విస్తృత పరిశోధన సారం`ఆదివాసీల జీవనం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత, సంపాదికులు భూక్యా చిన వేంకటేశ్వర్లు కలం నుంచి జాలువారిన ‘ఆదివాసుల జీవనం’ అనే పుస్తకంపై సమీక్ష
తెలుగు సాహిత్యానికి గిరిజన జీవన చిత్రానికి విడదీయరాని బంధం సంబంధం ఏనాటిదో!! మౌఖికంగా ప్రారంభమై అక్షరాల గుండా నేడు అడివంత విశాలంగా వ్యాపించి వివిధ ప్రక్రియల ద్వారా పరిశోధనాత్మకంగా పరిశీలన పథంలో పయనిస్తుంది,గిరిజన సాహిత్య వికాసం కోసం విశ్వవిద్యాలయాలతో పాటు కొన్ని పత్రికల యాజమాన్యాలు చేస్తున్న కృషి అభినందన పూర్వక ఆచరణీయం.
ఇందులో భాగంగానే సుమారు పాతికేళ్ల క్రితం గుంటూరుకు చెందిన,ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన జాతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు,గిరిజన స్రవంతి మాసపత్రిక సంపాదకుడు.
‘‘భూక్యా చిన వెంకటేశ్వర్లు’’సంపాదకత్వంలో వెలువడిన వ్యాస సంకలనం‘‘ఆదివాసుల జీవనం’’, విభిన్న రంగాలకు చెందిన రచయితలు,తమ తమ పరిధిలో పరిశోధనాత్మక,ప్రామాణిక,రీతిలో గిరిజన జనావళికి సంబంధించిన అనేక చారిత్రక,సాంస్కృ తిక,సామాజిక,ఆర్థిక,అంశాలను గణాం కాలతో సైతం అందించిన 30వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
వ్యాస సంకలనంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు వివరించడంతోపాటు,వారి వెనుక బాటుకు కారణాలు ప్రభుత్వాలు చేయాల్సిన విధులు, గురించి కూడా నిర్మొహమాటపు వ్యాసాలు అనేకం ఇందులో చదవవచ్చు.
ఆదివాసులకు అడవులకు మధ్య గల అవినాభావ సంబంధంను కాలరాస్తున్న ‘‘ఫారెస్ట్‌ బిల్లు’’ ద్వారా అడవి బిడ్డలకు జరుగుతున్న నష్టం,బావి ప్రమా దాలను, హెచ్చరికలతో అందించిన తొలి వ్యాసంలో ‘‘1927 భారత అటవీ చట్టం’’మొదలు అనంతర కాలంలో వచ్చి రూపాంతరం చెందిన పలు అటవీ చట్టాలు..బాహ్యంగా అడవుల,పర్యా వరణ,పరిరక్షణకు అన్న చందంగా కనిపించిన అంతర్గతంగా అడవి బిడ్డలకు అనేక విధాల ఆటంకాలు కలిగిస్తున్నాయి, అనే అక్షర సత్యం అందులో మనం గమనించవచ్చు, కేవలం బిల్లులోని దోషాలు ఎత్తి చూపడమే కాక పరిష్కార మార్గాలు, సూచనలు,కూడా చేయడం వల్ల ఉత్తమ విమర్శనాత్మక వ్యాసశ్రేణిలో నిలుస్తుంది,ఈ కోవకు చెందిన వ్యాసాలు అనేకం ఇందులో ఉన్నాయి.
నిడివి వ్యాసాల విషయం పక్కనపెట్టి విషయ ప్రాధాన్యతలను ప్రామాణికంగా లెక్కించి వర్గీకరించుకోవలసిన ఈవ్యాసాలు మొత్తం సంఖ్యాపరంగా 29,విషయ సూచిక లోపంగల దీనిలోని వ్యాసాలు పరిశీలించినప్పుడు గిరిజనుల సంస్కృతిని పరిరక్షించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు చేయాల్సిన కృషిని గురించి, కూడా గుర్తు చేస్తాయి.
‘‘గిరిజనాభివృద్ధి ఒక పరిశీలన’’అనే వ్యాసంలో 1957లో బలవంతరాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు గిరిజన అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 43 బహు ళార్థ ప్రాజెక్టులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విషయంతో పాటు,మూడవ,నాల్గవ,పంచవర్ష ప్రణాళికల్లో గిరిజన అభివృద్ధికి ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేసి,వారి ఆర్థిక అభివృద్ధికి జరిగిన కృషిని గుర్తు చేస్తూనే ఆదివాసుల సమగ్ర అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలు మూస పద్ధతిలో కాక, ఆయా గిరిజన ప్రాంతాల్లోని భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన రీతిలోనే అభివృద్ధి చర్యలు చేపట్టాలనే విలువైన సూచనలు అందించారు వ్యాస రచయిత డాక్టర్‌ ఎల్‌. ప్రసాద్‌,
‘‘గిరిజన విద్య-అవకాశాలు-నిర్బంధాలు’’ అనే మరో వ్యాసంలో రచయిత ‘‘ప్రొఫెసర్‌ అంబాస్ట్‌’’ అనేక విలువైన విషయాలు తెలియజేశారు. పూర్వం గిరిజన జాతులు ఒక దానితో ఒకటి ఏవిధమైన సంపర్కం గాని సమాచార సంబంధాలుగానీ లేకుండా ఉండేవి, అందువల్ల వారిలో అధిక శాతం వ్రాసే భాషను అభివృద్ధి చేయలేకపోయి కేవలం మాట్లాడటం ద్వారానే అవసరాలు తీర్చుకుంటూ గిరిజన భాషలు మౌఖిక భాషలుగానే మిగిలిపోయాయి,అనే అక్షర సత్యాలను ఈ వ్యాస రచయిత ఆవిష్కరించడంలో ఆదర్శంగా నిలిచిపోయారు.గిరిజన భాషలకు లిఖితపూర్వకమైన భాష లేకున్నా నిర్దిష్టమైన వ్యాకరణం,భాషా నిర్మాణం ఉండేవి, మన దేశంలోనే చాలా గిరిజన తెగలవారు వారి పురాతన సంస్థల ద్వారానే విద్యావసరాలు తీర్చుకునేవారు.ఈ సంస్థలు ఆయా గిరిజన తెగలలోని యువతను సామాజిక ప్రయోజనం కలిగిన ఉత్పాదక సభ్యులుగా తయారు చేసేవి. గిరిజన సమాజాలు చాలావరకు ఇతర ప్రపంచాలతో సంబంధం లేనివి కావడం చేత వారు లిపి అవస రంగా భావించలేదు. కానీ వారికి భావపరమైన నైపుణ్యం ఉంది.
గిరిజనులందరికి సంపూర్ణ విద్యా సౌకర్యాలు అందాలంటే సమయం పడుతుంది, రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యా, ఆర్థిక, ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.ఇలాంటి ఎన్నో ప్రామాణిక అంశాలు ఈ వ్యాస పరంపర సాయంగా తెలుసుకోవచ్చు.
గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించిన ప్రయోజనాల గురించి యం.టి.దిన్‌ తనవ్యాసంలో అనేక ప్రామాణిక అంశాలు కూలంకషంగా వివరించారు, పూర్వం బ్రిటిష్‌ పాలకులు అనుసరించిన ఏర్పాటు వాదాన్ని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు గిరిజన గిరిజనేతర ప్రజల మధ్య గల అవరోధాలను తొలగించే దిశగా మార్పులు చేర్పులు చేసి గిరిజనులు కూడా ఇతర భారతీయులతో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృ తికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ ,షెడ్యూళ్లు, రూపొందించారు.
వీటి ద్వారా గిరిజన జనాభా ఆశించిన లబ్ధి పొందవచ్చు, కానీ కార్యాచరణలో నేటి గిరిజన జనాభా అభివృద్ధి ఏమిటి? అన్నది వ్యాసకర్త ప్రశ్న. ఇలా అనేక విషయాల కలబోతలు గల ఈ వ్యాసాలు బహుళ ప్రయోజన కారకాలు అనాలి.
ఇక ఇందులోని రెండవ పార్శ్వం గిరిజనుల సంస్కృతి వికాసానికి సంబంధించిన వ్యాసావళిలో కోయనృత్య ప్రదర్శన, విధానాలు గిరిజనలు పండుగలు, వేడుకలు, గిరిజనుల ఆచారాలు, అలవాట్లు, మొదలైన వ్యాసాలతో పాటు డాక్టర్‌ బాలగోపాల్‌ గారి సుదీర్ఘ వ్యాసం ‘‘గిరిజనులు గిరిజన సంస్కృతి’’ ద్వారా అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలుస్తాయి.
గిరిజన జీవితాలతో విడదీయలేని బంధం గల నృత్యాల గురించిన ప్రత్యేక వ్యాసంలో గొట్టిపాటి సుజాత అనేక గిరిజన నృత్య రీతుల గురించి కళ్లకు కట్టినట్టు అక్షరీకరించారు. వీటిలో కొండ దొరల ‘‘మయూర నృత్యం’’ గురించి ప్రత్యేకంగా వ్రాశారు, వివాహ సందర్భాల్లో చేసే ఈ నృత్యంలో పెళ్లి, వైవాహిక జీవితం, మొదలైన అంశాలను ఘట్టాల వారీగా ప్రదర్శించడం వీరి ప్రత్యేకత, అలాగే గోండులు చేసే దండారి, థింసా, నృత్య విశేషాలు, అలంకరణలు, మొదలైన అంశాల గురించి కూలంకషంగా ప్రామాణికంగా
ఈ వ్యాసంలో చర్చించారు.
పరిశోధకుల పాలిట కల్ప వృక్షంగా చెప్పాల్సిన ఈవ్యాస సంకలనం బహుళ ప్రయోజన కారి అనడం సబబు, 1998లో ప్రథమ ముద్రణ పొందిన ఈ వ్యాస సంకలనం, 2002లో ద్వితీయ ముద్రణ పొందటం మరో విశేషం,
ఆదివాసుల జీవనం (వ్యాస సంకలనం), పేజీలు : 144
వెల : 55/- రూ
సంపాదకుడు : కీ:శే భూక్యా చిన వెంక టేశ్వర్లు.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌ : 77298 83223.

అడవి బతుకులు ఆదివాసీ నవల

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత,పరిశోధకులు డాక్టర్‌ దిలావర్‌ కలం నుంచి జాలువారిన ఆధ్యాత్మక, చారిత్రక,ప్రాధాన్యత సంతరించుకొని గిరిజనల్లో ఒక ప్రత్యేకత చాటుకున్న ‘ అడవి బతుకులు ఆదివాసీ నవల’ అనే పుస్తకంపై సమీక్ష
అడవి జన జాతుల్లో అచ్చమైన అడవి బిడ్డలు చెంచులు,మన తెలుగు రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో అధికంగా అగుపించే ఈచెంచులకు ఎంతో ఆధ్యాత్మిక,చారిత్రక,ప్రాధాన్యత ఉండి గిరిజనుల్లో ఒక ప్రత్యేకత చాటు కున్నారు.
ఎంతో ఘనమైన చరిత గల ఈ చెంచు జాతి అడవి బిడ్డలు నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న అగచాట్ల గురించి ఆవిష్కరించిన ఆదివాసీ నవల‘‘అడవి బ్రతు కులు’’దీని రచయిత ప్రముఖ పరిశోధకుడు ‘‘డాక్టర్‌ దిలావర్‌’’ వీరు తెలుగు బోధకునిగా పనిచేస్తూ పలు గిరిజన జనవాసాల్లో ప్రత్యక్షంగా గడిపిన అనుభవంతో పాటు తనదైన పరిశోధన, పరిశీలన, సాయంగా ఈ నవలను అనేక విషయాలు విశేషాల సమాహారంగా అందించారు.
నవల మొత్తం 21అధ్యాయాలుగా విభ జించబడి కొనసాగింది, కాల్పనిక పద్ధతిలో వాస్తవ సంఘటనలను మిళితం చేసి వ్రాసిన ఈనవల రచనా శైలి సరళంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది,
నవల మొత్తం చెంచుల సంస్కృతి సాంప్ర దాయాల ఆవిష్కరణతో పాటు వారి జీవనం లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా ఆధునిక వ్యక్తులు ఆధునిక కట్టడాలు నిర్మాణాలు ద్వారా అడవి బిడ్డలు ఎదు ర్కొంటున్న కష్టాలే కాక నష్టాలు,తద్వారా తమ జాతి జనాభా నిర్వీర్యం అయి అంత రించిపోతున్న తీరు,నల్లమల ప్రాంతంలో నిర్మించిన నాగార్జునసాగర్‌ ఆనకట్ట నిర్మా ణం తీరు ఆనాటి పరిస్థితులు, చెంచులు నష్టపోయిన వైనం, వంటి చారిత్రక విష యాలు విశేషాలతో పాటు నేటి ఆధునిక కాలంలో స్వార్థపు స్మగ్లర్ల వల్ల అటవీ సంపద కొల్లగొట్ట పడుతున్న తీరు,ఆ దాస్టి కంలో అమాయక చెంచులు సమిదలవు తున్న వైనం,కళ్ళకు కట్టారు రచయిత డాక్టర్‌ దిలావర్‌.ఈనవలలో ప్రధాన పాత్రలు ప్రొఫెసర్‌ రచయిత రమణారావు, అతని భార్య సృజన,పరిశోధక రచయిత రమ ణారావు తన దగ్గర గల క్షేత్ర పర్యటనల అను భవ సారంతో ఒక మంచి ‘ఆదివాసీనవల’ రాయలనుకొని చాలా కాలం కృత్యాద్య వస్థ పొంది చివరికి రచన ఆరంభిస్తారు.కట్‌ చేస్తే తెలంగాణకు హృదయం వంటి అందమైన నల్లమల అడవుల్లో నవల ప్రారంభమవుతుంది. నవల రెండో భాగంలో చెంచులు నల్లమల ప్రాంతానికి దూరమైన తీరు తద్వారా మరణి మరణించిన వైనం చెప్పడం జరుగుతుంది. మూడవ భాగంలో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ కట్టిన నేపథ్యం వివరిస్తూ దాని నిర్మాణంలో వందలాది చెంచులు అసువులు బాసిన మరు గున పడిన చరిత్రను,ఈ నవలా రచయిత ఆవిష్కరించటం ఇందులో విశేషం. నల్లమల అడవుల్లోని పక్షి, జంతు,సంతతి వివరాలు, చెంచుల జీవన విధానం ఆహారపు అలవాట్లు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ …డాక్టర్‌ దిలావర్‌ తనదైన శైలిలో స్థానిక విషయాలతో కూడిన ఉపమానాలు అన్వయిస్తూ నవలను నడిపించిన వైనం పాఠకులను అబ్బురపరుస్తుంది.4,5 భాగాలలో ఈ అక్షర దృశ్యాలు నల్లమల అందా లు చెంచుల ఆనంద వైభవాలు హృ ద్యంగా చదవవచ్చు.సంస్కృతి సాంప్రదాయాలను పర్యా వరణను పరిరక్షించే అడవిబిడ్డలైన చెంచుల్లో నిభిడీకృతమైన ప్రేమఅనురాగాలు,అమలిన శృంగార కథనాలు కూడా మనం ఈనవలలో గమనించవచ్చు.కోనమ్మ,కొండడు,అనే ఇద్దరు చెంచు యువతీ యువకుల ప్రణయగాథ ఈ నవలకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక రచయితలోని ప్రేమతత్వం చిలిపితనం,శాంత స్వభావం,అర్థం అవుతాయి.ఇష్టపడ్డ ఇద్దరూ యువతీ యువకులు కుల పెద్ద అంగీకారంతో రెండు మూడు రోజులు వనవాసం చేసివస్తే ఆ తర్వాత కులదేవత సాక్షిగా వారికి అందరి అంగీకారంతో పెళ్లిచేసే సంప్రదాయం చెంచు జాతిలో ఉందనే విషయంఈనవలలో కొండడు, కోనమ్మల,పెళ్లి సందర్భంగా రచయిత వివరిం చారు.భార్యా,భర్త చనిపోయిన జంటలు తిరిగి పెళ్లి చేసుకునే సహృదయ సాంప్రదాయం సైతం చెంచు జాతిలో ఉందని, ఆ సహజీవ నం కూడా కుల పెద్ద అంగీకారంతోనే అంటూ చెంచుల కుల కట్టుబాటును ఉదహరిస్తూ గుర్రమ్మ,లింగయ్యల సహజీవనం గురించి కూడా రచయిత ఈనవల ద్వారా వివరించారు,
చెంచుల్లో ఉండే పోడు వ్యవసాయ విధానం, సంచార జీవనం ద్వారా ఎక్కడ పంటలకు అనుకూలమైన వాతావరణం భూమి ఉంటుం దో అక్కడే వారు జీవనం చేస్తూ జీవితం గడుపుతారు.ముఖ్యంగా వారి వ్యవసాయ పద్ధతులు అన్ని సహజత్వంగా ప్రకృతికి దగ్గరగా ప్రకృతిని పరిరక్షించే తీరులో ఉండ టం అందరికీ ఆశ్చర్యకరమే కాదు ఆదర్శ నీయం కూడా. చెంచులు ఎంతగా ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛ మైన జీవనం సాగిస్తున్న,చెట్ల మందులతో వైద్యం చేయడం వచ్చిన, అత్య వసరమైన కాన్పుల సమయంలో కనలేక ఎందరో చెంచు మహిళలు మరణిస్తున్నారు. అందులో ఒకటి లింగయ్య ఇష్టపడి మారు మనువు చేసుకున్న గుర్రమ్మ, కాన్పు సమ యంలో మరణించడం,కొందరు చెంచు యువకులు మత్తు పానీయాల వ్యసనాలకు లోనై నాలుగు పదుల వయసులోనే చనిపోతూ… చెంచు గుడేలు,పెంటలు, విధవ రాళ్ల తో నిండిపోతున్నాయని,హృదయ విధా రక ఆవేదనను సైతం రచయిత ఈ నవలలో ఆవిష్కరించారు. నవల పదవ భాగం నుంచి పరిశోధక రచయిత ప్రొఫెసర్‌ రమణరావు చెంచుల మరి కొన్ని జీవన విధానాలు ప్రత్య క్షంగా చూసి తెలుసుకోవడానికి గాను తన మిత్రులతో కలసి చెంచు గుడేలకు వెళ్లడంతో మొదలవుతుంది. స్థానిక చెంచు పెద్దలు వీరికి చెప్పిన స్థానిక చరిత్రల ఆధారంగా అనేక చారిత్రక సత్యాలు అర్థం అవుతాయి,చెంచుల తొలి దేవర వృద్ధ మల్లికార్జునుడు అతను శ్రీశైలంలో స్వయంభూ గా వెలిసినట్టు,అతనిని ‘‘మలల అన్న’’అని మొదట పిలిచేవారని, అతను తమ ఆడబిడ్డ ‘‘బ్రహ్మ రాండదేవి’’ని పెళ్లి చేసుకున్నట్టు, శ్రీశైలం మొదట చెంచుగూడెం అని, అక్కడ గుడి కట్టింది కూడా చెంచులే అని గజ్జల కొండడు ఆలయతొలి పూజారి అనే మరుగున పడిన చారిత్రక విశేషాలు రచయిత ఈనవల లో అందించారు. శివాజీ చేసిన యుద్ధాలకు చెంచులు అందించిన సహకారం గురించి మరికొన్ని మరుగున పడిన చెంచు ప్రాంత చారిత్రక విషయాల గురించి రమణారావు పాత్ర క్షేత్ర పర్యటనల ద్వారా తెలుసుకున్నట్టు రచయిత దిలావర్‌ నవలీకరించారు.
అలాగే నల్లమల అడవుల్లో ప్రస్తుత ఆధునిక కాలంలో స్వార్థపరులైన వ్యాపారులు దళారీల ద్వారా జరుగుతున్న అటవీ ఉత్పత్తుల రవాణా వల్ల స్థానిక చెంచు కుటుంబాలు నేటి కాలంలో ఎలా నష్టపోతున్నాయో అన్యాయాలు ఇబ్బందు లు ఎలా ఎదుర్కొంటున్నారో ఈ నవల ముక్తా యింపులో రచయిత డాక్టర్‌ దిలావర్‌ అందం గా ఆలోచింపజేసే విధంగా ఆవిష్కరించారు. అందమైన స్థానిక అంశాల ఉపమానాలే కాక స్థాని సరళమైన భాషను కూడా నవలలో ప్రయోగించటం రచయితకు గల అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది ఎన్నో చారిత్రక సాంస్కృతిక విలువలు గల విలువైన ఆదివాసీ నవల‘‘అడవి బతుకులు’’ అందరూ విధిగా చదవాలి.
అడవి బతుకులు (నవల),రచయిత: డాక్టర్‌ దిలావర్‌, పేజీలు: 112, వెల:100/- రూ,
ప్రతులకు: యండి అక్బర్‌,సెల్‌: 93811 06671,సమీక్షకుడు:డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

ప్రామాణిక దర్పణం కొండరెడ్డి జీవన విధానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన గ్రంధం ‘ కొండ రెడ్ల గిరిజనుల జీవన విధానం’ అనే పుస్తకంపై సమీక్ష
మనం మూల వాసులుగా చెబుతున్న ఆదివాసీలలో ఒక తెగ అయిన కొండరెడ్డి గిరిజన జీవన విధానంకు సంబంధించి సంపూర్ణ సమాచారంగల ప్రామాణిక పుస్తకం ‘‘కొండరెడ్డి గిరిజనుల జీవన విధానం’’ తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన, ప్రచురణల విభాగంలో భాగంగా ఈ పుస్తకం 2010 సంవత్సరంలో ప్రచురించారు. గిరిజన జీవన విధానాల పరిశోధన ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని నాటి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి మండలంలో గల ‘‘బొడ్లంక’’అనే సంపూర్ణ కొండారెడ్డి గిరిజన గ్రామంను ఈ పరిశోధనకు ఎంపిక చేసుకొని పరిపూర్ణమైన సమాచారం సేకరించి పొందుపరిచారు.
నాటి గ్రామ చరిత్ర సమాచారాలను తెలిపే కైఫియత్తు ప్రక్రియలో వ్రాసిన ఈ గిరిజన గ్రామ చరిత్రలో అనేక చారిత్రక సామాజిక సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి.
సుమారు 1901 సంవత్సరంలో పుట్టగండి గ్రామం నుంచి వలస వచ్చిన కొన్ని కొండ రెడ్డి కుటుంబాలతో ఏర్పడిన ఈ పూర్తి గిరిజన గ్రామంలో నేడు 60 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు.
చుట్టూ దండకారణ్యం ఎతైన కొండలు వాటి మధ్య బొడ్డు లాగా లోతుగా ఉండే లోయ నాలుగు దిక్కుల జలజల పారే సెలయేర్లతో అందాలు ఆరబోస్తున్న ఈ ప్రాంతం భౌతిక రూపం అనుగుణంగానే ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు సార్ధకం చేసినట్టు,అలాగే ఈ గ్రామ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిం చిన పల్లాల వీరపరెడ్డి తండ్రి బోడి రెడ్డి పేరు మీదుగా కూడా ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు వచ్చిందనే మరో కథనం కూడా ఉంది.
నేడు ఈ గ్రామం ఐటిడిఎ సహాయ సహకారాలతో కొంత కొత్త రూపును సంతరిం చుకుంటున్న,నగర సంస్కృతి ఛాయలు సంత రిస్తున్న ఇక్కడి కొండరెడ్డి గిరిజనులు వారి పూర్వ తరాల సంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ మనుగడ సాగించటం విశేషం.
‘‘బొడ్లంక పరిచయం’’ మొదలుకొని ‘‘ఆటలు’’ వరకు మొత్తం14విభాగాలుగా విభజించి వ్రాసిన సంపాదకులు ఆచార్య భట్టు రమేష్‌ గారి సంఘటిత అక్షర కృషి అభినందనీయం, విషయ సేకరణ కర్తల కృషి ప్రశంసనీయం, గ్రామాల చరిత్ర రాయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ఇందులో అగుపిస్తున్నాయి. గ్రామ పరిచయంతో మొదలై. ప్రజలు కులాల మధ్య సయోధ్య, పర్యావరణం,ఇంటి నిర్మాణం, గృహ సంబంధ వస్తు సంస్కృతి,వైద్య విజ్ఞానం, దేవతలు పండుగలు,జీవిత చక్రం,సంబరాలు వేష భాషలు భూషణాలు,ఆహారం,వస్తువులు, నిలవ పద్ధతులు,ఆటలు,తదితర అంశాలు కొండరెడ్డి గిరిజన జీవితాల్లో ఎలా పెనవేసు కున్నాయో ఆసక్తిదాయకంగా ఇందులో వివరించారు.
కొండ రెడ్డి కుటుంబంలో పుట్టిన శిశువుకు పేరు పెట్టడం ఒక ప్రహసనంగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని ‘‘పేరు ముళ్ళ’’ అని పిలుస్తారు ఈ తంతులో వారి సంస్కృతిని ఆధారం చేసుకుని వ్యవహరించడంలో అనేక ఆసక్తి దాయకమైన విషయాలు వెల్లడవుతాయి మనుషుల పేర్లతో పాటు ఇంటిపేర్లు చెట్ల పేర్లు తదితర పేర్ల గురించి వివరంగా తెలిపారు. బొడ్డులంక సంపూర్ణ కొండ రెడ్డి గ్రామం అయినా వీరితో సయోధ్య గల కమ్మరులు వేగుజంగాలు తదితర జాతుల గురించి ప్రస్తావిస్తూ వారితో వీరికి గల సయోధ్య గురించి వివరించిన అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయి.
అలాగే ఈ గ్రామస్తులు పర్యావరణ సంరక్షణలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరిస్తూ అక్కడి వృక్ష సంపద గురించి అనేక విలువైన విషయాలు పేర్కొన్నారు. అలాగే కొండరెడ్డి గిరిజనులు నిర్మించుకునే ఇంటి నిర్మాణం గురించి జీవిత చక్రపు సంబరాల్లో ఇంటి ప్రాధాన్యత దానికి కొండరెడ్లు ఇచ్చే ప్రాతినిథ్యం తదితర అనేక విలువైన విషయాలు ఈ విభాగంలో పొందుపరచబడ్డాయి.
అలాగే ‘‘గృహ సంబంధ వస్తు సంస్కృతి’’ వైద్య విజ్ఞానం, వృత్తి విజ్ఞానం,తో పాటు కొండరెడ్లు ప్రత్యేకంగా చేసుకునే దేవతల పండుగలులో వారు చేసుకునే విలక్షణమైన సంక్రాంతి పండుగ గురించి, అనేక ఆసక్తిదాయకమైన విషయాలు ఈ విభాగంలో తెలిపారు దీనితో పాటు వాళ్లు చేసుకునే కొండ దెయ్యాల పండుగ,సొప్పల పండుగ,పచ్చిక పండుగ, మామిడి కొత్త పండుగ,మామిడి టెంకల పండుగ,కొర్ర కొత్త,జొన్న కొత్త,పండుగలు బుడమల పండుగ,దారి పండుగ,లక్ష్మీదేవి పండుగ,భూదేవి గంగానమ్మల పండుగలు, వంటి సామూహిక పండుగలతో పాటు వ్యక్తి గతమైన పండుగలను జీవిత చక్రపు సంబ రాలు శీర్షికతో కొండరెడ్లు చేసుకునే మరికొన్ని పండుగలు అవి చేసుకునే విధానాల గురించి ఉపయుక్తమైన విషయాలను సేకరించి అందిం చారు.దీనిలో కొండారెడ్డి జాతిలో జననం నుంచి మరణం దాకా చోటు చేసుకునే వివిధ సంఘటనల గురించి సవివరంగా తెలిపారు. ఇక 11వ విభాగం అయిన ‘‘వేష భూషణాలు’’ గురించిన దానిలో కొండరెడ్లు ధరించే ఆభర ణాలు అలంకరణలు తదితర విషయాలు ఎంతో చక్కగా పేర్కొన్నారు.అనంతరం ఆహా రం గురించిన విశ్లేషణలో వారు తినే సోడి రొట్టె, సామకూడు,సామజావ,కొర్రకూడు, గంట్లు,జీలుగు అంబలి,మామిడి టెంకల రొట్టె, అంబలి,మొక్కజొన్న అంబలి,సేమకూర, వెదురు కొమ్మలకూర,లక్ష్మిచారు,తదితర ఆహార దినుసులు తయారు చేసే విధానాలు మొదలైన అంశాలు ఈ విభాగంలో పొందుపరిచారు. ఇక చివరి రెండు విభాగాలుగా,వస్తువులు నిల్వ పద్ధతులు,ఆటలు,అనే అంశాలు చెప్పబడ్డాయి. పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధస్తులైన కొండరెడ్లు వారు పండిరచిన ఆహారం పంట లను నిల్వ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహి స్తారు.ఆధునికులకు ఈవిధానం ఆశ్చర్యకరంగా ఆగుపించిన,వీరు పాటించే పద్ధతులు ప్రామా ణికంగా ఆరోగ్య దాయకంగా ఉంటాయి. కొండరెడ్లు ఆడే ఆటల్లో కూడా కొన్ని విలక్షణమైన అంశాలను మనం గమనించ వచ్చు వాటిలో ప్రధానంగా ఆగుపించేవి ఉప్పరి పెట్టెలు,నాలుగురాళ్లు,పిన్నీసు ఆట,ముక్కు చిక్కుడు,తల్లి పిల్లఆట, ఎత్తురాళ్ళు,పుల్ల, బచ్చ,గూటి బిళ్ళ,గెలుపులాట,మొదలైన ఆటలు కొండరెడ్డి గిరిజన జాతులవారిలో పిల్లలు పెద్దలు స్త్రీ పురుషులు ఆడతారు..అనే అంశా లు ఇందులో తెలిపారు.
ఇలా ఒక గ్రామమును ప్రామాణికంగా తీసు కుని అక్కడి వివరాలను పరిశోధనాత్మకంగా అక్షరబద్దం,చేయడం ద్వారా బహుళ ప్రయో జనాలు చేకూరతాయి.
ఎన్నో పరిశోధక విలువలు గల ఈ బొడ్లంక కొండరెడ్డి గిరిజన గ్రామ చరిత్ర ఆధారంగా మరిన్ని గిరిజన గ్రామాల చరిత్రలు రావాల్సిన అవసరం కనిపిస్తుంది.
పుస్తకం : కొండ రెడ్డి గిరిజనుల జీవన విధానం (బొడ్లంక)
సంపాదకులు : ఆచార్య భట్టు రమేష్‌, పేజీలు:172,వెల :-85/-రూ,ప్రతులకు : జానపద గిరిజన విజ్ఞాన పీఠం తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్‌-506002, ఫోన్‌ : 0870-2101309/2441258
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌ :7729883223.

తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు

మామానవ జాతికి మూలంగా చెప్పబడుతున్న గిరిజనులు దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో విస్తరించి ఉన్నారు ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందున తెలంగాణ రాష్ట్రంలో గిరిజ న జనాభా10శాతం విస్తరించి ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తుంది.12రకాల గిరిజన తెగలు గోదావరి కృష్ణ నదుల పరివా హక ప్రాంత కొండలు,కోనలు,అడవులు, మైదానాలలో నివసిస్తున్నారు.నమ్మకానికి సంస్కృతి పరిరక్షణకు ప్రతిరూపా లైన ఈఅడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలోని ఆధ్యాత్మిక క్షేత్రాల గురించిన పూర్తి పరిశోధక పుస్తకం ‘తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు’ రచయిత డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ. వీరు నిత్య సంచార పరిశోధకులు16 డిగ్రీలు పూర్తి చేసిన బహుముఖ విద్యావేత్త. గిరిజనా భివృద్ధి సంస్థ హైదరాబాదులో ఉన్నత ఉద్యో గ సేవలు అందిస్తున్న ఆయన వ్రాసిన ఈపుస్తకంలో అనేక ప్రామాణిక అంశాలు పొందుపరిచారు. గిరిజన కళాసంస్కృతి మొదలు గోదావరి లోయలో గిరిజన క్షేత్రాలు అనే తొమ్మిది విభాగాలుగా ఈ ప్రామాణిక పుస్తకం పొందుపరిచారు, అను బంధంగా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల వారీగా లంబాడ గిరిజన జనాభా వివరాలు అందించారు.ఈ పుస్తక రచన తెలంగాణ ప్రాంతంలోగల వివిధ జాతుల గిరిజనులు వారు పూజించే దైవాలు చేసేజాతరలు కేంద్రంగా కొనసాగి నేటితరం వారికి తెలి యని అనేక విలువైన చారిత్రక ఆధ్యాత్మిక విషయాలు విశేషాలు తెలియజేసింది. గిరిజన కళా సంస్కృతి అనే మొదటి విభాగంలో వివిధ గిరిజన తెగలు,కళలు, సంగీతం,నాట్యం,సాహిత్యం,చిత్రలేఖనం,కర్ర శిల్పం,అల్లికలు,గురించి సవివరంగా వివరి స్తూనే ప్రపంచీకరణ ప్రభావంతో అవి అంత రించిపోతున్న వైనం తెలిపి జాగృతం చేశారు.
ముఖ్యంగా లంబాడీల జీవన సంస్కృతి గురించి చాలా లోతైన అంశాలు వెల్లడిరచారు వంశాల వారీగా కొలిచే దేవతలు వాటి ప్రతిరూపాలుగా పూజించే చెట్ల వివరాలు లంబాడి సమాజం కుటుంబం కట్టుబాట్లు వివాహ విధానాలతో పాటు రాజస్థాన్లోని అబు పర్వతంపై బ్రాహ్మ ణులు చేసిన యజ్ఞం నుంచి ఉద్భవించిన రాజులు ఆ వంశం నుంచి అవతరించిన లంబడా తెగల వివరణ ఆసక్తికరంగా వివరిం చారు రచయిత సత్యనారాయణ. లంబాడీల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ పూజా విధానం గురించి అనేక చారిత్రక అంశాలు జోడిరచి వివరించబడిరది.
కోయదొరలు పూజించే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి చారిత్రక జానపద అంశాలు జత చేసి అందించిన విభాగంలో సమ్మక్క సారక్క ప్రతాపరుద్రుని సేనలతో పోరాడి మరణించినట్టు ప్రజలను రక్షించే నేపథ్యంలో యుద్ధంలో మరణించిన వారి స్ఫూర్తి కోసం ‘‘వీరగల్‌ శిల్పాలు’’ చెక్కించటం నాటి ఆనవాయితీ, ప్రస్తుతం మేడారం దగ్గర జంపన్న వాగుపై వంతెన నిర్మాణ తవ్వకాల్లో స్త్రీ మూర్తి,పురుషమూర్తి,విగ్రహాలు బయట పడ్డట్టు అవి సమ్మక్క జంపన్న లవి అయిఉంటాయి అనే స్వీయ భావం రచయిత వ్యక్తపరిచారు. కాని ఆవివరాలు ఏవి ప్రస్తుతం మేడారంలోగానీ మ్యూజియంలోగాని లేకపోవడం కాస్త సందిగ్ధకరం. ఇక ఆదిలాబాద్‌ లోని కేస్లాపూర్‌లో గల గోండుల ఆరాధ్య దైవం‘‘నాగోబా’’గురించి కూడా అనేక చారిత్రక విషయాలతో సుదీర్ఘ అంశాలు, జాతర నేపథ్యం తీరుతెన్నుల గురించి కూలంకషంగా చర్చించారు.అలాగే గుండులు అమ్మ తల్లిగా పూజించే జంగు భాయ్‌ జాతర గురించి,కొమరం భీమ్‌ స్మారకం జోడెన్‌ ఘాట్‌ గురించిన వివరణలు ఇందులో చదవవచ్చు.
తెలంగాణలో గల ప్రధాన కోటలు వరంగల్‌, భువనగిరి,కోటలకన్నా అతి ప్రాచీనమైన గాంధారి కోట,గురించి అక్కడి పద్మనాయకపు గిరిజనులు ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో జరుపుకునే మైసమ్మ జాతర గురించి జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు చేసే తంతులు గురించి సవివరంగా రాయడంలో రచయిత స్వీయ క్షేత్ర పర్యటనా నుభవం ప్రతి అక్షరంలో అగుపిస్తుంది.
ఆదిలాబాద్‌లోనే గల మరో అరుదైన పెద్దయ్య గుట్ట,గురించి కూడా మార్గ నిర్దేశం చేస్తూ వివరించారు,అలాగే కరీంనగర్‌ ప్రాంతంలో గల చిన్నయ్య గుట్ట యొక్క మొక్కుల గురించి కూడా తెలిపారు,
భద్రాచలం సమీపంలోని చర్ల దగ్గర పూజారి గూడెంలోని నాయకపోడు గిరిజనులు చేసే ‘‘సోముల దేవమ్మ కొలుపు’’ గురించి ఆసక్తిక రంగా తెలుపుతూ ఆధునికులు చేసే యజ్ఞ యాగాదుల ద్వారా వర్షాలు కురుస్తాయి. అనడంలో ఎలాంటి శాస్త్రీయత ఉందో, గిరిజనులు చేసుకునే జాతర్లు,కొలుపులలో కూడా అంతే శాస్త్రీయత ఉంది అంటూ రచయిత సహేతుకంగా చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని నల్లముడి గ్రామం శివారులోని అడవుల్లో గల ‘‘అక్షరాలలొద్ధి’’లో గల ఆదివాసి చిత్రలేఖనం గురించి రచయిత సత్యనారాయణ గారే మొదట వెలుగులోకి తెచ్చిన విషయం వివరించారు.
పాండవులు అరణ్య అజ్ఞాతవాస సమయంలో దక్షిణభారతంలోని దండకారణంలో గడిపినట్టు తద్వారా ఈ ప్రాంత అటవి పుత్రులకు పాండవులకు కలిగిన సంబంధ బాంధవ్యాలకు సంబంధించి నేటికీ ఇక్కడ గిరిజనులు భీముడు మొదలైన వారిని పూజిస్తూ సంబరాలు జాతరలు చేస్తుంటారు అని అనేక ఉదాహ రణలతో రచయిత చెప్పారు.
నల్లమల ప్రాంత గిరిజనులు తమ జాతి ఆడపడుచు చెంచులక్ష్మినిమను వాడిన శివుని తమ అల్లునిగా భావించి,పూజిస్తారని,ఇక్కడ జరిగే సలేశ్వరం లింగమయ్య జాతర,లొద్ది మల్లయ్య జాతర,భవరాపూర్‌ శివరాత్రి జాతర, గురించి చాలా క్షుణ్ణంగా రచయిత వివరించారు.
అదేవిధంగా గోదావరి లోయలోగల గిరిజన క్షేత్రాలు గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలియజేస్తూ… పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ అనేక విలువైన గిరిజన చారిత్రక సాంస్కృతిక విషయాలు తెలియజేశారు.
ఇందులోని ప్రతి విషయం కూడా ప్రామాణికంగా పరిశోధనకు చేయూతనిచ్చే దారి దీపం వంటిది ఈ పుస్తకం.
ఇప్పటివరకు వచ్చిన అనేక గిరిజన సాంప్రదాయ పుస్తకాలకు ఇది భిన్నమైనది ప్రతి పరిశోధక విద్యార్థి ఉత్తమ పాఠకులు తప్పనిసరిగా చదివి తీరాల్సిన ప్రామాణిక పుస్తకం ఇది.

పుస్తకం పేరు తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు
రచన డా.ద్యావనపల్లి సత్యనారాయణ పుటలు 116 పేజీలు వెల అమూల్యం ప్రతులకు సంత్‌ శ్రీ సేవాలాల్‌ స్వచ్ఛంద సంస్థ,టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెల్‌ 9703085458. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంస్కృతి పరివర్తన

అంకితభావంతో తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడమే కాక తను పని చేస్తున్న ప్రాంత సామాజిక స్పృహతో అక్కడి గిరిజనుల జీవన విశేషాలను భావితరాల కోసం అక్షరబద్దం చేసి పదుల సంఖ్యలో ప్రామాణిక పుస్తకాలు రాసిన గిరిజన సాహితీవేత్త డాక్టర్‌ విఎస్‌వికె శాస్త్రిగా సుపరిచితులైన వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి. అత్యున్నతమైన అధికారిగా విధులు నిర్వహించి నిత్యం గిరిజన గ్రామాల్లో మమే కమై ఉండే వారు.అలా లభించిన క్షేత్ర పర్యట నల అనుభవాలతో అడవి బిడ్డలకు సంబంధిం చిన అనేక వివరాలు విశేషాలు చారిత్రక అంశాలు పరిశోధనాత్మకంగా ప్రామాణికంగా రచనలు వెలువరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గల ప్రధాన గిరిజన తెగలైన గోండు,చెంచు,కోయ,గిరిజనుల సంస్కృతిలో వస్తున్న మార్పుల గురించిన వివరాలు కూలంకషంగా సహేతుకంగా వివరిస్తూ జాగృతం చేశారు రచయిత డాక్టర్‌ శాస్త్రి.తన రచన ఆంధ్ర ప్రదేశ్‌ గిరిజన సంస్కృతి పరివర్తన అనే పుస్తకంలో..
ఆంధ్రప్రదేశ్‌ లో షెడ్యూల్డ్‌ తెగలు మొదలు గోదావరి ప్రాంతంలో కొండ రెడ్ల వరకు సాగిన 16 విభాగాల ఈ పుస్తకంలో ఆదివా సులకు సంబంధించిన అనేక అంశాలు గణాం కాలతో సచిత్ర సహితంగా అందించారు, ప్రతి విభాగంలో కూడా ఆయా ప్రాంత అడవి బిడ్డల గురించి అధ్యయన పూర్వక విశేషాలు రాస్తూ శాస్త్రీయ దృక్పథంతో చర్చించారు. ఆరంభ అధ్యాయం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ తెగలలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్‌ ప్రకారం గిరిజ నుల కోసం పొందుపరిచిన ప్రత్యేక అంశాలు రిజర్వేషన్ల వివరాలు పొందుపరిచారు 1991, 2001,జనాభా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా గిరిజన జనాభా ప్రాంతాలవారీగా నివసిస్తున్న వివిధ తెగల గిరిజన జనాభా వివరాలు ఆక్రమిత భూ విస్తరణం గిరిజన గ్రామాల సంఖ్య తదితరాలు పట్టికల రూపంలో అందించి భావి పరిశో ధనలకు విలువైన సమగ్ర సమాచారం భద్రపరిచారు.గిరిజనులు విశ్వాసానికి ప్రతీకలు, నమ్మకం అనే దానినే మతంగా రూపాంతరం చేసిన ఆధునిక మానవులు వివిధ పేర్లు పెట్టుకుని విశ్వాసానికి, హిందూ క్రైస్తవ ముస్లిం బౌద్ధం వంటి పేర్లు పెట్టి ఆధునిక మతాలకు అంకు రార్పణ చేశారు.కానీ మానవ జాతికి మూల మైన ఈ ఆదివాసుల సహజ ప్రకృతి విశ్వాసమే పురాతన మతం,కొండలు వాగులు చెట్లు రాళ్లు పొలిమేర దేవతలు వీరికి గౌరవ మత శక్తులు, వారికి మంచి జరిగితే ప్రకృతి శక్తులను పూజిస్తారు.చెడు చేసే శక్తులను శాంతింప చేస్తారు.కానీ మారుతున్న కాలంతో పాటు అడవి బిడ్డల ఆలోచనల్లో మార్పులు వచ్చి అన్య మతాల ప్రభావం పాలై వారి అస్తిత్వం కోల్పోతున్నారు అన్నది ఈ పుస్తక రచయిత ఆవేదన. ఎంతో మహోన్నత చరిత గల ఆదిలాబాద్‌ ప్రాంతపు గోండు గిరిజనుల గురించిన అనేక విశేషాలు వివరించారు. కోరు తూర్‌ అనే అడవి బిడ్డలను గోండులు అనే పెట్టుడు పేరు పెట్టా రని దానికి సరైన అర్థం ఎవరు చెప్పలే దని చెబుతూనే ద్రావిడ భాష కుటుంబానికి చెందిన కోయ భాషని గోండు భాషగా మాట్లాడుతారని అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్‌ మరాఠీ ఉర్దూ భాషల ప్రభావంతో ఆయా భాషలు కూడా నేర్చుకుంటున్నారు. అన్ని భాషలతో పాటే వివిధ సంస్కృతులు వీరి మీద బలమైన ప్రభావం చూపి భవిష్యత్తులో వారిదైన అసలు భాషా సంస్కృతులు మర్చి పోయే ప్రమాదం పొంచి ఉందని రచయిత తన ఆవేదన వ్యక్తపరుస్తారు.గోండుల ఆరాధ్య దైవం నాగోబా గురించిన అనేక చారిత్రక సత్యాలు విశేషాలు ఆసక్తిక రమైన విషయాలతో అందిం చారు. కేవలం వచన రూప వాక్యాలతోనే సరిపెట్టకుండా ఎన్నో అలనాటి అపురూప చిత్రాలు కూడా ముచ్చటగా పొందుపరిచారు. తద్వారా అదనపు విజ్ఞానం సొంతం చేసుకో వచ్చు.ఇక్కడి గోండులతో పాటు ఇతర గిరిజను లైన ప్రధానులు,కోలాములు,తోటి, నాయక పోడు,జనజాతుల సంస్కృతులు విశేషాలు కూడా అందించారు.
కేవలం ప్రస్తుత పరిస్థితులతోనే సరిపెట్టుకో కుండా పూర్వ చరిత్రను కూడా ఉఠంకించారు సందర్భాను గుణంగా నల్లమల చెంచుల సంస్కృతి గురించి చెబుతూ చెంచు అనే పదం మనుస్మృతి పదవ భాగంలో ఆంధ్రులతో పాటు పేర్కొనబడిరదని ఆధారాలు చెబుతూ 17వ శతాబ్దంలో పరిష్ఠా వద్ద నుంచి చెంచుల వివరాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కొన్ని స్థానిక జానపద గాధలు కూడా తెలిపి చెంచు జాతి పూర్వ వైభవం ఆవిష్కరించారు రచయిత శాస్త్రి.అడవిని తల్లిగా దైవంగా భావించే చెంచులు అడవిని జీవనాధారంగా ఎలా చేసుకున్నారో తొమ్మిదవ అధ్యాయంలో ఆకర్షణీయంగా చదవవచ్చును.అలాగే నల్లమల అడవి బిడ్డలైన చెంచు జాతి, క్రమేణ అంత రించిపోతున్న వైనం అందుకు గల కారణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూలంకషం గా సహేతుకంగా వివరించారు.12వ విభాగం లో చెప్పిన గోదావరి ప్రాంతం లోని కోయలు సాంస్కృతి గురించి అందులోని వివిధ రకాల ఉప తెగ కోయ జాతులైన గుత్తి కోయ,రాస కోయ,లింగకోయ,డోలికోయ వంటి వారి ప్రస్థావన తీసుకువచ్చారు.ఒకప్పుడు పాలకు లుగా చిన్నచిన్న కోయ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పాలించిన వీరు కాలక్రమేణా పాలి తులుగా కష్టజీవులుగా మారిపోయిన, వారి కులాలలో రాచ,దొర,అనే పేర్లు ఉండిపో యాయి అని నిజనిర్ధారణ చేస్తూ నేటి గిరిజ నులు ఒకప్పటి రాజ్యాధినేతలు అనే చారిత్రక సత్యం చెప్పే ప్రయత్నాలు ఈ రచనలో అనేకం జరిగాయి.గిరిజనుల జీవనం చరిత్ర సంస్కృతు లకే పరి మితం కాకుండా వారు చేసిన పోరా టాలు ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో తిరుగు బాట్లు అనంతరం జమీందారులతో గల సత్సం బంధాలు ఇందులో చదవవచ్చు.గోదావరి జిల్లాలలో నాటి జమీందారు ప్రాంతాలైన పోలవరం,జీలుగుమిల్లి,జంగారెడ్డిగూడెం, దేవీపట్నం,పెద్దాపురం,రంప,కోరుకొండ, భద్రా చలం లలో గిరిజనుల సహకారం వివరణ చేశారు.గిరిజనుల్లో గల మాతృభూమి మమ కారం స్వరాజ్యకాంక్ష బ్రిటీష్‌ వారిపై గల ద్వేషం, తదితర అంశాలు ఈ పుస్తకంలో పరిశోధక రచయిత శాస్త్రి గారు కూలం కషంగా వివరిం చారు.‘‘శంకరగిరి మాన్యాలు’’ అనే జాతీయం గురించి వివరణ, నిర్వాసితులు అవుతున్న అడవి బిడ్డల ఆవేదన, తదితర అంశాలు సవి వరంగా ఆసక్తిదాయకంగా అందించి భావి రచయితలకు పరిశోధక విద్యార్థులకు ప్రామాణిక విషయాలు అందిం చారు. కేవలం గిరిజనుల సంస్కృతి జీవనాలకే పరిమితం కాకుండా వారి భావి జీవితాలు అభివృద్ధి వికాసాల గురించిన స్పృహతో ఎంతో ముందు చూపుతో క్షేత్ర పర్యటనల అనుభవా లతో వ్రాయబడిన ఈ పుస్తకం గిరిజన జీవి తాల భద్రతకు ఒక హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు.బహుళ ప్రయోజన కార్య అయిన ఈ పుస్తకం అందరూ విధిగా చదువు‘‘కొని’’ దాచుకోదగ్గది.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

విలక్షణ అడవి చుక్క సీతక్క

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ అస్నాల శ్రీనివాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ రణధీర సీతక్క’ అనే పుస్తకంపై సమీక్ష
రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల సాయంగా బాగా దగ్గరైన ఆదివాసి పోరు బిడ్డ అతి మారుమూల గిరిజన గూడెంలో పుట్టి తెలిసి తెలియని వయస్సులో విప్లవ మార్గం పట్టి అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపి కుటుంబ సభ్యులను భర్తను కోల్పో యి,అనేక ఇబ్బందులుపడి చివరికి తనకు ఇష్టమైన ప్రజాసేవకు తనించుకున్న విప్లవ బంధ పనికిరాదని అనుభవ పూర్వకంగా తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలిసి కష్టపడి చదువుకొని తన జనజాతి అడవి బిడ్డల అభ్యున్నతి తనఅంతిమ లక్ష్యంగా ముందుకు నడిచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి పదవి చేపట్టిన గిరిజన ధీర వనిత సీతక్క అనపడే ‘‘దనసరి అనసూయ’’ మన మహిళాలోకానికి ఆదర్శం.
నేటి ఆధునిక యువతకు ఆమె జీవి తం హెచ్చరికతో కూడిన ఆదర్శ సందేశం ఈ విషయాన్ని గమనించిన ఉద్యమ రచయిత, విద్యావేత్త, ప్రధానాచార్యుడు అయిన అస్నాల శ్రీనివాస్‌ సీతక్కతో తలకు గల ఆత్మీయ సోపతి తో ఆమె గురించిన వార్తా కథనాల సమ్మేళ నంగా చక్కని పుస్తకం ‘‘రణధీర సీతక్క’’ పేరుతో ప్రచురిం చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు మలిదశ తెలంగాణ పోరా టం వరకు అమరులైన వందలాది అమర వీరులకు అంకితం ఈయబడిన ఈ యోధు రాలు పుస్త కంకు,గ్వాటే మాల ఆదివాసీ నాయకురాలు ‘రిగో బెర్తామెంచు’, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా తదితరులు అందించిన యోగ్యతా పత్రాలు అదనపు ఆకర్షణ మాత్రమే కాదు,అదనపు సమాచార యుక్తం కూడా…!!
అత్యంత ప్రజాదరణ పొందిన నాయ కురాలు పూర్వాశ్రమ వివరాలు,వార్తాంశాలు, ఇందులో పొందుపరచబడ్డాయి,‘పోరాటం కాలం చెల్లకుండా ఉండాలంటే అచంచలమైన నిబద్ధతతో పోరాట రూపాన్ని మార్చుకోక తప్పదు’ అనే సత్యా న్ని చరిత్ర చెబుతుంది. అందుకు కట్టుబడ్డ సీతక్క గిరిజనులు పేదల పట్ల గల తన నిబద్దతను కొనసా గిస్తూ..బాహ్య సమాజమే తన సేవా కేంద్రం చేసు కొని అజ్ఞాతం వదిలి జనజీవన స్రవంతిలో కలసి, ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఒక మాజీ నక్స లైట్‌ నాయకురాలు ప్రజాసేవ సాయంగా ఉద్యమ సిద్ధాంతాలకు పూర్తిగా సరిపోని ప్రాంతీయ, జాతీ య,పార్టీలతో చేతులు కలిపి రాజకీయ తెర చాపల ద్వారా తనదైన ‘ప్రజాసేవనావ’ను నడిపి స్తున్న సీతక్క జీవితం నేటి యువతరానికి విలక్షణ మైన ఆదర్శం.
ఈ వ్యాస సంపుటి రచయిత ప్రయ త్నం చాలా మంచిది అభినందించదగ్గది. భావిత రాలకు అక్షర రూపంలో భద్రపరిచిన ఈ ఉద్యమ చరిత్ర సంపద పరిశోధనలకు దారి దీపం అవు తుంది. ఇదో చారిత్రిక వాస్తవాల వ్యాస సంపుటి రూపంలో గల ఒకవ్యక్తి జీవన చిత్రం, స్ఫూర్తిదా యకంగా సాగిన అక్షర ప్రయాణం, సీతక్కను తెలంగాణ సర్వనామంగా అభివర్ణిస్తూ ప్రారంభ మైన ఈ వ్యాస సంపుటిలో మొత్తం 22 భాగాలు కనిపిస్తాయి.07 డిసెంబర్‌ 2023న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా సీతక్క ప్రమాణం చేసిన అపూర్వ సంఘటనతో ఈ పుస్తకం ప్రారంభమవు తుంది. రెండవ భాగంలో ‘వీర యోధుల శిక్షణ కేంద్రం ములుగు’అనే నేటితరానికి తెలియని విలువైన చారిత్రక అంశాన్ని ఇందులో చేర్చారు. కానీ ఆకాలానికి సీతక్క జన్మించి లేరు. అనంతర కాలంలో జన్మించిన ఈగిరిజన యువతి తన ప్రాం తంలోని పోరాట మూలాలకు చైతన్యం పొంది, తాను సైతం పోరుబాట పట్టింది అన్నదే అక్కడి ప్రధాన అంశం.‘వీరకిశోర బాలికగా సీతక్క’ అనే మూడవ విభాగంలో సీతక్క ఉన్నత విద్యాభ్యాస సమయంలో వసతి గృహంలో విద్యార్ధినిల సమ స్యల గురించి ప్రశ్నించిన తీరు ఆమెను నాయకురా లుగా తీర్చిదిద్దిన వైనం వివరించారు.నాల్గవ విభా గంలో ‘సాయుధగెరిల్లా యోధగా సీతక్క’ చేసిన పోరాటం ఎదుర్కొన్న కష్టాలు నక్సల్స్‌ ఉద్యమ చరిత్రలో తొలిగిరిజన మహిళా కమాండర్‌గా ఆమె నిర్వహించిన బరువు బాధ్యతల గురించి క్షుణ్ణంగా వివరించారు. అడవుల అజ్ఞాతం వీడిన ధనసరి అనసూయ అడవిలో సీతక్క పేరుతోనే జన స్రవంతిలో అడగండి గిరిజన విద్యాకేంద్రాల వికా సం,మహిళల సమస్యలు,అడవుల పరిరక్షణ, మేడా రం సహజత్వం కాపాడటం,కోసం అవిశ్రాంత అజ్ఞాత పోరాటాలు చేస్తూనే తన ఉన్నతికి సాయ పడే విద్య విలువలను వదలక అజ్ఞాతం వీడిన వెంటనే న్యాయ శాస్త్రంలో పట్టభద్రురాలు కావడం, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా అధ్యయనం సాగించి 2022లో ఉస్మాని యా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన నిత్య విద్యార్థిని డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క, 2004లో చంద్రబాబు నాయుడు దూర దృష్టిలో పడ్డ సీతక్క ఎమ్మెల్యే టికెట్‌ పొంది తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది.ప్రజల్లో తన కు గల విశేషఆదరణ సాయంగా రాజకీయాల్లో సహజమైన గెలుపోటములు ఎత్తుపల్లాలను అధిగమిస్తూనే నిత్యం ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడుతూ ప్రజా నాయకురాలుగా ఎదిగిన వైనం ఈవిభాగాల్లో వివరించడం జరిగింది. మలి దశ తెలంగాణ పోరాటంలో సైతం సీతక్క పాత్ర కృషి గురించిన విశ్లేషణ 12వ విభాగంలో చేశారు, ఒక సాధారణ గిరిజన కుటుంబంలో మారుమూల ప్రాంతంలో పుట్టి, అంచలంచెలుగా ఎదిగి, ఆదర్శ పోరాటం నాయకత్వం అలవర్చుకొని ఆదర్శంగా నిలిచిన ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు కోల్పోయిన కుటుంబ బలగం, వివరాలు తో పాటు ప్రజల హృదయాల్లో అన్ని వయస్సుల వారిలో స్థానం పొందిన వైనం ప్రతి ఒక్కరికి ఆచర ణీయం.
చివరగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించిన డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క బాధ్యతల గురించి కూడా రచయిత ఉఠం కించటం అభినందనీయం.ప్రారంభ రచనలో ఉండే కొన్నిలోపాలు సవరణలు పక్కకుపెడితే, సంఘ టన సమాచార హారంగా అందించిన ఈ వ్యాస సంపుటి కర్త శ్రీనివాస్‌ అక్షర కృషి అభినందనీ యం. దీనికి కొనసాగింపుగా ఈ అరణ్య ధీరవనిత జీవితం గురించి భవిష్యత్తులో మరెన్నో ప్రామాణిక రచనలు పరిశోధనలు రావాలని అందుకు ఈ పుస్తకం సరైన మార్గదర్శి కావాలని ఆశిస్తూ సీతక్క అభిమానులతోపాటు,పరిశోధక విద్యార్థులు విధిగా దాచు‘కొని’చదవాల్సిన విలువైన పుస్తకం ఇది.

అడవిపూల కదంబ మాల`ఆత్మగోష

ఆదివాసీల‘ఆత్మఘోష’ ను అక్షరీకరించి ఎత్తిచూపిన పాండు కామ్టేకర్‌ కథాత్మక కథనాల గుచ్చం ఇప్పటి వరకు తెలుగు కథా సాహిత్యాన్ని గిరిజనుల జీవిత ఇతివృతాలతో సుసంపన్నం చేసిన గిరిజన,గిరిజనేతర రచయితలు కూడా అబ్బుర పడేటంత గొప్పగా సంకలనీకరించిన అడవిపూల కదంబ మాల ఈ కథనాత్మక కథనాల సంపుటం…
అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కిందపడిపోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి, భరించి ఇక భరించలేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయినప్పటికీ తను అనివార్యంగా ఈ కథా కథనాత్మక రచనకు శ్రీకారం చుట్టారు.

కామ్టేకర్‌ తన యాభై రెండేండ్ల జీవనయనంలో సుమారు పాతిక సంవత్సరాల పాటు ఆంత్ర పాలజిస్ట్‌ లపాలిటి బంగారు గని లాంటి ప్రాంతమైన చింతూర్‌ సమీప గ్రామమైన ‘కోయత్తూర్‌ బాట’ రామన్నపాలెంలో ఓస్వచ్ఛంద సంస్థలో నూటికి నూరుపాళ్ళు నిమగ్నమై, అదివాసీ జీవితాలకు సంబంధిం చిన సమస్త కోణాలనూ ఔపోసన పట్టినవాడు. పాఠకులు అతిశయోక్తి అనుకోకుంటే కామ్టేకర్‌ మన తెలంగాణాకు చెందిన మరో హైమం డార్ఫ్‌గా పేర్కొనదగినవాడు.తన స్వంత కుటుంబంతోపాటు మొత్తం ఆదివాసీ సమా జాన్నే తన బలగంగా భావించి,వారి అభ్యు న్నతికి తన పరిధి మేరకు అనేక విధాలుగా శ్రమించిన ఆదివాసీ ప్రేమికుడు. గిరిజన జీవితాలతో తనకున్న రెండున్నర దశాబ్దాల అనుబంధంలో తటస్థపడిన ప్రతి అనుభవాన్ని తన గుండెకవాటంలో తోరణాలుగా గుచ్చి ఒరుగులుగా దాచు కున్నవాడు కామ్టేకర్‌. తన వ్యక్తిగత,ఆరోగ్య కారణాలతో వ్యక్తిగా కోయ త్తూర్‌ బాట నుండి బయటికొచ్చినా మానసి కంగా తను అను నిత్యం గిరిజన జీవితాలనే శ్వాసిస్తున్న వ్యక్తి. అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కింద పడి పోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి,భరించి ఇక భరించ లేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయి నప్పటికీ తను అనివార్యంగా ఈకథా కథనా త్మక రచనకు శ్రీకారం చుట్టారు. దాని ఫలి తమే మన చేతుల్లో వున్న ఈ సంపుటం. ఇందులో కోయపల్లె, పురుడు పోయడం,కొడ కల్పడం,బాణం తయారీ, సంతకు తయారీ, భూమి పండుగ, సుక్కుడు కాయ పండుగ,తాటి పండుగ,ఇప్పపూల పండుగ,కొలుపుల పండుగ,పెద్దమనిషి,చావు, కీడు నీళ్ళు,దినాలు, పేతర్లముంత,ఇంటి నిర్మాణం, గ్రంధాలయం, పెళ్లి,నేల-ఉపాధి,చీమ గుడ్ల కారం, ఆదివాసీ (కోయత్తూర్‌) కులమా? మతమా?, పోలవరం నిరసనలు,ఒంటరి మహిళలు-జీవన విధానం, గుజిడి, పోలవరం ప్రాజెక్ట్‌-తీరుతెన్నులు, ఓదార్పు-సమస్త జీవజాల మద్దతు,సమస్త సమాజానికి సూటి ప్రశ్న అనే ఇరవై ఎనిమిది శీర్షికలతో వ్రాసిన కథాత్మక కథనాలున్నాయి. ప్రతి కథనం ఒక్కో సమస్యను పాఠకుల ముందుకు తీసుకొచ్చి సవివరంగా వాటిని గురించి మనకు వివరిస్తూ మనను మనకు తెలియని లోకంలోకి చేయిపట్టి నడిపించుకు పోతాడు రచయిత కామ్టేకర్‌. మొట్ట మొదటి కథాకథనంలో ‘కోయపల్లె’లో చింతూర్‌ చుట్టుపక్కల ఉళ్ళన్నీ గుంపుల సముదాయం. ఒక్కొక్క గూడెంలో నాలుగు నుండి ఎనిమిది గుంపులుంటాయి.ప్రతి గుంపుకి ఓఇంటి పేరు వుంటుంది.ఆ ఇంటి పేరు వారే గుంపులో ఎక్కువగా వుంటారు. స్తూపాకారంతో చెక్కిన ఓవేప కర్రను పాతి, దాని చుట్టూ మట్టితో గద్దె వేస్తారు. దాన్ని ‘గామం’ లేదా బొడ్రాయి అంటారు. అక్కడే కొలుపుల పండుగ చేస్తారు. పండుగప్పుడు వెదురు బుట్టలో ఒక మట్టి ముంతను పెడతారు.దాన్ని ‘ముడుపు ముంత అంటారు. అందులో వున్న నీళ్ళల్లో పసుపు కలుపుతారు. ఆ పసుపును ‘బండారు’ అంటారు. ఆబండారును గుంపుల్లో అంటు వ్యాధులు ప్రబలినప్పుడు పిల్లలకు బొట్టు పెడతారు. వేల్పులు ఉన్న చోటును ‘అనె గొందే’ అంటారు. జువ్వి లేదా మద్ది చెట్టును గ్రామ దేవతగా ముత్యాలమ్మ పేరుతో కొలు స్తారు. పురుడు పోయడం కథా కథనంలో మంత్రసాని భద్రమ్మ ద్వారా గుంపుల్లో పురుడు ఏవిధగా పోస్తారో కూలంకషంగా వివరించిన సంద ర్భంలో కథకుడి జిజ్ఞాస ఏస్థాయిలో కొనసాగిందో మనకు అర్ధమౌతుంది. అదివా సీల్లో అమ్మాయి పుడితే కొడవలితోను, అబ్బాయి పుడితే బాణంతోనూ బొడ్డు కోస్తారట. ఈగ్రా మాల్లో గల గల పారే ఏటి దారిలో ఏర్పడే చిన్న చిన్న గుంతలను ‘అలంధర్‌’ అంటారట. ఈ అలంధర్ల దగ్గర ఆదివాసీలు విశ్రాంతి తీసుకుంటుంటారు.‘కొడ కల్పడం’అనే మరో కథా కథనంలో హిందూ ధర్మంలో కొన్ని సామాజిక వర్గాల్లో యుక్త వయస్కులౌతున్న మగపిల్లలకు మెడలో జంద్యము వేసి,దాన్ని ‘ఒడుగు’అంటారు. అదే ముస్లీముల్లో మగ పిల్లలకు సున్తీలు చేసి, ఒడుగు అంటారు.ఇక క్రైస్తవుల్లో ఓ నీటి మడుగులో చేయించే పవిత్ర స్నానాన్ని బాప్థిజమ్‌ పేరుతో ఒడుగు అంటారు. అదే ఆదివాసీల్లో పన్నెండేండ్ల మగపిల్లలందరినీ ఒకరోజు దేవర దగ్గరకు తీసుకుపోయి కోల్లను కోసి,వాటి మాంసంతో ఘాటైన చారు కాస్తారు. ఆ చారును ‘జొమ్ము’ అంటారు. ఆ చారుతో పాటు సారా,కల్లులను తాపించి పెద్దవాళ్ళతో సమానమైన హోదా ఇస్తారు.దాన్నే ఒడుగు అంటారు. ఆవిధంగా ఆలోచించి చూస్తే అన్నీ ధర్మాల్లోకల్లా అదీవాసీ ధర్మంలోనే అందరికన్నా ముందుగా ఈఒడుగు అనే ఆచారం ఆచరణలో వున్నట్టుగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. ‘బాణం తయారీ’ కథా కథనంలో అడవిలో సంచరించే ఆదివాసికి బాణం అతిముఖ్యమైన వేట సాధనం.దాన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాల్సి వుంటుంది. ముందుగా పిల్లల్లు అడుకోడానికి చిన్న విల్లు బాణాలను తయారుచేసి ఇస్తారు. వాటిని ‘‘డుమ్మిరి విల్లు’’అంటారు.ఆ డుమ్మిరి విల్లే తదనంతరకాలంలో ‘డమ్మీ’ అనే ఆధునిక పదంగా మారిపోయి విస్తృత జనబాహుళ్యంలో వాడుకలో కొచ్చింది.‘ఎర్రగడ చేపలు’ అంటే? కొన్నిసార్లు ఎక్కువ చేపలు దొరికినప్పుడు కొన్ని తిని, మిగతా వాటిని తాటి కమ్మల్లో కాల్చి, దోరగా వేయించి,ఎండలో ఎండబెడతారు. వీటినే ‘ఎర్రగడ’ చేపలు అంటారు. వీటి రుచి ఆదివాసులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. ‘సంతకు తయారు’ కథలో నేటి షాపింగ్‌ మాల్స్‌ కి మూల రూపమైన గిరిజన సంతలను గురించి కథకుడు చాలా విలువైన సమాచా రాన్ని అందించారు.అంతేకాదు నేటి ఆధునిక హెయిర్‌ డ్రెస్సర్స్‌ కు ఏమాత్రం తీసిపోని హెయిర్‌ డ్రెస్సర్స్‌ ఆదివాసీ మహిళల్లో ఏనాటి నుండో ఊహించ లేనంత కళాత్మకంగా వుండేదో కథకుడు ఎంతో వివరంగా తెలియజేశాడు.‘భూమి పండుగ’ కథా కథనం లో ఆదివాసీలు ప్రతిరోజూ సాయం కాలం తాటి కళ్ళు దింపుకుని వచ్చి,ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ,తాక్కుంటూ, ఏదో ఒకటి నంజుకుంటూ గడుపుతారు.అట్లా కూర్చునే తావునే ‘‘గుజిడి’’ అంటారు.ఇట్లాగే ఇంకా మిగిలిన కథా కథనాల్లో కూడా మనకు తెలియని అనేక అంశాలను సందర్భో చితంగా వివరించిన రచయితకు ఆదివాసీల ఆచారవ్యవ హారాల్లో ఎంతటిలోతైన అవగాహన వుందో తెలుసుకుంటున్నా కొద్ది మనం ఆశ్చర్యచకి తులమై పోతుంటాము. వాటిల్లో మచ్చుకు కొన్ని….. కమతం అంటే? :- ఎక్కడైనా ఒక్కరే వ్యవసాయం చేసుకోవడం సాధ్యపడదు. అందుకే మూడు నాలుగు కుటుంబాలు కలిసి వారి భూమిని సమిష్టిగా కలిసి దున్నుకుని సాగుచేయడానికి చేసుకునే ఒప్పందం. ఈ కమతాల భావనే తదనంతర కాలంలో సహకార వ్యవసాయానికి మాతృక అయ్యిందేమో అన్పిస్తుంది.
రాగిపట్ట అంటే? :- గ్రామస్తులందరి భూమిని కలిపి ఒకే ఒక పట్టా రాగిరేకు పైన రాసి వుండేది.దీన్నే రాగి పట్టా అంటారు. నెయిదం అంటే? :- భూమి పండుగనాడు దేవతకు బలి ఇచ్చే జంతువు మాంసంతో చేసే వంటకం.ఆ మాంసంలోనే బియ్యం,పసుపు, కారం,ఉప్పు నూనె ప్రతి ఇంటి నుండి తెచ్చినవి అదే పాత్రలో వేసి,నీళ్ళు పోసి,దగ్గరికి ఉడికి స్తారు.అదే నేయిదం. ఆధునికులు చేసుకునే బిర్యానికి ఈ నేయిదమే మూలం అనవచ్చును. ‘కోయ వాళ్ళు’ అంటే? :- దేవరకు పెట్టే కోడిని కత్తితో కోయకుండా నేలకు కొట్టి చంపి, కోసు కుని తింటారు. కాబట్టి వాళ్ళను ‘కోయని వాళ్ళు’,కోయత్తురు అని అంటారు. పూర్ణ కల్లు అంటే? :- రోజు దించే కల్లును, దించకుండా వారంరోజులు వుంచితే చెట్టుకు కట్టి వుంచిన వెదురు గొట్టం నిండుతుంది. అలా నిండిన కల్లును ‘పూర్ణకల్లు’అంటారు. ఇప్ప పూల పండుగ అంటే :- ఇప్పచెట్టు పాలతో బండ కత్తుల పిడులను, కొడవళ్ళ పిడులను ఊడిపోకుండా వుండడానికి సన్నని ఇసుకతో కలిపి,పిడి చుట్టూ వున్న సందుల్లో ఇప్ప ఆకు పాలు పోస్తే ఆ పిడి గట్టిగా రాయిలాగా అతుక్కుంటుంది.అంతటి మహిమ గల చెట్టుకు మొట్టమొదటి సారిగా రాలిన పువ్వులను సేకరించే సందర్భంగా చేసుకునే పండుగానే ‘‘ఇప్పపూల పండుగ’’ అంటారు. బట్టలను ఉతకాలంటే :- మద్ది ఆకు బూడిదలో బట్టలన్నీ నానబెట్టి ఉతికితే మురికి అంతా పోయి, బట్టలకు కమ్మని వాసన వస్తుంది. వార్తలు :- చావు వార్తలు చెప్పడాని వెళ్ళేటప్పుడు చేతుల్లో గొడుగు పట్టుకెళితే అది కీడు కబురని అందరికీ తెలుస్తుంది.ఆ ప్రయాణాన్ని ఆపకుండా మిగతా వాళ్ళు సహకరిస్తారు. అదే శుభకార్యమైతే బాణం పట్టుకు పోతారు. వెట్టి అంటే?’’ :- ఆదివాసీలు తమ తమ ఇండ్లను పూర్తిగా సహకార పద్ధతిలో కట్టుకుంటారు. ఈ పద్ధతినే ‘వెట్టి’ అంటారు.కానీ,ఇదే వెట్టి అనే పదానికి భూస్వామ్య వ్యవస్థలో పేదవారు ముఖ్యంగా కులవృత్తుల వారు,భూస్వాములకు కొన్ని తరాలపాటు జీతం,బత్తెం లేని సేవలు చేయడాన్ని కూడా వెట్టి అంటారు.దీన్ని బట్టి ఒకే పదానికి సమాజాన్ని బట్టి,కాలాన్ని బట్టి అర్ధం మారిపోతుందన్న విషయం మన దృష్టికి వస్తుంది.
పెళ్లి అనే కథలో :- ఆదివాసీల్లో పెళ్లి చూపుల తతంగం ఏడు అంచలుగా సాగుతుంది. వాటిలోనూ పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తరపువాళ్ళు ఏ ఒక్కరూ ఒకే తల్లి పాలు తాగివుండకూడదు.వాళ్ళ వరుసలు, గట్టులు అనుకూలంగా వున్నా, వారు ఒక తల్లి పాలు తాగితే వారి మధ్య అన్నా చెల్లి వరుస వున్నట్టుగా భావిస్తారు. అటువంటి బంధాన్ని ‘పాలవంకలు’ అంటారు. ఆటువంటి పెళ్ళిని వారు అంగీకరించరు.పెద్దల కారణంగా వచ్చే ఈ బాధలన్నీ పడలేకనే ప్రేమించుకున్న అమ్మాయిలు,అబ్బాయిలు చాలామంది లేచి పోయి,కొన్నాళ్ళ పాటు సహజీవనాలు సాగించి, ఆ తరువాత మెల్లగా పెళ్లిళ్లు చేసు కుంటారు. మామిడాకులన్నీ ఓచెట్టు చివరలో గుత్తులు గుత్తులుగా వుంటాయి. కొన్ని ఆకులు ఒకదాని కొకటి అంటుకొని ఒక సొరకాయ బుర్ర మాదిరిగా,గుండ్రంగా డొప్పలు డొప్పలు గా కట్టివుంటాయి.ఆ డొప్పల పైన వున్న రంద్రము లోకి ఎర్రచీమలు వస్తూ పోతూ వుంటాయి.ఆ చీమలను ‘అల్లి పెత్తెలు’ అంటారు.చీమలు ఆగూళ్ళల్లో పెట్టిన గుడ్లను సేకరించిన ఆది వాసీలు వాటిని చక్కగా వేయించి కారప్పొడి గాను,చారుగాను తయారు చేసుకుని తింటారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ విధంగా పుస్తకం అంతటా మనం ఎరుగని ఆదివాసీల జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రస్తావించని అనే విషయా లను కామ్టేకర్‌ తనదైన శైలిలో మనకు అందిం చడమే కాదు. ముందు తరాల గిరిజనులకు ఒక నిధిని సమకూర్చి పెట్టిన వారుగా మిగిలిపోతారు. ప్రధానంగా ఆదివాసీ బిడ్డల సేవా కార్యక్ర మాల్లో మునిగిపోయిన కామ్టే కర్‌కి రచనా ప్రక్రియల్లో ప్రవేశం లేకుండా పోయింది.ఆ కారణం చేతనే ఎంతో విలువైన సమా చారాన్ని పాఠకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కథన పద్ధతిలో వ్రాయలేక పోయా రేమో అన్పిస్తుంది.అదో ప్రధానమైన లోపంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ పట్టుకొని విధంగా ఆదివాసీ దేవతల ఆత్మల ద్వారా కథనాలను నడిపించడం వినూత్నంగా వుంది. పాతికేళ్ళపాటు తన కార్య స్థానమైన రామన్న పాలెం పరిసర ప్రాంతాలన్నీ పోలవరం ముంపులో జలసమాధి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆదివాసీల ఆత్మఘోషను వాళ్ళ దేవతల ఆత్మఘోషగా వెల్లడిరచడం అతని ఊహాశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ముద్రా రాక్షసం కూడా అక్కడక్కడా కొంచం పాఠకుణ్ణి విసిగించే ప్రమాదం పొంచివుంది.
పై రెండు లోపాలను మినహాయిస్తే ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన గిరిజన సాహిత్యంలో ఈ పుస్తకం ఒక మైలు రాయిగా నిలిచిపో యేంత గొప్పగావుంది.-ఇది శీరాంషెట్టి కాంతా రావు. రచయిత కామ్టేకర్‌ భవిష్యత్తు లోనూ ఇటు వంటి విలువైన మరిన్ని పుస్తకా లను వెలువరించాలని కోరుకుందాం!.
ఆత్మఘోష కథాసంపుట కోసం..:
ప్రచురణ : బోధి ఫౌండేషన్‌ పేజీలు : 241 ధర : 400/- రూ.లు.
సెల్‌ నెం. : 63004 84726

ప్రామాణిక వివరణ గిరిజనులు తిరుగుబాట్లు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ రామ్‌దాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ తెలంగాణలో గిరిజనులు తిరగుబాట్లు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
మానవ జీవనమే పోరాటాలమయం మనిషి జీవిత కాలం ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే మనుగడ కోసం జీవన పోరాటం సాగించక తప్పదు. మానవ సమాజానికి మూలవాసులుగా ఆదివా సులుగా అభివర్ణించబడుతున్న ఈ అడవి బిడ్డల జీవితమే ఒక పోరాటం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్న పేర్లతో జీవిస్తున్న ఈ ఆదివాసులు ప్రతి పోరాటానికి మూలవాసులే అనాలి.
ఇక మన తెలుగు ప్రాంతాల్లోని గిరి బిడ్డలు అటు ఆదిలాబాద్‌ నుంచి ఇటు నల్లమల మీదుగా ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ లోని గోండులు పేరు చెప్పగానే కొమరం భీం పోరాటం, ఉత్తరాంధ్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన తిరుగుబాట్ల పోరాటాలు, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు మనకు తెలిసిందే!!
మనుగడ కోసం మొదలైన పోరాటం స్వాతంత్రం కోసం తీవ్ర రూపందాల్చింది. చివరికి స్వరాజ్యదేశంలో కూడా ప్రాంతీయత కోసం,అస్తిత్వాలు కాపాడుకోవడం భూమి కోసం భుక్తి కోసం ఆధునిక తిరుగుబాట్లు పోరాటాలు కొనసాగుతున్నాయి.
పోరాటాలను సమాజ విధముగా చర్యలుగా చూస్తూ వాటిని కూకటివేళ్లతో బికిలించి సమూలంగా నాశనం చేయాలనుకుని రక్షణ దళాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ..అనేకమంది అమాయకులను బలి చేస్తున్న పాలకులు అసలు పోరాటాలకు మూల కారణం గురించి ఆలోచించడం లేదు.
అచ్చంగా అలాంటి ఆలోచన కోసమే ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పరిశోధ నాత్మకంగా గణాంకాలతో అందించిన ప్రామాణిక పుస్తకమే ‘‘తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు’’
ఈ పుస్తకంలో గిరిజనులు చేసిన పూర్వ పోరాటాలు వాటి నేపథ్యం వివరిస్తూ గిరిజనులకు అందించాల్సిన అవకాశాలు, చేయబడ్డ చట్టాలు గురించి క్షుణ్ణంగా వివరించారు రచయిత రామదాస్‌,
తెలంగాణలో గిరిజనులు భూస్వాములు మొదలు ఉద్యమ దశలు కొరకు ఐదు విభాగాలుగా రూపొందించబడిన ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకం ద్వారా అనేక విలువైన విషయాలతో పాటు సమగ్ర సమాచారం క్షుణ్ణంగా తెలుస్తుంది.
ఇది కేవలం తెలంగాణ ప్రాంత గిరిజనులకే పరిమితం చేసినట్టు కన్పిస్తున్న దీనిలోని సమస్యలు పరిష్కార మార్గాలు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.
అడవి బిడ్డలు తరతరాలు ఓ అనుభవించిన బాధ వివక్షత తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది,దాన్ని అంతం చేయడానికి పాలకులు చేసిన చర్యలు అన్నీ విఫలం కావడంతో గిరిజన గిరిజనేతల మధ్య అలాగే గిరిజనుల్లోని వివిధ తెగల మధ్య వైరుధ్యాల సృష్టించి అనేక కుట్రలతో ఆదివాసీలను, ఆదివాసీ నాయకులను,లోబర్చుకోవడానికి నిత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంటారు రచయిత,
పోరాటాలపై ఎన్ని అణచివేతలు ఉన్నా గోండుల ఆరాధ్య దైవం కొమరం భీం ఆశయం అయిన జల్‌,జమీన్‌,జంగల్‌, కోసం నేటికీ తెలంగాణ అడవి బిడ్డలు తమ అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రాంత గిరిజనుల ప్రధాన సమస్య భూ సమస్య,ఇక్కడి గిరిజనుల ప్రతి పోరాటం దీని చుట్టూనే తిరుగుతుంది.
సహజంగా శాంతికాంకులైన అడవి బిడ్డల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం తమ కట్టుబాట్లకు తమను దూరం చేస్తూ వారిపై ఆధునిక పెత్తనం చేయడమే ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణం అంటూ వాటిని సహేతు కంగా వివరించే ప్రయత్నం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారి పాలనలోనే భూముల వ్యాపారం మొదలైంది అని చెబుతూనే 18 వశతాబ్దపు తొలి రోజుల్లో తెలంగాణలో నాటి నైజాం రాజ్యంలో గిరిజనులు బయట ప్రపంచానికి సంబంధంలేని చక్కని జీవనం గడిపేవారు కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం నిజాం సర్కారుపై దండెత్తి ఆక్రమించి ఆధిపత్యం చిక్కించుకున్న సమయంలో (1800-1850) బ్రిటిష్‌ వారు చేసిన భూచట్టాలు తదితరాలవల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది తప్ప ఆదివాసులకు ఎలాంటి లాభం ఉండేది కాదు, అదేవిధంగా అడవుల మీద హక్కులు కూడా కోల్పోయారు.అడవులను రక్షిస్తూ పర్యావరణ సంరక్షకులుగా ఉన్న అడవి బిడ్డలు తమ సొమ్ములకు తామే పన్నులు కట్టే దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిరది, అంటూ గిరిజన భూములకు కలిగిన అభద్రత గురించి వివరిస్తూ గిరిజన భూముల దురాక్రమణ కారణాలు వివరిస్తూనే భూ బదిలీ నియంత్రణ చట్టాల ఉల్లంఘన గురించిన వివరాలతో పాటు..
భూబదలాయింపు నిబంధన చట్టం అమలు అయిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు.
రెండవ భాగములో స్వాతంత్రానికి ముందు తరువాత జరిగిన గిరిజన ఉద్యమాల గురించి చారిత్రక గణాంక ఆధారాలతో వివరించ బడిరది,గిరిజన ఉద్యమాల్లో తొలి ఉద్యమంగా 1879-80 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాలో గల చోడవరం తాలూకాలోని ‘‘రంప’’ అనే గ్రామంలో జరిగిన తొలి ఆదివాసి తిరుగుబాటు అనంతర కాలంలో జరిగిన పోరాటాలకు మూలంగా నిలిచింది,1915- 16 సం:లో జరిగిన కొండ రెడ్ల ఉద్యమం, అనంతర కాలంలో1922-24 మధ్యకాలంలో మన్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచింది. అలాగే 1940 దశకంలో కొమరం భీమ్‌ చేసిన గోండుపోరు,1946-51మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మరికొన్ని గిరిజన పోరాటాల గురించి వివరించి చివరగా స్వాతంత్రానంతరం గిరిజనుల దీనస్థితి గురించి కూడా సవివరంగా చెబుతూ దానికి కారణాలు నివారణ మార్గాల గురించి కూడా పరిశోధక రచయిత రామదాస్‌ సహేతుకంగా వివరించారు.
మూడవ విభాగంలో గిరిజన ప్రాంతాలపై జరిగిన పరిశోధనలు మార్గదర్శకాలు గురించిన వివరణలో గిరిజన ఉద్యమాలను నాటి బ్రిటిష్‌ వారు నేటి ప్రజాస్వామ్య పాలకులు ఎన్ని కుయుక్తులు చేసి వ్యూహాత్మకంగా ఉద్యమాల అణిచివేతకు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు మాత్రం ఒక నిర్దిష్టమైన మార్గంలో ముందుకు పోతూ గిరిజనులను ప్రభావితం చేస్తున్నాయి అంటారు రచయిత.
నాల్గవ విభాగంలో తెలంగాణలో గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతుల పట్టికల ఆధారంగా విశ్లేషణలు చేయబడ్డాయి.
చిట్టచివరి భాగంలో భూ ఆక్రమణ తీరుతెన్నులు ఉద్యమ దశల గురించి వివరించిన ఈ వ్యాస సంపుటిలో గిరిజన ఉద్యమాలు మొత్తం భూమి కేంద్రంగా జరిగాయని అందుకు గిరిగినేతరులే ప్రధాన కారణం అన్న విషయం చెబుతూనే,చట్టాల గురించి అవగాహన కలిగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇందులో వివరించబడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి కోసం ప్రస్తుతం చేపడుతున్న చట్టాలు చర్యలకు తోడు మరికొన్ని చట్ట సవరణలు అభివృద్ధి అవగాహన చర్యలు గురించి ఇందులో కూలంకషంగా వివరించారు.
గిరిజన సాహిత్య అధ్యయనకర్తలు, పరిశోధక విద్యార్థులకు ఎంతో విలువైన సమాచార దర్శిని ఈ ప్రామాణిక పరిశోధక వ్యాస సంపుటి.
తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు
రచన : ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పేజీలు : 82, వెల,60/-రూ ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌- 68 ఫోన్‌ : 040-24224453/54. సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసులు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ కంచ ఐలయ్య షెఫర్డ్‌ ’ కలం నుంచి జాలువారిన ‘ ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
సంచల రచయిత కంచ ఐలయ్య గారి కలం నుంచి వెలువడిన పుస్తకం ‘ఉచిత ఉపాధ్యా యులు ఆదివాసీలు’ పేరుకు తగ్గట్టుగానే అందులోని అంశాలు కూడా ఆసక్తికరంగా ఉండి నూతన అంశాలను ఆవిష్కరించారు. పూర్వకాలం నుంచి లిపిలేని భాషలో సంభాషించుకుంటున్న అడవి బిడ్డలంతా ఆధునిక ఆంగ్ల భాష నేర్చుకుంటే అన్ని రంగాల్లో ఘనమైన అభివృద్ధి సాధించేవారు అన్నది రచయిత ప్రొఫెసర్‌ ఐలయ్య గారి భావన.పేర్లు సంస్కృతి,ఆదివాసి వ్యక్తిత్వం, ఆహార సంస్కృతి, శాఖాహార ఉద్దేశం, మద్యం ఆధ్యాత్మిక వాదం,పోడు ఉత్పత్తి ఆదివాసి సృజనాత్మకత,ఆదివాసి సాంకేతిక పరిజ్ఞానం, ఆదివాసి విత్తన వ్యవస్థలు, ఆదివాసి సజీవ నాయకత్వం,ఆధ్యాత్మికత,ప్రతికూల జాతీయ వాదం, సజీవ కథానాయకులు,స్వీయ ఆరాధన,స్త్రీ పురుష సంబంధాలు, ఆదివాసి వివాహం,అనే ఉప విభాగాలుగా సాగిన ఈ పుస్తక అక్షర ప్రయాణంలో ప్రతి అంశం ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబడిరది. ఆదివాసీలు వ్యక్తిత్వం రీత్యా వారి జీవన విధానంద్వారా సమాజానికి ఎంతో కొంత నేర్పే వారే అన్న భావన అందించారు. మన సంస్కృతి నాగరికతలకు పునాదులు వేసింది ఆదివాసీలే అన్న విషయాన్ని ఇందులో రచయిత స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివా సీలు తినే మాంసాహారంలోని ఆరోగ్య కారకాలు మనిషి మనుగడకు ఎలా దోహద పడుతున్నాయో వివరిస్తూనే వారు అలవాటు చేసిన మాంసాహారాన్ని నేటి ఆధునిక సమా జం అనుసరించి ఆధునికమైన కొత్త రుచు లతో ఆరగిస్తున్నారు అంటారు ఐలయ్య గారు. పోడు వ్యవసాయానికి చిరునా మాదారులైన గిరిజనులు వ్యవసాయ కార్యకలాపాల్లో తమదైన భుజశక్తికి ప్రాధాన్యత ఇస్తూ కర్ర ఇనుము కలగలిసిన వ్యవసాయ సాధనాలను కళాత్మకంగా ఉపయోగిస్తూ తమదైన సృజనాత్మకతతో పోడు వ్యవసాయం చేసుకోడాన్ని భిన్న కోణంలో ఆవిష్కరిస్తూ తద్వారా కూడా గిరిజనులు ఆధునిక సమాజానికి బోధకులు ఎలా అయ్యారో నిరూపించారు. ఆదివాసీలు త్రాగే ఆహార పానీయాల్లోని వినూత్న విషయం గురించి చెబుతూ చెట్లనుంచి కల్లు తీయడం వారికి మాత్రమే తెలిసిన గొప్ప ప్రక్రియగా అభివర్ణించారు. అంతేగాక అందులోని ఆరోగ్య కారకాలు శరీర ఆరోగ్యానికి ఎలా దోహద పడుతున్నాయో కూడా వివరించారు తాటిచెట్టు కల్లుతో పాటు ఈత,జీలుగ,వేప,చెట్ల నుంచి వారు తీసే కల్లు ఆరోగ్యానికి ఎలా సహకరిస్తుందో సవివరంగా సెలవిచ్చారు,అలాగే వారు ఆరాధించే దేవుడు సైతం ఈ మద్యాన్ని ఆరగిస్తారని మద్యానికి సైతం ఆధ్యాత్మిక వాదం అనుబంధం చేశారు రచయిత. నేటి మన ఆధునిక పద్ధతులకు ఆధారం ఆదివా సులు అవలంబించే పద్ధతులే కారకం అన్న రచయిత బలమైన వాదనఈ పుస్తకం లోని ప్రతిభాగంలో కనిపిస్తుంది.కొండారెడ్డి లంబాడాలు చెంచులు కోయలు ఉంటే సొంత సామాజిక పేర్లు కలిగి ఉన్న వీరిని ఆధిపత్య ధోరణిలో అందరిని ఒకే గాటిన కట్టేస్తూ గిరిజనులు, వనవాసులు,అని పిలవడం సరైన విధానం కాదు అన్నది రచయిత వాదనే కాదు,అలా పిలిపించు కోవడం వారికి ఇష్టం ఉండదు అని కూడా తేల్చి చెప్పారు దీనిలో వాస్తవికత లేకపోలేదు. ఇక ఆదివాసుల ఆహార నియమాల గురించిన వివరణ కూడా ఇస్తూ కొన్ని రకాల ఆహారం మాత్రమే పవిత్రమైనది మరికొన్ని రకాల ఆహారం అపవిత్రమైనది అనే భావన సరైనది కాదని అంటూనే పవిత్రంగా భావించే శాఖాహారం పట్ల ఆదివాసులు ఇష్టం చూపరు అని కాదు కానీ వారు ఇష్టంగా తినే మాంసా హారంలోని ఔషధ గుణాలను రచయిత కూలం కషంగా వివరించారు.అందులోని ఆదివాసుల పరిజ్ఞానాన్ని సహేతుకంగా చెప్పడంలో రచయిత పరిశీలన శక్తి అర్థమవుతుంది. ఆదివాసీలలో గల సాంకేతిక పరిజ్ఞానం గురించి చెబితే నేటి ఆధునికులకు నమ్మబుద్ధి కాకపోవచ్చు!! కానీ దీనిని సామరస్యంగా తెలుసుకుంటే అడవి బిడ్డల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అర్థం అవుతుంది. ఇక్కడ మరో విషయం గమనించాలి వీరి సాంకేతిక పరిజ్ఞానం అంతా సహజసిద్ధంగా వారి శారీరక శ్రమనుంచే ఆవిర్బవిస్తుంది తప్ప కృత్రిమంగా యాంత్రిక శక్తుల సాయంతో మాత్రం కాదు. ఈ విషయంలో కూడా ఆధునికులమైన మనం వారి నుంచి నేర్చు కోవలసినది చాలా ఉంది అన్నది రచయిత వాదన ఆవేదన.విత్తనాల వ్యవస్థకు ఆదివా సీలకు గల సంబంధం గురించి చెబుతూ అటవీ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి గల వ్యత్యాసం ఇందులో వివరిస్తూ అటవీ ప్రాంతానికి చెందిన విధానాలు మైదాన ప్రాంతం వారివిగా అన్వయించుకొని అటవీ ప్రాంతం వారికి ఎలాంటి నైపుణ్యాలు తెలియవు అనే ముద్ర వేసిన తీరును కూడా ఇందులో వివరించారు.అగ్రవర్ణాల వారి ఆధిపత్య ధోరణుల వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాలు నష్టాలు గురించి సహేతుకంగా ఆలోచింపజేసే విధంగా వివరించారు.రాజ్యం అనే ప్రభుత్వాల వలే, పౌర సమాజం కూడా ఆదివాసీల్లోని సామాజిక శక్తుల సాంకేతికతల నైపుణ్యాలు ఎప్పుడు గుర్తించలేదు, మౌర్యుల కాలంలో చంద్రగుప్తునికి ఆదివాసీల పట్ల సరైన అభిప్రాయం లేకపోవడం కౌటిల్యునికి ఆది వాసీలపట్ల గల తీవ్ర వ్యతిరేకత కారణం గానే తన మంత్రి పదవిని వదిలి రాజ్యతంత్ర గ్రంథమైన ‘అర్థశాస్త్రం’ రచించాడు అనే చారిత్రక వాదన వినిపించారు రచయిత ఐలయ్య.
హిందూ సమాజంలో గల కుల వ్యవస్థ కారణంగా ఆదివాసీలు అందులో ఎమడలేక తమకు సమన్నత స్థానం దక్కక తమకు సము చిత స్థానం కలిగిస్తున్న ఇతర మతాలలోకి వలసలు పోతున్న వైనాన్ని కూడా ఇందులో కూలంకషంగా చెప్పుకు వచ్చారు రచయిత. భారత జాతీయ ఉద్యమంలో ఆదివాసులు చేసిన వీరోచిత పోరాటాలను సైతం జాతీయ వాద వర్గం గుర్తించిన పాపాలపోలేదు అసలు మన దేశంలో బ్రిటిష్‌ పాలకులపై తొలి తిరుగు బాటు ఎజెండా ఎగరవేసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసింది ఆదివాసి వీర యోధులే కానీ చరిత్రలో ఎక్కడ వారి వివరాలు కనిపించ కుండా జాగ్రత్త పడిరది, అగ్రవర్ణాల వారైన ఆధునిక చరిత్ర రచయితలే!! అన్న విషయం ఈ పుస్తక రచయిత కులంకషంగా వివరిం చారు. ఇలా అనేక విధాలుగా అనేక రంగాల్లో అగ్ర భాగాల నిలిచిన ఈ ఆదివాసి అడవి బిడ్డల ప్రతి పని మనకు ఆదర్శనీయమైన బోధన అంశమే అలా అన్ని విషయాలు మనకు బోధించిన ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసి బిడ్డలే అన్న చారిత్రక సత్యాన్ని ముందు తరాలకు అందించిన ఈ పుస్తకం అందరు చదవదగ్గది.
పుస్తకం పేరు : ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు
రచయిత :ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, పేజీలు :30, ధర 30/- రూ, ప్రతులకు :ప్రజాశక్తి బ్రాంచీలు
సెల్‌ :94900 99057, సమీక్షకుడు :డా:అమ్మిన శ్రీనివాసరాజు

గిరిజన ప్రగతికి చిహ్నం ఈ గిరిజన సాహిత్యం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ ఆచార్య ఎం.గోనా నాయక్‌ ’’ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజన సాహిత్యం ’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
పూర్వపు గిరిజన సాహిత్యం అంతా గిరిజనేతరులు రాసిన ‘‘అనుభూతి సాహిత్యం’’ నేటి ఆధునిక కాలంలో విద్యావంతులైన గిరిజన జన జాతి రచయితల రాస్తున్న ‘అనుభవ పూర్వక సాహిత్యం’ దీనిలో మరి కాస్త ప్రామాణికత ఉంటుంది అనేది విశ్లేషకులు మాట.
అచ్చంగా ఆ కోవకు చెందింది ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే ప్రామాణిక పుస్తకం. రచయిత ఆచార్య యం.గోనా నాయక్‌ గిరిజన సామాజిక వర్గంకు చెందిన అత్యు న్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విశ్వ విద్యాలయ ఆచార్యునిగా వృత్తి జీవితం గడుపుతున్నారు.
ఆచార్య నాయక్‌ లక్ష్యం తమ గిరిజన సంస్కృతి భాషా సాంప్రదాయాలను ప్రామాణికంగా విశ్వవ్యాప్తం చేయాలని, అందులో భాగంగానే విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాస్తూ, విద్యార్థుల పరిశోధనలకు చేయూతనిస్తున్నారు.
ఆయన రాసిన అనేక గిరిజన భాషా పరమైన రచనల్లో ఒకటి ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే పుస్తకం.దీనిలో గిరిజన మూలాలు,గిరిజన తెగలు,గిరిజనులు సాంఘిక ఆచారాలు,గిరిజనసాహిత్యం, పొడుపు కథలు, అనే విభాగాలు ఉన్నాయి.
మానవ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన మోర్గాన్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి ఆది మానవుని కన్నా ముందుతరం నుంచి నాటి ఆటవిక యుగంలోనే ఆదిమ గిరిజనులు ఈ భూమి మీద నివసించారని ఆధుని కాలం నుంచి తమదైన సంస్కృతిని పరిరక్షించుకుంటూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో మైదాన ప్రాంతాల్లో తమదైన ప్రత్యేక జీవన శైలిలో నేటికీ వీరు జీవిస్తున్నారు.
మానవ శాస్త్రవేత్తల నిర్వచనాలను అనుసరించి గిరిజనుల నామౌచిత్యాల వివరణ చేసి వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలను క్రోడీకరించి అందులోని సారూప్యతల ఆధారంగా గిరిజనుల లక్షణాలు భాషా తదితరాలను అభివ్యక్తీకరించారు.
రెండవ విభాగంలో గిరిజన తెగల గురించిన వివరణ దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాల వారీగా ఆయా తెగల వివరణలు అందించి మొత్తం 35 తెగలుగా నిర్ధారించారు. ప్రతి తెగకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను కూడా ఇందులో సంక్షిప్తంగా తెలపడం ఉపేత్తంగా ఉంది ప్రాచుర్యమైన గిరిజన తెగతో పాటు రోనా,మూకదొర,కూలియ, మాలీలు,వంటి మరికొన్ని గిరిజన తెగల వివరాలు కూడా ఇందులో పొందు పరిచారు.దీనిలో ఆయా గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ శాస్త్రీయంగా అందించారు.గిరిజనుల సాంఘిక ఆచారాల విషయానికి వస్తే గృహ నిర్మాణం మొదలుకుని వారి వేట,వేట సాధనాలు,పండుగలు,నృత్యాలు, రీతులు వివరించారు దీనిలో ఆయా గిరిజనులు చేసే నృత్యాల రకాలు సవివరంగా వ్రాశారు వీటిలో జాతావులు చేసేగజ్జల నృత్యం,గొలుసు నృత్యం,కోంధ్‌లు చేసే మయూరి నృత్యం, భగత, వాల్మీకి,తెగల వారు చేసే గుమ్మలాట నృత్య విశేషాలు గురించి ఆసక్తికరంగా వివరించారు.
నమ్మకానికి చిరునామాదారులైన ఆదివాసీల్లోని విభిన్న రకాల నమ్మకాలను క్షుణ్ణంగా సహేతుకంగా రచయిత గోనా నాయక్‌ వివరించారు
ఆదివాసీల నమ్మకాలు ఎక్కువగా ప్రాకృతిక శక్తుల నుంచి తమను తాము రక్షించు కోవ డానికి, సులభంగా వేటాడుకోవడానికి,వారి జీవనం సక్రమంగా సాగిపోవడం కోసం, ప్రకృతిలో కనబడని శక్తుల్ని పూజించటం, బలు లు ఇవ్వడం చేస్తారు.వీరిజీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక నమ్మకాన్ని సూచిస్తుంది.
కలలకు సంబంధించి, ఆరోగ్య సంబంధం, గృహ సంబంధిత, వ్యవసాయ సంబంధిత,దైవ సంబంధిత, వార వస్తు, వేటకు సంబంధించిన వీరి నమ్మకాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటా యి. వీటిపూర్వకాల పద్ధతులు సంఘటనలు ముడిపడి ఉన్న సామాజిక శాస్త్రీయతలు కల గల్సి ఉంటాయి. గిరిజనుల్లో కనిపించే వైద్య విధానంలో నాటు పద్ధతులు కనిపించిన అంతర్గతంగా శాస్త్రీయత ఆగుపిస్తుంది వీరి వైద్యంలో ప్రధానంగా అనేకుల అనుభవాల సమ్మేళనం కనిపిస్తుంది వీరు ఎక్కువగా అడవుల్లో లభ్యమయ్యే వనమూలికలు,చెట్ల ఆకులు,బెరడు,అడవి జంతు వులను మందులుగా ఉపయోగిస్తారు.
పాల చెక్క పచ్చిపసుపుల మిశ్రమం నీళ్ళ విరోచనాలు తగ్గడానికి, బర్నిక చెట్టు పాలను దగ్గు తగ్గడానికి, మూర్ఛ వ్యాధి నయం కావడానికి పులి కొవ్వు, నడుం నొప్పికి ఉడు మాంసం ఒళ్ళు నొప్పులకు ఎలుగుబంటి కొవ్వు తాగించడం వంటి అనేక గిరిజన వైద్య విధానాలు ఇందులో తెలుసుకోవచ్చును.
ఇక ‘గిరిజనుల సాహిత్యం’ గురించి నాలుగో విభాగంలో వివరించారు, వీరి సాహిత్యమంతా మౌఖికంగా నృత్య గీతాలలో నిక్షిప్తం అయినట్టు ఇందులో చెప్పబడిరది.సాధారణంగా గిరిజనుల జీవన విధానం అంతా సంఫీుభావంతో ముడిపడి ఉంటుంది, వివిధ సామాజిక శాస్త్రవేత్తల నిజ నిర్ధారణ ద్వారా వీరి సంగీత నృత్య రీతులను నిర్ధారించి వివరించారు.
జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం,సృష్టి రూపాన్ని సంతరించుకోవడానికి ఎన్నో సంవత్స రాలకు ముందే ఈ గిరిజన సాహిత్యం పుట్టిం దని సంగీతానికి తొలి రూపం గిరిజనుల ఆటపాటలే అని నిర్ధారించారు.
నృత్య గీతాలు రకాలు నృత్య గీతాల అర్థ వివరణ వర్గీకరణ తదితరాలు ఇందులో క్రోడీకరించారు, దీనిలో వివిధ తెగల పాటలు అర్ధ వివరణలతో అందించడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది.
అదేవిధంగా లంబాడాలు అని పిలవబడుతున్న బంజారాల మూలస్థానం గురించిన పూర్తి వివరణ సహేతుకంగా ఇచ్చారు.
వీరిలో కనిపించే సాంప్రదాయాల ఆధునీకరణ పద్ధతులు వారిలోని సంస్కృతి సాహిత్యాల అభివృద్ధి కారణాలు గురించి కూడా మనం ఇందులో కూలంకషంగా చదవవచ్చు.
సాహిత్యంలో భాగమైన పొడుపు కథలను చివరిదైనా ఐదవ భాగంలో ప్రస్తావించారు, గిరిజన తెగల్లో కూడా ఈ పొడుపు కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇందులో వ్యవ సాయ,వివాహ,సామాజిక, పరిస్థితులకు సంబంధించిన వాటిని వర్గీకరించి వివరించారు.బంజారా భాషలోని పొడుపు కథలను తెలుగీక రించి ఇందులో రచయిత వివరించడం ఉపయుక్తదాయకం.
ఈ పుస్తకం నిడివిలో చిన్నదైన విషయ వివరణలో చాలా పెద్దది అనాలి,దీనిలో ప్రతి విషయాన్ని పరిశోధక రచయిత గోనా నాయక్‌ అత్యంత శ్రద్ధగా బాధ్యతాయుతంగా ప్రామా ణికంగా రాయడం అభినందనీయం.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణలో భాగంగా 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా వెలువడ్డ ఈ పరిశోధనాత్మక పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షంగా చెప్పవచ్చును. పరిశోధకులతో పాటు గిరిజన సాహిత్య అధ్యయన విద్యార్థులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ విధిగా చదవదగ్గ విలువైన పుస్తకం ఇది.
పుస్తకం పేరు : గిరిజన సాహిత్యం, రచన : ఆచార్య యం.గోనా నాయక్‌, పేజీలు :124, వెల:30/- రూ,
ప్రతులకు : తెలుగు అకాడమీ, హిమాయత్‌ నగర్‌,హైదరాబాద్‌.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

1 2