• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home పోరు-Poru

వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు

team-dhimsa-viz by team-dhimsa-viz
September 14, 2021
in పోరు-Poru
0
వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు
0
SHARES
62
VIEWS
Share on FacebookShare on Twitter

భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్‌ రూల్స్‌ను తుంగలో తొక్కి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన పరిస్థితి గతంలో ఏనాడూ లేదు.
ప్రస్తుత మార్కెటింగ్‌ యార్డులు రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయని,ఈనూతన వ్యవ సాయ చట్టాల వలన రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను పంపి, తనకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు లభిస్తుందని,కమీషన్‌ ఏజెంట్లు వుండ రని, రైతులకు చాలా మేలు చేకూరుతుందని ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్‌ తదితరులు పదేపదే చెటబుతున్నారు. వాస్తవానికి ఈ మూడు నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళుగా మారతా యి. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద వున్న 2384 రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ యార్డులు, 4887 సబ్‌ యార్డులు,ఎ.పి.ఎం.సి.లు నోటిఫై చేసిన వేలా ది ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు,గోడౌన్లు ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వందల మార్కెట్‌ యార్డులు,గ్రామీణ ప్రాంతాలలో వున్న దాదాపు 20,000 చిన్న చిన్న మార్కెట్‌ యార్డులు, మోడీ తెచ్చిన చట్టంలో ‘’ట్రేడ్‌ ఏరియా’’ నిర్వచనం లోకి రావు.దాంతో మార్కెటింగ్‌ వ్యవస్థ క్రమేపీ నిర్వీర్య మై, గత్యంతరం లేక రైతులు ఎమ్‌.ఎస్‌.పిలతో నిమిత్తం లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుర్గతి పడుతుంది.
మోడల్‌ ఎ.పి.యం.సి.యాక్ట్‌-2017, మోడల్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ యాక్ట్‌-2018లను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుందని, దాంతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో నమ్మబలికారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ రెండు మోడల్‌ చట్టాలను అమలు చేయటం అవసరమని నీతి అయోగ్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసి వుంది. కమీషన్‌ ఏజెంట్లు ఉండరని ప్రధానమంత్రి పెద్ద అబద్ధం చెబుతున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కె టింగ్‌లో ‘’ఎగ్రిగేటర్లు’’ ఉంటారని చట్టంలో స్పష్టంగా పేర్కొ నబడిరది. కమీషన్‌ ఏజెంట్లు చేసే పనినే ‘ఎగ్రిగేటర్లు’చేస్తారు. ‘మోడల్‌ ఎ.పి.ఎం.సి.యాక్ట్‌-2017’లో రెగ్యు లేటెడ్‌, ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డు లనుఈ-నామ్‌తో అనుసంధానం చేయడం, ధాన్యం, గోధుమలు మున్నగు ఉత్పత్తులపైన 2శాతం మించ కుండా, కూరగాయలు, పండ్లు మొదలగు పచ్చి సరుకుపై 1శాతం మించకుండా మార్కెట్‌ సెస్సు వసూలు చేయవచ్చు. కమీషన్‌ ఏజెంట్లకు ధాన్యం మున్నగు వాటిపైన 2శాతం మించకుండా, కూర గాయలు మున్నగు వాటిపైన 4శాతం మించ కుండా కమీషన్‌ వసూలు చేసుకోవచ్చు. ఇందుకు పూర్తి భిన్నంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకు రావలసిన అగత్యంపై కేంద్రం నుండి ఇంతవరకు సమాధానం లేదు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం-2020 రైతులకు నష్టం కలిగిం చేలా వుంది. రైతులకు సరైన రక్షణ కలిగించే అంశాలు ఇందులో లేవు. స్పాన్సర్‌తో విభేదాలు వచ్చినపుడు రైతు (ఆర్‌.డి.ఒ/జిల్లా కలెక్టర్‌ స్థాయిలో నడిచే వివాద పరిష్కార ప్రక్రియ సందర్భంగా) న్యాయవాది సహాయం తీసుకోడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. సాధార ణంగా రైతాంగంలో ఎక్కువ శాతం మంది నిరక్షరా శ్యులు. స్పాన్సర్‌ తరపున హాజరయ్యే వారికి ఉన్నత విద్య, చట్టాలపట్ల అవగాహన,ప్రభుత్వ అధి కారులతో సత్‌సంబంధాలు వుంటాయి. కావున వారు చెప్పినట్లుగానే జరుగుతుంది. అంతే తప్ప రైతుల మాటలకు విలువ వుండదు. ’నిత్యావసర వస్తువుల సవరణ చట్టం’’లో నిల్వ పరిమితులను ఎత్తివేయడంవల్ల బడారిటైల్‌ సంస్థలు చాలా హెచ్చు పరిమాణంలో సరకులను నిల్వ చేసుకోగల అవ కాశం కల్గుతుంది. ఫలితంగా కృత్రిమ కొరతలు సృష్టించబడేందుకు ఆస్కారం వుంది. అంతేకాక గత 12మాసాలలో వస్తువు సగటు ధరపైన మరు సటి సంవత్సరం 50శాతానికి మిగలని ధరలకు అమ్ముకోవచ్చుననే అంశం ప్రైవేట్‌ రిటైల్‌ మాల్స్‌కు అత్యధిక అదనపు లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు, రిలయన్స్‌ రిటైల్‌ మార్టులలో వినియోగ దారులకు అమ్మే ధరలకు పొంతన లేదు. రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేకపోగా వినియోగ దారులపైన పెనుభారం మోపబడుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోపడ్డ చందంగా తయారయ్యే అవకాశం వుంది. సన్నకారు, చిన్న రైతులలో నూటికి 40మంది ప్రైవేట్‌ వడ్డీ వ్యాపా రుల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని నాబార్డుసర్వే చెబుతోంది. రూ.1.5లక్షల లోపు పంట రుణాలను హామీతో నిమిత్తం లేకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వా లని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు వున్నా సరిగ్గా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా సాగుభూమి లో 10శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తు న్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో ఇంకా అధిక శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందవలసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ, ప్రభుత్వం నేరుగా అందించే నగదు బదిలీ సహాయం (పి.ఎం.కిసాన్‌ సమ్మాన్‌ యోజన) కానీ, పంటల బీమా పథకం వలన అందాల్సిన సహా యం గానీ కౌలు రైతులకు ఇప్పటికీ అందడం లేదు. చాలామంది రైతులలో కౌలుకిచ్చినట్లు కాగి తంపైన అంగీకరిస్తే, తమ భూయాజమాన్య హక్కుకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలు వుండ టం వలన కౌలు పత్రం పైన సంతకాలు చేయడం లేదు. అంతేకాక బ్యాంకు కౌలు రైతుకిచ్చే పంట రుణం అతను కట్టకపోతే తాను కట్టవలసి వస్తుం దనే భయం కూడా వుంది. వాస్తవంగా తాము కౌలు చేస్తున్న భూమి తమకు చెందాలని, కౌలు రైతులు కోరుకోవడం లేదు. కౌలు చేసుకోడానికి భూమి దొరికితే చాలనుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సంస్థ ‘’మోడల్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌-2016’’ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఈచట్టం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టా న్ని ఆమోదించాలని,రైతుకు తనభూమి పైన యాజ మాన్య హక్కుకు ఎట్టి పరిస్థితిలోనూ భంగం వాటి ల్లదని హామీ ఇస్తూ, అదే సమయంలో కౌలు రైతుకు గుర్తింపు ఇచ్చి,బ్యాంకు రుణం, ఇన్సూరెన్స్‌ సదు పాయం, ఇన్‌-పుట్‌ సబ్సిడి, నగదు బదిలీ మున్నగు ప్రయోజనాలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయవలసి వుంటుంది. రైతు సంఘాలు,కౌలు రైతు సంఘాలు, మోడల్‌ యాక్టు లోని అంశాలను రైతు లకు అవగాహన కల్పించి కౌలుపత్రాలపైన సంత కాలు చేయడంద్వారా కౌలు రైతులకు మేలు కలిగేం దుకు కృషి సల్పాలి.కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ (పి.యం.కిసాన్‌ సమ్మాన్‌) పథకంలో 5ఎకరాల లోపు భూయజమానులైన సన్నకారు, చిన్న రైతులకు మాత్రమే వార్షికంగా మూడు వాయిదాలలో రూ. 2,000 చొప్పున మొత్తంగా రూ.6,000నగదు బదిలీ జరుగుతుంది. వాస్తవానికి సాగు చేస్తున్న భూమిగల రైతుగాని లేక అనేక కష్టనష్టాలకోర్చి సాగు చేస్తూ వున్న కౌలురైతుకు ఈసహాయం అంద వలసిన అవసరం ఎంతైనావుంది. కాలియా పథ కం కింద ఒరిస్సా ప్రభుత్వం వార్షికంగా వ్యవసా య కూలీ కుటుంబాలకు రూ.12,500 చొప్పున, సన్నకారు,చిన్నరైతులు,కౌలు రైతులకు రూ.10,000 చొప్పున అందచేస్తున్నది. అదేపద్ధతిని ఇతర రాష్ట్రా లలో కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే భూమి రికార్డులు సక్రమంగా వుండా లి. దేశంలో సుమారు 2 కోట్ల గిరిజన కుటుంబాలు వుండగా 20లక్షల మందికి మాత్రమే ఫారెస్ట్‌ అటవీ హక్కు పత్రాలు ఇవ్వబడ్డాయి. తగు సంఖ్యలో సిబ్బందిని నియమించి మహిళారైతుల పేర్లతో సహా భూ యజమానులపేర్లు, కౌలు రైతుల పేర్లతో సహా భూ రికార్డులను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా వుంది.
వ్యవసాయ చట్టాలు -నిజా నిజాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసా య సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతు న్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసా య చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢల్లీి సరిహ ద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతులకు లాభం ఎంత? కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? తదితర వివరాలను పరిశీలిద్దాం.
ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలకు ఆమోదం తెలిపి, వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు తీసుకువచ్చిన ుష్ట్రవ ఖీaతీఎవతీం ూతీశీసబషవ ుతీaసవ aఅస జశీఎఎవతీషవ (ూతీశీఎశ్‌ీఱశీఅ aఅస ఖీaషఱశ్రీఱ్‌a్‌ఱశీఅ) Aష్‌-2020బీ ఒప్పంద వ్యవసాయం చేసుకునేందుకు రూపొం దించిన, నిత్యావసర వస్తువుల పరిమితిపై చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దళారులకు అవకాశం కల్పించకుండా రైతుల ఆదాయాన్ని వృద్ది చేయాలనే లక్ష్యంతోనే ఈ చట్టాలు చేశామని కేంద్రం ప్రకటించింది.
రైతులకు ఎలా ఉపయోగం?
ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల (Aూవీజ) నియమాల ప్రకారం రైతులు పంటలు అమ్ముకు నేవారు. వీటిని కొత్త చట్టాలు సడలించాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వ మార్కెట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తు లను అమ్ముకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. దీంతోపాటు ఒప్పంద వ్యవసాయానికి సంబంధిం చిన నియమ,నిబంధనల ద్వారా చట్టబద్దత కల్పిం చారు. వ్యవసాయ ఉత్పత్తులపై స్టాక్‌ పరిమి తులను తొలగించేందుకు విధానాన్ని రూపొందించారు. పంటలు ఎక్కువగా పండినప్పుడు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ ఉత్ప త్తుల మార్కెట్లలోకి వచ్చేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు భయపడుతున్నారు. ఇది గుత్తాధిపత్యాన్ని సృష్టించగలదని,ఫలితంగా పంట ల ధరలను ఆయాకంపెనీలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Aూవీజ మార్కెట్లను 1960లలో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రైతులకు మెరుగైన మద్దతు ధరలు కల్పించాలనేది వీటిలక్ష్యం. దీని ప్రకారం రైతులు స్థానిక మార్కెట్‌ యార్డులలోని లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులకు మాత్రమే పంట ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది. అంటే.. బహి రంగ మార్కెట్లో కాకుండా,తమకు దగ్గర్లో ఉన్న మార్కెట్‌ యార్డుల్లోనే రైతులు పంటలు అమ్ము కోవాలి. ఈ పరిమితుల వల్ల రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునేందుకు అడ్డంకు లు ఏర్పడ్డాయి. దీంతోపాటు కొన్ని దశాబ్దాలుగా ఈ కమిటీల ద్వారానే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ మార్కెట్లే రైతులు తమ ఉత్పత్తులకు సరిపోయే ధరను పొందడానికి అవరోధాలుగా మారాయి. ఏయే సీజన్లో, ఏయే పంటలకు ఎంత ధర పలుకుతుందనేది ప్రభుత్వం చేతుల నుంచి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటలను అమ్ము కునే గతి రైతులకు పట్టింది. Aూవీజలు ప్రధానంగా కమిషన్‌ ఆధారిత వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులు మాత్రమే ఈ మార్కెట్లలో రైతుల పంటలను కొనాలి. ఈ మధ్య వర్తుల్లో కమీషన్‌ ఏజెంట్లు,హోల్‌సేలర్స్‌, ట్రాన్స్‌ పోర్టర్స్‌, రైల్వే ఏజెంట్లు,స్టోరేజ్‌ ఏజెంట్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు తరువాత ఇవి ఱఅ్‌వతీషశీఅఅవష్‌వస శీశ్రీఱస్త్రశీజూశీశ్రీఱవంలకు దారితీశాయి. కొన్ని వ్యాపార వర్గాలే మార్కెట్‌ యార్డులపై ఆధిపత్యం చూపడం మొదలైంది. స్థానిక మార్కెట్లలో వారు చెప్పిందే వేదం అనేంతగా పరిస్థితులు దిగజా రాయి. ఇందుకు ఒక ఉదాహరణ సైతం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ ఉంది.2010 డిసెంబరులో…ఈ మార్కెట్‌ నుంచి జరిగిన వ్యాపారంలో దాదాపు 20శాతం ఒకే ఒక్క దళారీ సంస్థ ద్వారా జరిగిం దని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా తేల్చింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి మార్కెట్‌ యార్డులకు వచ్చే రైతులకు మద్దతు ధర రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకొని వ్యాపారాన్ని పంచుకుం టున్నాయని తేలింది. ఇలాంటి దళారుల వల్ల రైతు అందుకున్న ధరకు, వినియోగదారులు కొనే ధరకు మధ్య తేడా పెరిగిపోతుంది.లాభం మాత్రం ఎప్పుడైనా మధ్యవర్తుల జేబుల్లోకే వెళ్తుంది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డులు కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీబఅషఱశ్రీ శీట Aజూజూశ్రీఱవస జుషశీఅశీఎఱష Rవంవaతీషష్ట్ర)2012లో వెల్లడిరచిన నివేదికలో తెలిపింది. రైతులు ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా బహిరంగ మార్కె ట్లలో,ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అమ్ముకు నేందుకు కొత్తచట్టం అవకాశం కల్పించింది.దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చట్టాలపై రైతులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు? క్రమబద్ధీకరించని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి పెద్ద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు ప్రవేశిస్తే..వారితో బేరమాడే శక్తిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారు.దీంతోపాటు కొత్త చట్టం ప్రకారం వ్యాపారులు ఎలాంటి ఫీజులూ చెల్లించా ల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రైవేట్‌ వ్యాపారులు లావాదేవీ లు చేయడం వల్ల సాంప్రదాయ మార్కెట్‌ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందేమోనని రైతులు భయపడుతు న్నారు. గత కొన్ని సంవత్సరాలలో చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి సంస్కరణలు చేసేందుకు ముం దుకు వచ్చాయి. కానీ అందులో రాజకీయ కోణమే ఉందని స్పష్టంగా అర్థమైంది. సాంప్రదాయ Aూవీజమార్కెట్లు కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరు లుగా ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో Aూవీజల్లో గోధుమల కొనుగోలుపై ఆరు శాతం ఫీజు(మార్కెట్‌ఫీజు,గ్రామీణాభివృద్ధి ఫీజు-మూడు శాతం చొప్పున)ను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ధాన్యంపై ఆరు శాతం, బాస్మతి బియ్యంపై 4.25 శాతం ఫీజుఉంటుంది. పంజాబ్‌లో సుమారు 90 శాతం గోధుమలు, వరి పంటలను ఈ మార్కెట్ల లోనే కనీస మద్దతు ధరల (%వీూూం%)కు కొను గోలు చేస్తారు. అందువల్ల కొత్తచట్టాలతో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వంతో పాటు మార్కె ట్‌ కమిటీలపై ఆధారపడి వ్యాపారాలు చేసే మధ్య వర్తులు,రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం చివరికి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆపేస్తుందేమోనని, ప్రైవేటు వ్యాపారులకే పంటలు అమ్ముకునే రోజులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది.
కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లు ఏంటి?
అన్ని ప్రధాన పంటల ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చట్టప్రకారం హామీ ఉండాలని, అలాంటి హామీ ఇచ్చే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. దీని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు, లేదా అంతకంటే ఎక్కువకు కొనాలనే నియమం ఉంటుంది.వీూూకి తక్కువగా ఉండే ఏదైనా వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించేలా చట్టం ఉండాలని రైతులు కోరుతున్నారు.
ఎవరికి ఉపయోగం?
వ్యవసాయ ఉత్పత్తులను ఫుడ్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఖీజI)ద్వారా ప్రభుత్వం కొను గోలు చేస్తోంది.దేశ అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎఫ్‌సీఐ సేకరించి,నిల్వ చేస్తోంది. దేశవ్యాప్తంగా అతి తక్కువమంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరిసాగు చేసే రైతుల్లో 13.5శాతం,గోధుమలు పండిరచే రైతుల్లో 16.2శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే చెబుతోంది.
కనీస మద్దతు ధరపై చట్టాలు చేయలేమా?
కనీస మద్దతు ధరకోసం చేసే చట్టం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు…రైతుల వద్ద మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే ప్రైవేట్‌ వ్యాపారి,తన లాభాన్ని చూసుకొని వాటిని వినియోగ దారులకు అందించేందుకు ఎక్కువ ధరలను నిర్దేశిం చాల్సి వస్తుంది. దీంతోపాటు మద్దతు ధరల విధా నాన్ని చట్టబద్దం చేస్తే.. బహిరంగ మార్కెట్లో కొను గోళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిపంట ఉత్పత్తుల ఎగుమ తులపై కూడా ప్రభావం చూపు తుంది. కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో, విదేశాల్లో పంట ఉత్పత్తులధరలు మద్దతు ధరలకంటే తక్కువ గా ఉండే అవ కాశంఉంది. ఇలాంటప్పుడు వ్యాపా రులు పంటలను ఎక్కువ ధరలు పెట్టి కొని, తక్కువ లాభాలకు ఎగుమతి చేయలేరు. ఇదే సందర్భంలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరలకు పంటలను కొనడానికి ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ మాత్రమే మార్కెట్లో పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఎక్కువ మద్దతు ధర వచ్చే పంటలనే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల పంటల సాగు తగ్గిపోతుంది. ఫలితంగా నూనె గింజలు వంటి అనేక ఆహార ఉత్పత్తులను భారత దేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుంది. సంస్కరణల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రైతుల అభ్యం తరాలను పరిగణనలోకి తీసుకొని, చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్ర మంత్రులు సైతం చెప్పారు. రైతులకు మెరుగైన ధర లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ధర-లోటు (జూతీఱషవ-సవటఱషఱవఅషవ) విధా నాన్ని అమలు చేస్తే మంచిదని కొంతమంది నిపు ణులు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవస్థను మధ్య ప్రదేశ్‌లో ప్రయ త్నించారు. దీని ప్రకారం..మార్కె ట్‌ ధరకు, కనీస మద్దతుధరకు మధ్య ఉండే లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో రైతుల హక్కులను కాపాడేందుకు చట్టపరంగా అద నపు రక్షణ కల్పించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా ప్రైవేటు మార్కెట్లు, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వ ర్యంలో పనిచేసే నోటిఫైడ్‌ మార్కెట్ల మధ్య సమానత్వం తీసు కొస్తామని తెలిపింది.నోటిఫైడ్‌ మార్కె ట్లలో వర్తించే సెస్‌, సర్వీస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభు త్వాలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తా మని ప్రకటిం చింది. కాంట్రాక్ట్‌-ఫార్మింగ్‌ చట్టం ప్రకారం అగ్రి బిజినెస్‌ స్పాన్సర్లు రైతుల భూమిని ఇతరుల పేరుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం,అమ్మడం,లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం వంటివి నిషేధించారు. కాంట్రా క్టు వ్యవసాయంలో రైతులు, స్పాన్సర్ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాల కారణంగా రైతుల భూమిని జప్తు చేయలేరని ప్రభుత్వం పేర్కొంది. పంటల వ్యర్థా లను కాల్చడంవల్ల ఢల్లీి,చీజR పరి సర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల వ్యర్థాలను దహనంచేసే రైతులకు ఒక సంవత్సరం జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్టోబర్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వ్యర్థా లను దహనం చేయకుండా ఇతర అవసరాలకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకక్వింటాల్‌ వ్యర్థాలకు రూ. 200 చొప్పున చెల్లించి, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్‌కు రూ.100 చొప్పున చెల్లించేందుకు ముందుకు రావాలని కేంద్రా నికి సుప్రీంకోర్టు సూచిం చింది. ఈసమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.– జిఎన్‌వి సతీష్‌

READ ALSO

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

Related Posts

పోరు-Poru

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

January 7, 2022
ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
పోరు-Poru

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

January 7, 2022
నోబెలే గుర్తించింది..మరి పాలకులు…?
పోరు-Poru

నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

January 7, 2022
ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు
పోరు-Poru

ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

December 4, 2021
72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి
పోరు-Poru

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

December 4, 2021
ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి
పోరు-Poru

ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి

December 4, 2021
Next Post
సమత తీర్పుకు 24 ఏళ్లు

సమత తీర్పుకు 24 ఏళ్లు

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

February 15, 2021

దేశ రైతును ఆదుకోవాలి!

February 15, 2021
We break indigenous societies and yet are scared of ‘them’

We break indigenous societies and yet are scared of ‘them’

November 3, 2020
తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

September 14, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3