ప్రైవేట్‌ స్కూల్స్‌..ఫీజల నియంత్రణ ఎక్కడ

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు.ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుం డానే ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.తమ పిల్ల లను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదం డ్రుల కోరిక ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెరతీశారు. పట్టణా ల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది.దీంతో స్కూలు, హాస్టల్‌ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు,ఆ తర్వాత విద్యార్థు లకు పాఠశాలనుబట్టి రూ.60వేల నుంచి సుమారు లక్షరూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు తాము తక్కువ కాదం టూ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఇదే సంప్రదా యానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్‌ అంటూ మరికొంత నొక్కుతున్నాయి.దీంతో విద్యా ర్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి,వెనక్కి వెళ్ళ లేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి
విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్‌-11ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయ కూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులోపెట్టాలి.సెక్షన్‌1,2ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియ మించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరా లను నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్‌-12ప్రకారంటీచర్‌,విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమా న్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగు లకు, మైనారిటీలకు కేటాయిం చాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లై న్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదర పు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల యాజమాన్యం అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్‌ ఫీజుల రసీదులు ఇస్తున్నది.మీఅమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలే దంటూ వారిని కించ పరుస్తున్నారు. ఫీజు స్లిప్పు లను చిన్నారుల చేతికిస్తే జరిమానా ఉంటుంది. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించ కూడదు. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటామారుస్తుండాలి.ప్రతి నెల సమా వేశం ఏర్పాటు చేసి ఆవివరాలను నమోదు చేయా లి.పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించ కూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించ కుండా నడుపుతున్నాయి.ప్రతిజిల్లాకు జిల్లా విద్యా శాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవస రమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదు వులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్రా ్టలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధ నలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2024-25కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచాయి. ప్రస్తు తం ఉన్న ఫీజుల కంటే ఎక్కువగా 10నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈవిద్యా సంవత్సరం వార్షిక పరీక్ష లు ఇంకా ముగియక ముందే వచ్చే ఏడాదికి కట్టా ల్సిన స్కూల్‌ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్‌, ప్రవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు, నోటీసులు, మెయిళ్లు పంపడం గమనార్హం. కొత్తగా తీసుకునే అడ్మిషన్లు గడువు తేదీలు ముగిశాయి. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగాస్క్రీనింగ్‌ టెస్టులు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా వారు చేస్తున్న ప్రొఫెషన్‌ తెలుసుకుని వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ అసమానతలు పెంచుతున్నారు.
ఫీజులపై నియంత్రణ ఏది ?
ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తు న్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్‌ నిర్వచించబడిరది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమా న్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసు కొచ్చిన జీవోనెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వినియోగించడం లేదు. షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మారినా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు,కార్పొరేట్‌ ఫీజుల నియం త్రణకై అనేక వాదనలు జరుగుతున్నాయి. అటాన మస్‌ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యం వాదనలు వినిపిస్తున్నాయి.2002లో ’’టి.ఎ.పారు.వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’2003లో’’ఇస్లామిక్‌ ఎడ్యు కషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’, 2004లో’’మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢల్లీి ప్రభు త్వం’’,2005లోపి.ఎ.ఇనాందారి వర్సెస్‌ మహా రాష్ట్ర ప్రభుత్వం’’ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలుక్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉం దని సుప్రీం తెలిపింది. కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
నియంత్రణ చట్టం అవశ్యం
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రిం చేందుకు తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర, రాజస్ధాన్‌,పశ్చిమ బెంగాల్‌,పంజాబ్‌ సహా15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చా యి.తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది.దాదాపు 11వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది.కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణలో ఉపాధ్యాయుల జీతాలు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రభు త్వం ఆయా సంస్థల ఎకౌంట్లను సమగ్రంగా పరిశీ లించి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వ హణ ఖర్చులు15శాతం మించకుండా పెంచుకు నేలా చట్టం చేయాలి. ప్రతి సంవత్సరం తల్లిదం డ్రులు,పాఠశాల యాజమాన్యం,విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌,జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియం త్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశా లలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్త కాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి.ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరిం చిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యా ర్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,చిన్న విద్యాసంస్థ ల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.
ఎక్కడ ఫీజుల నియంత్రణ చట్టం?
ప్రయివేట్‌,కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజుల మోత మోగుతోంది. ఇది ప్రతియేటా విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతోంది.ప్రయివేట్‌, కార్పొ ంట్‌,ఇంటర్నేషనల్‌ పేరుతో నడిపిస్తున్న స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు విద్యాశాఖాధికారులుగానీ,అటు ప్రభుత్వంగానీ ఆ స్కూల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు ఈ స్కూల్స్‌లో క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణం. ఫీజులను కట్టడి చేస్తామంటూ సంవత్స రాల నుంచి చెబుతున్న మాటలను ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రొ. తిరుపతిరావు కమిటీ అంటూ కొన్ని రోజులు, మంత్రుల కమిటీ అంటూ కొన్నిరోజులు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు.చివరికి ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార సులను పక్కన పెట్టేశారు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు.రాష్ట్రంలో పైచిలుకు కార్పొ రేట్‌, ప్రయివేట్‌ స్కూల్స్‌ ఉండగా, వీటిలో దాదాపు గా లక్షల మంది చదువుతున్నారు.ఫలితంగా ప్రయి వేట్‌,కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగు తుంది.రాష్ట్రంలో కొన్ని పాఠశాలకు పర్మిషన్‌ లేక పోయినా అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్ల పేరుతో డబ్బులు దండు కుంటున్నాయి యజమాన్యాలు. గత సంవత్సరం ఫీజు కంటే 20నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచు తున్నాయి.స్కూల్స్‌ స్థాయిని,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంపకం నడు స్తుంది.కార్పొరేట్‌స్కూల్స్‌ బ్రాంచీల పేరుతో రాష్ట్రం లో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో అడిగే నాథుడు లేడనే ఉద్దేశాలతో విద్యాలయాలు నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులను పరోక్షంగా భయాం దోళన గురిచేస్తున్నారు.రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య,భాష్యం,సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌, కృష్ణవేణి టాలెంట్‌,శాంతినికేతన్‌,నాగార్జున స్కూల్స్‌ వివిధ ప్రాంతాలలో బ్రాంచిల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు. ఆఖరికి పపుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్‌ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతు న్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్‌ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు,ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపా యాలు ఉండవు. ఫైర్‌ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. స్కూల్‌ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓచట్టం చేయాలని నిర్ణయం తీసు కుంది. జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావే శంలో మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధా నాలు ఏర్పాటు చేసేందుకు ఉప సంఘాన్ని నియ మించారు.ఈ కమిటీకూడా ప్రతిప్రయివేట్‌, కార్పొ రేట్‌ స్కూల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే ఫీజు లు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగ లేదు.అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అడుగులు కూడా పడకపోవడం గమనార్హం. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్న గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వాస్తవానికి ఏవిద్యా సంస్థనైనా ట్రస్ట్‌ పేరిట నడ పాలి. దానికి ఒక గవర్నమెంట్‌ బాడీ ఏర్పాటు చేయాలి.అయితే కార్పొరేట్‌ పాఠశాలలో నామ మాత్రంగా గవర్నమెంట్‌ బాడీ చూపిస్తున్నా, అధి కారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుం టుంది.కొన్ని స్కూల్స్‌ ఒకేసారి మొత్తం ఫీజు కట్టా లని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రం లోని అన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.-(టి.నాగరాజు)

సాగుకు వేళాయె..సన్నద్దత లేదయె

రాయితీపై పచ్చిరొట్టవిత్తనాల సరఫరా మందకోడిగా సాగుతోంది.వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతులు నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకా లంలో సాగు పనులు చేపట్టకపోతే,పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీ త్యాలు రైతుల కష్టాన్ని మింగే స్తాయి.గతాను భవా లను దృష్టిలో ఉంచుకుని వ్యవ సాయశాఖ అధికారులు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ కు వరుణుడు సిద్దం అంటున్నాడు.వాన జడితో మాగా ణిని సన్నద్దం చేశాడు. సిరుల పంట వేయడానికి అన్న దాత సై అంటున్నాడు.అధికార యంత్రాంగం మాత్రం ఓ అడుగు వెనకే ఉన్నానంటోంది.
వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈసారి వర్షాలు ముందే కురుస్తుండడంతో అంచనాతో అన్నదాతలు సమా యాత్తమవుతున్నారు. దుక్కులు దున్నుతూ వ్యవ సాయ పనుల్లో బిజీబిజీగాఉన్నారు. ప్రభుత్వ ఆదేశంతో వ్యవసాయశాఖ సైతం కర్షకులకు కావా ల్సిన విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై అంచనాలు సిద్ధం చేసింది. గతేడాతో పోలిస్తే ఈ సీజన్‌లో 25 శాతం వరిని తగ్గించడంతో పాటుగా ఇతర పంటలైన పత్తి, కంది పంటలను ప్రోత్సహిం చేలా అధికారులు రైతులను చైతన్యం చేయను న్నారు. 34.40లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి.ఈసారి పప్పు పంటలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. త్వరలో రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అంద నుండడంతో మరింత ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నం కానున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న వాతావరణ శాఖ చల్లని కబురు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న జనానికి భారీ ఉపశమనం. నిరుడు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవ నాలు వైఫల్యం చెందగా ఈ మారు పసిఫిక్‌లో లానినా పరిస్థితుల వలన అధిక వర్షం కురుస్తుం దన్న సూచన రైతాంగానికి పెద్దఊరట.వ్యవ సాయ ఆధారిత ఎ.పి.కి ఖరీఫ్‌ ప్రధానమైనది. ఇప్పుడే 60-70శాతం భూమి సాగవుతుంది. కోటి ఎకరా లకు పైగా సేద్యం కోటి మందికి పైగా రైతులకు, కౌలు రైతులకు, అంతే సంఖ్యలో ఉన్న వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఇదే. రాష్ట్ర స్థూలోత్పత్తికి సైతం ఇదే ఇరుసు. కాగాగత సంవత్సరం రుతుప వనాలు ఆలస్యమయ్యాయి.వచ్చాక కూడా అంతగా ప్రభావం చూపని కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితి నెలకొంది.సీజన్‌ ముగిసే సమయానికి 400 మండలాల్లో తీవ్ర వర్షా భావం తిష్ట వేసింది.ప్రభుత్వం మాత్రం 103 మండలాల్లోనే కరువును ప్రకటించింది. రబీలోనూ అనావృష్టి కొనసాగగా, ఎన్నికల షెడ్యూల్‌ వస్తుంద నగా 87 కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది. రైతులు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు. వేసిన పంటల్లో లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయి. కరువుతో పాటు అకాల వర్షాలు, డిసెంబర్‌లో వచ్చిన మిచౌంగ్‌ తుపాన్‌ రైతుల ఉసురు తీసింది.ఇప్పుడు ‘నైరుతి’ మోసుకొచ్చిన తీపి కబురు విపత్తులతో నష్టాలు చవిచూసిన రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.ఖరీఫ్‌ సజావుగా సాగా లంటే రైతులకు అదనుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి అందుబాటులో ఉంచాలి. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ప్రభుత్వ యం త్రాంగం తలమునకలైంది. పోలింగ్‌ ముగిసిన ప్పటికీ జూన్‌ 4న ఫలితాలొచ్చే వరకు కోడ్‌ అమల్లో ఉంది. అప్పటి వరకు ఇ.సి.పర్యవేక్షణలో ప్రభుత్వం నడుస్తుంది. కోడ్‌ ఉంది కదా అని సీజన్‌ ఆగదు. అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఖరీఫ్‌ కు సన్నద్ధం కావాలి. కానీ ఇప్పటి వరకు సమగ్ర సమీక్ష లేదు. సబ్సిడీ విత్తనాల సేకరణ మొదలు కాలేదు.ఎరువులపైనా ఉదాసీనతే. పరపతి పరిస్థితీ అదే తీరు. ఖరీఫ్‌లో కరువు, తుపాన్‌లతో పంట నష్టపోయిన 12లక్షల రైతులకు రూ.1,294 కోట్లు విడుదల చేస్తూ ఎన్నికల కోడ్‌ రాకముందు మార్చి 6న ముఖ్యమంత్రి బటన్‌నొక్కగా ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. బీమా వ్యవహారం తేల్లేదు. విపత్తు మండలాల్లో బ్యాంకులు ఫ్రెష్‌ లోన్లు ఇవ్వలేదు. వార్షిక రుణ ప్రణాళిక మీటింగ్‌లు ఎన్నికల పేరిట వాయిదా పడ్డాయి. రైతు భరోసా కిస్తు ప్రశ్నార్ధక మైంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలొచ్చే వరకు తేలేటట్లు లేదు. రబీ పంటల సేకరణను పట్టించుకునేనాథుడు లేడు. రబీ పంట నష్టాలపై అతీగతీ లేదు.రైతులకువిత్తనాలివ్వకుండా, రుణాలి ప్పించకుండా,ఎరువుల్లేకుండా,రుణాలు,పెట్టుబడి సాయం ఇవ్వకుండా సేద్యం ఎలా చేస్తారు? ఎన్ని కలయ్యాక చూసుకుందామనుకుంటే గడచిన కాలం తిరిగొస్తుందా? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.అది నడుస్తూనే ఉండాలి. ఎన్ని కైన ప్రభు త్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రాధ మ్యాలు మారుతుంటాయి. ఎన్నికలున్నందునే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని మాసాల ఖర్చుకు సభామోదం తీసుకుం టుంది. ఈ ఖరీఫ్‌లో స్కీములు, ఇతర వ్యవహారాలు ఓటాన్‌ బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా అమలవుతా యి.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇతర అంశాలు నిర్ణయ మవుతాయి. ఎన్నికలు సరిగ్గా ఖరీఫ్‌ వేళ వచ్చినం దున ఈఅంశాలను ప్రభుత్వం,సి.ఎస్‌. గమనం లోకి తీసుకొని సమీక్షలు జరిపి ఖరీఫ్‌కు యావత్‌ యంత్రాంగాన్నీ సిద్ధంచేయాలి. సామాజి క పెన్షన్ల మాదిరిగాఇన్‌పుట్‌ సబ్సిడీకి,రైతు భరోసా, బీమా, సబ్సిడీ విత్తనాలకు ఇబ్బందులేమీ ఉండవు. అవసర మైతే ఇ.సి.నుంచి తగిన అనుమతులు తీసు కొని ఖరీఫ్‌ సాగడానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. పోలింగ్‌ వరకు అధికార వైసిపి, టిడిపి కూటమి పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పోలింగ్‌ ముగిశాకా అదే ధోరణితో ఉన్నారు. గెలు పోటముల అంచనాల్లో బిజీగా గడుపుతు న్నారు. వాటన్నింటినీ పక్కనపెట్టి ఖరీఫ్‌ సన్నద్ధతపై ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే పని చేయాలి. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం జొన్న, మొ క్కజొన్న,శనగలు, పొద్దుతిరుగుడు తదితర పంట లను పండిరచేలా సూచనలు ఇస్తోంది.రైతు వేదికల వద్ద ఏఈవోలు నిత్యం మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు అందుబాటులో ఉండను న్నారు. ఇక్కడ ప్రతి వారం రెండుసార్లు రైతులకు సాగు, రైతుల సమస్యలపై ఏఈవోలు వివరించ నున్నారు. దీనివల్ల సీజన్‌లో రైతులకు విత్తనాలు వేసినప్పటి నుంచి మార్కెట్‌కు పంటలు తరలించు కునే వరకు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.సింగిల్‌విండోల ద్వారా, మార్కె ట్‌లో రైతులకు కావాల్సిన విత్తనాలను అందు బాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతు న్నది. రైతుబంధు నిధులను కూడా త్వరలో అంద జేయనున్నది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు ప్రారంభ మయ్యా యి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లోభూములు చల్లదనం సంతరించుకొంటు న్నాయి. ఈసారి ముందస్తు వర్షాలు ఉంటాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతులు వానకాలం ఆరంభంలోనే విత్తనాలు విత్తేందుకు సమాయాత్త మవుతున్నారు.భూసార పరీక్షలకు సైతం చేయించు కొంటున్నారు.
నెలలో సేద్యపు పనులు
టమాట: ఇప్పుడు టమాట చిల్లరగా వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. నీళ్లున్న ఎక్కువ మంది రైతులు, టమాట సాగు వైపు మొగ్గు చూపే అకాశముంది. విస్తీర్ణం బాగా పెరిగితే పంట చేతి కొచ్చేటయానికి (విత్తిన 90 రోజులకు లేక నాటిన 60 రోజులకు పంటచేతికి రావడం మొదల వుతుంది) ధరలు తగ్గే అవకాశముంది. వర్షానికి కూడా టమాట సాగు చేయడం పలు ప్రాంతాలలో అలవాటుంది. వర్షాధార పంట చేతికొచ్చే టయా నికి టమాట ధర బాగా తగ్గే అవకాశ ముంది. విపరీత వర్షాలు, ముసురు, మేఘావృత వాతావర ణం వలన ఏ ప్రాంతంలోనైనా పంట దెబ్బతింటే అప్పుడు టమాట రేట్లు పెరుగుతాయి. టమాట ధర జూన్‌ నెలలో కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతున్నది.జూలై 3వవారం, ఆ తర్వా త వర్షాధార ఆకుకూరలు, కూరగాయలు మార్కె ట్‌కు వచ్చినపుడు ఈపంట ధర తగ్గే అవకాశ ముంది.
కొత్తిమీర: జూన్‌ మొదట్లో రుతుపవనాలు మొదలయ్యే వరకు వేడి వాతావరణమే ఉంటున్నం దున,ధనియాలు మొలకెత్తి, పెరగడానికి పాక్షికంగా నీడ/ఎండ ఉండి,నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు కొత్తిమీర సాగుకు అనుకూలం. మొక్కజొన్నలో అంతర పంటగా పందిరి కూరగాయల పొలాల్లో, మామిడి,మునగ,కొబ్బరి మొదలగు తోట పంట ల్లోని ఖాళీ జాగాల్లో, పాలీహౌస్‌లు,నెట్‌హౌస్‌లు, షేడ్‌నెట్ల క్రింద,చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద,కొత్తిమీరసాగు చేసి జూన్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.జూన్‌లో కూడా చల్లగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో (అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాం తంలో)కొత్తిమీరను అనుకూలంగా పండిరచి, ఇతర ప్రాంతాలకు పంపవచ్చు.
ఫ్రెంచిచిక్కుడు: ఈ పంటకూడా కొత్తిమీర లాగానే, అధిక ఎండను, వేడిని తట్టుకోలేదు. కనుక పాక్షిక ఎండ/నీడ ఉన్న ప్రదేశాలలో ఈపంటను పం డిరచి,అధిక ధరను పొందే వీలుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా వచ్చే ఆకుకూరలు జూలై 3వ వారం నుండి ఎక్కువగా ఉంటాయి. ఆలోపు చేతికొచ్చే ఆకుకూరలకు ఎక్కువ ధర పొందవచ్చు. వీటిని ఎండలకు కూడా పండిరచ వచ్చు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో మంచి లాభాలు పొందవచ్చు.పాలకూర,తోటకూర, చుక్కకూర,మెంతికూర,గోంగూర,పొన్నగంటి కూర,కొయ్యగూర,సోయకూర,గంగవాయిలాకు మొదలైనవి. సిరిధాన్యాలతో పాలకూర,తోటకూర, పొన్నగంటికూర,కొయ్యగూర,గంగవాయిలాకు మొదలగు ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగి,ఎక్కువబల్క్‌ ఉన్న ఆహారం తయారవుతుంది. దీనిని తినే దాని వలన మధుమే హాన్ని సులభంగా కంట్రోల్‌లో ఉంచవచ్చు. ఆచ రించిన అనుభవంతో తెలుపుతున్నాను. మధుమేహ గ్రస్తులు అలవాటుపడితే ఆకుకూరలకు విపరీ తమైన గిరాకీ ఏర్పడవచ్చు. ఖచ్చితంగా సుగర్‌ వ్యాధి అదుపులోకొస్తుంది. రైతులు పండిరచిన ఆకుకూరలకు మంచిధర రావడం జరుగుతుంది. అన్నికాలాల్లో దొరికే ఆకుకూరలు (ముఖ్యంగా చప్పగా ఉన్న ఆకుకూరలు) సిరిధాన్యాల బియ్యం తో కలిపి వండుకోవడం కూడా చాలా సులభం. మధుమేహాన్ని చాలావరకు ప్రపంచం నుండి తరి మికొట్టవచ్చు.మధుమేహపు మందులను మానేయ వచ్చు.
సిరిధాన్యాలు: కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు,అండుకొర్రలు విత్తడానికి జూన్‌ నెల కూడా అనుకూలమే. వర్షాధారంగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండిరచిన ఈ పంటలకు అత్యధిక ధర ఇచ్చి రైతుల వద్దకే వచ్చి కొనుక్కెళ్లే వాళ్లున్నారు.
కూరగాయలు: పలు కూరగాయ పంటలను జూన్‌ మొదటి నుండి విత్తుకోవచ్చు. భూమిలో తడిలేక పోతే నీరు పెట్టాల్సుంటుంది. వర్షం పుష్కలంగా పడితే,తేమ అనుకూలంగా ఉన్నపుడు విత్తుకో వచ్చు. కూరగాయల ఎగుమతులను విపరీతంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బెండ: జూన్‌లో విత్తవచ్చు.విత్తిన 45రోజుల్లో తొలి కోత మొదలుపెట్టవచ్చు.సులభంగా పంట తీసుకో వచ్చు.సొంత విత్తులను నాటితే ఖర్చు తక్కువ. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు,హైబ్రిడ్‌లు మార్కె ట్లో దండిగా దొరుకుతున్నాయి. ఎక్స్పోర్ట్‌కు అనుకూ లాలు మెండు.ఎగుమతికనువైన రకాలు:వర్ష, విశాల్‌,నాథ్‌శోభ,పంజాబ్‌ పద్మిని.
వంగ: వర్షాకాలంలో నారు పోయడానికి జూన్‌-జూలై నెలలు అనుకూలం. 30-35 రోజుల నారు నాటవచ్చు. ఏ ప్రాంతానికి అనువైన రకాలను ఆ ప్రాంతంలో సాగు చేసి, మంచి ధర పొందవచ్చు. దేశవాళీ రకాలను, సొంత విత్తనాలను, ఆర్గానిక్‌ పద్ధతి ద్వారా పెంచి, సోషల్‌ మాధ్యమం ద్వారా ప్రచారం చేసుకుంటే ఎక్కువ ధరలకు అమ్ముకో వచ్చు. ఖర్చు తక్కువ. తప్పుడు ప్రచారం చేసుకుంటే అది బెడిసికొట్టి ఆమనిషికి విలువ లేకుండా చేస్తుం ది.అనుకూలమైన రకాలు:కోస్తాఆంధ్ర: పూసా పర్పుల్‌ క్లస్టర్‌, పూసాక్రాంతి, గులాబిబీ రాయ లసీమ:రాయదుర్గం, పోలూరు వంగ, అర్కకుసు మాకర్‌బీ తెలంగాణ:శ్యామల, దేశవాళీ పచ్చ వంగ రకాలు, పూసా పర్పుల్‌ క్లస్టర్‌,పూసాక్రాంతి. గోరుచిక్కుడు: వర్షాధారంగా పండిరచే మొండి జాతి పంట.నీటిఎద్దడిని,చీడపీడలను చాలా వరకు తట్టుకుంటుంది. నీటి ఆధారంగా కూడా పండిరచి అధిక దిగుబడులు పొందవచ్చు.జూన్‌-జూలై నెల ల్లో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. పశువుల దాణాగా,పచ్చిమేతగా, పచ్చిరొట్ట ఎరువుగా, దీని గింజలు గమ్‌ తయారీకి పనికొస్తాయి. లేత కాయ లు,కూరగాయగా వాడుతారు.జూన్‌-జూలైలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: పూసామౌసమి, పూసాసదాబహార్‌, పూసానవబహార్‌, గౌరి.పందిరి కూరగాయలు: జూన్‌-జూలైనెలల్లో విత్తు కోదగినవి.
ఆనప/సొర: రకాలు: పూసానవీన్‌, అర్కబహార్‌, పి.ఎస్‌.పి.ఎల్‌. హైబ్రిడ్లు: వరద్‌, విక్రాంత్‌, అమిత్‌ దోస: కూరదోస: ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎమ్‌-1, ఆర్‌.ఎన్‌. ఎస్‌.ఎమ్‌-3, వీటిని లేతగా ఉన్నపుడు పచ్చిదోసగా కూడా వాడవచ్చు. పచ్చిదోస రకాలు: పూస ఖీర, కొ-1, హైబ్రిడ్లు: మాలిని, జిప్సి.కాకర: రకాలు: డి.కె.-1, ప్రియ, హైబ్రిడ్లు: శ్వేత, పూనం గుమ్మడి: రకాలు: పూసా అలంకార్‌, అర్కచందన, హైబ్రిడ్‌: పూసా హైబ్రిడ్‌-1బూడిద గుమ్మడి: రకాలు: శక్తి, కో-2,‘పేట’స్వీటు తయారీకి:బి.హెచ్‌-24,బి. హెచ్‌-25
పొట్ల: పందిరిపై పెంచడానికి రకాలు: శ్వేత, కో-1,కో-2,పి.కె.ఎం.-1బీ నేలపై పెంచడానికి రకం: కో-2బీ హైబ్రిడ్‌: పందిరిపై పెంచడానికి: ఎం.డి.యు-1
బీర: రకాలు: జగిత్యాల లాంగ్‌, అర్కసుజాతబీ హైబ్రిడ్లు: ఎస్‌.ఎస్‌-403, సంజీవని
దొండ: రకాలు చిన్నదొండ,పెద్దదొండ, నేతి దొండ
కీరదోస: అలామిర్‌, కియోన్‌, సటిన్‌.
పూలు: బంతి: ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. జూన్‌ రెండవ వారంలో నారు పోసుకుని, జూలై రెండవ వారంలో నాటడం అనుకూలం. మార్కె ట్‌కు అక్టోబరులో తయారవుతుంది. పండుగకు అందివ్వాలంటే సుమారు 60 రోజులు ముందుగా నాటుకోవాలి.
గులాబి: జూన్‌ నుండి జనవరి వరకు నాటుకో వచ్చు.సెప్టెంబరు,అక్టోబరు నెలల్లో నాటడం అత్యంత అనుకూలం. హైబ్రిడ్‌ టీస్‌: పింక్‌ పాం థర్‌,ఆదిత్య, రక్తిమబీ ఫ్లోరిబండాస్‌: ఆకాష్‌దీప్‌, రెడ్‌ ట్రెంప్‌, ల్యూటిన్‌బీ మినియేచర్‌: బేబి చాక్లెట్‌, ప్రీతి.
మల్లె: వర్షాకాలం ప్రారంభంలో జూన్‌-జూలైలో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. గుండు మల్లెను 55, జాజిమల్లెను 77, కాగడమల్లెను 6ో5 అడుగుల ఎడంలో నాటాలి.
కనకాంబరం: మే-జూన్‌ నెలల్లో నారుపెంచి, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60ో30 సెం.మీ.దూరంలో నాటాలి. సంవత్స రమంతా పూస్తుంది.చలికాలం,వేసవిలలో పూల దిగుబడి ఎక్కువ. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది.
వరి: భారతావనిలో వరి పంట దిగుబడి అవసరాల కంటే ఎక్కువైనందున ఈ పంటకు ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గుతున్నది. వరి తప్ప ఇతర పంటలు వేయలేని ఊటభూములు, కాలువల క్రింద, లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే పండిరచడం మం చిది. ఇంటి వాడకానికి, ఆర్గానిక్‌ పద్ధతిలో పంట పెట్టుకోవచ్చు. అధిక దిగుబడులకు జూన్‌లో ఎంత ముందుగా వీలయితే అంతముందుగా విత్తడం పూర్తి చేయండి. నాటు పెట్టడం కూడా నీటి లభ్యత ఉంటే, ఎంత లేత నారు నాటితే అంత దిగుబడులు పెరుగుతాయి. నీటి లభ్యత సరిగా లేనిచోట, నీటి లబ్యత మెరుగైన తర్వాతనే నారు పోయుట, నాటు ట చేపట్టాల్సుంటుంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెం టుపై ఆధారపడకుండా,స్వంతంగా మార్కెట్‌ చేసుకున్నా, గిరాకీ ఉన్న రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయడం బాధలను తగ్గిస్తుంది.
ప్రత్తి: చైనా నుండి దిగుమతులను కట్టడి చేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువై నందున, దిగుబడి తగ్గినందున మార్కెట్‌లో ప్రత్తికి మంచి డిమాండ్‌ ఉంది.క్వింటాలు ప్రత్తి రూ. 10-12 వేలు పలుకుతున్నది. మంచి ప్రోత్సాహము న్నందున ఈ పంటను రైతులు పెట్టడానికి ఉత్సా హం చూపుతున్నారు. పూర్తిగా నమ్మకమైన డీలర్ల దగ్గర నమ్మకంగా క్రితం సంవత్సరంలో బాగా పండిన, గిరాకీ ఉన్న రకాలనే పండిరచండి. కొత్త రకాలు వేయాలనుకునేవాళ్లు,కొద్ది విస్తీర్ణంలో పరీ క్షించి బాగా పండితే తదుపరి సంవత్సరం, అదే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తిని పండిరచి, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ విధానంలో ప్రత్తి పంట త్వరగా పూర్తవుతుంది. ప్రత్తి తర్వాత శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను పెట్టుకో వచ్చు. అధిక సాంద్రత విధానాన్ని వర్షాధారం గాను, నీటితడులిచ్చి కూడా చేపట్టవచ్చు.
వేరుశనగ: జూన్‌ రెండవ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ గింజలు పెద్దగా ఉండడం వలన, మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ అవసరం. జూలై మొదటి వారం తర్వాత ఎంత నిదానించి విత్తితే అంత దిగుబడి తగ్గుతుంది. కదిరి లేపాక్షి (కె-1812)బాగా దిగుబడి నిస్తున్నప్పటికి కన్ఫెక్షనరీ (గింజలతో తయారైన పదార్థాలు) తయారీదారులు, దీని వాడకానికి ఇష్ట పడుట లేదు. ఇందులో వగరు ఉండుట కారణ మంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వారు రూపొందించినటి.సి.జి.ఎస్‌-1694 గట్టి, కమ్మటి, లావుగింజలు, సమానమైన సైజుగల గింజలు కలిగి, అత్యధిక దిగుబడులను సైతం ఇస్తున్నది. దీనిని ప్రాచుర్యంలోకి తేవ డానికి,విరివిగా విత్త నోత్పత్తి చేపట్టవచ్చు.
-జి.ఎన్‌.వి.సతీష్‌