ప్రకృతి జీవకళ జీవ వైవిధ్యం

జీవుల మధ్య ఉండే భిన్నత్వమే జీవ వైవిధ్యం.భూమ్మీదఉండే లక్షలాది జీవ జాతు లు, వాటి జన్యువులు, అవి ఉన్న జీవా వరణ వ్యవస్థలను కలిపికూడా జీవ వైవిధ్యం అంటా రు. ఈఅధ్యయనాన్ని నోర్స్,మెక్మానస్ 1980 లోమొదట జీవశాస్త్ర వైవిధ్యం అన్నారు.ఈ పదాన్ని డబ్ల్యుజి రోసెన్ 1985లో జీవ వైవి ధ్యంగా మార్చారు.తరువాత దీనిలో ఎన్నో మార్పు లు వచ్చాయి.ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశానికి సంబంధించి జీవ వైవిధ్యంలోని రెండు విలువల గురించి చెప్పాలి. అవి ప్రత్యక్ష విలువలు, పరోక్ష విలువలు. జీవ వైవిధ్యం దెబ్బ తింటే పర్యావరణం దెబ్బ తింటుంది. దీనితో పంటలు దెబ్బ తింటాయి. జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడం అంటే మానవాళి తనను తాను రక్షించుకోవడమే. మితిమీరిన రసాయనిక ఎరువులు,మందులకు జీవ వైవి ధ్యం బలవుతున్నది.మానవాళి మనుగడకు కీలకమైన ఆహారోత్పత్తులకు మూలాధారం జీవ వైవిధ్యమన్న వాస్తవాన్ని కూడా మానవాళి విస్మ రిస్తున్నది.ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవు లకు ఒకటే గ్రహం,ఒకటే గృహం. మనుషు లంతా ఒకటే అనేది ఉట్టిమాట. పొడుగు, పొట్టి, లావు, సన్నం, నలుపు, తెలుపు, ఇంకా వీటి మధ్యస్థ రకాలు, భేదాలు.ఇంకా మనుషులంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి? ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి. ఈ భూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈతరహా భేదాలన్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్ వంటిది.ప్రకృతిలో ప్రతిజీవి ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ పర్యావరణ వ్యవస్థల స్థిరత్వంస్థితిస్థాపకతకు దోహదం చేస్తుంది.
తక్కువైతే మనకేంటి నష్టం?
ఒక పురుగో, అసలిప్పటివరకు సామా న్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమై పోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతి జాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంకర్షణ చెందుతుంది. పర్యావరణ వ్యవస్థను ఒక భారీ నెట్వర్క్గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవి ఒక దారం ద్వారా ఇతరులతో అనుసంధా నించబడి ఉంటుంది.ఒక దారం తెగిపోయి నప్పు డు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతు లు ప్రభావితమౌతాయి. అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యంగా ఉంటుందో, అది అంత బాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. జీవుల సహజ ఆవాసాల నాశనం, కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయా లతో పర్యావరణం నిలకడగా ఉండదు. అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామా లను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభావితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు
ప్రతిరోజూ, జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు, మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్ను అందిస్తాయి. తేనెటీగలు మరియు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహద పడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్ ఉత్పత్తి, నేల నిర్మాణం,నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్లో దాదాపు సగభాగాన్ని పీల్చుకోవడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించడంలో సము ద్రాలు,అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీర పర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటి శుద్దీకరణతో పాటు, ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి, తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూ లుస్తున్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే, జీవ వైవిధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవి ధ్యభరితమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది.వాతావరణ మార్పులవల్ల జీవవైవి ధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. ఎన్నో శాస్త్రీయ నివేదికలు ఈ విషయాన్ని నివే దించాయి.ఉష్ణోగ్రతలు1.5%జ పెరిగితే,దాదాపు 6%కీటకాలు,8% మొక్కలు4%సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో(ఆవాసాలమార్పు) మార్పులకు లోనవుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల 2%మేర అయితే,ఈశాతాలు రెట్టింపు అవుతా యి.ఈ కారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూహ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభాగంలో దాదాపు 7% పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవా సాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది.ఫినోలాజికల్ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘ టనలు) ఎక్కువగా నమోదు చేయబడుతు న్నాయి, ఫలితంగా జాతుల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రత 1.5%జ లేదా 2%జ పెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషు లకు, తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.
కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరియా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధా లలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమి కోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకర ణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చి తంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా 17 కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒకఅంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆ కోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరిం చడం జరిగింది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే! భూమి చరిత్రలో జీవవైవిధ్యం అంతరించిపోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే. గతంలో కనీసం అయిదు సార్లు సహజ కారణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు(జుఞ్ఱఅష్ఱశీఅం) జరిగాయి.వీటిలో చివరిది 65మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలుప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచీకరణ నుండి, జీవవై విధ్య నష్టం ప్రమాదకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరు గయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవై విధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు,ప్రతి జాతి మన పర్యావ రణ వ్యవస్థ అనే వస్త్రపు సమతుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆవస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారిపోతు న్నాయి. మన కళ్ల ముందే ప్రకృతి కనుమరుగవుతోంది. భూగ్రహం పై జీవవైవిధ్యం ముప్పులో ఉండటానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధారపడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు మరియు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలు ష్యం, వ్యవసాయం, వేటాడటం, ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా వక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలలో, జనాభా పెరుగుదల, దాంతోబాటే విపరీతంగా, అనిశ్చితంగా పెరిగిన, ఉత్పత్తి, వినియోగ విధా నాలు జీవవనరులకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపో యింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.
జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ.విల్సన్ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు,సూక్ష్మజీవులు,అలాగే పర్యావరణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవి ధ్యాన్ని భూమిపై ఉన్న జీవ సంపదగా నిర్వచించ వచ్చు.జీవవైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవిధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం 2011లో నగోయా ప్రోటోకాల్పై సంతకం చేసి, హైదరాబాద్లో జరిగిన జదీణకి 11వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో అక్టోబర్ 2012లో దానిని ఆమోదించింది. బయో లాజికల్ డైవర్సిటీ యాక్ట్, 2002, జదీణ అమలు కోసం భారతదేశ దేశీయ చట్టంగా పనిచేస్తుంది. భారతదేశం,32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారతదేశంలో 89,451జంతుజాతులున్నాయి. ఇది ప్రపంచ జంతుజాలంలో 7.31%.అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి. ఇది ప్రపంచ మొత్తంలో 10.78%వాటాను కలిగి ఉంది. ప్రపం చంలో ఉన్న పదిహేడు అతిపెద్ద జీవవైవిధ్య దేశా లలో భారతదేశం ఒకటి.భూవిస్తీర్ణంలో 2 .4శా తమే ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభు త్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకు వచ్చింది.అందులో ముఖ్యాంశాలు: జీవవైవిద్య సంరక్షణ, సుస్థిర వినియోగం, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడటం, వాటికి పునరావాసం కల్పించడం. జీవవనరుల వినియోగాన్ని క్రమబద్దీ కరించడం, జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ భారత దేశంలో1,212 జంతు జాతులను తన రెడ్ లిస్ట్లో పర్యవేక్షిస్తుంది.వీటిలో 12%పైగా జాతులు 148%అంతరించిపోతున్నాయి.అంతరించి పోతు న్న జాతులలో69క్షీరదాలు,23 సరీసృ పాలు, 56ఉభయచరాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం (ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు నూట నలభై నాలుగుకోట్లు.ప్రపంచ జనాభా దాదా పు ఎనిమిది వందల కోట్లు) పెరిగిపోతున్నారు. మొత్తం అటవీ ప్రదేశంలో కేవలం15శాతం అడవు లు మాత్రమే ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. మిగతా వన్నీ ఏనాడో మనిషి మింగేశాడు. దాదాపు పాతిక శాతం వృక్షజాతులు ప్రమాదపుటంచులలోఉన్నా యి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దాదాపు నలభై శాతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవవైవిధ్యంపై ఆధా రపడి ఉంది.భూమ్మీద అందుబాటులో ఉన్న మూడుశాతం మంచినీటిలో దాదాపు ఆరుశాతం జాతులు ఉన్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు ఒకప్పుడు భూమి పై 14 శాతం వుంటే, ఇప్పుడు ఆరుశాతానికి పడిపోయాయి.
వినాశనానికి ముఖ్య కారణాలు
సహజ పర్యావరణాల విధ్వంసం, విచ్ఛిన్నం జీవవైవిధ్యానికి అతిపెద్ద ముప్పు. ఆవాసా లలో మార్పులు వ్యవసాయం, పట్టణీకరణ, అటవీ మరియు భూవినియోగంలో మార్పుల ఫలితం. ఇన్వేసివ్ జాతుల (ఆక్రమణ జాతులు) వ్యాప్తి కూడా జీవవైవిధ్య వినాశనానికి అతిపెద్ద ముప్పు. మానవు లు ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు ప్రవేశ పెట్టిన కొన్ని జాతులు ఆయా ఆవాసాలలో ఉండే సహజ జాతులపై దాడి చేసి వాటిని అంతంచేసే ప్రమాదముంది. వనరులను అతిగా దోచుకోవడం, అంటే,అధికంగా చేపలు పట్టడం, వేటాడటం లేదా అతిగా మేపడం వంటి చర్యలు అనేక జాతులకు ముప్పు కలిగిస్తుంది. మన వాతావరణం, పర్యావ రణ వ్యవస్థలలో మార్పులు జీవవైవిధ్యానికి ముప్పు. అన్ని రకాల కాలుష్యం:నీరు, నేల మరియు వాయు కాలుష్యం,కానీ కాంతి లేదా ధ్వని కాలుష్యం, ఇది అనేక రకాల జీవులను ప్రభావితం చేస్తుంది. అభి వృద్ధి పేరుతో ఎకరాలకొద్దీ సహజ వనరులపై జరిగే దాడి, విధ్వంసం తెలియనిది కాదు. ఇటీవల జరిగిన నికోబార్, లక్షద్వీపాలలో వేలకొద్దీ ఎకరాల భూమిలో అడవులు నాశనం కావడం, ఆ కారణం గా ఆదివాసీ తెగల జీవన, ఆవాసాలు దెబ్బతినడం తెలిసిందే. తెగలతో బాటు చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువుల జాతులు కూడా దెబ్బతిని, ఒకప్పటి ఘనమైన వైవిధ్యం ఇకఎప్పటికీ కనిపించదు. అడవులు,జీవ,జలరాశులను ఇప్పటికైనా పరి రక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవ జాతి మనగడకే ముప్పు వాటిల్లుతుందని అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి పేరుతో మనం ఇప్ప టికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయా ము,అయినా మిగిలివున్న వన సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వంగానీ, పౌరులుగానీ అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానంలో పది చెట్లు నాటాలి.జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుందన్న అవగాహన ఉండాలి. భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.
జాతీయ జీవవైవిద్యం ప్రాధికారసంస్థ
ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ వాతా వరణం, అడవుల మంత్రిత్వశాఖ, ఆధ్వ ర్యంలో పనిచేస్తుంది.జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ సంస్థ నూ చట్టబద్ధ హోదాతో చెన్నైలో 2003లో ఏర్పా టు చేశారు. జీవసంపద దొంగ లించకుండా జాగ్రత్త పడడం,రక్షిత ప్రదేశాల బయట కూడా జీవవైవిద్య రక్షణకు నియమాలు రూపొందించి వాటిని అమలుపర చడం వంటివి దీని బాధ్యతలు.
ఆంధప్రదేశ్ జీవ వైవిధ్య మండలి
ఆంధప్రదేశాష్ట్ర జీవవైవిధ్య మండలి భారత ప్రభుత్వం జీవవైవిధ్య చట్టానికి అనుగు ణంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2006లో ఏర్పాటు చేసింది.జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియో గానికి సంబం ధించిన విషయాలపై రాష్ట్ర ప్రభు త్వానికి సలహాలు ఇవ్వడం,జీవవనరుల వినియో గం ద్వారా సమ కూరే ప్రయోజనాల న్యాయబద్ధ పంపిణీ మొదలై నవి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రధాన ఉద్దేశాలు.
వ్యాసకర్త : ఆంధప్రదేశ్ జీవవైవిధ్య నిపుణులు-(డా.కాకర్లమూడి విజయ్/ బీఎంకే రెడ్డి,)