• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home బాట‌-Bata

పర్యావరణం..కరోనా

team-dhimsa-viz by team-dhimsa-viz
September 2, 2021
in బాట‌-Bata
0
పర్యావరణం..కరోనా
0
SHARES
7
VIEWS
Share on FacebookShare on Twitter

చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ గా ఉంటుంది. ఏవిషయాన్నైనా ఇట్టే పట్టేసి జ్ఞాపకం ఉంచుకుంటారు. బాల్యంలో విద్యార్ధుల ప్రతిభను గమనించి ప్రోత్సహిం చేది తలిదండ్రులు. తరు వాత గురువులు, స్నేహితులు. ఈ విధమైన ప్రతిభ అనేక విష యాల్లో చూస్తుంటాం. వయసుకు మించి న శక్తి సామర్ధ్యాల్ని కనబరచటం. ఈ ప్రతిభ ను వెలికి తీయటం అనేది కత్తి మీదసామే! చదువు తో పాటు విద్యార్ధిలో నిగూఢమైవున్న కళను బయ టకు తీసుకురావటంలో ఉపాధ్యాయులు ముం దుండాలి. అలా చేయగలిగితే ఆవిద్యార్ధిలో పరి పూర్ణ పరిమళత్వం చూడ గల్గుతుంది. ఈనేపథ్యం లో ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో విద్యార్ధి సాధించిన విజయమే ఈనెల బాల వినోదంలో చదవండి. (జన విజ్ఞాన వేదిక ఏప్రి యల్‌ 2021 లో ‘‘పర్యావరణం-కరోనా’’ అనే అంశంపై ఆంధ్రా-తెలంగాణాలలో నిర్వహించిన పోటీలలో పాఠశా లల విభాగంలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం )

‘‘ ఆధునిక కాలంలో మన పర్యావరణం ఎక్కువ భాగం,కాలుష్యానికి గురవుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండగా,మనుషుల అవసరాలు,వారి కోరికలు పెరుగుతున్నాయి. దీనివల్ల భూమి మీద ఉండే ప్రకృతి వనరులని, మనం ఎక్కువగా వాడటమే కాకుండా భూమిని,దానిమీద ఉండే జీవరాశులన్నీంటినీ కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నాము. కర్మాగారాలు బయటకు వదిలే వ్యర్ధపదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు,బొగ్గును కాల్చడం ద్వారా వచ్చే కార్బన్‌ డైయాక్సైడ్‌,సముద్రాలలోకి విడుదలయిన ప్లాస్టిక్‌,నేలని ఆక్రమించుకోవటానికి చెట్లు కొట్టి వేయడం ఇవన్నీ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌, మన జీవనవిధానాన్ని మార్చే సింది. ఈ ప్రభావంవల్ల కొంత మంచి మరియు కొంత చెడు జరుగుతోంది.. జరిగింది. అవి పెద్దవైన చిన్నవైన,చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంలో ఒక మార్పు కలుగుతుంది ’’
ఆధునిక సమాజం సాంకేతికంగాబాగా అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా మాత్రం ప్రకృతితో ఇతర జీవరాసులతో ఒకసంబంధాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయింది. మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కంటికి కనబడని ఈవైరస్‌ రోజురోజుకి వేలల్లో, లక్షల్లో మనుషులకు సోకుతోంది. ఇకపై మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రకృతితో మమేకమైతేనే మనం బ్రతకగలమని అర్ధమైంది. ఈపరిణామంవల్ల మన సమాజంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కరోనావ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మను షులకి సోకటంవల్ల వ్యాపారాలు,చదువులు,ఉద్యో గాలు,దేశాలఆర్ధిక వ్యవస్థలు వీటన్నీటిపై ప్రతికూల ప్రభావం చూపించినా, పర్యావరణంపై మాత్రం అనుకూల ప్రభావమే చూపించింది. కరోనావల్ల అందరూ ఇంట్లోనే నిర్బంధమయ్యారు. ఈసమ యంలో ఎవరూ ప్రయాణాలు చేయక పోయేసరికి కార్లు, విమానాలు, రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనివల్ల అవి విడుదలచేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎమిషన్లు, గాలిలో సుమారుగా17 శాతం తగ్గాయి. మనుషులు ఎవరూ బయటకు రాకపోవటంవల్ల సముద్రాలలో, నదు లలో ఉన్న నీళ్ళు ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు మరియు రసాయనాలు, అవి మూతబడటంవల్ల సముద్రా లలోకి నదులలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతం మనభారత దేశానికి చెందిన గంగా నదిలో కూడా, నీళ్ళస్వచ్చత దాదాపుగా50శాతం పెరిగింది. చాలాతక్కువగా కనిపించే పక్షులు,అడవి జంతువులు కూడా బయట ఉన్న వాహనాల రద్దీ,ధ్వనికాలుష్యం తగ్గటంవల్ల అవిరోడ్ల మీద సంచరిస్తున్నాయి. చాలా సంవత్స రాల తర్వాత వాటికి స్వేచ్చ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా కరోనావల్ల కొన్ని పర్యావరణ లాభాలు ఉన్నాయి. కరోనా పర్యావరణంపై చూపించిన ప్రభావాలలో చాలానష్టాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత,అందరూ ప్రాముఖ్యత నిచ్చింది మాస్కులకే. మాస్కు ధరిస్తే మనల్ని మనము కాపాడుకోవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వాడిపడేసే ఈమాస్కులవల్ల చెత్త పెరిగి పోతోంది. అవి కూడా ప్లాస్టిక్‌ తోనే చేయబడ్డాయి కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ చెత్త సముద్రాలకు చేరి వాటిలో ఉన్నటువంటి జల చరాలకు హాని చేస్తాయి. చాలామంది మామూ లు చెత్తలాగా వీటిని కూడా ఎలా కావాలంటే అలా రోడ్ల మీద పడేస్తున్నారు. ఈమాస్కుల్లో వైరస్‌ ఉండటంవల్ల జంతువులకు తర్వాత మనుషులకు కూడా కరోనా వీటి నుంచి సోకుతుంది. ఆన్లైన్‌ షాపింగ్‌ కూడా కరోనా కారణంగా బాగా పెరిగిం ది. షాపులకి వెళ్లలేని మనము,ప్రతిదానికి ఆన్లైన్‌ ఆర్డర్లు చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్లాస్టిక్‌ చెత్త మిగులుతుంది. ఈసమయంలో మాస్కులు లాగానే చేతితొడుగులు (గ్లవ్స్‌) మరియు ఆసుప త్రులనుంచి వచ్చే వ్యర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవికూడా మాస్కుల లాగా చెత్త అయ్యి ఇతర జీవులకు హాని కల్గిస్తున్నాయి.
ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరగటం వలన,చాలామంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతోంది. అంతకుముందు రోజుకు ఐదు-ఆరు శవాలని కాల్చి వేయాల్సి వచ్చేది,కానీ ఇప్పుడు రోజుకి వేల శవాలను కాల్చే యాల్సి వస్తోంది. వీటిని కాల్చటంవల్ల కూడా పర్యావరణం కలుషితం అవుతుంది. ఎందుకంటే శవాల్ని కాల్చటంవల్ల వచ్చే పొగంతాగాలిలో కలు స్తుంది. కరోనాబయటివాళ్లకు సోక కుండా ఉండ టానికి శవాలని ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టినప్పుడు, శవాలతో పాటు ప్లాస్టిక్‌ కూడా కాలుతుంది. ఇందు వల్ల కూడా గాలిలోకి హానికరమైన విషవాయు వులు విడుదలవుతాయి. కరోనా కేసులు పెరగటం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఆక్సిజన్‌ సరిపోక ఆసుపత్రులలో చాలామంది చనిపోతు న్నారు కూడా. ఒకఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ అవ్వ టంవల్ల 20మంది మృతి చెందారు. కృత్రిమ ఆక్సిజన్‌ రోగులకు అందటానికి దేశంలో రోజుకి చాలా ఆక్సిజన్‌ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కూడా సరిపోక ఇతర దేశాలనుంచి విమానాలలో తీసుకురావాల్సి వస్తోంది. ముందే మనం కరోనా కేసులు ఇలా పెరగనివ్వకుండా ఉంటే, ఈపరిస్థితి వచ్చేది కాదు. ఈవిధంగా కరోనా పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపించింది.
కరోనా వల్ల పర్యావరణానికి కల్గిన లాభాలు,నష్టాలు చూస్తుంటే అది మనుషులకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. అయినప్పటికీ పర్యా వరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పర్యా వరణాన్ని కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది.-జతిన్‌ జూలకంటి

READ ALSO

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

Related Posts

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి
బాట‌-Bata

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

January 7, 2022
కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?
బాట‌-Bata

కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

January 7, 2022
భారీ వ‌ర్షాల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం
బాట‌-Bata

భారీ వ‌ర్షాల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం

December 4, 2021
ఆమెకేది రక్షణ
బాట‌-Bata

ఆమెకేది రక్షణ

October 12, 2021
స్వర్ణయుగ చక్రవర్తి
బాట‌-Bata

స్వర్ణయుగ చక్రవర్తి

October 12, 2021
విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు
బాట‌-Bata

విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు

September 2, 2021
Next Post
కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

September 14, 2021
ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

September 14, 2021
కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

February 15, 2021

October 29, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3