప్రభుత్వ సంస్థలలో ఆదివాసీలపట్ల ఉన్న నిర్లక్ష్యం,ఉదాసీనత.ఈ విషయంలో పభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనాపెసా చట్టాన్ని సమర్ధవంతంగా గిరిజనప్రాంతాల్లో అమలు పర్చాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగంకల్పించిన వారి హక్కులు నిర్వీర్యం చేయకుండా గిరిజన చట్టాలను అమలు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

బాలకార్మిక వ్యవస్థకు ముగింపు ఎప్పుడు?

ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి.కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ,మైనింగ్‌,నిర్మాణ రంగం,కర్మాగారాలలో,హోటల్స్‌లో, రైల్వే,బస్సుస్టేషన్‌లు,బిక్షాటన,సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. చిన్నారులకు సరైనవిద్యలేకపోవడంతో ఉపాధిఅవకాశాలు తగ్గిపోతున్నాయి.దీంతోపాటు పోటీతత్వంతో నిండినసమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారన్నారు.ఈనేపథ్యంలో ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం,ఆర్థిక తోడ్పాటు లేకపోవడం,నైపుణ్యలేమి వంటి కారణాలవల్లే ఇలా మారుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటిహైటెక్‌ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరివ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..!
ఐక్యరాజ్య సమితి బాల కార్మికుల సమస్యలపై వివిధ దేశాధినేతల సమక్షంలో 18సార్లు సమావేశాలను నిర్వహించింది.గరిష్ట వయస్సు,కనీస వేతనం, వైద్యపరీక్షలు, పనిచేసేచోట సౌకర్యాలు, పనిలో శిక్షణ, చదువుకోడానికి అవకాశాలు, రాత్రివేళ పని చేయించకపోవడం వంటి అనేక అంశాలపై ఈసమావేశాల్లో తీర్మానాలు చేశారు.ఇలాంటి తీర్మానాలు,సిఫార్సులు, ప్రతిపాదనలు ఎన్నివున్నా ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత,అసంఘటిత రంగాల్లో బాలకార్మికులను యథేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. 1948 నాటిఫ్యాక్టరీలచట్టం నుండి,1986 నాటి ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం నుండి,2016లో ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు వరకూ బాల శ్రామికులకు రక్షణ కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి,జరుగుతున్నాయి.చదువు మాన్పించి పనికి పంపితే-అది బాలల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులకు తెలియకపోవడం. గ్రామాల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విషయంలో ఇది అధికంగా ఉంటోంది.
గ్రామీణులు పట్టణాలకు వలసపోవడంతో పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు. జీవనో పాధికి వలస పోయే కుటుంబాల్లో పిల్లలను సైతం పనిలోకి పెడతారు.కనీస వయస్సు రానిదే పిల్ల లను పనులకు పంపరాదన్న విషయమై చాలా మంది తల్లిదండ్రులకు అవగాహన లేదు. కార్మిక చట్టాలను అమలు చెయ్యాలన్న ఆలోచన కర్మాగారాల యజమానులకూ వుండదు. వారికి కావలసిందల్లా- బాలల చేత ఎక్కువ పనిచేయించుకుని,తక్కువ జీతం యిచ్చి అధిక లాభాలను పొందడం. బాలకార్మి కులకు కనీస సదుపాయాలు సమకూర్చాలని,వారు బడికి వెళ్లి చదువుకోడానికి కొంత సమయం ఇవ్వాలని,5గంటలు మించి పనిచేయించ కూడదని ఎన్నో ఆంక్షలు వున్నప్పటికీ-రోజుకు10,12 గంటలు వారిచేత పనిచేయిస్తూ వుంటారు. రాత్రిళ్లు కూడా పనిచేయిస్తూ వుంటారు. వారి ఆరోగ్యానికి హానికలిగించే పనులను చేయిస్తూ వుంటారు. ఇదంతా కార్మిక శాఖ ఉద్యోగులకు తెలిసినా వారు పట్టించుకోరు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగు తూనే ఉంది తప్ప,తగ్గడం లేదు.సమాజంలో భాగస్వాములైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మికులతో ఆప్యాయంగా మాట్లాడి సమీపంలోగల పాఠశాలలో, హాస్టళ్లలో చేర్పిద్దాం.అనాధలైన బాల కార్మికులను ప్రభుత్వ వసతిగహాలలో ఉండేలా ప్రవేశాలు కల్పిద్దాం. దేశ అభివద్ధికి అవరోధంగా నిలుస్తున్న బాలకార్మికవ్యవస్థను తరిమికొట్టడానికి ప్రతిఒక్కరం ముందుకు వద్దాం.బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం.బాల కార్మికుల పట్ల దయ,కరుణ,జాలి చూపుదాం!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

చెట్లు విలువ ఎంత..?

సమాజానికి,పర్యావరణానికి సేవ చేస్తు మానవ జాతికి ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు ఇతరాత్ర విలువైన సంపదను అందిస్తున్న మన వారసత్వవృక్షాలు అభివృద్ధిపేరుతో గొడ్డలి వేటుకు బలైపో తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356 చెట్లను నరికేశారు.దీనిపై ఓఎన్జీఓ సుప్రింకోర్టును ఆశ్రయించారు.ఆకేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌),సోహంపాండ్యా (కార్యదర్శి)లతో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈకమిటీ కోర్టుకు నివేదించిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచారు.డబ్బు చెట్లను పెంచదుని తెలిపింది.చెట్టు యొక్క ఈద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
ఒకచెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది.ఒక వారసత్వ వృక్షం పౌరసమాజానికి,పర్యావరణానికి సేవచేస్తుందని,ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు, కంపోస్ట్‌, బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎబోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ప్రాజెక్టుల కారణంగా నరికివేయబడుతున్న ఈ చెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ అధికం.2021లో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరిచారు.ఇది భారతదేశంలో మొదటిసారి జరిగింది.
అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి గుణిస్తే,ప్రస్తుత సందర్భంలో 100సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు,ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధర రూ.20వేలు.సూక్ష్మపోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడంద్వారా,జీవించేచెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొనడం విశేషం.హైవే ప్రాజెక్టులకోసం చెట్లను నరికివేయడానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలికసదుపాయాలను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమార్గాలు, రైలు మార్గాలను ఉపయోగించడంవంటి ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది. చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లనునరికివేస్తే ఆస్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి,చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయినందున వారికి సహాయకరంగా ఉండవచ్చు అని నిపుణల నివేదిక భావించింది.
అయితే జీ`20పేరుతో విశాఖాని సుందరంగా తీర్చిదిద్దడానికి అనేక వృక్షాలను విచాక్షణ రహితంగా నరికేశారు.దేశంలోనే పేరుగాంచిన ఆంధ్రా విశ్వవిశ్వవిద్యాలయంలో శతాబ్దల సంవత్స రాలకుపైగాఉన్న వారసత్వ వృక్షాలను సైతం నరికేశారు.అదేవిధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో నిర్మిస్తున్న హైవే రహదారి నిర్మాణం కోసం దట్టమైన అడవిలో ఉండే వేలాది వృక్షాలను నరికివేయడం గమనార్హం.సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం..గుత్తేదారు కంపెనీ, అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించగలదా?నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకూ ఇక్కడ ఎంతో వారసత్వ సంపద గల విలువైన వృక్షాలను కోల్పోయాం అనేది తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వ పరి పాలన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి.ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది..!

భారతదేశంలోని ధనవంతులైన 70లక్షల మంది పేదవారు 80కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే,ఎగువ0.5శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాదిస్తారు.ఈసంఖ్యలు వివాదాస్పదంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమానత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ,అతని సహచరుల అంచనాల ఆధారంగా ప్రముఖ సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌ ఔనింద్యో చక్రవర్తి రూపొం దించారు.
199లో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ ప్రవేశపెట్టింది.ఈసంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవడం,దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగామారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇది దోహద పడిరది.ఇదిదేశంలో ప్రైవేట్‌రంగం విస్తరించడానికి మరియు ఆర్థికవృద్ధికి దోహదం చేసింది. ఈనేపథ్యంలోనే నూతన ఆర్ధికసరళీకరణ విధానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్‌ మోనార్టింగ్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌),వరల్డ్‌ బ్యాంక్‌లు అప్పటి నుంచి వీటిని తమ గుప్పెట్లోకి వచ్చాయి.
దాని ముందర మనకు సోషలిస్టు విధానం ఉండేది. 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తోంది.కానీ డేటా పరిశీలిస్తే0.5శాతం జనాభ ధనికవర్గానికే చెందు తుంది. సంపాదనలో 80కోట్ల మంది పేదవారి సంపాదనతో సమానం అని డేటా చెబుతుందని ఔనింద్యోచక్రవర్తి ద్వారా తెలుస్తోంది.దీనబట్టి పరిశీలస్తే,ముప్పైయేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానం ధనవంతులకే ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందినదేశాల కంటే అత్యంతపేదగా పరిగణించబడే బురుండి,మడగాస్కర్‌.ఈ రెండుదేశాల సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదా యాలతో దాదాపు సమానంగా ఉంటాయి.ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ..ఆదాయం తక్కువ.
2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750 (ూూూ).భారత దేశంలో దిగువన ఉన్న42శాతం మంది పెద్దలు దానికంటే తక్కువ సంపాదించారు దాదాపు వి1,720 (ూూూ).అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065 (ూూూ).భారతదేశంలో దిగువన ఉన్న52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు.దీనర్థం దాదాపు58కోట్ల మంది భారతీయులు(ఈపెద్దలపై ఆధార పడిన పిల్లలతోసహా) ప్రపంచంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తివలే పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయపరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నట్టు డేటాద్వారా తెలుస్తోంది.
అయితే దేశరాజ్యాంగం మాత్రం ఒకసోషలిస్టు విధానాన్ని స్థాపించేదిగా ఉంది.కానీ ఆర్ధిక విధానంమాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతోంది.అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది.ఆర్ధిక విధానాలను రూపొందించే సమయంలో పాలకులు ఇలాంటి అంశాలపై దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తయారుకు భలోపేతం చేసినవాళ్లం అవుతాం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

గిరిజనాభివృద్ధి జరగాలంటే.. స్థానిక వనరుల వినియోగించాలి

గిరిజనప్రజలైన..సామాజికకార్యకర్తలైన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమైన గిరిజనాభివృద్ధి జరగాలంటే ఏజెన్సీలో నిక్షేపమైన వనరులు స్థానిక గిరిజనులే వినియోగించు కొనేలా వారికే రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలి.స్థానిక వనరుల వినియోగంపై గిరిజనులను చైతన్యవంతులను చేసేలా చర్యలు చేపట్టాలి. ఐదవషెడ్యూల్‌ ఏరియాలో నివసించే గిరిజనులకు ప్రధానజీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.గతంలో ప్రతీగిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూవస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో,గిరిజనుల హక్కులపట్ల చైతన్యం కలిగించి,గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘ టించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు,పర్యావరణ పరిరక్షణ,వారిహక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. అయినా పీసాచట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి,రాజ్యాంగానికి విరుద్దంగా,వారి వనరులపై గిరిజనేతరుల పెత్తనం సాగుతూనే ఉంది. ఫలితంగా పచ్చని పొలాలపై మైనింగ్‌ చిచ్చు రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎండీసీ) మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్నయుద్దం జరుగుతూనే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో నిమ్మలపాడు కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ,జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏప్రిల్‌ 19న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్దింటే సమత జడ్జెమెంట్‌ ప్రకారం స్థానికులకే లీజులు అప్పగించాలంటూ గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. నిజానికి గిరిజనుల ఆవేదనకు అర్ధముంది. సమత తీర్పును ప్రభుత్వంగానీ,ఏపీఎండీసీ అధికార యంత్రాంగం గానీ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.ఆతీర్పు పూర్తిగా చదివితే మైనింగ్‌ తవ్వకాలపై సమత జెడ్జి మెంట్‌ వ్యతిరేకం కాదని అర్ధమౌతోంది.రాజ్యాంగబద్దంగా గిరిజన ప్రాంతానికి చెందిన వనరులు గిరిజనులకే చెందాలని, ఒకవేళ వనరులు వెలికితీస్తే గిరిజనులను సొసైటీలుగా ఏర్పాటు చేయించి,వారికే లీజులు ఇవ్వాలని ఆతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కోంది.ఈతీర్పును అర్ధం చేసుకోకుండా గిరిజన బినామీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజులు ఇవ్వడానికి ఏపీఎండీసీ మొగ్గు చూపుతోంది.
పదహారేళ్ల నుంచి స్థానిక గిరిజన సొసైటీలకు లీజులు ఇవ్వకుండా ఏపీఎండీసీ స్థానికేతర గిరిజనులకే లీజులు ఇవ్వడంపై కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామాల గిరిజన ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వారి అమయకత్వం కారణంగా వనరుల దోపిడికి గురవుతునే ఉన్నారు. ఈ మూడు గ్రామాల మధ్య 125 ఎకరాల్లో విలువైన కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది.వీటిని చేజిక్కించుకోవడానికి మైనింగ్‌ మాఫియా ఏపీఎండీసీ అండతో మూడు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దోపడి వ్యవస్థకు స్వస్తిపలికి ఏపీఎండీసీ అధికార్లు రాజ్యాంగనీతిని అనుసరించాలి.నిజమైన గిరిజనాభివృద్ధిని సాధించాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్థానిక వనరులను వినియోగించి అభివృద్ధి చేయాలి.పీసా,సమత జడ్జెమెంట్‌ స్పష్టం చేసిన తీర్పును అర్ధం చేసుకొని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న వనరులు స్థానికులకే హక్కు కలిగేలా చర్యలు తీసుకోవాలి.వారి వనరులు వారికే చెందేలా గిరిజన సొసైటీలుఏర్పాటు చేయించి,గిరిజనులకు లీజులు ఇచ్చిప్రొత్సహించాలి. అప్పుడే గిరిజన ప్రజలు ఆశించిన నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దశగా ఏపీఎండీసీ,రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్

ఎస్టీల గుర్తింపులో తొందరపాటు సరికాదు !

బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీలు)గా గుర్తించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.బోయలు, వాల్మీకులు మరియు బెంథో ఒరియాల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని పరిశీలించడానికి ఒక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది మరియు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా,వారిని ఏపీ ఎస్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గిరిజన సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.సాధారణ కోర్సులో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏ(9) ప్రకారం అవసరమైన షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌తో ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంప్రదింపులు జరగిన దాఖలాలు కన్పించలేదు.రాష్ట్రం నియమించిన కమిషన్‌ ఈఅంశంపై తమ అభిప్రాయాలను కోరలేదని,రాష్ట్ర ప్రభుత్వం తమను ఎప్పుడూ విశ్వాసంలోకి తీసుకోలేదని గిరిజన సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ఐదవ షెడ్యూల్‌లోని పారా4కింద ఏర్పాటైన గిరిజన సలహా మండలి పరిగణలోకి తీసు కున్న అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలుస్తోంది.ఎస్సీ,ఎస్టీలజాబితాల సవరణపై జస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలోని కేంద్ర సామాజిక భద్రత విభాగం 1965లో నియమించిన అడ్వైజరీ కమిటీ,ఆదివాసీల సమూహాన్ని వర్గంగాగుర్తించాలా? వద్దా? అనే విషయాన్ని గుర్తించేందుకు అవసరమైన కొన్ని లక్షణాలను సూచించింది.కొత్త సమూహాలను షెడ్యూల్డ్‌ తెగలలో సభ్యులుగా చేర్చాలని స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడిని పరిగ ణనలోకి తీసుకున్నారు. అయితే దీనిని పరిశీలించడానికి రాష్ట్రం ఆదివాసీల సంస్కృతి గురించి తెలిసిన బయటి నిపుణులతో ఒకకమిటీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉండేది.ఈ నేపథ్యంలో,షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌టీ)ఈ విషయంలో జోక్యాన్ని కోరే స్వేచ్ఛ గిరిజన తెగలకు ఉంది.ఎన్‌సీఎస్‌టీ వన్‌ మ్యాన్‌ కమీషన్‌ నివేదికను వృత్తిపరంగా ఆదివాసీల సంస్కృతి,జీవితాల గురించి తెలిసిన బయటి ప్రముఖ నిపుణుల బృందానికి సూచించమని గిరిజనతెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోతున్నాయి.ఈ విషయంలో కనీసం గిరిజన సలహా మండలి(టీఏసీ) అభిప్రాయాలు తీసుకున్న దాఖలులేవు.
ఏదైనా తుదినిర్ణయం తీసుకునే ముందు ఏస్టీ జాబితాలో కొత్త సమూహాలను చేర్చడం వలన వారి అవకాశాలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, రాష్ట్రం స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 1965లో లోకూర్‌ కమిటీ సంప్రదించిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుత ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏస్టీల జాబితాలో ఏదైనా సమూహాన్ని చేర్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(1) (రాజ్యాంగం (మొదటి సవరణ) చట్టం,1951 ద్వారా సవరించబడిన ప్రకారం)రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడంచాలా అవసరం.దీనిపై ఎన్‌సిఎస్‌టి పరిశీలించిన అభిప్రా యాలను కోరాలని కేంధ్ర ఇంధన వనరులశాఖ విశ్రాంతి ముఖ్యకార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏలో 9వ అంశం ప్రకారం జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ను సంప్రదించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆదివాసీలుకాని వారిని ఎస్టీలుగా గుర్తించడంవల్ల తమ హక్కులకు హాని కలిగే అవకాశముందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారి ప్రతినిధులతో సంప్రదింపలు జరిపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20 నగరాల మొదటి జాబితాను ప్రకటించారు దేశ్యాప్తంగా అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌,పూణే,కోయంబత్తూర్‌,జబల్‌పూర్‌, జైపూర్‌, సూరత్‌, గౌహతి,చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, ఇండోర్‌,భోపాల్‌,ఉదయపూర్‌,లూథియానా,కాకినాడ,బెల్గాం,షోలాపూం,భువనగిరి మొత్తం20 నగరాలున్నాయి.
ఇవి సిటీ పౌరులకు సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. డేటాను సేకరించేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ పద్ధతులు,సెన్సార్లు ఉపయోగించబడతాయి. అందుకున్న డేటా అంతర్భాగం చెత్త సేకరణ,వినియోగ సరఫరా,ట్రాఫిక్‌ కదలిక,పర్యావరణ నిర్వహణ,సామాజిక సేవల నిర్వహణలో కార్యాచరణ మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌,గవర్నెన్స్‌,రవాణావ్యవస్థ,భద్రత కోసం మెరుగైన నిఘా,స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు,మెరుగైన ఉద్యోగావకాశాలు,సౌకర్యవంతంగా జీవించే ప్రతి ఇతర సౌకర్యాలు కల్పిస్తాయి.
వాస్తవానికి స్మార్ట్‌ సిటీ అంటే ప్లానింగ్‌ పక్కాగా ఉండాలి.కానీ ఎక్కడ ఏం జరుగుతుందో..ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఏపీలో కీలక నగరమైన విశాఖపట్నంలోనే.స్మార్ట్‌సిటీలో నిరుపేదలు జీవించే పరిస్థితులు లేకుండా పోతుంది. నగరానికి జీవనోపాధి పొట్టకూటి కోసం వచ్చే వలసవాదులు,బీక్షాటన చేసే బిక్షగాళ్లకు సరిjైున సదుపాయాలు లేక రోడ్డుజంక్షన్లవద్దనే భిక్షాటన చేయడం శోచనీయం.వీటికి చట్టాలున్నా శూన్యంగానే ఉంది. మరోపక్క చెత్త,చెదారం,ఆహార వ్యర్ధాలు విచ్చలవిడిగా పడేయడంవల్ల నగరమంతా అస్తవ్యస్థంగా మారుతోంది. స్మార్ట్‌సిటీ అంటే చెత్తరీసైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలి.కానీ ఆపరిస్థితి విశాఖలో కన్పించడం లేదు.స్మార్ట్‌సిటీ అంటే కేవలం మెయిన్‌ రోడ్లుకు మరమ్మతులు,డివైడర్ల మధ్య పూల మొక్కలు,ప్రగహారీగోడలకు రంగులు వేయడమేనా?నగరాన్ని ఆనుకొని ఉన్న మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ లింక్‌ రోడ్డు నిర్మిణాలు ఎక్కడ జరుగుతున్నాయి? పచ్చని చెట్లు నరికేసి మొదళ్లు,మోడులకు రంగులు వేయడం అవసరమా?.అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితమైయ్యింది.నగర నడిబొడ్డునఉన్న ఎన్నో షాపింగ్‌ మాల్స్‌,దుకాణాల్లోను ప్లాస్టిక్‌ తాండవి స్తోంది.దీంతో నగరపరిసరాలన్నీ ప్లాస్టిక్‌మయంగా మారింది.పరిశ్రమల నుంచి వెలువడే కాలు ష్యకారకాలు,వాహన శబ్దకాలుష్యాలు నగరాన్ని రాజ్యమేలు తున్నాయి.

జగనన్న ఇళ్లు స్థలం పేరుతో నగరంలో జీవిస్ను నిరుపేదలను3040కిలోమీటర్ల దూరంలో అభయారణ్యాల మధ్య నగరం నుంచి గెంటేశారు. వీరంతా నగరంలో చిన్నచితక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేదలే.ఇప్పుడంతా వారు నిర్వాసితులయ్యారు. ఉన్నచోటనే నిరుపేదలకు ఉపాధి,ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ పేరుతో పేదలను నగరం నుంచి గెంటేయడం ఎంతవరకు సమాంజసం. ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌,పబ్లిక్‌ సేఫ్టీ,స్మార్ట్‌ మొబిలిటీ,పెరిగిన టూరిజం,సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,ఫిజికల్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీలుగా మార్చడాన్ని సులభతరం చేస్తాయి.కానీ నగరాన్ని ఆనుకొని స్మార్ట్‌సిటీలో విలీనమైన దబ్బంద గ్రామంలో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నిల్‌ రావడం లేదు.దీనివల్ల అనేక మంది నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు సక్రమంగా పొందలేకపోతున్నారు.

ఈనెల 28,29,30తేదీల్లో జరిగే జీ20సదస్సుకు కోసం జీవీఎంసీ రూ.150కోట్లతో నగరాన్ని సుందరీకరణ చేస్తుంది కానీ అస్తవ్యస్థంగా పడి ఉన్న చెత్త,ప్లాస్టిక్‌ సేకరణలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.సేకరించిన చెత్త,ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం శాస్త్రీయమైన రీసైక్లింగ్‌ పద్దతులను పాటించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అవశ్యకత ఎంతైనాఉంది.అప్పుడే స్మార్ట్‌సిటీ ప్రయోజనాలు ప్రజలకు సమకూరుతాయి. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

1 2 3 5