కొత్త న్యాయ చట్టాలు`మార్పులు ఇవే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా.అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ కూడా అత్యంత పక్బడందీగా ఉండాలి.కానీ,మన దేశంలో ఇంరా శతాబ్ద కాలంనాటి బ్రిటీష్ చట్టాలే దిక్కయ్యాయి.తాము న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన..భాజపా ప్రభుత్వం అనుకు న్నట్లుగానే గతేడాది ఆగస్టులో 3న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది.కీలకమైన ఐపీసీ, సీఆర్పీసీ,ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత,నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తీసు కొచ్చింది. వీటికి లోక్సభ ఆమోదం కూడా లభించడంతో..జూలై1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. మరి,ఆ కొత్త చట్టాలు ఏంటీ? ముఖ్యంగా జీరో ఎఫ్ఐఆర్,దేశద్రోహం చట్టాలు లాంటి చట్టాల్లో వచ్చిన మార్పులేంటి పరిశీలిద్దాం.– -(గునపర్తి సైమన్)
బ్రిటీష్ కాలంనాటి చట్టాలకు తెరప డిరది.భారత న్యాయవ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలైనెల నుంచి అమల్లోకి వచ్చాయి.భారత శిక్షా స్మృతి(ఐపీసీ) కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ),భారత సాక్ష్యాధర చట్టాల చరిత్ర గత నెలాఖరు అర్ధరాత్రితో ముగిసింది.కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్,ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం,ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్దతిలో సమన్లు పంపడం,హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్దతులను న్యాయవ్యవస్థలో రానున్నాయి.ఆనాటిచట్టాల మా దిరిగా శిక్షకాకుండా,న్యాయం అందిం చేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్రహోం మంత్రి అమిత్ షా వెల్లడిరచారు.చట్టాల పేరు మాత్రమే కాదు.. వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొం దించారు. కొత్త చట్టాలు రాజకీయ,ఆర్ధిక, సామాజిక న్యాయాన్నీ అందించనున్నాయి.
ా భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడు లు,హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్షపడుతుంది.దీనిప్పుడు యూవజ్జీవంగా మార్చారు.హేయమైన నేరాలకు సంబంధిం చిన క్రైమ్సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.
ా నకిలీనోట్ల తయారీ,వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది.విదేశాల్లో మన ఆస్తులు ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వహించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు.
ా మహిళలు,పిల్లలపై నేరాలపై కొత్త అధ్యా యాన్ని జోడిరచారు.పిల్లల్ని కొనడం, అమ్మ డం,ఘోరమైన నేరంగా మార్చారు.మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు.పెళ్లి చేసుకుం టానన్న తప్పుడు వాగ్ధానాలతో లైంగిక సంబం ధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్తనిబంధన పెట్టారు. మహి ళలు,పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రధమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు,15ఏళ్లలోపు, 60ఏళ్లు పైబడిన వ్యక్తులు,వికలాంగులు, తీవ్రమైన అనారో గ్యంతో బాధపడుతున్న వారు ఇంటినుంచే పోలీసు సాయం పొంద వచ్చు.కోర్టు అనుమతి లేకుండా లైకింక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష,జరి మానా నిబంధనన చేర్చారు.
ా కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగను న్నాయి.పోలీస్ స్టేషన్కు వెళ్లే పనిలేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు.పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబా నికి,స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్స్టేషన్లో ప్రదర్శి స్తారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి (జులై1,2024) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ),కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్ పీసీ),ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుచ్చారు.
తొలుత 2023ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనం తరం వీటిని పార్లమెంట్ స్టాండిరగ్ కమిటీకి పం పించగా,కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆబిల్లులను వెనక్కి తీసు కుంది.మార్పులు చేర్పుల తరువాత పార్లమెంటులో దీనిపైచర్చ జరిగి ఆమోదం దక్కింది. దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
ఈ కొత్త చట్టాలతో భారత న్యాయవ్యవస్థ, నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. జీరో ఎఫ్ఐఆర్,పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్ లైన్లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం, ఎలక్ట్రానిక్ మోడ్లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు.
ఏమేం మారుతున్నాయి?
క్రిమినల్ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60రోజుల్లోపు చార్జ్షీట్ దాఖలు చేయాలి. క్రిమినల్ కేసులలో విచారణ పూర్తయిన 45 రోజు లలోగా తీర్పు వెలువడాలి. కొత్త చట్టాలలో రాజ ద్రోహం అనే పదాన్ని తొలగించారు. అదే సమ యంలో దేశ సార్వభౌమత్వం,సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్షార్హమైన జాబితాలో చేర్చారు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష చిన్నారులపై సామూహిక అత్యాచా రానికి పాల్పడేవారికి గరిష్ఠంగా మరణ శిక్ష విధిం చేలా కొత్త చట్టాలలో నిబంధన ఉంది.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు.
మైనర్లను కొనడం,అమ్మడం కూడా నేరమే.
పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పదేళ్ల జైలు శిక్ష మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి.
అలాగే కులం, మతం, జెండర్ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.
90 రోజుల వరకు పోలీస్ రిమాండ్
గతంలో కంటే ఎక్కువ రోజులు పోలీస్ రిమాండ్ విధించే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. 60నుంచి 90రోజుల వరకు రిమాండ్ విధిం చొచ్చు.
అయితే, కేసు విచారణకు ముందు ఇలా సుదీర్ఘ కాలం పోలీస్ రిమాండ్కు అవకాశం కల్పిం చడంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ ‘ఉగ్రవాదం’ పరిధిలోకే..
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యుడీషి యల్ కోడ్)లో ప్రవేశపెట్టారు. గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలా పాల పరిధిలోకే తెచ్చారు.
నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
ఇప్పుడు,భారత్లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.