ఆ గాలిలోనే గ‌ర‌ళం

దేశ రాజధాని నగరంఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే.. దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా.. మళ్లీ గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచించింది. పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగల బెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దు లోని హర్యానా, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగు తుంటుంది. ఆ పొగంతాఢిల్లీను కమ్మేస్తుం టుంది. ఒక్కసారిగా 14శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడ మేనని తెలిసింది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢల్లీిలో వాయు కాలుష్యం(ణవశ్రీష్ట్రఱ Aఱతీ ూశీశ్రీశ్రీబ్‌ఱశీఅ) పెరుగు తోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్‌(ణవశ్రీష్ట్రఱ చీజR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్‌ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం..’’ గత రెండు వారాల్లో డాక్టర్‌ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండిరతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ప్రపంచంలోనే టాప్‌ పొల్యూటెడ్‌ సిటీ ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూట గట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IూA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజ ధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలోగాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్‌ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండా లంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ప్రాణవాయువే… ప్రాణాంతకం
ప్రాణవాయువే…ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడి పోయిందనే కారణంతో ఏకంగా దేశరాజ ధానిలో కొద్ది రోజులు లాక్డౌన్‌ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం… యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం…గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు…ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌ కేసులు -ఇలా ఢల్లీిలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్‌ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటి కాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్‌ చివర నుంచి నవంబర్‌ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యా లు కలగలిసి ఢల్లీిలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీ యాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ,నవంబర్‌ మొదట్లో దీపావళి టపాసులు,పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై,ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థా యికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్‌ 13న సుప్రీమ్‌ కోర్టు కొరడా జుళిపిం చింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమా వేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యక లాపాలకు బ్రేక్‌ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢల్లీిలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢల్లీిలో దుమ్ము ధూళి,పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా,ఢిల్లీలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా,పంజాబ్‌ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్‌ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నా రనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్‌, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్‌ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్‌’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్‌-26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్‌)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభ వాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్‌ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే…మొదటికే మోసం!
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్‌ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిరదని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని వెల్లడిరచింది. సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్‌,నోయిడా,ఘజియాబాద్‌,ఫరీదాబాద్‌ లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండిరటితో బాధపడు తున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమత మవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్య తో బాధపడు తున్నామని చెప్పారు.కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ ఉపయో గించాలనుకుంటున్నారని,61శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్‌ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.

-జి.ఎన్‌.వి.సతీష్‌